జీడిమెట్ల పరిధి జగద్గిరిగుట్ట, రింగ్ బస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలోని జగద్గిరిగుట్ట, రింగ్ బస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 400మంది పోలీసులు పాల్గొని తనిఖీలు చేశారు. తనిఖీల్లో 10మంది రౌడీషీటర్లు, 20మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు 9 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.