card on search
-
పోలీసులు తనిఖీలు: అనుమానితులు అరెస్ట్
మచిలీపట్నం: కృష్ణాజిల్లా ముఖ్యకేంద్రమైన మచిలీపట్నం పట్టణంలోని పలు కాలనీల్లో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నుంచి సోదాలు నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ, టెంపుల్ కాలనీలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. అలాగే పలు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని... స్టేషన్కు తరలించారు. పోలీసుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో పట్టణంలో దొంగలు పలు నివాసాలే లక్ష్యం చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దాంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
నందిగామలో పోలీసుల కార్డాన్ సెర్చ్
-
నందిగామలో పోలీసులు తనిఖీలు : 40 మంది అరెస్ట్
విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామలోని డీవీఆర్ కాలనీలో నివాసాలలో పోలీసులు శనివారం అర్థరాత్రి నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 13 మంది రౌడీషీటర్లు, 15 మంది దొంగలతోపాటు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నందిగామ పరిసర ప్రాంతాలలో దోపిడి దొంగల బీభత్సం అధికమైంది. దాంతో ప్రజలు హాడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నందిగామలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గత అర్థరాత్రి బీవీఆర్ కాలనీలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు స్థానిక డీఎస్పీ రాధేశ్ మురళి నేతృత్వం వహించారు. కృష్ణాజిల్లాలో నేర తీవ్రత సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే జిల్లాలోని పలు ప్రాంతాలలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే గుడివాడలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
మచిలీపట్నంలో పోలీసుల సోదాలు
-
మచిలీపట్నంలో పోలీసుల సోదాలు
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించారు. మచిలీపట్నం పరిధిలోని రాజుపేట, గంగులతోట, పావురాలగుట్ట తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. స్థానికుల ధృవపత్రాలను పరిశీలించారు. అనుమానితుల కదలికలపై ఆరా తీశారు. నేర చరిత్ర కలిగిన 15మందిని అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంట్స్లేని 15 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వంద మంది పోలీసులు కార్డ్ ఆన్ సెర్చ్లో పాల్గొన్నారు.