Constitution amendment
-
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలామంది కోరుకుంటున్నారు’ – రెండోసారి అధ్యక్షుడై మూడు నెలలైనా నిండకముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మూడో టర్ము గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకు ఇది తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం గత జనవరిలో కూడా, ‘ఒకట్రెండు సార్లు మాత్రమే కాదు, మూడు, ఇంకా చెప్పాలంటే నాలుగుసార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసీ ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గముంటుందన్నట్టు, ‘మూడో’ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్కు అవకాశముందని అభిమానులు చెబుతున్నారు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేగాక ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటంటే...రాజ్యాంగాన్ని సవరించాలి అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు. ఏ కారణాలతోనైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం అధ్యక్షునిగా చేసినా సరే, ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట మూడొంతుల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్లో అంతæ మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమొక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి.‘ఉపాధ్యక్ష’దారిలో... అధ్యక్ష పదవికి రెండుకంటే ఎక్కువసార్లు ‘ఎన్నిక’కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు! ‘‘ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిగ్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు’’అంటున్నారు. ఈ ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ అంగీకరించారు కూడా. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోర్టెడామ్లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెబుతున్నారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు’’అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒకవ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ మూడుసార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు.9 మంది గెలవకుండానే అధ్యక్ష పీఠమెక్కారుఅమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం, లేదా రాజీనామా వల్ల తాము అధ్యక్షులయ్యారు. వయసు అనుమతించేనా? మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్కు అడ్డంకిగానే మారేలా కన్పి స్తోంది. ఆయనకిప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంత వరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తేలదు.వద్దే వద్దు: డెమొక్రాట్లు ట్రంప్ మూడో టర్ము వ్యాఖ్యలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచమంతటినీ ఇంతటి గందరగోళంలోకి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసమున్నా ట్రంప్ మతిలేని మూడో టర్ము ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి’’అని డిమాండ్ చేసింది. రిపబ్లికన్లలో కూడా కొందరు మూడో టర్ము సరైన యోచన కాదంటున్నారు. ఈ ఆలోచనకు తానసలే మద్దతివ్వబోనని ఓక్లహామీ సెనేటర్ మార్కవైన్ ములిన్ ఇటీవలే చెప్పారు.రూజ్వెల్ట్ నాలుగుసార్లు! రెండు కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు! అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటినుంచీ పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టనే. ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారీ అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. అప్పటినుంచి అందరు అధ్యక్షులూ అనుసరిస్తూ వస్తున్న ఆ సంప్రదాయాన్ని రూజ్వెల్ట్ మాత్రం అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచిగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో నాలుగోసారి బరిలో దిగేనాటికే రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే మరణించారు. అనంతరం రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవడం లేదా?
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామ్యవాద, లౌకిక( సోషలిస్ట్, సెక్యులర్) పదాలను తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సోమవారం సుప్రీంకోర్టు విచారించి పిటిషన్లపై పలు ప్రశ్నలు సంధించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, లాయర్ విష్ణు శంకర్ జైన్, బలరామ్ సింగ్, లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ తదితరులు దాఖలుచేసిన ఈ పిల్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. ‘‘సామ్యవాదం అనే పదానికి అర్ధాలను ప్రాశ్చాత్య దేశాల కోణంలో చూడొద్దు. సోషలిజం పదానికి అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు అనే దృక్కోణంలోనే చూడాలి. సెక్యులరిజం అనే పదం భారత రాజ్యాంగంలో భాగమని గతంలో ఎన్నో తీర్పుల్లో న్యాయస్థానాలు తేలి్చచెప్పాయి. సెక్యులర్ పదం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఫ్రెంచ్ వారి సెక్యులరిజంకు బదులు ఆధునిక భావజాల సెక్యులరిజాన్ని భారత్ సంగ్రహించింది. మీరు భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవాట్లేరా?’’అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. దీనికి లాయర్ విష్ణుశంకర్ జైన్ బదులిచ్చారు. ‘‘మేం లౌకిక అనే పదానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ పదాన్ని పీఠికలో చేర్చిన విధానాన్ని మాత్రమే సవాల్ చేస్తున్నాం. తప్పుడు మార్గంలో సోషలిజం పదాన్ని చేరిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రమాదంలో పడుతుందని బీఆర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. 1949 నవంబర్ 26నాటి రాజ్యాంగ పీఠికనే కొనసాగిద్దాం. సవరణల ద్వారా పీఠికలో సవరణ చేయకూడదు. అదనపు పదాలను చేర్చడంలో హేతుబద్ధత లోపించింది’అని లాయర్ వాదించారు. ‘‘కొత్తగా చేరిన పదాలు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాకున్నా ఒక గందరగోళానికి తెరలేపాయి. దీంతో పీఠికలో ఎలాంటి మార్పులైనా చేయొచ్చన్న భావన తదుపరి ప్రభుత్వాల్లో నెలకొంది’’అని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదించారు. వాదోపవాదనల తర్వాత కేసు విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదాపడింది. -
అభివృద్ధికి కీలకం... వికేంద్రీకరణ
ఏ రాష్ట్రమైనా సుసంపన్నం కావాలంటే పంచాయతీ రాజ్ వ్యవ స్థను పటిష్ఠపరచాలి. మొత్తంగా దేశం అభివృద్ధి పంచాయతీ రాజ్ వ్యవస్థ బలంపైనా, అది ఏ మేర పాలనను వికేంద్రీకరిస్తుంది అన్న అంశాల పైనా ఆధారపడి ఉంటుంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని ప్రాథమిక స్థాయి సంస్థలకు అధికారాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో గుర్తించారు. స్థానిక సంస్థలకు అధికారాలు పంచడం కోసం రాజ్యాంగ సవరణకు సైతం వెనుకాడలేదు. ఫలితంగా 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థ రూపు దిద్దుకొంది. ఈ వ్యవస్థే గత 30 ఏళ్లుగా కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చింది.కేరళ వంటి రాష్ట్రాల సామా జిక, ఆర్థిక అభివృద్ధికి అక్కడి చైతన్య వంతమైన పంచాయతీ వ్యవస్థ ముఖ్య కారణం. గ్రామ పంచాయతీ స్థాయిలోనే పాలన సమర్థంగా అందడం, మరికొన్ని ఇతర అంశాలు దీనికి కారణం. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్థల బలోపేతం, పాలన వికేంద్రీకరణ అంశాల్లో ముందు వరుసలోనే ఉన్నాయి.పరిమితమైన వనరులను దృష్టిలో పెట్టుకుంటే గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీలకు అందే నిధులు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే ఈ నిధులు తలసరి లెక్కలో విడుదల అవుతూంటాయి. పోనీ పంచాయతీలు సొంతంగా ఏవైనా వినూత్నమైన ఆదాయ వనరులను సమకూర్చుకోగలవా? ఇది కూడా వీలు కాని విషయమే. ఇలా చేసుకోగలిగితే ఆ గ్రామపంచాయతీ చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. కేరళలో కొన్ని గ్రామ పంచాయతీలు వినూత్నమైన పద్ధతుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తూండటం ఇక్కడ చెప్పుకోవా ల్సిన విషయం. 2030 నాటికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామ పంచాయతీల బలోపేతం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవు తుంది. ఆర్థిక సహకారం, పాలన పరంగా స్వాతంత్య్రం కూడా అవసరమవుతాయి. వీటితోపాటు గ్రామ పంచాయతీల స్థాయిలో సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో సమర్థమైన, వికేంద్రీకృతమైన పరిపాలన సాగేందుకు కింది సూచనలను కూడా పరిగ ణనలోకి తీసుకోవచ్చు. దీనివల్ల మానవ వనరుల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ‘2022 నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్వర్క్’ ఇచ్చిన సలహా సూచనల సాయంతో పనులు చేపట్టాలి. ప్రణా ళిక రూపకల్పన, అమలులో గ్రామపంచాయతీల్లోని ప్రజలందరూ భాగ స్వాములయ్యేలా చూడాలి. ఇందుకు తగ్గట్టుగా గ్రామ పంచాయ తీలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చాలి. దాతృత్వసంస్థల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు సమ కూరేలా వ్యస్థలను ఏర్పాటు చేయాలి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించగలవని నా విశ్వాసం. – డా.డబ్ల్యూ. రాంపుల్లా రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఎన్ఐఆర్డీ మాజీ డైరెక్టర్ జనరల్ -
నేపాల్ కొత్త మ్యాప్కు చట్టబద్ధత
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్కు రాజ్యాంగబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును గురువారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన కొన్ని గంటల్లోనే అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ సంతకం చేశారు. సవరణ బిల్లు ఇప్పటికే దిగువసభలో ఆమోదం పొందింది. భారత్కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమ దేశ భూభాగంలో చూపిస్తూ మేలో నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం తెల్సిందే. భారత్తో విభేదాల నేపథ్యంలో నేపాల్ తన సరిహద్దుల్లో కాలాపానీ సమీపాన ఉన్న చంగ్రూ శిబిరాన్ని నేపాల్ ఆధునీకరించింది. దార్చులా జిల్లాలోని ఈ ఔట్ పోస్టులో ఇకపై శీతాకాలంలోనూ ఒక జవాను బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు. ఖండించిన భారత్: నేపాల్ ప్రయత్నాలను భారత్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని భారత్ విమర్శించింది. నేపాల్ ప్రయత్నాలను మద్దతు తెలిపేందుకు ఎటువంటి రుజువులు గానీ, చారిత్రక వాస్తవాలు కానీ లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. సరిహద్దుల విషయంలో చర్చలు జరుపుకోవాలని గతంలో కుదిరిన అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని చెప్పారు. -
బహుభార్యత్వంపై విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: ముస్లింలు అనుసరిస్తున్న బహుభార్యత్వం, నిఖా హలాలాకు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై తమ వైఖరి చెప్పాలంటూ కేంద్రం, లా కమిషన్లకు నోటీçసులిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం 2017లో ట్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ బహుభార్యత్వం, నిఖా హలాలాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది. ఈ రెండు అంశాలపై మరో ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది. ఇస్లాం ప్రకారం ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. నిఖా హలాలాను అనుసరించి భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడినే వివాహం చేసుకోరాదు. వేరే వ్యక్తిని పెళ్లాడి అతనితో విడాకులు తీసుకున్నాకే మొదటి భర్తను పెళ్లాడేందుకు అనుమతిస్తారు. వీటిని వ్యతిరేకిస్తూ.. స్త్రీ, పురుషులకు సమన్యాయం కోరుతూ కేసువేశారు. -
దూకుళ్ల జాతర-విలువల పాతర
సభ్యులు పార్టీలు మారినపుడో, విప్ ఉల్లంఘించినపుడో ఫిర్యాదు చేస్తే స్పందించి, చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్/చైర్మన్లు. పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఈ విషయంలో సభాపతులదే తుది నిర్ణయం. కోర్టులకు కూడా జోక్యం చేసుకునే అధికారం, పరిధి లేవు. అందుకేనేమో, నిర్ణయం దాకా వెళ్లకుండా వ్యవహారాన్ని నాన్చి, తాత్సారం చేయడం రివాజయింది. ఇందుకు ప్రధాన కారణం స్పీకర్లు, చైర్మన్లు పాలకపక్షీయులుగా నడుచుకోవడమేనని చరిత్ర చెబుతోంది. ‘‘రాజకీయ పార్టీ ఫిరాయింపులు దేశానికి పట్టిన అరిష్టం. వీటిని సమర్థంగా అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య పునాదుల్ని, ఆ సౌధాన్ని నిలుపుతున్న మూలసూత్రాన్నే ఈ జాడ్యం విచ్ఛిన్నం చేస్తుంది. ఈ చెడు పోకడల్ని నియంత్రించే లక్ష్యంతోనే తన ప్రసంగంలో రాష్ట్రపతి నిర్దిష్టంగా హామీ ఇచ్చారు, ఆ మేరకు ప్రస్తుత సమావేశాల్లోనే పార్టీ మార్పిళ్ల నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పార్టీ మార్పిళ్లను చట్టవ్యతిరేకంగా ఖరారు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ఈ బిల్లు.....’’ మూడు దశాబ్దాల కింద పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చే ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఉద్దేశాలు-లక్ష్యాల్లో పేర్కొన్న అంశమిది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్ను కొత్తగా రాజ్యాంగంలో భాగం చేశారు. ఫిరాయింపులను చట్ట వ్యతిరేకంగా పేర్కొనడమే కాకుండా అలా మారిన ప్రజాప్రతినిధుల్ని అనర్హుల్ని చేసే అంశాన్ని అందులో పొందుపరిచారు. ముప్పయ్యేళ్ల ప్రస్థానంలో.... జరిగిన పరిణామాల్ని పరిశీలిస్తే వేర్వేరు సందర్భాల్లో ఇది ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితి. ఏమిటి కారణం? ఎందుకిలా జరిగింది? ఎవర్ని నిందించాలి? అని సమీక్షించుకుంటే, తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఉంది. విలువలు పతనమై రాజకీయ వ్యవస్థ స్వరూప-స్వభావాలే మారిపోవడం ప్రధాన కారణం. అందులో భాగంగానే... అధికారం కేంద్రీకృతం అవడం, డబ్బు-సంపద పెంచుకోవడానికి రాజకీయాలు ఆలం బన కావడం, ఏంచేసైనా అధికారం నిలబెట్టుకోవడం, ఎలాగైనా అధికార పక్షంతో అంటకాగడం... వంటి విపరీత ధోరణులు పెరిగాయి. విపక్షమే ఉండకూడదన్న నియంతృత్వ పోకడతో పాలకపక్షాలు పార్టీ మార్పిళ్లను పండుగల్లా, జాతర్లలా, మేళాలుగా జరిపిస్తున్నాయి. ఇప్పుడు తెలుగునాట ఈ క్రీడ విశృంఖల స్థితికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఈ పెడ ధోరణులు శిఖర స్థాయికి చేరుతున్నాయి. అన్ని స్థాయిల్లో అరాచకాలే...... పార్లమెంటులో ప్రశ్నలడగటానికి డబ్బు తీసుకున్నందుకు 11 మంది ఎంపీల్ని అనర్హుల్ని చేసిన సందర్భాలున్న దేశమిది! కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే ఓటుకోసం 5 కోట్ల రూపాయలకు బేరమాడి, యాభయ్ లక్షల నగదు ఇస్తూ పట్టుబడ్డా దర్జాగా తిరిగే పరిస్థితులూ ఉన్నాయి. దర్యాప్తు కొనసాగించడం, నిలిపివేయడంలోనూ సంకుచిత రాజకీయాలే! రాజకీయ వ్యవస్థ కనుసైగల ప్రకారం ఊడిగం చేయడం తప్ప దర్యాప్తు సంస్థల్లోనూ జవజీవాలు నశించాయి. గ్రామ సర్పంచ్ ఎన్నికల స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుల ఎన్నికల వరకు పార్టీ ఫిరాయింపులు మామూలయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్య చాలకుంటే, ఎన్నికల తర్వాత గెలుపొందిన వారిని తమవైపు లాక్కునే ‘హార్స్ ట్రేడింగ్‘ ఒకప్పటి మాట! ఇప్పుడు ఎన్నికల తర్వాతే కానక్కర్లేదు, ఎన్నికలకు ముందు కూడా పార్టీ నుంచి ఫిరాయించేటట్టు చేయవచ్చు. అవతలి పార్టీ అభ్యర్థినే కొనుగోలు చేయొచ్చు! సంచి దులిపినట్టు మొత్తం పార్టీనే ఖాళీ చేసెయ్యొచ్చు. ఇక అప్పుడు పోటీ నామమాత్రం, కొనుగోళ్లు చేసిన పాలకపక్షం గెలుపు ఖాయం! కొండొకచో... ఏకగ్రీవమైనా ఆశ్చర్యం లేదు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తదనంతరం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఆ బాగోతమూ కళ్లకు కట్టింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో విపక్షాలకు మెజారిటీ స్థానిక సంస్థల ప్రతినిధులుండి కూడా పాలకపక్ష అభ్యర్థులే ఎమ్మెల్సీలుగా గెలిచారు. ఎలా! అంటే....? అదంతే! క్యాంపుల నిర్వహణ, భారీ చెల్లింపులు, భవిష్యత్తుకు భరోసాలు, వినకుంటే కేసుల్లో ఇరికిస్తామనో, పాత కేసులు తిరగదోడుతామనో బెదిరింపులు. వ్యూహాత్మకంగా అవతలి పార్టీలో ఓ అభ్యర్థికి టిక్కెట్టు లభించేలా చూడ్డం, నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసేదాకా ఆగి, సదరు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే తమ మందలో కలుపుకోవడం... ఇదీ రివాజు. సమకాలీన రాజకీయాల్లో పలువురు నాయకులకు పార్టీల కట్టుబాట్లు లేవు, సిద్ధాంతాల్లేవు, నైతిక విలువలు అంతకన్నా లేవు. రాత్రికి రాత్రి పార్టీ మారారు ఏమిటీ? అని అడిగితే ‘అభివృద్ధి కోసం పార్టీ మారాను, వారి నేతృత్వంలో అభివృద్ధి సాధ్యమని భావించాను, నమ్మాను కనుక పాత పార్టీని వదిలి పాలకపక్షం వైపు రావాల్సి వచ్చింది’ అని ఓ చిలుకపలుకు! ఎవరి అభివృద్ధి? నియోజకవర్గం అభివృద్ధా? తమ సొంత అభివృద్ధా? ఇది కోటి రూకల ప్రశ్న! చట్టపరంగా చర్యలుండవా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని సామెత! ఒక చట్టం రాగానే దాన్నెలా నీరుగార్చాలో ఎత్తులు వేయడం, లొసుగులు, లోపాలు వెతికి వాడుకోవడం ఆధునిక మేధావిత్వం. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం వచ్చాక కూడా అదే జరిగింది. మూడో వంతుకు తగ్గని సభ్యులతో పార్టీ చీలితే, చీలిక వర్గాన్ని గుర్తించాలి. అప్పుడు వారికి చట్టం వర్తించదు. పార్టీ మారినా అనర్హులు కారు. దీన్ని అడ్డు పెట్టుకొని పార్టీల్ని చీల్చడం మొదల యింది. చట్ట నిబంధనే ఆయుధంగా విపక్షాల్ని చీలుస్తూ పాలకపక్షాలు తమకు లేని బలాన్ని సంతరించుకోవడం, బలమున్న పాలకపక్షాల ప్రభు త్వాల్ని కూడా ఇవే చీలికలతో విపక్షాలు పడగొట్టడం ఒక ప్రహసనంలా తయారయింది. దాంతో, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో ఈ చట్టాన్ని మార్చారు. మూడో వంతుకు తగ్గని సభ్యులతో చీలికను గుర్తించా లన్న నిబంధనను తొలగించారు. అయినా ఇంకో నిబంధన ఉండనే ఉంది. ఏ చట్టసభలోనైనా, పార్టీకి చెందిన మూడింట రెండొంతుల సభ్యులు మరో పార్టీలోకి మారితే దాన్ని ‘విలీనం’గా గుర్తిస్తారు. ఈ అంశానికి రెండు కోణా లున్నాయి. ఇది పరోక్షంగా ఫిరాయింపులకు ఊతమిచ్చేదే! అనేది ఒక వాదన. ఇది లేకుంటే పాలకపక్షాల నియంతృత్వ ధోరణి పెచ్చుమీరుతుందని, ఎన్నికైన సభ్యులకు వాక్ స్వాతంత్య్రం, ప్రజావ్యతిరేక విధానాల్ని ఎదిరించే స్వేచ్ఛ పోతాయనే వాదనా ఉంది. అధికారపార్టీ ఏకపక్ష విధానాల్ని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నపుడు, ‘విప్’ను ధిక్కరించి, అనర్హత వేటు పడకుండా మిగలడానికి వారికో ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి కదా! అనే వారు దీన్ని సమర్థిస్తారు. మరి మూడింట రెండొంతులకు తక్కువ సంఖ్యలో సభ్యులు పార్టీలు మారినపుడు? వేటు పడాల్సిందే! కానీ, అత్యధిక సందర్బాల్లో పడట్లేదు. చట్టం వచ్చిన పాతికేళ్లలో, అంటే 2010 నాటికి చట్ట వ్యతిరేకంగా పార్టీలు మారినట్టు 62 మంది లోక్సభ సభ్యులపై అభియోగాలు రాగా అందులో 26 మంది పైనే వేటు పడింది. 2004 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల చట్టసభల్లో కలిపి 268 మందిపై ఫిర్యాదులు రాగా అనర్హత వేటు పడింది 113 మంది పైనే. ఇందుకు ప్రధాన కారణం స్పీకర్లు, చైర్మన్లు పాలకపక్షియులుగా నడుచుకోవడమేనని చరిత్ర చెబుతోంది. నిర్ణయాధికారం సభాపతులదే సభ్యులు పార్టీలు మారినపుడో, విప్ ఉల్లంఘించినపుడో ఫిర్యాదు చేస్తే స్పందించి, చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్లు/మండలి చైర్మన్లు. పార్టీ ఫిరా యింపుగా పరిగణిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఈ విషయంలో సభాపతులదే తుది నిర్ణయం. కోర్టులు కూడా జోక్యం చేసుకునే అధికారం, పరిధి లేవు. ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోలేకపోయినా, ఒకసారి సభాపతి నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని ఎవరైనా సవాల్ చేస్తే సమీక్షించే పరిధి న్యాయస్థానాలకుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందు కేనేమో, నిర్ణయం దాకా వెళ్లకుండా వ్యవహారాన్ని నాన్చి, తాత్సారం చేయడం రివాజయింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి పార్లమెంటు తొలి భేటీ కూడా జరక్కముందే నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డి పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, నిస్సిగ్గుగా తెలుగుదేశంలోకి మారారు. అదే దారిలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత నడిచారు. వీరిద్దరిపై పార్టీ నాయకత్వం చేసిన ఫిర్యాదు ఇప్పటికీ లోక్సభ స్పీకర్ పరిశీలనలో ఉంది తప్ప, నిర్ణయం జరగలేదు. ఏపీలో ప్రస్తుతం విపక్ష సభ్యులు నిబద్ధత నిలబడ్డా సానుకూల మీడియా ఊతకర్రగా పాలకపక్షం పిరాయింపుల మైండ్గేమ్ ఆడుతోంది. తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి దూకుళ్లపై ఏడాదిగా ఫిర్యాదులున్నా స్పీకర్ నుంచి ఉలుకూ-పలుకూ లేదు. పాలకపక్షం టీఆర్ఎస్లోకి తాజాగా దూకిన టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకరరావు త్వరలోనే ‘విలీనం’నోటీసి స్తారంటున్నారు. విలీన నిబంధన మాటున అనర్హత వేటు తప్పించుకోవ డానికి అవసరమైన పది మంది (10/15 మూడింట రెండొంతులు) సభ్యుల సంఖ్య గురువారం నాటి తాజా చేరికతో సమకూరింది కనుక ఇప్పుడు స్పీకర్ స్పందిస్తారేమో! మరి ఎప్పుడో ఏడాది కింద పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగ తేంటి? ఒక్క టీడీపీయే కాకుండా, కాంగ్రెస్ నుంచి, వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన వారినీ అనర్హులుగా ప్రకటించండి అని ఆయా పార్టీలు చేసిన ఫిర్యాదును స్పీకర్ ఎందుకు పట్టించుకోలేదు? ఇదే విషయమై తన ముం దుకు వచ్చిన కేసును విచారిస్తూ, ‘ఎప్పట్లోగా నిర్ణయిస్తారో చెప్పండి’ అని రాష్ట్ర హైకోర్టు రెండుమార్లు నిగ్గదీసినా సభాపతి స్పందించలేదు. టీడీపీ తరపున ఎన్నికై, ప్రత్యర్థి పక్షమైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా కొనసాగడం, టీడీపీ ఫిర్యాదు ఇచ్చినా నిర్ణయాన్ని సభా పతి వెల్లడించకపోవడం పట్ల రాజ్యాంగ నిపుణులే విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి! అత్యధిక సందర్భాల్లో స్పీకర్ల వైఖరి ఇలాగే ఉంటోంది. మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఘండ్, గోవా, యూపీ తదితర చోట్ల జరిగిన పరిణామాలు స్పీకర్లు పాలకపక్షం తాబేదార్లుగా వ్యవహ రించారనడానికి మచ్చుతునకలు. పచ్చిగా ప్రజల్ని వంచించడమే! చట్టపరమైన అంశమే కాకుండా ఇందులో నైతిక కోణం కూడా ఉంది. ఒక పార్టీనుంచి ఎన్నికై ఇంకో పార్టీలోకి మారడమంటే, ఆయా పార్టీలకు వ్యతి రేకంగా ప్రజలిచ్చిన తీర్పును చులకన చేయడమే. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, ఒక రాజకీయ పార్టీలోకి మారితే కూడా అనర్హతవేటు వేయాల్సిందే నన్నది చట్ట స్ఫూర్తి! పార్టీ సిద్ధాంతాలు పలుచనవడం, ఓడితే ఐదేళ్లు నిరీక్షించే ఓపిక నశించడం, రాజకీయాల్లో డబ్బు ప్రమేయం పెరగడం, ఎన్నికల ప్రక్రియ బాగా ఖరీదు కావడం ఈ సిగ్గువీడిన ఫిరాయింపులకు కారణాలు. సంస్కర ణలకు అనేక కమిటీల సిఫారసులున్నా.... అంతిమంగా ఈ దుర్నీతికి టాటా చెప్పి, ఫిరాయింపురాయుళ్లకు గుణపాఠం నేర్పాల్సింది ప్రజలే! - దిలీప్ రెడ్డి సాక్షి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com