British PM
-
కొండంచుపై యుద్ధకాల ప్రధాని!
బ్రిటన్ ప్రధానులలో హెర్బర్ట్ హెన్రీ ఆస్క్విత్ భిన్నమైనవారు. మొదటి ప్రపంచ యుద్ధారంభ సమయంలోనూ నిమ్మళంగానే ఉన్నారాయన! ఎంతటి అత్యవసర పరిస్థితులూ, సంక్షోభాలూ ఆయన్ని వెంటబడి తరమలేకపోయాయి. ‘తొందరెందుకు?’ అన్నట్లే తాపీగా ఉండేవారు. నెమ్మదిగా మాట్లాడే వారు. అర్ధరాత్రి వరకు సాగే విందు వినోదాలలో కనిపించేవారు. వీధులలోని పుస్తకాల దుకాణాలలో కాలక్షేపం చేసేవారు. బాడుగ టాక్సీ ఎక్కేసేవారు. అంగరక్షకులు లేకుండానే కాలు కదిపేవారు. అలాంటి వ్యక్తి తన కంటే 35 ఏళ్లు చిన్నదైన ఒక యువతి ప్రేమలో కొండంచు పైనుంచి జర్రున జారినట్లుగా పడిపోయారు. ఆ యువతి ధ్యాసలో తలమునకలైపోయి మొదటి ప్రపంచ యుద్ధ సమయపు ఘోరమైన విపత్తులలో ఒక దానికి జీవం పోశారు!చారిత్రక రచనల్ని కాల్పనిక సాహిత్యంగా పరిగణించటం మన ఇండియాలో సాధారణ విషయం. అయితే మనకు తెలియనిదేమిటంటే – మంత్రముగ్ధులను చేసే కల్పనతో అక్షర రూపం దాల్చిన వాస్తవ చరిత్రలు కూడా ఉంటాయని! అటువంటి రచనే రాబర్ట్ హ్యారిస్ రాసిన తాజా పుస్తకం ‘ప్రెసిపిస్’ (కొండ చరియ). నిజ జీవిత పాత్రలు, నిజమైన సంఘటనలు, నిజంగా లభ్యమైన లేఖలతో ఈ పుస్తకం ఉత్కంఠను కలిగిస్తూ ... ‘ఇదంతా నిజమేనా లేక అల్లికలోని నేర్పరితనమా?’ అనే ప్రశ్నను మీలో రేకెత్తిస్తుంది. ‘ప్రెసిపిస్’ హెర్బర్ట్ హెన్రీ ఆస్క్విత్ కథ. ఆస్క్విత్ 1908 నుంచి 1916 వరకు బ్రిటన్ ప్రధాని. ఆయన పేరుతోనే ఆయనకు ‘ఎర్ల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ ఆస్క్విత్’ అనే బిరుదు (టైటిల్) ఉండేది. సమాజంలోని సంపన్న వర్గాలలో గొప్ప గుర్తింపు కలిగిన వెనీషియా స్టాన్లీ అనే కులీన యువతి పట్ల ఆయన తీవ్రమైన మోహావేశంతో ఉండేవారు. ఆయనకు 62. ఆమెకు 27. రచయిత చెప్పిన విధంగా, ‘‘ఈ పుస్తకంలో ఉటంకించిన లేఖలన్నీ ప్రధాని ఆస్క్విత్ – పాఠకులు ఆశ్చర్యచకితులు అయ్యేంతగా–ప్రామాణికమైనవి. ప్రధాని ఆస్క్విత్కు వెనీషియా స్టాన్లీ రాసిన లేఖలు మొత్తం తొలిసారి వెలుగు చూసినవి’’. ఆయన తన లేఖల్లో ‘‘నా ప్రియా’, ‘‘ప్రియ సఖీ’’, ‘‘ప్రియమైన ప్రేయసీ’’ అని ఆమెను సంబోధించేవారు. రహస్య దౌత్య సందే శాలను, మంత్రివర్గ చర్చల వివరాలను ఆమెతో పంచుకునేవారు. విన్స్టన్ చర్చిల్ (అప్పటికి నేవీ ఆఫీసర్)ను, లేదా లార్డ్ కిచనర్ (ఆర్మీ ఆఫీసర్)ను ఎలా దారికి తేవాలని అనే విషయమై తరచూ ఆమె సలహాలను కోరేవారు. ఆయన ప్రతిరోజూ, తరచుగా ఒక్కరోజులోనే రెండు మూడుసార్లు ఆమెకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. శుక్రవారాల్లో వాళ్లిద్దరూ తీరిగ్గా మధ్యాహ్నం ప్రారంభమయ్యేలా సుదీర్ఘ ప్రయాణాలను పెట్టుకునేవారు. ‘‘తక్కిన రోజులలో, వారాంతంలో వారు తరచూ భోజనానికి, విందు భోజనాలకు కలుసు కునేవారు. అయితే వారు ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల మధ్యనే కలుసుకోవటం జరిగేది. వారు ఏకాంతంగా కలుసుకునే అవకాశం ఉన్న ప్రదేశాలలో మాత్రం వారి కారు కూడా ఒకటి’’. దీని అంతరార్థం ఏమిటంటే – డ్రైవర్ కారు నడుపుతుండగా ఆ 1908 మోడల్ నేపియర్ కారు వెనుక భాగంలో ఆమె ‘‘తెరలు దించాక’’ వారిద్దరూ లైంగిక క్రియకు ఉపక్రమించేవారు. 30 నిమిషాల తర్వాత ఆమె తన ‘‘స్కర్ట్ను సవరించుకుంటూ’’ పైకి లేచేవారు. హ్యారిస్ రాసిన ఇతర గొప్ప నవలల మాదిరిగానే ‘ప్రెసిపిస్’ కూడా మిలియన్లలో అమ్ముడు పోతుందా అనే సందేహం నాకే మాత్రం లేదు. అయితే ఆస్క్విత్ వార సుల ఖండనతో ఈ పుస్తకం వివాదా స్పదం అయింది. ఆస్క్విన్ ముని మన వడు, ‘3వ ఎర్ల్’ బిరుదాంకితుడు అయిన రేమండ్ దీనినొక (కారులో లైంగిక క్రియను) ‘‘అర్థం లేని’’ విషయంగా కొట్టిపడేశారు. ‘‘ఇది పూర్తిగా హాస్యా స్పదం’’ అన్నారు. బహుశా వెనీషియాపై ఆస్క్విత్కు ఉన్న గాఢమైన మోహం – అలా జరిగేందుకే ఎక్కువ అవకాశం ఉందని – అనుకోవటానికి ఆస్కారం ఇచ్చిందా? పుస్తకంలో హ్యారిస్ రాసిన దానిని బట్టి వెనీషియాపై ఆస్క్విత్కు ఎంత గాఢమైన, నిలువనివ్వనంత ప్రేమ ఉండేదంటే... కేబినెట్ మీటింగ్లో గలిపలీ (టర్కీలోని ద్వీపకల్పం) పైన సైనికచర్య జరిపే తీర్మానాన్ని విన్స్టన్ చర్చిల్ ప్రతిపాదనకు పెడుతున్నప్పుడు ఆస్క్విత్ వెనీషియాకు లేఖ రాస్తూ కూర్చున్నారు! ఆయన ధ్యాసంతా తన ప్రేమపైనే ఉంది కానీ, డార్డనెల్లెస్ జలసంధి (గలిపలీ) మీద కాదు. బహుశా అందుకే గలిపలీపై సైనికచర్య అంత ఘోరంగా విఫలం చెంది ఉంటుంది. ఆ కేబినెట్ సమావేశం ఎలా జరిగిందనే దాని గురించి హ్యారిస్ ఎంత రసవత్తరంగా రాశారో చూడండి. ‘‘ప్రైమ్ మినిస్టర్?’’ అనే పిలుపునకు ఆస్క్విత్ తలెత్తి చూశారు. విన్స్టన్ ఆయన వైపే చూస్తూ – ‘‘నేనిప్పుడు కౌన్సిల్ ముందుకు డార్డనెల్లెస్ విషయాన్ని తీసుకు రావచ్చునా?’’ అని అడిగారు. ‘‘తప్పకుండా’’ అంటూ, చప్పున తను రాస్తున్న లేఖను కొన్ని విదేశాంగ శాఖ కార్యాలయ టెలిగ్రామ్ల మధ్య దాచేశారు ఆస్క్విత్. కానీ ఆ లేఖ తిరిగి వెంటనే ఆస్క్విత్ మదిలోకి వచ్చేసింది. ‘‘ఆయన తన కాగితాల కుప్ప కింది నుంచి అప్పుడే ప్రారంభించిన ఆ లేఖను బయటికి లాగారు. తిరిగి రాస్తున్నప్పుడు పక్కనే ఉన్న బాల్ఫోర్ (విదేశాంగ కార్యదర్శి) నిరామయ దృష్టి పడకుండా ఒక చేత్తో లేఖను మూసి ఉంచారు. ‘‘లేఖ రాయటం పూర్తయ్యాక మాత్రమే విన్స్టన్ చర్చిల్ ప్రసంగంపైకి ఆయన ధ్యాస మరలింది. అప్పటికే ఆ ‘ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాలిటీ’ (రాయల్ నేవీ అధిపతి చర్చిల్) తన గలిపలీ ప్రతిపాదనకు తిరుగులేని విధంగా ఆమోద ముద్ర పొందేశారు. హ్యారిస్ రాసిన దాని ప్రకారం... ‘‘ఎవరూ ఎటువంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు’’. ‘‘డార్డనెల్లెస్పై సైనిక చర్యకు ఏకగ్రీవ ఆమోదం లభించింది’’ అని ఆస్క్విత్ ప్రకటించారు. కానీ దాని వివరాలపై ఆయన మనసు పెట్టలేదని తెలుస్తోంది. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధపు ఘోరమైన విపత్తులలో ఒకటి జీవం పోసుకుంది. ఆస్క్విత్ది గతించిపోయిన కాలం. విస్మృత ప్రపంచంలోని ఒక భాగం. తొందరెందుకు అన్నట్లుగా ఆయన తీరు ఉండేది. తాపీగా, నెమ్మదిగా ఉండేవారు. అత్యవసర స్థితులు, సంక్షోభాలు ఆయన్నె ప్పుడూ తరమలేకపోయాయి. తరచూ డిన్నర్ పార్టీలకు వెళ్లే వారు. అవి అర్ధరాత్రి వరకు సాగేవి. బాడుగ టాక్సీలో వెళ్లేవారు. పుస్తకాల దుకాణాలో కాలం గడిపేవారు. అంగరక్షకులు లేకుండా కాలు కదిపే వారు. బిడియపడకుండా మద్యం సేవించేవారు. యుద్ధం మొదలవటానికి ముందు జరిగిన ఒక సందర్భం ఇది. ‘‘రాత్రి ఒంటి గంటకు ప్రధాని ఆస్క్విత్ ఒక క్వార్టర్ బాటిల్ బ్రాందీని దుస్తుల లోపల ఉంచుకుని తూలుతూ టాక్సీలో ఎక్కి, వెనుక కూర్చు న్నారు. తబ్బిబ్బై తనను చూస్తున్న ఆ టాక్సీ డ్రైవర్తో నేరుగా బకింగ్ హామ్ ప్యాలెస్కు పోనిమ్మని చెప్పాడు. ప్యాలెస్లోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే బ్రిటన్ రాజు ఐదవ జార్జి ప్రత్యక్షమయ్యారు. స్లిప్పర్స్ తొడుక్కుని, నైట్ షర్టుపై గోధుమ రంగు డ్రెస్సింగ్ గౌను వేసుకుని పూర్తి నిద్రకళ్లతో ఉన్నారాయన. ఆ స్థితిలో– కైజర్ (జర్మనీ చక్రవర్తి)కి వ్యతిరేకంగా జార్ (రష్యా చక్రవర్తి) మద్దతు కోరుతూ టెలిగ్రామ్పంపమని ఆస్క్విత్ ఆయనను కోరారు’’ అని రాశారు హ్యారిస్. మోదీని అలా ఉంచండి. స్టార్మర్, సునాక్ (బ్రిటన్ ప్రస్తుత, మాజీ ప్రధానులు) కూడా అలా చేయటానికి వెనుకాడి ఉండేవారు. అలా వెనుకాడక పోవటమే ఆస్క్విత్ కథను ప్రత్యేకమైనదిగా చేసింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వీసా నిబంధనలు సడలించాలి
బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో చర్చల్లో మోదీ - భారత్కు రెండు కొత్త వీసా కార్యక్రమాలు ప్రకటించిన బ్రిటన్ ప్రధాని - వీసా ప్రతిపాదనలను మెరుగుపరచడాన్ని పరిశీలిస్తామని థెరెసా హామీ - ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే వారిపై కఠిన చర్యలు న్యూఢిల్లీ: బ్రిటన్లో కఠినమైన వీసా నిబంధనలు, వృత్తినిపుణులు వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితిని పెంచడంపై భారత్ సోమవారం ఆ దేశానికి తన ఆందోళనను తెలియజేసింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రధానంగా భారతీయ కార్పొరేట్ల కోసం రెండు వీసా కార్యక్రమాలను ప్రకటించారు. రిజిస్టర్డ్ ప్రయాణికుల పథకం కింద వాణిజ్య ప్రయాణికులకు బ్రిటన్ సరిహద్దులో వేగవంతమైన అనుమతులు పొందుతారని.. ఈ పథకంలో భారత్ ‘తొలి వీసా దేశం’ అవుతుందని థెరెసా పేర్కొన్నారు. రెండో పథకం కింద.. వీసా, వలస సేవ అరుున ‘గ్రేట్ క్లబ్’లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్లను నామినేట్ చేసే తొలి ప్రభుత్వంగా భారత ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం థెరెసా ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకోవడం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఢిల్లీలో ఆమెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదం, భారత్-బ్రిటన్ ఆర్థిక సంబంధాలు, నేరస్తుల అప్పగింత అంశాలతో పాటు.. వీసా నిబంధనలపై చర్చించారు. కఠినమైన విద్యార్థి వీసా నిబంధనలపై భారత్ ఆందోళనను మోదీ తెలియజేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్రిటన్లో చదువుకునే విద్యార్థులు కోర్సు పూర్తరుున వెంటనే భారత్ తిరిగి రావాలి. దీనివల్ల బ్రిటన్కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోరుుంది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 2010లో 68,238 ఉండగా.. ఈ ఏడాది అది 11,864కు తగ్గాయి. అలాగే.. బ్రిటన్ వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితినీ 20,800 పౌండ్ల నుంచి 30,000 పౌండ్లకు పెంచారు. అంతకుముందు భారత్ -బ్రిటన్ సాంకేతిక సదస్సులో థెరెసా, మోదీలు పాల్గొన్నారు. యువత రాకపోకలను అధికంగా ప్రోత్సహించాలంటూ బ్రిటన్ విద్యార్థి వీసా నిబంధనలను సడలించాలని థెరెసాను కోరారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లోనూ మోదీ ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. బ్రిటన్లో ‘ఉండిపోయే హక్కు లేని’ భారతీయులు తిరిగి వచ్చేసే వేగం, పరిమాణం పెరిగినట్లరుుతే భారత్కు వీసా ప్రతిపాదనలను ఇంకా మెరుగుపరిచే విషయాన్ని తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని థెరెసా హామీ ఇచ్చారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా అనుసరించే విధానాన్ని, తగిన తనిఖీ ప్రక్రియ అనుసరిస్తామని భారత్ పేర్కొంది. మాల్యా, మైఖేల్లను అప్పగించండి... మనీ లాండరింగ్ ఆరోపణలున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, అగస్టావెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ స్కాం మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ సహా భారత్ వాంటెడ్ జాబితాలో ఉన్న 60 మందిని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్ను కోరింది. థెరెసా, మోదీల చర్చల సందర్భంగాఈ జాబితాను బ్రిటన్కు అందజేశారు. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద తమ కస్టడీకి అప్పగించాలని బ్రిటన్ 17 మందితో కూడిన జాబితాను భారత్కు అందించింది. నేరస్తులు, పరారీలో ఉన్న వారు చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతించరాదని ఇరుదేశాలు నిర్ణరుుంచారుు. ‘మండలి‘లో శాశ్వతానికి మద్దతు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ పేర్కొంది. సభ్యత్వం కోసం ఐరాసతో నిరంతర సంప్రదింపులు జరపాలని తమ అధికారులకు మోదీ, థెరిసాలు సూచించారు. సులభ వాణిజ్యం, మేధోసంపత్తి హక్కులపై సహకారం పెంపునకు భారత్, బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారుు. వ్యాధికారక సూక్ష్మజీవులపై పరిశోధనగాను రూ.107కోట్లతో సంస్థను ఏర్పాటు చేస్తాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం... ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్న మోదీతో థెరెసా గళం కలిపారు. ముంబై, పఠాన్కోట్ ఉగ్రదాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ఇద్దరూ పాకిస్తాన్కు పిలుపునిచ్చారు. చర్చల తర్వాత ప్రకటన విడుదల చేస్తూ.. మానవాళికి ఉగ్రవాదం తీవ్ర ముప్పు అని ఉద్ఘాటించారు. అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాటం చేయాలన్న తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ను పాక్ ‘అమరుడు’గా కీర్తించటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులను కీర్తించొద్దన్నారు. హైదరాబాద్ హౌస్లో థెరెసా, మోదీ వ్యాహ్యాళి బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ పూదోటలో ప్రధాని మోదీతో కలసి వ్యాహ్యాళి చేశారు. సోమవారం ఇక్కడికి చేరుకున్న థెరెసాను మోదీ ఆహ్వానించారు. అనంతరం వారిద్దరూ తోటలో నడుస్తూ చర్చలు కొనసాగించారు. ఇంతకుముందు గత ఏడాది జనవరిలో భారత్కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా, మోదీలు ఈ తోటలో నడుస్తూ మాట్లాడుకున్నారు. -
భారతీయులకు ఈజీగా బ్రిటన్ వీసా
న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆ దేశాన్ని కీలక వాణిజ్య భాగస్వామిగా మార్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రెగ్జిట్ అనంతరం తొలిసారి భారత్కు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే, భారత వ్యాపారులకు సులభతరమైన వీసా పాలన అందిస్తామని ప్రకటించారు. ఇండియా-యూకే టెక్ సమిట్లో ప్రసంగించిన థెరిస్సా, భారతీయులు ఈజీగా బ్రిటన్లోకి ప్రవేశించడానికి తాము ఆఫర్ చేస్తామని, రిజిస్టర్డ్ ట్రావెలర్ స్కీమ్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు. దీంతో యూకేను తరుచూ సందర్శించేవారికి ఇది ఎంతో ఉపయోగపడనుందని పేర్కొన్నారు. బ్రిటన్, భారత్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలనేదే తమ అభిప్రాయమని, వ్యాపారాలకు బ్రిటన్ ఎంతో అనువైనదని థెరిస్సా చెప్పారు. సమర్థవంతమైన వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలకు కేవలం చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ మాత్రమే కాక, ఇరు దేశాల ప్రజలు కూడా అవసరమేనన్నారు. తమ దేశంలో వ్యాపారాలు కోసం ట్రావెల్ చేసేవారికి వీసా ప్రక్రియను సులభతరం చేస్తానని హామీ ఇచ్చారు.చాలామంది భారతీయులు తమ స్కిల్స్ను, ఐడియాలను, బిజినెస్లను బ్రిటన్కు తీసుకొస్తున్నారని, ఇది తమ దేశానికి, ఆర్థికవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. సీఐఐ నిర్వహించిన ఈ సమిట్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. ఇండియాకు బ్రిటన్ ఎంతో ముఖ్యమైన స్నేహదేశమని వ్యాఖ్యానించిన మోదీ, ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక ఒప్పందాల్లో 'మేకిన్ ఇండియా'ను భాగం చేస్తామని తెలిపారు. -
బ్రిటన్లో దీపావళి సంబరాలు
-
బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే
-
బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే
రేపు ప్రమాణ స్వీకారం: కామరాన్ ప్రకటన లండన్ : బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ సోమవారం ప్రకటించారు. థెరిసా (59) ప్రస్తుతం దేశ హోంమంత్రిగా ఉన్నారు. ఉక్కు మహిళగా పేరుపడ్డ మార్గరెట్ థాచర్ అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న మహిళా నేత థెరిసాయే. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ (బ్రెగ్జిట్) జూన్ 23న నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో తీర్పు వెల్లడవటంతో.. బ్రెగ్జిట్ను బలంగా వ్యతిరేకించిన కామెరాన్ తాను ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయూతో బ్రెక్జిట్ చర్చలను ముందుకు తీసుకెళ్లే అంశాన్ని కొత్త ప్రధాని చూస్తారని ఆయన అప్పుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామెరాన్ తర్వాత ప్రధాని పదవి కోసం అధికార కన్సర్వేటివ్ పార్టీలో.. హోంమంత్రి థెరిసా మే, ఇంధనశాఖ మంత్రి ఆంద్రియా లీడ్సమ్ల (53) మధ్య పోటీ నెలకొంది. అయితే నాటకీయంగా సోమవారం ఉదయం ఆంద్రియా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు థెరిసా బలమైన నాయకురాలంటూ ఆమెకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. దీంతో.. థెరిసా ఒక్కరే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో కన్సర్వేటివ్ పార్టీ బోర్డు సభ్యులు 22 మంది సోమవారం నాడే అత్యవసరంగా సమావేశమై.. పోటీ లేనందున ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. థెరిసా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కామెరాన్ సోమవారం తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద మీడియాతో మాట్లాడారు. థెరిసా బుధవారం ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. తాను మంగళవారం తన చివరి మంత్రివర్గ భేటీకి హాజరవుతానని, బుధవారం ప్రధానిగా తన చివరి ప్రశ్నల కోసం హౌస్ ఆఫ్ కామన్స్కు హాజరవుతానని.. ఆ తర్వాత నబకింగ్హామ్ పాలస్కు వెళ్లి రెండో ఎలిజబెత్ రాణికి రాజీనామా సమర్పిస్తానన్నారు. ‘థెరిసా బలమైన నాయకురాలు. రానున్న సంవత్సరాల్లో మన దేశానికి అవసరమైన నాయకత్వాన్ని అందించటంలో ఆమె చాలా సమర్థులు’ అని కితాబునిచ్చారు. -
కాబోయే ప్రధాని ఆమెనే
బ్రిటన్ పీఠాన్ని అధిష్టంచనున్న థెరిసా మే బ్రెగ్జిట్ అనుకూల రెఫరెండం తీర్పుతో రాజకీయ అనిశ్చితిలో మునిగిపోయిన బ్రిటన్ లో తదుపరి ప్రధానమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. డేవిడ్ కామెరాన్ వారసురాలిగా బ్రిటన్ పగ్గాలను థెరిసా మే చేపట్టనున్నారు. నాటకీయ పరిణామాల నడుమ ఆమె ప్రధాన పోటీదారు అయిన ఆండ్రియా లీడ్సమ్ పోటీ నుంచి వైదొలగడంతో ప్రధాని రేసులో ఇప్పుడు థెరిసా ఒక్కరే నిలిచారు. బ్రిగ్జిట్ ఫలితాల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకొంటానని కామెరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి రేసులో ఆండ్రియా, థెరిసా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. థెరిసాకు పిల్లలు ఉండటం వల్ల ఆమె ప్రధాని పదవిని సమర్థంగా నిర్వహించలేరంటూ ఆండ్రియా ఇటీవల చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఆండ్రియా సోమవారం ఊహించనిరీతిలో ప్రకటన చేశారు. ప్రధాని రేసు తుదకంటూ కొనసాగడం సబబు కాదని, కాబట్టి తాను ఈ రేసు నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందరినీ విస్మయ పరిచారు. బ్రిటన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బ్రెగ్జిట్ ప్రక్రియను థెరిసా సమర్థంగా నిర్వహించగలరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో త్వరలోనే బ్రిటన్ ప్రధానిగా థెరిసా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.