army post
-
పాక్కు బుద్ధి చెప్పిన భారత్
జమ్మూ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సరిహద్దు ప్రాంతాలైన రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో మోర్టారు దాడులు, కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్కు చెందిన 7 సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. పలువురు పాక్ సైనికులు గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ మోర్టారు దాడులు చేయడంతో ఓ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్, నౌషెరా సెక్టార్ పరిధిలోని రాజౌరీలో పాక్ సోమవారం మొదలుపెట్టిన మోర్టారు దాడులు, కాల్పులు మంగళవారం కొనసాగాయి. ఇందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఎల్ఓసీ వెంబడి రాక్చిక్రి, రావలకోటె ప్రాంతాల్లో ఉన్న 7 పాక్ సైనిక పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ విభాగం తెలిపింది. -
పాక్పై భారత్ ప్రతీకారం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని ఆర్మీ పోస్టులు, గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్కు భారత్ దీటైన జవాబిచ్చింది. శనివారం బీఎస్ఎఫ్ బలగాలు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఆరు పోస్టులను ధ్వంసం చేయడంతో పాటు నలుగురు రేంజర్లను హతమార్చాయి. పాక్ జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ సహా నలుగురు శనివారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో బీఎస్ఎఫ్ తాజా దాడితో పాక్పై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్ స్పందిస్తూ.. ‘భారత్లోకి ఉగ్రవాదుల్ని పంపడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాక్కు అలవాటుగా మారాయి. ఆ దేశానిది వక్రబుద్ధి. పాక్ పేల్చే ఒక్కో బుల్లెట్కు భారత్ 10 బుల్లెట్లతో సమాధానమిస్తుంది’ అని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్లోని సరిహద్దు గ్రామాలను పాక్ లక్ష్యంగా చేసుకోవడంతోనే తాము తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ కాల్పుల్లో నలుగురు మృతి జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట పాక్ బలగాలు శనివారం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 18 మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారుల హెచ్చరికతో దాదాపు 35,000 మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వెయ్యిమందికి అధికారులు సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. 300 స్కూళ్లతో పాటు పలు విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం మూడు రోజుల పాటు సెలవు ప్రకటించింది. పాక్ కాల్పుల్లో పంజాబ్లోని ఆలంపూర్కు చెందిన ఆర్మీ జవాన్ మన్దీప్ సింగ్ మృతి చెందినట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. -
ఆర్మీపోస్టుపై పడిన మంచు కొండ.. ఒకరి మృతి
జమ్ము కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోగల ఆర్మీ పోస్టుపై మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఒక ఆర్మీ ట్రూపర్ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం తర్వాత జరిగింది. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ సోనాపెండి గలీ ప్రాంతంలో ఉన్న ఆర్మీపోస్టుపై ఈ మంచుకొండ పడిందని, దాని శిథిలాల కింద ఇద్దరు ట్రూపర్లు ఉండిపోయారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. వారిలో సనాతమ్ సింగ్ అనే ట్రూపర్ను వెంటనే అక్కడి నుంచి తీసి కాపాడినా, తర్వాత కాసేపటికి అతడు తీవ్ర గాయాల కారణంగా మరణించాడు. మరో ట్రూపర్ జాడ మాత్రం ఇంకా తెలియరాలేదు. అతడి కోసం గాలింపు జరుపుతున్నారు. -
పాక్ దుర్మార్గంపై మండిపడ్ద యువత
-
గీత దాటిన పాక్: ఐదుగురు భారత జవాన్ల హతం