brain death
-
పుట్టెడు దుఃఖంలో..
► బ్రెయిన్ డెడ్ అయిన భర్త అవయవాలు దానం చేసిన భార్య ► బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం ► దివ్యంగురాలిగా ఆ బాదేంటో నాకు తెలుసన్న భార్య దేవరకొండ : పుట్టెడు కష్టంలోనూ వారు పరోపకారం వైపు ఆలోచన చేశారు. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుకుని ఆ ఇంటి పెద్ద అవయవాలను దానం చేశారు. అవయవ లోపం మనిషిని ఎంత కుంగదీస్తుందో స్వయంగా అనుభవిస్తున్న ఆమె అలాంటి కష్టం మరొకరికి రావద్దనుకుంది. 56 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ డెడ్ అయిన తన భర్త అవయవాలను దానం చేసి ఆ దివ్యాంగురాలు నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. వివరాలు... నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామపంచాయతీకి చెందిన షేక్ నిరంజన్ అలియాస్ బాబు(56) గ్రామంలో ఉంటూ కిరాణం, చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. అతనికి దివ్యాంగురాలైన భార్య, నలుగురు పిల్లలున్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యా యి. అయితే అతని భార్య షరీఫా కొన్నేళ్ల క్రితం ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. అయితే దివ్యాంగురాలైన షరీఫా భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో నిరంజన్ గత గురువా రం వనవాసం సందర్భంగా ఊళ్లో కోళ్లు అమ్ముడుపోతాయని భావించి వాటిని కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంపై గ్రామం నుంచి దేవరకొండకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టడంతో నిరంజన్కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుం బ సభ్యులు అతడిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రెండు రోజుల పాటు చికిత్స నిర్వహించిన వైద్యులు అతని బ్రెయిన్ డెడ్ అయ్యిందని నిర్ధారించి బంధువులకు తెలిపారు. ఇదే క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు మరొకరికి దానం చేయడం వల్ల వారికి పునర్జన్మను ప్రసాదించవచ్చునని డాక్టర్లు చెప్పడంతో నిరంజన్ భార్య, కుమారుడు వెంటనే తమ అంగీకారాన్ని తెలిపారు. తమ తండ్రి మరణించిన అతని అవయవాలు మరొకరిని బతికిస్తాయంటే సంతోషమేనని తెలిపారు. దీంతో నిరంజన్ శరీరం నుంచి కిడ్నీలు, లివర్, కళ్లను వైద్యులు సేకరించారు. భర్త మరణంతో నిరంజన్ షరీఫా అనా థైంది. కొడుకులు, బిడ్డలకు పెళ్లిళ్లవడంతో షరీఫా ఇప్పుడు అనామకురాలిగా మారింది. తోటి వారికి సాయపడాలన్న అలాంటి ఉన్నతమైన వ్యక్తులకు ప్రభుత్వం కూడా తోడ్పాటునందించాలని పలు వురు కోరుతున్నారు. -
ఆ ఐదుగురిలో పునర్జన్మెత్తి..
► నిండు నూరేళ్లు కలిసుంటానంటూ ఏడడుగులు వేసిన తోడు.. అర్ధంతరంగా లోకాన్ని వీడుతున్నాడనే బాధను మునిపంటి కింద నొక్కి పట్టి..మిణుకుమిణుకుమనే ఆ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే మహోన్నత ఆశయానికి పురుడు పోసింది. . ► నాన్న ఎక్కడమ్మా అంటూ చంటి బిడ్డలు మారం చేస్తుంటే..వారికి సమాధానం చెప్పలేక ఉబికివస్తున్న కన్నీళ్లను కళ్లలోనే దాచుకుంటూ..ఐదు కుటుంబాల్లో కల్లోలం రేపుతున్న అవే కన్నీళ్లను వారికి దూరం చేయాలనే సంకల్పానికి నడుం కట్టింది. ► కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోతున్నాననే దిగులును గుండె లోతుల్లో అదిమిపట్టి..మరెన్నో గుండెల్లో దిగులు తరిమేయాలనే భార్య త్రివేణి మనోధైర్యం ఆదర్శంగా నిలిచింది. భర్త అవయవాలను జీవన్దాన్కు అప్పగించి..తాను అంతులేని విషాదంలో మునిగిపోయింది. విజయవాడ(లబ్బీపేట): ఆయన మృతి చెందిన మరో ఐదుగురిలో సజీవంగా జీవించాలని భావించిన త్రివేణి అవయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ ఇల్లాలి నిర్ణయం ముగ్గురికి పునర్జన్మను ప్రసాదించగా, మరో ఇద్దరికి ఈ రంగుల లోకాన్ని చూసేందుకు చూపునిచ్చింది. జీవన్దాన్ ద్వారా సూర్యారావుపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్రెయిన్డెత్ యువకుడి నుంచి సేకరించిన రెండు కిడ్నీలు, లివర్, కళ్లు వేర్వేరు ఆస్పత్రులకు సోమవారం తరలించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై... ఖమ్మం జిల్లా ముచ్చర్లకు చెందిన కే సురేష్(25) వ్యవసాయ కూలీ. ఈ నెల 20న రోడ్డు ప్రమాదానికి గురి కాగా తొలుత జిల్లాలో స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని మెట్రో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మెదడు వాపు వచ్చి బ్రెయిన్డెత్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి స్థితిలో కోలుకోవడం కష్టమని, అవయవదానం ద్వారా మరికొందరికి పునర్జన్మను ప్రసాదించవచ్చునని వైద్యులు శ్రీనివాసరావు, వినయ్బాబు కుటుంబ సభ్యులతో చెప్పడంతో నిరుపేదలైనా మహోన్నత హృదయంతో అంగీకరించారు. జీవన్దాన్తో అవయవాల సేకరణ రాష్ట్రంలో అవయవదానం చేసేందుకు అమలులో ఉన్న జీవన్దాన్ పథకం ద్వారా యువకుడి అవయవాలు సేకరించారు. యువకుడి ఊపిరితిత్తులు, గుండె పనికి రావని వైద్యులు నిర్ధారించారు. రెండు కిడ్నీలను సేకరించి వాటిని సన్రైజ్ హాస్పిటల్, అరుణ్ కిడ్నీకేర్ సెంటర్లకు తరలించారు. లివర్ను మణిపాల్ ఆస్పత్రికి, రె ండు కళ్లు వాసన్ ఐ కేర్కు అప్పగించారు. రెండు కిడ్నీలను వేర్వేరు వ్యక్తులకు విజయవంతంగా అమర్చినట్లు వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం.. ఆదుకోండి బ్రెయిన్డెత్కు గురైన సురేష్కు ఏడాదిలోపు వయసున్న పాపతో పాటు, మూడేళ్ల బాబు ఉన్నారు. దినసరి కూలి పనులకు వెళితేనే పూటగడిచే ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. తన భర్త మృతి చెందడంతో ఇద్దరు చంటి పిల్లలతో తన పరిస్థితి ఏమిటంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది భార్య త్రివేణి. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. ఒక మహోన్నత ఆశయంతో భర్త అవయవాలను దానం చేసిన ఆ ఇల్లాలి వేదనను అర్థం చేసుకుని దాతలు సహకరించాలని కోరుకుందాం. -
గతంలో ఇలా..
లబ్బీపేట : నగరంలోని బృందావన్ కాలనీలో నివసించే పద్మావతి గత ఏడాది జనవరిలో రక్తపోటు కారణంగా ఆకస్మికంగా బ్రెయిన్డెత్కు గురయ్యారు. చికిత్స కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఆరోగ్య పరిస్థితిని వివరించి ప్రాణాలు కాపాడే అవకాశాలు నూరుశాతం లేవని తేల్చి చెప్పారు. దీంతో స్వచ్ఛంద సంస్థల కృషితో ఆమె భర్త తేజోమూర్తి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. పద్మావతిని వెంటిలేటర్పైనే ఉంచి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి అవయవాలు సేకరించారు. ఆమె నుంచి సేకరించిన గుండె, లివర్, ఊపిరితిత్తులను హైదరాబాద్లోని వేర్వేరు ఆస్పత్రులకు పంపించగా, ఒక కిడ్నీని జిల్లాలోని వణుకూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడికి అమర్చారు. అదే విధంగా మరో కిడ్నీని గుంటూరు జిల్లాలోని 18 ఏళ్ల యువతికి అమర్చారు. తన భార్య ఇక లేదన్న బాధతో ఉండి కూడా ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరికి పునర్జన్మ ఇచ్చేందుకు ముందకొచ్చిన తేజోమూర్తి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.