CP sashidhar reddy
-
మీర్పేటలో పోలీసుల కార్డన్ సెర్చ్
-
మీర్పేటలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని మీర్పేట లెనిన్నగర్లో ఆదివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాచకొండ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 బైక్లు, 9 ఆటోలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
జీడిమెట్లలో పోలీసుల కార్డన్ సెర్చ్...
హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలోని జగద్గిరిగుట్ట, రింగ్ బస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 400మంది పోలీసులు పాల్గొని తనిఖీలు చేశారు. తనిఖీల్లో 10మంది రౌడీషీటర్లు, 20మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు 9 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.