బెంగళూరులో ఆవాస్ ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: బాలాజీ డెవలపర్స్ సంస్థ బెంగళూరులో ప్రీమియం నివాస సముదాయానికి శ్రీకారం చుట్టింది. వైట్ఫీల్డ్లో ఇప్పటికే 4 ప్రాజెక్ట్లలో కలిపి సుమారు 600 ఫ్లాట్లను పూర్తిచేసిన ఈ సంస్థ.. ఇప్పుడు ఆవాస్ పేరిట నివాస సముదాయాన్ని నిర్మిస్తో్తంది. 1.80 లక్షల చ.అ.ల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో 125 ఫ్లాట్లుంటాయని కంపెనీ ఎండీ అరవింద్ రెడ్డి తెలిపారు.
⇔ ప్రాజెక్ట్లో 44 యూనిట్లు 2 బీహెచ్కే, మిగిలినవి 3 బీహెచ్కే యూనిట్లుంటాయి. 1,245 నుంచి 1,770 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రస్తుతం శ్లాబ్, బ్రిక్ వర్క్ నడుస్తోంది. ధర చ.అ.కు రూ.5 వేలు. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది ముగింపులోగా మరో ప్రాజెక్ట్ను ప్రారంభిం చనున్నాం. 2 ఎకరాల్లో 200 యూనిట్లు వస్తాయి. నిర్మాణ అనుమతుల దశలో ఉంది.