Brutally murder
-
Medchal: నడి రోడ్డుపై అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్: అది జాతీయ రహదారి.. ఆదివారం సాయంత్రం కావస్తోంది.. జన సంచారం.. వందలాది వాహనాలు వస్తూ పోతున్నాయి. ఓ వ్యక్తి ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడిని కొందరు వ్యక్తులు వెంబడించారు. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ దారుణాన్ని అక్కడున్న వారు ఆపే ప్రయత్నం చేయకపోగా.. తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు గుగులోతు గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉమేష్ (25), రాకేష్ ఉన్నారు. వీరు మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు ఉమేష్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య ప్రియాంకను, సోదరుడు రాకేష్ను, ఇంట్లోని పిల్లలను వేధింపులకు గురి చేస్తుండేవాడు. దురలవాట్లకు బానిసైన అతడిని దుబాయ్కి పంపించే ఏర్పాట్లు చేస్తుండగా.. వాటిని కూడా చెడగొట్టాడు. ఈ క్రమంలో ఆదివారం సైతం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఉమేష్.. కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు. అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంట్లోనే ఉన్న సోదరుడు రాకేష్తో, చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్లతో ఉమేష్ వాగ్వాదానికి దిగాడు. వారిని బీరు సీసాతో బెదిరించాడు. రాకేష్ లక్ష్మణ్లు అతడిని ప్రతిఘటించారు. దీంతో ఉమేష్ సమీపంలోని జాతీయ రహదారి వైపు పరుగెత్తాడు. రాకేష్ లక్ష్మణ్లు బస్టాండ్ సమీపంలో ఉమేష్ను పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉమేష్ మృతదేహంపై 12 కత్తిపోట్లు ఉన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. హత్య ఘటన వీడియోల్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నా.. మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాకేష్ లక్ష్మణ్తో పాటు వీరి కుటుంబ సభ్యులు నవీన్, నరేష్ సురేష్లు ఉన్నట్లు సమాచారం. ఉమేష్ను కత్తులతో దారుణంగా పొడుస్తున్నా.. అక్కడున్నవారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తమ మొబైల్ ఫోన్లలో హత్య చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తోటి మనిషి కత్తి పోట్లకు గురవుతున్నా.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా.. ఎవరూ స్పందించకపోవడం మానవత్వం కనుమరుగవుతోందనడానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. -
ఆటోడ్రైవర్ దారుణ హత్య..
విశాఖపట్నం: సస్పెక్టడ్ షీటు ఉన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లారేసరికి రక్తపుమడుగులో ఉన్న అతడిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. దుర్గాబజార్లో నివాసముంటున్న ఏరుసుమాండాల ఆదినారాయణ అలియాస్ ఆది(30) ఆటో డ్రైవర్. ఆయన మంగళవారం రాత్రి స్నేహతుడి పుట్టినరోజు పారీ్టకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో బాలాజీనగర్ ప్రాంతంలోని జీవీఎంసీ సులభ్ కాంప్లెక్స్ వద్ద కూర్చున్న అదే ప్రాంతానికి చెందిన జగదీ‹Ù, శివ అనే ఇద్దరు యువకులను కలిశాడు. వారితో ఆదికి పరిచయం లేకపోయినా.. మాటలు కలిపి అక్కడే కొద్దిసేపు ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరితో ఆదికి చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవ పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఆది అందుబాటులో ఉన్న కర్ర, బీరు బాటిల్ తీసుకుని వారిద్దరినీ కొట్టాడు. దీంతో ఆ యువకులు ఆదిపై తిరగబడి దాడి చేశారు. కర్రతో అతని తలపై బలంగా కొట్టారు. దీంతో ఆది సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బుధవారం ఉదయం ఆరు గంటలకు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న ఆది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. కాగా.. ఆదిని హత్య చేసిన జగదీష్, శివ పోలీసులకు లొంగిపోయారు. తాము ఆదిని హత్య చేశామని ఒప్పుకున్నారు. ఆది తమ వద్దకు వచ్చి కావాలనే గొడవపడి మమ్మల్ని కొట్టడంతో.. దాడి చేసినట్లు పోలీసులకు తెలిపారు. వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు.ఆదిపై సస్పెక్టడ్ షీట్ : రెండేళ్ల కిందట ఆరిలోవ కాలనీలో ఓ యువకుడిని హత్య చేసిన కేసులో ఆది నిందితుడని సీఐ సోమశేఖర్ తెలిపారు. దీంతో ఆయనపై సస్పెక్టడ్ షీటు తెరిచినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం రౌడీ షీటర్లతో పాటు ఆది కూడా స్టేషన్కు వచ్చి రికార్డులో సంతకం చేస్తుండేవాడన్నారు. ఇప్పుడు ఈ హత్యకు పాత గొడవలు కారణమా.. యాదృచి్ఛకంగా యువకులు దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆది తండ్రి బంగారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
-
దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..
Matheran Crime News: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్లో ఓ మహిళా పర్యాటకురాలు దారుణ హత్యకు గురైన సంఘటనలో రాయ్గఢ్ పోలీసులు ఒక ఐటీ ఇంజనీర్ను అరెస్ట్ చేశారు. పన్వేల్కు చెందిన రామ్పాల్ అనే వ్యక్తి తన భార్య పూనమ్పై అనుమానంతోనే ఆమెను లాడ్జిలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. మాథేరాన్లోని ఇందిరానగర్లో ఉన్న ఓ లాడ్జ్లో గది కావాలని శనివారం సాయంత్రం ఓ జంట వచ్చింది. లాడ్జ్ సిబ్బంది నియమాల ప్రకారం ఆ జంట వివరాలు రిజిస్టర్లో రాసుకొని వారికి గది ఇచ్చారు. ఆదివారం ఉదయం లాడ్జ్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి గది లోపలికి వెళ్లగా, బెడ్ కింద తల లేని మొండెం కనపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూసి భయపడిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ అంతటా సోదా చేశారు. కానీ తల దొరకలేదు. దీంతో శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పన్వేల్లోని ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా, దర్యాప్తులో భాగంగా తనిఖీ చేస్తుండగా, రిజిస్టర్లో రాసిన పేరు, చిరునామా తప్పుడు వివరాలని తేలింది. ఈ జంట నుంచి లాడ్జ్ యజమాని కేతన్ రమాణే ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకోలేదు. దీంతో ఈ హత్య కేసు చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు, లాడ్జింగులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. చదవండి: (రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్) మాస్క్ ధరించి ఉండటంతో ఆ మహిళ భర్త ముఖం గుర్తించడం కష్టతరంగా మారింది. ఇదిలావుండగా, సోమవారం ఉదయం మాథేరాన్లో ఓ చోట ఓ హ్యాండ్ బ్యాగ్ లభించింది. సీసీ టీవీ ఫుటేజ్లో మహిళ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగు, పోలీసులకు దొరికిన బ్యాగు ఒకటేనని తేలింది. దీంతో ఆ బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను ముంబైలోని గోరేగావ్కు చెందిన 30 ఏళ్ల పూనమ్ పాల్గా గుర్తించారు. అదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా తమ కూతురు అదృశ్యమైనట్లు గోరేగావ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మృతదేహం పూనమ్దేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. -
11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో 11 ఏళ్ల హిందూ బాలుడుని లైంగిక వేధింపులకు గురిచేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాదు ఆ బాలుడు శవమై ప్రావిన్స్లో ఖైర్పూర్ మీర్ ప్రాంతంలోని బబర్లోయ్ పట్టణంలోని ఒక పాడుబడిన ఇంట్లో ఉన్నట్లు గుర్తించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించింది. ఈ మేరకు ఆ బాలుడు బంధువు రాజ్కుమార్ మాట్లాడుతూ..."మా కుటుంబం గురునానక్ పుట్టినరోజు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో మా పిల్లవాడు ఎప్పుడూ అదృశ్యమయ్యాడో మేము గుర్తించలేకపోయాం." అని చెప్పారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) అంతేకాదు ఆ బాలుడు 2011లో జన్మించాడని, ప్రస్తుతం ఐదోతరగతి చదువుతున్నట్లు ఆ బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా ఆ మైనర్ బాలుడి శరీరంపై చిత్రహింసల తాలుకా గుర్తులు కూడా ఉన్నాయని చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీ సుక్కుర్కు చెందిన జుబైర్ మహర్ తెలిపారు. అంతేకాదు గత కొన్ని వారాల్లో ప్రావిన్స్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని మహర్ చెబుతున్నారు. ఈ మేరకు బాబర్లోయి పోలీస్ స్టేషన్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) మాట్లాడుతూ.." నిందితులు అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడే ముందు బాలుడిని గొంతు కోసి చంపినట్లు చెప్పారు. మేము ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం. పైగా వారిలో ఒకరు నేరాన్ని అంగీకరించారు" అని ఎస్హెచ్ఓ చెప్పారు. (చదవండి: యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..) -
అనంతపురం జిల్లాలో దారుణ హత్య
-
నిజాయితీకి నిండు ప్రాణం బలి
బెదిరింపులకు బెదరలేదు.. ప్రలోభాలకు లొంగలేదు... పోలీసు శాఖలో నిగూఢమై ఉన్న నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచాడు.అక్రమార్కులను ఒంటి చేత్తో పట్టుకుని చట్టానికి పట్టించే ప్రయత్నంలో కరుడుగట్టిన ఇసుక మాఫియా చేతుల్లో దారుణంగా హతమయ్యాడు. అతని మరణంతో ఐదు నెలల గర్భిణిగా ఉన్న భార్య, నాలుగేళ్ల కుమారుడు అనాథలయ్యారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీస్ హెడ్కానిస్టేబుల్ను ఇసుక మాఫియా కిరాతకంగా హతమార్చింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి తాలూకా చింతామణికి చెందిన జగదీశ్ దురై (34) విజయనారాయణం పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. విజయనారాయణం సమీపంలో రేయింబవళ్లు ఇసుక అక్రమరవాణా సాగుతోంది. నంబిచెరువు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు జగదీశ్కు సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మోటార్సైకిల్పై వెళ్లి తనిఖీలు నిర్వహించాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఇసుక లోడ్చేసిన ట్రాక్టర్తో సహా పరారయ్యేందుకు ప్రయత్నించారు. జగదీశ్ వారిని వెంబడించాడు. పరప్పాడి–తామరైకుళం అటవీ ప్రాంతంలో వెనుకవైపు టైరు పంచరై ట్రాక్టర్ బోల్తాపడి నిలిచిపోయింది. ట్రాక్టర్ నుంచి దిగిన 8 మంది వ్యక్తులు తమను వెంటాడుతున్న జగదీశ్పై గడ్డపార, ఇనుపరాడ్డు, దుడ్డుకర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. గిలగిలాకొట్టుకుంటూ జగదీశ్ అక్కడే ప్రాణాలువిడిచాడు. అతరువాత నిందితులు ట్రాక్టర్ను సంఘటన స్థలంలోనే విడిచి పారిపోయారు. గస్తీకి వెళ్లిన జగదీశ్ తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులు హత్య గురైనట్లు గుర్తించారు. పంచరైన ట్రాక్టర్కోసం నలుగురు వ్యక్తులు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం గాలింపు చేపట్టారు. రెండు నెలలుగా బెదిరింపులు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన జగదీశ్కు ‘మా జోలికి రావద్దు’ అంటూ రెండునెలలుగా బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక తమకు అనుకూలమైన పోలీసుల ద్వారా జగదీశ్ను మచ్చిక చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఎవరికీ లొంగకుండా నిజాయితీగా విధులు నిర్వర్తించడంతో చంపేస్తామని కూడా హెచ్చరించి చివరకు అన్నంత పనిచేసి పొట్టనపెట్టుకున్నారు. తల్లడిల్లిన సతీమణి జగదీశ్ హత్యకు గురైనట్లు సోమవారం ఉదయం భార్య, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఐదునెలల గర్భిణిగా ఉన్న భార్య మారియారోస్ మార్గరెట్ (30) తన కుమారుడు జోయల్ (4)ను వెంటపెట్టుకుని హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నిజాయితీగా పనిచేస్తున్న తన భర్తను పాపిష్టి మూకలు ప్రాణం తీసాయని మృతదేహంపైపడి గుండెలవిసేలా రోదించారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఉన్నతాధికారులకు భర్త తెలియజేసినా పట్టించుకోనందునే ఆయన ప్రాణాలు పోయాయని ఆమె నిందించారు. తిరునెల్వేలి జిల్లా ఎస్పీ అరుణ్శక్తికుమార్, నంగునేరి ఏఎస్పీ సురేష్కన్నన్ తదితరులు ఆమెను ఓదార్చారు. -
గొడ్డలితో నరకటానికి ప్రయత్నించాను.. కానీ
అన్నానగర్: భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ఆమెను నరికి హత్య చేశాడు. అంతటితో అగకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఉలగంధిని(47) పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. తిరువారూర్ జిల్లా వడపూర్ మెయిన్ రోడ్డుకి చెందిన ఉలగంధి మేస్త్రీ పని చేస్తూ జీవనం గడిపేవాడు. ఈయన మునీశ్వరి(36)ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కిరుబాదేవి(19), ప్రియదర్శిని (06) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునీశ్వరి తల్లి ఓ బ్యాంకులో పని చేస్తుంది. ఆరోగ్యం సరిగాలేనప్పుడు ఆమె వెళ్ళి వస్తుంది. ఉలగంధి రోజు మద్యం తాగి వచ్చి మునీశ్వరి ప్రవర్తనపై అనుమానపడి తగాదా చేస్తూ వచ్చాడు. ఈ స్థితిలో గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. కిరుబాదేవి తల్లికి ఫోన్ చేసింది. ఫోన్ తీయకపోవడంతో ఆమె తల్లిని వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉంది. కిటికీ నుంచి లోపలికి చూస్తే తల్లి చేతులు, తల ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. తల్లి మృత దేహాన్ని చూసి దిగ్ర్భాంతి చెందిన కూతురు భోరున ఏడ్చింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి చూసి దిగ్భ్రాంతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మన్నార్కుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి భర్త ఉలగంధిని అరెస్టు చేసి విచారణ చేశారు. నా భార్య మీద అనుమానం ఉంటూ వచ్చింది. గురువారం రాత్రి ఈ విషయంలో ఇద్దరి మధ్య తగాదా ఏర్పడింది. ఆవేశంలో ఇంటిలో ఉన్న కత్తితో ఆమెను నరకడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తరువాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు చేతులను, తలను ముక్కలుగా చేశాను. పైగా నడుము భాగాన్ని గొడ్డలితో నరకటానికి ప్రయత్నించాను, కాని నా వల్ల కాలేదు. అందుకే ఇంటికి తాళం వేసి వెళ్ళానని విచారణలో తెలిపాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
ప్రత్యర్థులంతా ఏకమై మట్టుబెట్టారు..
► ఏడుగురు నిందితుల అరెస్టు కర్నూలు: బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన పేరపోగు రాజు (42) హత్య కేసు మిస్టరీ వీడింది. రాజు ప్రత్యుర్థులంతా ఏకమై అతడిని మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో ఇద్దరు హతుడికి స్వయానా సోదరులుండడం గమనార్హం. నిందితులు పేరపోగు బుజ్జన్న, పేరపోగు బాబురావు, అదే గ్రామానికి చెందిన ఆకెపోగు ఇసాక్, సందెపోగు కృష్ణ, ఆకెపోగు రవి, పేరపోగు ప్రేమ్కుమార్, తేనెల రాజు అలియాస్ మున్నా రాజు (నందనపల్లె)పడిదెంపాడు సమీపంలోని కేసీ కెనాల్ కట్ట వద్ద ఉండగా పోలీసులు వారిని అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన పట్టుడు కట్టెలు, పిడిబాకులను స్వాధీనం చేసుకున్నారు. తాలూకా పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. గ్రామానికి చెందిన మారెన్న, వెంకటరమణ దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా హతుడు రాజు రెండవ కుమారుడు. తల్లి వెంకటమ్మ పేరుతో ఉన్న రెండు ఎకరాల పొలం విషయంలో తమ్ముళ్లు బాబురావు, బుజ్జన్నలతో విభేదాలు ఉన్నాయి. ఆస్తి కోసం హతుడితో గొడవ పడి సోదరులిద్దరూ ఊరు వదిలారు. ఎమ్మార్పీఎస్ మాజీ నేత పెద్ద లక్ష్మన్నకు వ్యతిరేకంగా ఉన్న వర్గంతో పేరపోగు రాజు సన్నిహితంగా ఉంటూ పెత్తనం చలాయించేవాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులంతా ఏకమై గత నెల 29 రాత్రి గ్రామ శివారులోని బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీకి వెళ్లే దారిలో పొలంలో మద్యం తాపించి హత్య చేశారు. ఎమ్మార్పీఎస్ మాజీ నేత పెద్ద లక్ష్మన్న ఇందులో ప్రధాన సూత్రధారి, అతడితో పాటు బాబు, మహేష్ పరారీలో ఉన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి వారి కోసం గాలిస్తున్నారు. మద్యంలో విష ప్రయోగం చేసినట్లుగా అనుమానం ఉండడంతో నిర్ధారణ కోసం వైద్య పరీక్షలకు పంపారు. స్వల్ప వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించిన తాలూకా పోలీసులను డీఎస్పీ అభినందించారు. సీఐ మహేశ్వరరెడ్డి ఎస్ఐ గిరిబాబు పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
హనుమంతునిపాడు : ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండల పరిధి నంద్యాల– ఒంగోలు హైవేపై వేములపాడు ఘాట్ రోడ్డు దిగుడు కొంతదూరం వెళ్లిన తర్వాత చెట్లలో ఆదివారం వెలుగు చూసింది. మృతదేహం గుంటూరు జిల్లాకు చెందిన మహిళదిగా సోమవారం ప్రాథమికంగా గుర్తించారు. కనిగిరి సీఐ సుబ్బారావు కథనం ప్రకారం.. ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్ వచ్చి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించింది. మహిళను హంతకులు కొట్టి చంపారు. ఆ తర్వాత ఆమెను కల్చి వేశారు. సంఘటన స్థలంలో రక్తంతో తడిచిన రాయి, వేరుశనగ కాయలు, అరటి కాయల తొక్కులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి చేతిపై పచ్చ బొట్టు ఉంది. కాళ్లకున్న పట్టీలు, మెట్టెలు, చేతి వాచ్, మెడలో ఉన్న సన్నని గొలుసు కాలి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆదివారం పొదిలి నుంచి గిద్దలూరు బస్సు ఎక్కి ప్రయాణం చేసిన టిక్కెట్లు కూడా గుర్తించారు. హత్యకు ముందు ఆమెతో ఓ వ్యక్తి వచ్చినట్లు సమాచారం. హత్య ఆదివారం సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్యలో జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలికి సుమారు 35 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. మృతురాలు గుంటూరులో ఆమీనా సంస్థలో సెక్యూరీటీ గార్డుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించారు. సీఐతో పాటు ఎస్ఐ హరిబాబు ఉన్నారు. -
భార్యను రోకలిబండతో కొట్టిచంపిన భర్త
-
అనుమానం పెనుభూతమై..
అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యని అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెద వేగిమండలం కే.కన్నాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామును చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకి ఆరేళ్ల క్రితం రోజ(21)తో వివాహమైంది. కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరి జీవితంలోకి తరచు గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శనివారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి కోపోద్రిక్తుడై ఆమె నిద్రిస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున కొబ్బరి కాయలు నరికే కత్తితో ఆమె మెడ నరికేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.