circuit
-
గౌతముడు నడయాడిన నేల!
జూలపల్లి (పెద్దపల్లి): చుట్టూ పచ్చని పంట పొలాలు.. సమీ పంలోనే గలగల పారే హుస్సేన్మియా వాగు.. పక్కనే అతిప్రాచీన కోటలు.. మధ్య ఎత్త యిన కట్టడం.. అదే ధూళికట్టలో శాతవాహ నులు నిర్మించిన బౌద్ధ స్తూపం.. ఎంతో ఆక ర్షణీయంగా కనిపిస్తున్న కోటలు, బౌద్ధ స్తూపం అభివృద్ధికి నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తూ.. ఇక్కడ చారిత్రక ప్రాశస్త్యానికి మంత్రముగ్ధులవుతున్నా.. పాలకులకు పట్టడం లేదు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి – ఎలిగేడు మండలాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలనే డిమాండ్ పెరుగుతోంది.ధూళికోటే.. ధూళికట్ట..శాతవాహనులు దశాబ్దాల క్రితం ధూళికోట (ధూళికట్ట)ను రాజధానిగా చేసుకుని పాలించారన్నది చరిత్రకారుల కథనం. ఇక్కడే బౌద్ధ స్తూపం నిర్మించగా, గౌతమ బుద్ధుడు «ధ్యానం చేసినట్లు చెబుతున్నారు. 1972లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అతి ప్రాచీన గ్రామ ఆనవాళ్లు, ఆధారాలు లభించాయి. ధూళికట్ట శివారులోని కోట ప్రాంతంలో తవ్వకాలు చేప ట్టిన పురావస్తు శాఖ.. ఇక్కడ లభించిన వస్తు వులను హైదరాబాద్లోని మ్యూజియానికి తర లించి భద్రపరిచింది. వడ్కాపూర్ శివారులోని 741, 742 సర్వే నంబర్లలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా.. బౌద్ధ స్తూపం, బుద్ధుడు, నాగశేషు, కొన్ని విగ్రహాలు లభించాయి. వాటిని కూడా మ్యూజియంలో భద్రపరిచారు. బౌద్ధ స్తూపం 0.19 గుంటల విస్తీర్ణంలో ఉంది. పురావస్తు శాఖ తరపున అభివృద్ధి చేసేందుకు వడ్కాపూర్ రైతులను ఒప్పించి.. మరో ఎనిమిది ఎకరాలను కొనుగోలు చేశారు.అమలుకు నోచని హామీలు..బౌద్ధ స్తూపం, పరిసరాలను అభివృద్ధి చేస్తా మని అప్పటి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.50 లక్షలు కేటాయించారు. అధికారులు ప్రణాళికలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహించడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.ఏటా బుద్ధుని జయంతి..బౌద్ధ స్తూపం వద్ద 2003 నుంచి ఏటా గౌతమ బుద్ధుని జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దాతల సాయంతో బౌద్ధ దమ్మ ప్రచార పరిషత్ సభ్యులు ప్రత్యేక కార్యక్రమా లు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బౌద్ధ భిక్షువులతోపాటు పలు ప్రాంతాల నుంచి బౌద్ధులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.కనీస సౌకర్యాలు కరువు..ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్లు నెరవేరడం లేదు. ధూళికట్ట ఎల్లమ్మ ఆలయం నుంచి స్తూపం వరకు రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరైనా.. రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రోడ్డు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వసతి గదులు అందుబాటులోకి రాకుండా పోయాయి. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నల్ల మనోహర్రెడ్డి సొంత నిధులు వెచ్చించి ఈ ప్రాంతంలో ధ్యానముద్ర నిర్మించారు. అందులో గౌతమ బుద్ధుని పాల రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.పర్యాటకాభివృద్ధి చేయాలిఅతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఉన్న ధూళికట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. పర్యాటకానికి ఆటంకంగా ఉన్న వడ్కాపూర్ నుంచి బౌద్ధ స్తూపం, ధూళికట్ట రేణుకా ఎల్లమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మించాలి. ఏటా నిర్వహించే ఉత్సవాలు, ప్రార్థనలకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి.– మొగురం రమేశ్, మాజీ సర్పంచ్, వడ్కాపూర్ -
647 షేర్ల సర్క్యూట్ బ్రేకర్ల సవరణ
వారాంతం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) 647 షేర్ల సర్క్యూట్ బ్రేకర్లను సవరించింది. ట్రేడింగ్పై నిఘా సమీక్షలో భాగంగా పలు కౌంటర్ల సర్క్యూట్ బ్రేకర్లలో మార్పులు చేసినట్లు బీఎస్ఈ వెల్లడించింది. అయితే ట్రేడ్ టు ట్రేడ్(టీ2టీ) విభాగంలోకి వచ్చిన కౌంటర్లకు యధాప్రకారం 5 శాతం సర్క్యూట్ ఫిల్టర్ అమలవుతుందని తెలియజేసింది. కొన్ని కౌంటర్లను టీ2టీ విభాగం నుంచి తొలగించడంతోపాటు సర్క్యూట్ బ్రేకర్ను 20 శాతానికి పెంచింది. ఇదే విధంగా మరికొన్ని కౌంటర్ల ఫిల్టర్లను 10 శాతం నుంచి 20 శాతానికి మార్పు చేసింది. మరికొన్ని కౌంటర్లను టీ2టీ విభాగంలో చేర్చింది. వివరాలు చూద్దాం.. ఇదీ జాబితా బీఎస్ఈ తాజాగా 36 స్టాకులను 5 శాతం నుంచి 20 శాతం ప్రైస్ బ్యాండ్లోకి మార్పు చేసింది. ఈ జాబితాలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డెల్టా కార్ప్, సెంట్రమ్ క్యాపిటల్, ఎవరెడీ ఇండస్ట్రీస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఫ్యూచర్ రిటైల్, వాటెక్ వాబాగ్ చేరాయి. ఇదే విధంగా 10 శాతం నుంచి 20 శాతానికి చేరిన కౌంటర్లలో డీమార్ట్, నెల్కో, ఆవాస్ ఆవాస్ ఫైనాన్షియర్స్, స్పైస్జెట్, అరవింద్, అతుల్ ఆటో, బీడీఎల్, ట్రైడెంట్, షాపర్స్ స్టాప్, షాలిమార్ పెయింట్స్, హిమత్సింగ్కా సీడ్, హింద్ అల్యూమినియం, ఐఎఫ్సీఐ, ఇగార్షీ మోటార్స్, ఇండియన్ టెరైన్, ఇండియన్ టోనర్స్, ఆదిత్య బిర్లా మనీ, ఏషియన్ గ్రానైటో తదితరాలున్నాయి. ఇక 5 శాతం నుంచి 10 శాతం ఫిల్టర్కు 325 కౌంటర్లు చేరాయి. వీటిలో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అఫ్లే ఇండియా, బజాజ్ హిందుస్తాన్, బీఎఫ్ యుటిలిటీస్, గ్రాఫైట్, జీవీకే పవర్, ఐడీబీఐ బ్యాంక్, ఐబీ రియల్టీ, ఐనాక్స్ విండ్, లెమన్ ట్రీ హోటల్స్కు చోటు లభించింది. 10 శాతం నుంచి 5 శాతానికి దిగిన జాబితాలో గొదావరి పవర్, ఆన్మొబైల్ గ్లోబల్, నియోజెన్ కెమికల్స్ తదితర 6 షేర్లు చేరాయి. ఈ సవరణలన్నీ ఆగస్ట్ 7(శుక్రవారం) నుంచీ అమల్లోకి వచ్చినట్లు బీఎస్ఈ తెలియజేసింది. 1987లో.. షేర్ల ధరల అనూహ్య పతనం లేదా ర్యాలీని నివారించేందుకు వీలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు సర్క్యూట్ బ్రేకర్లను అమలు చేస్తుంటాయి. ఈ విధానానికి 1987లో బీజం పడింది. 1987 అక్టోబర్ 19న యూఎస్ ఇండెక్స్ డోజోన్స్ ఒక్క రోజులోనే దాదాపు 23 శాతం కుప్పకూలింది. దీంతో సర్క్యూట్ బ్రేకర్ల అంశం తెరమీదకు వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగా 2001 జులై 2న ఇండెక్స్ ఆధారిత సర్క్యూట్ బ్రేకర్లు ప్రారంభమయ్యాయి. తదుపరి పలు మార్పులకు లోనైన విషయం విదితమే. ఇండెక్సుల విషయంలో ప్రస్తుతం 10 శాతం, 15 శాతం, 20 శాతంగా ఫిల్టర్లు అమలవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. -
విద్యుత్ తీగలు తాకి టిప్పర్ దగ్ధం
ఉట్లపల్లి(పెద్దవూర) విద్యుత్ తీగలు తాకడంతో టిప్పర్ దగ్ధమైంది. ఈ ఘటన గురువారం మండలంలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధి గేమ్యానాయక్తండా సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం అనుముల మండలం యాచారం నుంచి ఊట్లపల్లి పుష్కరఘాట్కు టిప్పర్ కంకరను అన్లోడ్ చేసి వస్తుండగా తండా సమీపంలోకి రాగానే తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తాకాయి. దీంతో టిప్పర్ షార్స్ర్క్యూట్కు గురై మంటలు వ్యాపించాయి. టిప్పర్ డ్రైవర్ చాకచక్యంతో కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. టిప్పర్ మంటలతో కూడిన పొగలు వ్యాపించటంతో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, తండావాసులు గమనించి సబ్ స్టేషన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. టిప్పర్ టైర్లు మంటలలో కాలిపోతూ పెద్ద శబ్దంతో పేలి పోయాయి. మంటలు డీజిల్ ట్యాంక్కు అంటుకుని పేలిపోతుందనే భయంతో టిప్పర్ దగ్గరకు వెళ్లటానికి ఎవరూ సాహసించలేదు. హాలియా ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయటంతో ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పేదాకా ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
ఆత్మకూరు(ఎం): విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయిపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బచ్చె అయిలయ్య (35) తన మామ వ్యవసాయబావి వద్ద పంపుసెట్ మోటారు సక్రమంగా నడవకపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బంద్చేయడానికి వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ పట్టుకుని ఆఫ్ చేస్తుండగా విద్యుత్ప్రసరణ జరిగి ప్రమాదానికి గురయ్యాడు. అక్కడే ఉన్న కొందరు రైతులు గుర్తించి గాయపడిన అయిలయ్యను చికిత్స నిమిత్తం మోత్కూర్కు తరలిస్తుండగా మర్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి సోదరుడు బచ్చె నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలం వద్ద సందర్శించి శవపంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.శివనాగప్రసాద్ తెలిపారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన బచ్చె అయిలయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీ, సర్పంచ్ బొట్టు మల్లమ్మ కోరారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తుల ఆరోపణ బచ్చె అయిలయ్య మృతికి ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు అస్తవ్యస్తంగా ఉన్నట్లు చెప్పారు. దీనిపై ట్రాన్స్కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.