Bharatnatyam
-
చారిత్రక వేదికపై.. సాంస్కృతిక పరంపర
భారతీయ నాట్యం, సంగీతరీతులను పరిరక్షించడానికి కళారూపాల ప్రదర్శన బాధ్యతను చేపట్టింది పరంపర ఫౌండేషన్. సాంస్కృతిక ప్రదర్శనలను ఆలయాలు, చారిత్రక ప్రదేశాల్లో ‘పరంపర గుడి సంబరాలు’ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు శశిరెడ్డి, డాక్టర్ శ్రీనగి. చరిత్ర, సంస్కృతి, కళలను మేళవించి ఒక వేదికపై ప్రదర్శిస్తున్నారు. గడచిన పదేళ్ల కార్యక్రమాల్లో భాగంగా నేడు గోల్కొండ కోటలో ప్రదర్శన జరుగుతోంది. భరతనాట్య కళాకారిణి, ఢిల్లీలోని గణేశ నాట్యాలయ డైరెక్టర్ రమా వైద్యనాథన్ ‘నిమగ్న’ రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి‘భరతనాట్యం ఒక సముద్రం. నాట్య గురువులు ఇచి్చన స్ఫూర్తి ఆ లోతులను చూడడానికి ఉపయోగపడింది. సముద్రం వంటి నాట్య సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నాట్యముద్రల గొప్పదనాన్ని పరిచయం చేయాలనేదే నా లక్ష్యం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తున్నాను. దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి భరతనాట్యం మంచి మాధ్యమం. ఆ మాధ్యమమే నన్ను నడిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలివ్వాలని ఉంది. ఫిబ్రవరి 27న వైజాగ్లో ప్రదర్శన ఇచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండ కోటలో ప్రదర్శనకు సిద్ధం అవుతున్నాను. మన సంస్కృతి, చరిత్రను రానున్న తరాలకు చేరవేయడానికి మా కళాకారులు ఎంత అవసరమో.. ఈ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు కూడా అంతే ముఖ్యం. సమాజంలో కళాభిమానులు ఎప్పుడూ ఉంటారు. కళను కళాకారుల నుంచి కళాభిమానులకు ప్రసరింపజేసే బాధ్యతను చేపట్టే వాళ్లు తక్కువ. కళాసాధన, కళాస్వాదన రెండూ మనిíÙని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్లే ప్రభావవంతమైన మార్గాలు’ అన్నారు రమావైద్యనాథన్.ఇరవై మంది నాట్యకారులతో.. గోల్కొండ కోటలో ప్రదర్శించే ‘నిమగ్న’ రూపకంలో గురు స్తోత్రమ్, కామాక్షి, కాశీ, రఘువీర, రసలీల అనే ఐదు అంశాలుంటాయి. నేను స్వయంగా రూపొందించిన ఈ 90 రూపకంలో నాతోపాటు మరో ఇరవై మంది నాట్యకారులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నాట్యప్రదర్శనలిచి్చన రమావైద్యనాథన్.. సంగీత నాటక అకాడమీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, జోనల్ సెంటర్స్, స్టేట్ అకాడమీలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తారు. పాటా్నలో జరిగే రాజ్గిర్ మహోత్సవ్, త్రివేండ్రంలో సూర్య ఫెస్టివల్, కోణార్క్ ఫెస్టివల్, ఖజురహో ఫెస్టివల్ భరతనాట్యపు అడుగులతో పరిపూర్ణతనందించారు.అవార్డులు⇒ 2017, కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు ⇒ 2015, మధ్య ప్రదేశ్ ప్రభుత్వ కుమార్ గంధవ్ పురస్కారం ⇒ 2013, కేరళ ప్రభుత్వ కళాశ్రీ పురస్కారం ⇒ 2011, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు ⇒ 1999, శ్రీలంక డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ ‘భారత రత్న’హైదరాబాద్కురెండోసారి! గతంలో ఒకసారి హైదరాబాద్లో ప్రదర్శన ఇచ్చాను. చారిత్రక ప్రదేశం గోల్కొండలో ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ అందమైన నగరం. నాకు చాలా నచి్చంది. అందమైన సరస్సులు, పార్కులున్నాయి. ఆధునికతకు సంస్కృతి, కళలను అద్దితే అదే హైదరాబాద్ నగరం. – రమా వైద్యనాథన్ -
అభినయ శోభన
మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి, నాట్యమయూరిగా ఎదిగింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం, వన్నె తగ్గని అందం, చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోటే ఉంటే, కనిపించే రూపమే నటి, ప్రముఖ నర్తకి శోభన . ఇటీవల ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించింది. ఆమె విశేషాలు మీ కోసం..⇒ శోభన సొంత ఊరు తిరువనంతపురం. ‘ట్రావెన్కోర్ సిస్టర్స్’గా నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు.⇒ ‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా కనిపించింది. ⇒ ‘మణిచిత్రతారు’ అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘మిత్ర్, మై ఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది.⇒ చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఎంతో ఇష్టం. 1994లో ‘కళార్పణ’ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి, భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది.⇒ శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తే చాలా కోపం. ఒకసారి ప్రదర్శన మధ్యలో ఫోన్లో రికార్డు చేస్తున్న ఒక ప్రేక్షకుడిని వారించింది.⇒ శోభనకు థాయ్, చైనీస్ వంటకాలు బాగా ఇష్టం. మలేసియాకు వెళితే, అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఆస్వాదిస్తుంది. చీజ్ ఆమ్లెట్ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. నా దుస్తులను నేనే డిజైన్ చేసుకుంటాను. ఒంటికి నప్పని దుస్తులను నేనెప్పుడూ ధరించను. బహుశా, నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనుకుంటా. – శోభన -
లండన్లో శివతాండవం
నాట్యం అనేది ఆహ్లాదానికే కాదు మానసిక వికాసానికి కూడా అనుకుంటే... నాట్యం అంటే సంతోషమే కాదు మానసికస్థైర్యం కూడా అనుకుంటే... నాట్యం అనేది ఆనందతరంగమే కాదు పర్యావరణహిత చైతన్యం అంటే గుర్తుకు వచ్చే పేరు.... సోహిని రాయ్ చౌదరి....సోహిని రాయ్ చౌదరి తండ్రి సుబ్రతో రాయ్ సితార్ విద్వాంసుడు. తల్లి ఉమారాయ్ చౌదరి శిల్పి. కోల్కత్తాలోని వారి ఇంటిలో ఎప్పుడూ కళాత్మక వాతావరణం ఉండేది. నాలుగు సంవత్సరాల వయసులోనే నృత్యకారిణిగా కాళ్లకు గజ్జె కట్టింది సోహిని రాయ్ చౌదరి. భరతనాట్యం నుంచి మోహినియాట్టం వరకు ఎన్నో నృత్యాలలో ప్రావీణ్యం సాధించింది.‘మన వైదిక సిద్ధాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మానవతావాదం, మంచి గురించి చాటి చెప్పాయి. కోవిడ్, ఆర్థికమాంద్యం, యుద్ధంలాంటి అనిశ్చిత కాలాల్లో అవి మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇతరులకు సహాయపడేలా ప్రేరణ ఇస్తాయి. జీవితానికి సానుకూల దృక్పథాన్ని ఇచ్చే శక్తి మన పవిత్ర తత్వాలలో ఉంది’ అంటుంది సోహిని. వాతావరణ మార్పులపై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సులలో సోహిని రాయ్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.‘వేదమంత్రాలతో కూడిన నా నృత్యప్రదర్శన ప్రకృతి గురించి, మన జీవితాల్లో దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసేలా ఉంటుంది. పశుపతిగా శివుడు, అడవులు, జంతువులు, పర్యావరణాన్ని పరిరక్షించేవాడు. ప్రకృతిని మనుషులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, విధ్వంసం సృష్టిస్తున్నారో చెప్పడానికి, ప్రకృతితో సన్నిహిత సంబంధాల కోసం శివతాండవం చేస్తున్నాను’ అంటున్న సోహిని రాయ్ ‘గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ కూడా అందుకుంది.ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళలు, సంస్కృతికి సోహిని రాయ్ చౌదరి అంబాసిడర్గా మారింది. యూకేలోని ఇండియన్ హైకమిషన్కు చెందిన నెహ్రూ సెంటర్లో సోహిని చేసిన శివతాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివతాండవంతోపాటు శివుడి గురించి రుషి దాస్ గుప్తా చెప్పిన విలువైన మాటలను వినిపించింది. మార్కండేయ పురాణం, శివపురాణాలలో నుంచి ఒక కథను ఎంపిక చేసుకొని దాన్ని నృత్యరూపకంగా మలుచుకుంది. లండన్ తరువాత అమెరికా, రష్యా, జర్మనీ, స్పెయిన్... మొదలైన దేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వబోతోంది.‘డ్యాన్సింగ్ విత్ ది గాడ్స్’ పేరుతో తొలి పుసక్తం రాసిన సోహిని రాయ్కు రచనలు చేయడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆమె రచనల్లో మహిళా సాధికారత నుంచి రంగస్థలం వరకు, నృత్యోద్యమం నుంచి దేవదాసీల దుస్థితి వరకు ఎన్నో అంశాలు ఉంటాయి. శక్తివాదాన్ని ప్రధానంగా చేసుకొని ఎన్నో రచనలు చేసింది.‘ఇండియన్ స్టేజ్ స్టోరీస్: కనెక్టింగ్ సివిలైజేషన్స్’ పేరుతో సోహినిరాయ్ రాసిన పుస్తకం భారతీయ రంగస్థలం ఆత్మను పట్టిస్తుంది. ఈ పుస్తకం ద్వారా మన నాగరికతలోని గొప్ప సాంస్కృతిక, సంప్రదాయల గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది. యూరప్లోని పద్ధెనిమిది యూనివర్శిటీలలో విజిటింగ్ప్రోఫెసర్గా పనిచేసింది. ‘సూఫీ తత్వం, రూమీ కవిత్వం, ఠాగూరు మానవతావాదంలో నాకు మహిళాసాధికారత కనిపిస్తుంది’ అంటున్న సోహినిరాయ్ చౌదరి తన నృత్య కళను సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తోంది. -
ఆకట్టుకున్న వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ప్రదర్శన
-
వారెవ్వా! ఏం హైబ్రిడ్ భరతనాట్యం.. ఏం స్టెప్పులు.. నెట్టింట్లో హల్చల్
కళలకు పుట్టినిల్లుగా భావించే భారతదేశంలో ఎన్నో విభిన్న నృత్యాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై లక్షలాది కళాకారులు నృత్య ప్రదర్శనలిస్తూ భారత్ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది డ్యాన్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. క్లాసికల్, వెస్ట్రన్ అనే తేడా లేకుండా పాటకు తగ్గట్లు స్టెప్పులేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనేక కొత్తరకమైన డ్యాన్స్లు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా భరత నాట్యం, హిప్ హాప్ రెండు కలిపి రూపొందించిన ఓ కొత్త రకం డ్యాన్స్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఓ అంగ్లో ఇండియన్ సరికొత్తగా ఆలోచించి భరత నాట్యం, హిప్ హాప్కు కొత్తదనాన్ని జోడించి వినూత్న డ్యాన్స్ను ప్రాణం పోశారు. ఇందులో ముగ్గురు మహిళలు సంప్రదాయ చీరకట్టులో, మల్లెపూలు పెట్టుకొని అమెరికన్ రాపర్ లిల్ వేన్ ఉప్రోయర్ పాటకు ఇండో- వెస్ట్రన్ స్టెప్పులు వేస్తూ అలరించారు. హైబ్రిడ్ భారతనాట్యం అని పేరు పెట్టిన ఈ డ్యాన్స్ వీడియోలు నెటిజన్ల హృదయాలు గెలుచుకుంటున్నాయి. What the f- though ? Where the love go ? 🧨@LilTunechi @THEREALSWIZZZ pic.twitter.com/H7kTfQXMO4 — Usha Jey (@Usha_Jey) May 22, 2022 పారిస్లో నివసిస్తున్న శ్రీలంకన్ ఉష జై అనే మహిళ కొరియోగ్రాఫర్ తన స్నేహితురాళ్లతో కలిసి ఈ రకమైన డ్యాన్స్ క్రియేట్ చేశారు. దీనికి హైబ్రిడ్ భరత నాట్యం పేరు పెట్టారు. ఆ వీడియోలను ఎపిసోడ్లా వారీగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పాపులర్ అయ్యారు. తాజాగా 20 సెకన్ల ఈ వీడియో షేర్ చేశారు. నిజానికి హిప్ హాప్, భరతనాట్యం రెండు భిన్నమైన నృత్యాలు వీటిని మేళవించి రూపొందించిన ఈ సృజనాత్మక డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ అద్భుతమైన వీడియో సాంస్కృతిక సరిహద్దులు దాటి పయనిస్తోందని కామెంట్ చేస్తున్నారు. దీనిని ఇప్పటికే 7 లక్షలమంది వీక్షించారు. ఈ అందమైన వీడియోను మీరూచూడండి Welcome to paradise 🌴 pic.twitter.com/5aKpcTN9nz — Usha Jey (@Usha_Jey) December 12, 2020 -
హాలీవుడ్ సాంగ్కు భరతనాట్యం జోడిస్తే..
బెంగళూరు: ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ గా మారింది. అనూహ్యంగా ఆ వీడియోను చూసిన వారి సంఖ్య పెరగడంతో దానిని రూపొందించిన వారు పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తుండగా ఇంకొందరు మాత్రం వారిని తప్పుబడుతున్నారు. ఇంతకీ ఏమిటా వీడియో అంటే.. 50 షేడ్స్ ఆఫ్ గ్రే అనే హాలీవుడ్ చిత్రం లో ప్రముఖ సింగర్ ఎలీ గౌల్డింగ్ పాడిన 'లవ్ మి లైక్ యూ డూ' అనే సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఈ పాటను తమ భరతనాట్యంతో మిక్స్ చేస్తూ అబ్బురపరిచేలా బెంగళూరుకు చెందిన ప్రియా వరుణేశ్ కుమార్, ప్రమితా ముఖర్జీ, సంధ్యా మురళీ ధరన్ అనే యువతులు డ్యాన్స్ చేశారు. వీరికి పియా డ్యాన్స్ కంపెనీ ఉంది. వీరు అలా డ్యాన్స్ చేస్తుండగా అక్కడి గేటెడ్ కమ్యూనిటీ వీడియో తీసి ఆన్ లైన్లో నవంబర్ 2015లో పోస్ట్ చేశారు. అయితే, రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇటీవలె రెండులక్షలమంది వీక్షకులను సంపాదించుకుంది. దీనిని చూసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా భరత నాట్య ప్రియులు మాత్రం ఒక సంప్రదాయబద్ధమైన నాట్య కళను ఇలా ఇష్టమొచ్చినట్లు ఏవేవో పాటలకు మిక్స్ చేసి ప్రదర్శించడం మంచిపద్ధతి కాదంటూ పెదవి విరుస్తున్నారు. కాగా, ఈ డ్యాన్స్ చేసిన వాళ్లలో ప్రియా స్పందిస్తూ తమ వీడియోకు ఇంతమొత్తంలో స్పందన వచ్చినందుకు పట్టరాని ఆనందంగా ఉందని చెప్పింది. త్వరలో మరో ఇంగ్లిష్ సాంగ్ కు కూడా ఇలాగే డ్యాన్స్ మిక్స్ చేసి మరో వీడియో అప్ లోడ్ చేయనున్నారట. -
ఫేస్బుక్లో కవలల డ్యాన్స్ సంచలనం..!
ఇద్దరు కవలపిల్లల వీడియో ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. భారత్ కు చెందిన ఆ ట్విన్స్.. చికాగోలోని ఇలినాయిస్ లో ఉంటున్నా సంప్రదాయ భరతనాట్యంలో తమ ప్రతిభను చాటుతున్నారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు గానూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొరియోగ్రాఫర్లు పూనమ్, ప్రియాంకా సహజంగా భరతనాట్య కళాకారిణులు. ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా సంప్రదాయ భరతనాట్యాన్ని రోజువారీ వ్యాయామాలతో మేళవించి స్వయంగా ప్రదర్శించారు. అదే వీడియోను సరదాగా ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. వాళ్ల ప్రదర్శన అందర్నీ కట్టిపడేసింది. అందుకే వారు పోస్ట్ చేసిన వీడియో రెండు మూడు రోజుల్లోనే ఎంతో పాపులారిటీ సంపాదించింది. వేలకొద్దీ షేర్లు, కామెంట్లతో ఫేస్బుక్లో హల్ చల్ చేస్తోంది. తమ ప్రయోగానికి ఇంతటి గుర్తింపు వస్తుందని ఊహించలేదని ఆ అక్కాచెల్లెళ్లు ఆశ్చర్యపోతున్నారు. తమను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.