cash withdraw
-
డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్డ్రా
డెబిట్ కార్డు పోయిందా..ఏటీఎంకు కార్డు తెసుకెళ్లడం మర్చిపోయారా..డెబిట్ కార్డు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లారా.. మరేం పర్వాలేదు. మీరు ఉన్న ప్రాంతంలో ఏటీఎం ఉంటే ఎలాంటి డెబిట్ కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీ స్మార్ట్ఫోన్లో యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బు విత్డ్రా చేయాలో తెలుసుకుందాం.బ్యాంకింగ్ రంగ సేవల్లో టెక్నాలజీ విస్తరిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ చిన్న లావాదేవీలు చేయాలన్నా స్మార్ట్పోన్లోని యూపీఐని వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంలో డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ఇంటర్ ఆపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి.విత్డ్రా చేసుకోండిలా..ముందుగా మీ వద్ద యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ఫోన్ ఉండాలి. ప్రస్తుతం చాలామంది గూగుల్పే, ఫోన్పే..వంటి యూపీఐ ధర్డ్పార్టీ యాప్లను వాడుతున్నారు.మీ బ్యాంకు ఐసీసీడబ్ల్యూ సేవలందిస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి.ఒకవేళ ఈ సర్వీసు అందుబాటులో ఉంటే ఏటీఎం వద్దకు వెళ్లి స్క్రీన్పై ‘యూపీఐ నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోవాలి.ఏటీఎం ప్రొవైడర్ను బట్టి ఈ ఎంపిక విభిన్నంగా ఉండవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సులువుగానే దాన్ని గుర్తించవచ్చు.యూపీఐ విత్డ్రా సెలక్ట్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది.మీ ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం స్క్రీన్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.మీరు ఎంత డబ్బు విత్డ్రా చేయాలో ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ప్రెస్ చేయాలి. (యూపీఐ ద్వారా ఏటీఎం రోజువారీ విత్డ్రా పరిమితి సాధారణంగా రూ.10,000గా ఉంటుంది)కొంత సమయం తర్వాత బ్యాంకు సిస్టమ్ సర్వర్తో కనెక్ట్ అయి డబ్బు విత్డ్రా అవుతుంది.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానంలోని కీలకాంశాలు..ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. క్యూఆర్ కోడ్ మీ సమాచారాన్ని రక్షించడానికి ఎన్క్రిప్షన్ని ఉపయోగిస్తుంది. మీకు మాత్రమే తెలిసిన యూపీఐ పిన్తో లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు. -
పెరుగుతున్న క్యాష్ విత్డ్రాలు!
భారత్లో యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ గతేడాది ఏటీఎంల నుంచి చేసే నగదు ఉపసంహరణలు 5.51 శాతం పెరిగినట్లు తాజాగా సీఎంఎస్ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 9 శాతం పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నా ఆ మేరకు నగదు ఉపసంహరణ మాత్రం పెరగడంలేదని నివేదిక ద్వారా తెలిసింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసిన నగదు ఉపసంహరణల కంటే 2023-24లో చేసిన నెలవారీ విత్డ్రాలు సగటున 7.23 శాతం ఎక్కువగా ఉన్నాయి. గతేడాదిలో మెట్రోనగరాల్లో విత్డ్రా చేసిన సగటు నగదు అంతకుముందు ఏడాదికంటే 10.37 శాతం పెరిగింది. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 3.94 శాతం పెరుగుదల కనిపించింది.భారత్లో గతేడాది ఏటీఎంల ద్వారా అధికంగా డబ్బు తీసుకున్న ఉత్తరాది ప్రాంతాల్లో దిల్లీ, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక ప్రజలు అధికంగా డబ్బు విత్డ్రా చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 49 శాతం ఏటీఎంలు మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 51 శాతం ఏటీఎంలు సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.ఇదీచదవండి: ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను సగానికి తగ్గించిన ప్రభుత్వ సంస్థప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించి 64 శాతం ఏటీఎంలు మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. 36 శాతం ఏటీఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిసింది. -
బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
సాక్షి, వీరఘట్టం (మన్యం పార్వతీపురం): మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన స్థానికులైన భోగి ప్రదీప్ ఖాతా నుంచి రూ.7,500, భోగి ప్రదీప్కుమార్ ఖాతా నుంచి రూ.6,400, కస్పా ఉమాశంకర్ప్రసాద్ ఖాతానుంచి రూ.9,999లు గత నెల ఆగస్టు 13వ తేదీన విత్ డ్రా అయ్యాయి. డబ్బులు విత్ డ్రా అయినట్లు అదే రోజు మధ్యాహ్నం 3.21 గంటలకు వారి ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. దీంతో విస్తుపోయిన వారు తమకు తెలియకుండా డబ్బులు ఎలా విత్ డ్రా అయ్యాయి? ఎవరు విత్ డ్రా చేశారోనని తలలు పట్టుకున్నారు. ఆగస్టు 13 రెండవ శనివారం కావడంతో సాయంత్రం 4 గంటలకే బ్యాంకు మూసేశారు. మరుసటి రోజు ఆగస్టు 14న ఆదివారం, సోమవారం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకుకు వరుస సెలవులు ఇచ్చారు. దీంతో వారు ఆగస్టు 16న బ్యాంకుకు వెళ్లి మేనేజర్ జయరామ్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు. ఆయన వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించి ఆధార్కార్డు నంబర్ ఆధారంగా 2230250000–222515304293 నంబర్ గల కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా డబ్బులు విత్ డ్రా అయినట్లు గుర్తించారు. అయితే కస్టమర్ సర్వీసు సెంటర్ ఏ ప్రాంతానికి చెందినదో గుర్తించలేమని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని ముంబైలోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి మెయిల్ చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. బాధితుడు ప్రదీప్ కుమార్ మూడు వారాలు గడుస్తోంది యూనియన్ బ్యాంకు ఖాతాల నుంచి తమ డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేసినా ఇంత వరకు బ్యాంకు సిబ్బంది పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో ఒకరైన భోగి శ్రీధర్ శుక్రవారం యూనియన్ బ్యాంకుకు వెళ్లి ఇంత వరకు ఏ చర్యలు చేపట్టారో చెప్పండని బ్యాంకు సిబ్బందిని ప్రశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజరు సెలవులో ఉన్నారని, రెండు రోజుల తర్వాత రావాలని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి వీరి ముగ్గురి డబ్బులే విత్ డ్రా అయ్యాయా? లేక ఇంకవరివైనా విత్ డ్రా అయ్యాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఈ సైబర్ క్రైమ్ను ఛేదించి ఖాతాదారులకు భరోసా కల్పించాలని బ్యాంక్ సిబ్బందిని పలువురు కోరుతున్నారు. -
నకిలీ ఇన్వాయిస్లతో 19.1 కోట్లు విత్డ్రా
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్లో వెలుగుచూసిన నకిలీ ఇన్వాయిస్ల కుంభకోణం మరువక ముందే అదే తరహాలో రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్లోనూ ఓ మోసం వెలుగు చూసింది. ముఖేశ్ కుమార్ గోయల్, సంజయ్ జోషి, రాహుల్ అగర్వాల్ అనే ముగ్గురు మనుగడలో లేని కంపెనీలను సృష్టించి, సరుకు రవాణా చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందారు. అంతేకాకుండా ప్రీతం ఫుట్వేర్, రాజేశ్ ఫుట్వేర్, యోగేశ్ ఫుట్వేర్ సంస్థలు జారీ చేసిన నకిలీ జీఎస్టీ ఈ–వే బిల్లుల సాయంతో దాదాపు రూ. 32.54 కోట్ల విలువైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందేందుకు ప్రణాళిక రచించారు. అందులో రూ. 19.1 కోట్లను రీఫండ్ రూపంలో పొందినట్లు జీఎస్టీ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిని అరెస్టు చేశారు. కోర్టు వారికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. -
ఏటీఎంలో నకిలీ రూ. 2వేల నోటు
సాక్షి, భూదాన్పోచంపల్లి : ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే అందులో రూ.2వేల నకిలీ నోటు రావడంతో బాధితుడు ఖంగుతిన్న సంఘటన భూదాన్పోచంపల్లి మండలంలోని దేశ్ముఖిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు దుర్గం లింగస్వామి తెలిపిన వివరాల ప్రకారం..దేశ్ముఖిలోని నిజాం ఇంజనీరింగ్ కళాశాలలో ఇండిక్యాష్ ప్రైవేట్ ఏటీఎం ఏర్పాటు చేశారు. లింగస్వామి ఏటీఎం నుంచి రూ. 10వేల చొప్పున రెండు సార్లు మొత్తం రూ. 20వేలు డ్రా చేశాడు. అనంతరం నోట్లను లెక్కిస్తుండగా అందులో రూ. 2వేల నకిలీ నోటు కనిపించింది. నిశితంగా పరిశీలించగా ‘భారతీయ బచ్చోంక బ్యాంకు, దో హాజార్ అంక్ ’ అని ఆ నోట్పై రాసి ఉంది. వెంటనే బాధితుడు ఏటీఎంలోని స్క్రీన్పై ఉన్న టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయగా రిజర్వు బ్యాంకును సంప్రదించాలని వారు సలహా ఇచ్చారు. నకిలీ నోటు వల్ల తాను రూ.2వేలు నష్టపోయానని బాధితుడు వాపోయాడు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏటీఎంల్లో నో క్యాష్ : ఊరటనిచ్చిన ఎస్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఏటీఎంలలో నగదు రాక, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్ల ద్వారా రోజుకు రూ.2000 వరకు నగదును కస్టమర్లు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. ‘క్యాష్@పీఓఎస్’ కార్యక్రమం ద్వారా ఈ క్యాష్ విత్డ్రా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏటీఎంల వద్ద నగదు దొరకని కస్టమర్లకు ఇది గుడ్న్యూస్గా మారింది. ‘క్యాష్@పీఓఎస్’ సౌకర్యం ద్వారా డెబిట్ కార్డుదారులు ఎస్బీఐ పీఓఎస్ టర్మినల్స్ వద్ద డెబిట్/ప్రీపెయిడ్ కార్డులను స్వైప్ చేసి నగదును విత్డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం టైర్ 1, టైర్ 2 నగరాల ప్రజలు ఒక్కో కార్డుపై రూ.1000 విత్డ్రా చేసుకోవచ్చని, టైర్ 3 నుంచి టైర్ 6 నగరాల ప్రజలు రూ.2000 వరకు విత్డ్రా చేసుకోవచ్చని తెలిసింది. మెర్చంట్ లొకేషన్ల వద్ద ఎస్బీఏ ఏర్పాటు చేసిన పీఓఎస్ మిషన్ల నుంచి ఎస్బీఐ, ఇతర బ్యాంకుల డెబిట్ కార్డు కస్టమర్లు ఈ విత్డ్రాను చేపట్టుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ విత్డ్రాలకు ఎటువంటి ఛార్జీలను విధించడం లేదని కూడా ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ల ద్వారా రిటైల్ వ్యాపారుల వద్ద కార్డు పేమెంట్లను జరుపుకోవచ్చు. ఎస్బీఐకి ప్రస్తుతం 6.08 లక్షల పీఓఎస్ మిషన్లు ఉన్నాయి. వాటిలో 4.78 లక్షల మిషన్లను నగదును అందిస్తున్నాయి. కాగ, దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏర్పడటంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత 24 గంటల నుంచి నగదును అందుబాటులోకి తీసుకురావడానికి తమ ఏటీఎం నెట్వర్క్లను మెరుగుపరుస్తున్నట్టు ఎస్బీఐ చెప్పింది. రేపటి వరకు ఈ సమస్య మటుమాయమవుతుందని కూడా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. -
ఆంక్షల్లేవు.. కానీ క్యాష్ ఏదీ?
⇒ నగదు విత్డ్రాపై పరిమితులు ఎత్తేసిన ఆర్బీఐ ⇒ ఇకపై డీమోనిటైజేషన్ ముందునాటి పరిస్థితులు ⇒ ఏటీఎంలలో నగదుకు కటకటే!! న్యూఢిల్లీ: సేవింగ్స్ బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలపై విధించిన అన్ని పరిమితులనూ ఆర్బీఐ సోమవారం నుంచి తొలగించింది. దీంతో గతేడాది నవంబర్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన ఆంక్షలకు తెరపడింది. ఏటీఎం నగదు ఉపసంహరణలపై విధించిన ఆంక్షలన్నీ మార్చి 13 నుంచి తొలగిపోతాయని ఆర్బీఐ గతనెల్లోనే ప్రకటించింది. కరెంటు ఖాతాలు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు, ఓవర్డ్రాఫ్ట్ ఖాతాల నుంచి చేసే విత్డ్రాయల్స్పై ఆంక్షలను జనవరి 30నే ఎత్తివేసింది. ఒకటి తర్వాత ఒకటి... గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ రాత్రి నుంచీ ప్రజల వద్దనున్న పెద్దనోట్లు చెల్లకుండా పోయాయి. కొత్త నోట్ల కొరత ఉండడంతో ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేయటంపై ఆర్బీఐ పరిమితులు పెట్టింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం నుంచి రోజులో రూ.2,000 మాత్రమే విత్డ్రా చెయ్యాలని పరిమితి పెట్టి... నవంబర్ 14 నుంచి దీన్ని రూ.2,500కు పెంచింది. జనవరి 1 నుంచి రూ.4,500కు, జనవరి 16 నుంచి రూ.10,000కు పెంచింది. బ్యాంకు శాఖల నుంచి చేసే విత్డ్రాయల్స్కూ పరిమితులు పెట్టింది. ఈ ఆంక్షలన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి. రీమోనిటైజేషన్... అంటే కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ముగిసిందని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఈ మధ్యే చెప్పారు. అయితే, ఇప్పటికీ చాలా ఏటీఎంలలో నగదుకు కటకట కొనసాగుతూనే ఉంది. బ్యాంకులు నెలకు 3 విత్డ్రాయల్స్ను మాత్రమే ఉచితంగా అనుమతిస్తూ... అంతకు మించితే ఇపుడు చార్జీలు వడ్డిస్తున్నాయి. దీంతో చాలామంది మధ్య తరగతి వారు తమ జీతం మొత్తాన్ని ఆ మూడు లావాదేవీల్లోనే తీసేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఏటీఎంలలో నగదు కొరతకు ఇదీ ఒక కారణమన్నది బ్యాంకింగ్ వర్గాల మాట. ⇔ డీమోనిటైజేషన్ ప్రకటన మర్నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో బీఎస్ఈ 1,689 పాయింట్లు, నిఫ్టీ 541 పాయింట్ల మేర పతనమయ్యాయి. ⇔ అందరూ ఏటీఎంలపై ఆధారపడుతున్నందున ప్రజల వద్ద ఉన్న నగదులో ఎక్కువ శాతం పెద్ద నోట్లే కావడంతో అవి చెల్లని పరిస్థితుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటీఎంలు అన్నీ పనిచేయడానికి దాదాపు నెల రోజులు పట్టింది. అందుబాటులో ఉన్న ఏటీఎంలు సైతం నగదు లేక వెలవెలబోయాయి. ⇔ నగదు కొరత కారణంగా 4 లక్షల ట్రక్కులు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నిలిచిపోయాయి. పాత నోట్లను అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రభుత్వం స్పందించి టోల్ వసూళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఆస్పత్రులు, ఆయిల్ కంపెనీల వద్ద పాత నోట్లు చెల్లుతాయని ప్రకటించింది. ⇔ నగదు కొరతతో పారిశ్రామికోత్పత్తి దెబ్బతింది. అక్టోబర్లో పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ 54.5 ఉండగా, నవంబర్లో 46.7కు పడిపోయింది. ⇔ ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో 7 శాతం లోపునకు పడిపోతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అంచనాలు వేశాయి. కానీ, కేంద్ర గణాంక విభాగం మాత్రం మూడో త్రైమాసికంలో జీడీపీ 7 శాతంగా నమోదైనట్టు ప్రకటించింది. ⇔ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా దాడులకు దిగి డిసెంబర్ చివరి నాటికి లెక్కల్లో చూపని రూ.4,172 కోట్ల నల్లధనాన్ని గుర్తించింది. కొత్త నోట్లను పెద్ద మొత్తంలో పోగు చేసిన వారి నుంచి రూ.105 కోట్ల విలువ మేర సీజ్ చేసింది. సాధారణ పరిస్థితే ఏటీఎంల నుంచి మా కస్టమర్ల నగదు ఉపసంహరణలు డీమోనిటైజేషన్కు ముందు సాధారణంగా రూ.18,000గా ఉండేది. ఇతర బ్యాంకు కస్టమర్ల ఉపసంహరణలు రూ.10,000గా ఉండేది. ప్రస్తుత పరిస్థితి పెద్ద నోట్ల రద్దు ముందు మాదిరిగానే ఉంది. – రాజీవ్ ఆనంద్, యాక్సిక్ బ్యాంకు రూ.2,000 నోటంటే నో...! కస్టమర్ల తీరు మారింది. వారిప్పుడు ఏటీఎంల నుంచి రూ.1,900 ఉపసంహరించుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల రూ.500 నోట్లు మూడు, రూ.100 నోట్లు నాలుగు వస్తాయి. రూ.2,000 నోట్లు ఉంటే తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. – నవరోజ్ దస్తూర్, ఎండీ, ఎన్సీఆర్ ఇండియా (అతిపెద్ద ఏటీఎం సంస్థ) -
నేటి నుంచి విత్డ్రాలపై ఆంక్షలు లేవు.. కానీ!
న్యూఢిల్లీ: సేవింగ్స్ అకౌంట్ నుంచి మీరు ఇక ఎంత నగదు అయినా విత్ డ్రా చేసుకోవచ్చు. సేవింగ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రాయల్స్పై ఉన్న ఆంక్షలు ఇవాళ్టి నుంచి తొలగిపోయాయి. ఈ మేరకు జనవరి 30న ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం.. నేటి(మార్చ్ 13) నుంచి ఆంక్షలు తొలగించబడ్డాయి. డీమోనిటైజేషన్ అనంతరం ఏర్పడ్డ నగదు కొరత పరిస్థితులను అదిగమించేందుకు ఆర్బీఐ తొలుత రోజుకు రూ. 2000 మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. తరువాత దీనిని రోజుకు రూ. 4500కు, ఆ తరువాత వారానికి రూ. 24,000కు మించకుండా రోజుకు రూ 10,000 వరకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అనంతరం ఫిబ్రవరి 20న వారానికి గల లిమిట్ను రూ 24,000 నుంచి రూ. 50.000కు పెంచిన విషయం తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయంతో నగదు విత్డ్రాపై ఆంక్షలు లేకపోవడంపై ఓ వైపు హర్షం వ్యక్తమౌతోంది. కానీ.. ఏటీఎంల వద్ద ఇప్పటికీ కనిపిస్తున్న నోక్యాష్ బోర్డుల పట్ల ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్లో నాలుగైదు రోజులుగా నోట్ల కష్టాలు కొనసాగతుతున్నాయి. డబ్బుకోసం ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. -
నేటి నుంచి విత్డ్రాలపై ఆంక్షలు లేవు.. కానీ!
-
బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు స్వాహా
కరీంనగర్: ఓ వ్యక్తి ఖాతా నుంచి దుండగులు డబ్బులు కాజేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని రామడుగుకు చెందిన ఖాజా అనే వ్యక్తికి ఫొన్ చేసిన దుండగులు బ్యాంకు అధికారులమంటూ మాట్లాడారు. తర్వాత అతడి నుంచి ఏటీఎం నంబరు వివరాలు తెలుసుకున్నారు. తర్వాత అతడి ఖాతా నుంచి రూ. 44 వేలు డ్రా చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.