chopped off genitals
-
భర్త వివాహేతర సంబంధం ; కోసిపారేసింది!
జలంధర్ : పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను దారుణంగా శిక్షించిందో ఇల్లాలు. అతని సున్నిత భాగాన్ని కోసి, టాయిలెట్ బేసిన్లో పారేసింది. పంజాబ్లోని జలంధర్ పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగీందర్ నగర్లో నివసించే ఆజాద్ సింగ్, అతని భార్య సుఖ్వంత్ కౌర్లు తరచూ గొడవపడేవారు. అతను వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య అనుమానం. ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మార్పురాకపోవడంతో కౌర్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త నిద్రపోతున్న సమయంలో రాడ్డుతో తలపై బలంగా మోదింది. ఆ దెబ్బకే అతను స్పృహకోల్పోయాడు. తర్వాత కత్తితో అతని సున్నిత భాగాలను కోసేసి, టాయిలెట్ బేసిన్లో పారేసి నీళ్లు పోసింది. కొడుకు పరిస్థితిని గుర్తించిన ఆజాద్ తండ్రి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆజాద్ పరిస్థితి విషమంగా ఉందని, మరికొద్ది గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు సుఖ్వంత్ కౌర్ను అరెస్టు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. -
అనూహ్యం.. కోసేసుకున్న బాబా
జైపూర్: రాజస్థాన్లోని చురూ జిల్లా తారానగర్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఓ బాబా(30) జననాంగాన్ని కోసేసుకున్నారు. స్థానికంగా ఉండే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఇరుగుపొరుగు వారు ఆరోపించిడంతో సంతోష్ దాస్కు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తారానగర్లో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బికనేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్థానికలంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుడి నుంచి ఇంకా వాంగ్మూలం తీసుకోలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తమ ఊరి నుంచి వెళ్లిపోవాలని స్థానికులు ఒత్తిడి తేవడంతో అతడు ఈ చర్యకు ఒడిగట్టాడని తెలిపారు. అతడికి బుద్ధి చెప్పేందుకు స్థానికులే ఈ చర్యకు పాల్పడినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. వీటిలో వాస్తవముందో, లేదో చూడాల్సివుందని పోలీసులు అన్నారు. -
ప్రియుడు మోసం చేశాడని.. కోసి పారేసింది!
న్యూఢిల్లీ: ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ప్రేయసి తెలివిగా అతడి పురుషాంగాన్ని కోసి పారేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని మంగోల్పురిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రవి(35) ఓ చిరు వ్యాపారి. స్థానిక మంగోల్పురిలో నివాసం ఉండే 23 ఏళ్ల యువతిని గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మొదట్లో యువతి ఇతడిని పట్టించుకోలేదు. కానీ క్రమంగా వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంటకు పెళ్లి విషయంలో విభేదాలొచ్చాయి. యువతి తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించగా, ప్రియుడు రవి మాత్రం విషయం వచ్చేసరికి దాటవేసేవాడు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి యువతి ఇంటికి రవి వెళ్లగా.. పెళ్లి చేసుకోవాలంటూ యువతి గట్టిగా నిలదీసింది. మా ఇంట్లో వాళ్లు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తనని మరిచిపోవాలిని సూచించగా యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నాలుగేళ్లుగా తనవెంట తిప్పుకుని మోసం చేసిన ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. ఇంట్లో వాళ్లకు కొద్దిసేపు బయటకు వెళ్లమని సూచించిన ఆ యువతి.. ఈ ఒక్కసారి తనతో శృంగారం చేస్తే పెళ్లి మాట ఎత్తనని ప్రియుడిని నమ్మించింది. చివరకు అతడిని నగ్నంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లింది. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న చాకుతో ప్రియుడి పురుషాంగాన్ని కోసిపారేసింది. నొప్పిని భరించలేక అతడు సాయం చేయాలని అరుస్తూ బటయకు పరిగెత్తాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడు రవిని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సర్జరీ చేసిన వైద్యులు పేషెంట్ను జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. యువతి సహా ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని విచారణ చేపట్టిన మంగోల్పురి పోలీసులు తెలిపారు.