chaman lal
-
బర్మింగ్హమ్ లార్డ్ మేయర్గా బ్రిటిష్ ఇండియన్
లండన్: ఇంగ్లాండ్లోని బర్మింగ్హమ్ నగర లార్డ్ మేయర్గా బ్రిటిష్–ఇండియన్ కౌన్సిలర్ చమన్లాల్ ఎన్నికయ్యారు. తద్వారా బర్మింగ్హమ్ తొలి బ్రిటిష్–ఇండియన్ మేయర్గా ఆయన రికార్డు సృష్టించారు. సిక్కు మతంలోని రవిదాసియా వర్గానికి చెందిన చమన్ లాల్ భారత్లోని పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని పఖోవాల్ గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి సర్దార్ హర్నామ్సింగ్ బంగా 1954లో ఇంగ్లాండ్కు వలస వచ్చారు. బర్మింగ్హమ్లో స్థిరపడ్డారు. చమన్లాల్ 1964లో తన తల్లి సర్దార్నీ జై కౌర్తో కలిసి ఇంగ్లాండ్కు చేరుకున్నారు. అప్పటి నుంచి బర్మింగ్హమ్లోనే నివసిస్తున్నారు. చమన్ లాల్ 1971లో విద్యావతిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తితో చమన్లాల్ 1989లో లేబర్ పార్టీలో చేరారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. -
హక్కులే కాదు... బాధ్యతలూ గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత సంఘ సేవకుడు చమన్లాల్ శతజయంతి సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అందుకే హక్కులు, బాధ్యతల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో సర్వస్వాన్ని కోల్పోయిన భారతీయ కుటుంబాలను పరామర్శిస్తూ వారికి చమన్లాల్ అండగా నిలిచారన్నారు. చమన్ లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్లను విడుదల చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ తపాలా శాఖను ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రులు దేవ్సింగ్ చౌహాన్, రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో 22.60% సమయం సద్వినియోగం పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో మూడోవారం 8 బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో ఎగువ సభలో సద్వినియోగమైన సమయం(ప్రొడక్టివిటీ) 24.2 శాతానికి పెరిగింది. ఇది మొదటి వారంలో 32.20 శాతం, రెండో వారంలో కేవలం 13.70 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు రాజ్యసభ పరిశోధక విభాగం గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా మొత్తం మూడు వారాల్లో సద్వినియోగమైన సమయం 22.60 శాతంగా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగసస్ స్పైవేర్తోపాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు మొదటిరోజు నుంచే ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రవేశపెడుతూనే ఉంది. గతవారం 17 పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు వివిధ బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో బిల్లులపై మొత్తం 3.25 గంటలపాటు చర్చలు జరిగాయి. -
ఆరోపణలు ఖండించిన బర్మన్, చమన్ లాల్
-
ఆరోపణలు ఖండించిన బర్మన్, చమన్ లాల్
న్యూఢిల్లీ : నల్లధనం అంశంపై పేరు వెల్లడి కావటంపై డాబర్ ఇండియా మాజీ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్ కుటుంబం స్పందించింది. న్యాయపరమైన అనుమతులతోనే విదేశాల్లో ఖాతా ఉన్నట్లు బర్మన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవాస భారతీయుడిగా ఉన్నప్పుడు ప్రదీప్ బర్మన్ ఖాతా తెరిచారని, విదేశీ అకౌంట్ తెరిచే సమయంలో అన్ని చట్టాలు పాటించామన్నారు. అవసరమైన పన్నులు చెల్లించామని, విదేశీ అకౌంట్ల విషయంలో చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన ఖాతాల మధ్య సరైన వివరణ లేదని బర్మన్ కుటుంబం ఆరోపించింది. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలును పంకజ్ చమన్ లాల్ లోధ్యా ఖండించారు. విదేశాల్లో ఖాతాలు పెట్టడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. కాగా నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విదేశాల్లో నల్లధనం దాచుకున్న ముగ్గురి పేర్లను కేంద్రం ఈ సందర్భంగా బయటపెడ్డింది. డాబర్ గ్రూపు డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, గోవా గనుల వ్యాపారి రాధా టింబ్లో, శ్రీజ ట్రేడింగ్ కంపెనీ ప్రమోటర్ చమన్ లాల్ పేర్లతో కూడిన అఫిడవిట్ను సమర్పించింది.