cto
-
వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా
అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్లో భారతీయ-అమెరికన్కు కీలక స్థానం దక్కింది. ఉబెర్, యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఖోస్లా జూలై 31 నుంచి వాషింగ్టన్ పోస్ట్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా చేరనున్నారు. వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా సంస్థ సీఈవోకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఇంజనీరింగ్ బృందానికి, ఆవిష్కరణ వ్యూహానికి నాయకత్వం వహిస్తారు. తద్వారా సంస్థ సాంకేతిక లక్ష్యాల కోసం తోడ్పాటు అందిస్తారు. మీడియా ప్రపంచం వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ది వాషింగ్టన్ పోస్ట్కి వినీత్ను స్వాగతిస్తున్నందుకు సోంతోషిస్తున్నామని, వాషింగ్టన్ పోస్ట్ తాత్కాలిక సీఈవో పాటీ స్టోన్సిఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్తో సహా సాంకేతిక పరిజ్ఞానంలో వినీత్కు ఉన్న విస్తృత నేపథ్యం తమ తదుపరి దశ ఆవిష్కరణలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఖోస్లాకు సాంకేతిక పరిశ్రమలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. యాపిల్లో సిరి సహజ భాషా ఇంజిన్ కోసం, ఉబెర్లో మ్యాప్స్ రౌటింగ్ టీమ్ కోసం ఆయన పనిచేశారు. జార్జియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాస్టర్స్ పట్టా పొందిన వినీత్ ఖోస్లా 2005 నుంచి ఆయన కృత్రిమ మేధపై పని చేస్తున్నారు. -
సీఐఏ తొలి సీటీఓగా మూల్చందానీ
వాషింగ్టన్: అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్చందానీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఢిల్లీ స్కూల్లో చదువుకున్న చందానీ సమర్థుడైన ఐటీ నిపుణుడు. సిలికాన్ వ్యాలీలో 25 ఏళ్లపాటు పనిచేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లోనూ సేవలందించారు. ఆయన పరిజ్ఞానం, సేవలు తమకు బాగా ఉపయోగపడతాయని బర్న్ అన్నారు. సీఐఏలో స్థానం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నానని మూల్చందానీ అన్నారు. -
‘నా భర్త మనసు మారాలి.. కాపురానికి తీసుకువెళ్లాలి’
అమలాపురం టౌన్ : ‘‘నా భర్త యన్నం వెంకటేశ్వర్లు (అమలాపురం సీటీవో) మనసు మారాలి.. నన్ను కాపురానికి తీసుకు వెళ్లాలి’’ అనే నినాదాలతోపాటు.. ఆయన తన మెడలో తాళి కడుతున్న ఫొటో ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ భార్య అంకమ్మ నిరసనకు దిగింది. అమలాపురంలో తన భర్త పని చేస్తున్న కార్యాలయం ముందే.. తన తండ్రి నూకకోటి మాచర్లయ్య, తల్లి రమణమ్మ, అన్నయ్య బాలకృష్ణతో కలసి సోమవారం మండుటెండలో నడి రోడ్డుపై ధర్నా చేసింది. సీటీవో వెంకటేశ్వర్లు తనను గత ఏడాది మార్చి 5న ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని లక్ష్మీనరసింహ ఆలయంలో వివాహం చేసుకున్నారని అంకమ్మ నాటి పెళ్లి ఫొటోలు చూపించారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చౌటుపాలేనికి చెందిన అంకమ్మకు, అదే జిల్లా బద్వీడు చర్లోపల్లికి చెందిన సీటీవో వెంకటేశ్వర్లుకు వివాహమైంది. ప్రభుత్వాధికారినైనా గౌరవంగా ఉండే సాధారణ కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి, తన కుమార్తెను ఆదర్శ భావాలతో పెళ్లి చేసుకున్నారని అంకమ్మ తండ్రి మాచర్లయ్య విలేకర్లకు తెలిపారు. నెల రోజుల కాపురం తరువాత తనను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంకమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా పలుమార్లు తమకు కౌన్సెలింగ్ కూడా చేశారని చెప్పారు. రాజకీయ, అధికార పలుకుబడితో కేసులు లేకుండా తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నారని బాధితురాలి తల్లి రమణమ్మ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనపై సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీటీవో కార్యాలయంలోకి వెళ్లి ఆయన ఫోన్ నంబరు తీసుకున్నారు. అంకమ్మ కుటుంబ సభ్యులను స్టేషన్కు తరలించి అక్కడ విచారణ జరిపారు. అనంతరం తాము జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి నేరుగా ఫిర్యాదు చేస్తామని బాధితురాలి అన్నయ్య బాలకృష్ణ చెప్పారు. అక్కడి నుంచి ఆ కుటుంబం ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు కాకినాడ వెళ్లింది. దీనిపై సీటీవో వెంకటేశ్వర్లును వివరణ కోరేందుకు విలేకర్లు ప్రయత్నించగా ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఫోనుకు కూడా స్పందించలేదు. విడిపోయేందుకు నా భార్యే నోటీసు ఇచ్చింది : సీటీవోతనతో సంసారం చేయడానికి ఇష్టం లేదని.. తాను వేరేగా ఉండడానికి మెయింటెనెన్స్(భరణం) ఇవ్వాల్సిందిగా తనకు తన భార్య ఈనెల మూడో తేదీన లీగల్ నోటీసు ఇచ్చిందని అమలాపురం సీటీవో వై.వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కోర్టు దాకా వెళుతున్న క్రమంలో పరిష్కారాన్ని అలా కోరుకుంటూ మరో పక్క తనను ఇబ్బంది పెట్టేలా.. తన హోదాకు భంగం కలిగేలా తన కార్యాలయం ముందు ధర్నా చేయడం ఎంత వరకు సమంజసమని సీటీవో ప్రశ్నించారు. ఉదయం నుంచి అందుబాటులో లేని సీటీవో జరిగిన ఘటనపై సాయంత్రం లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. -
ట్విటర్ సీటీవోగా ముంబై ఐఐటీ పూర్వ విద్యార్థి
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ టాప్ ఎగ్జిక్యూటివ్గా ఎంపికయ్యారు. ఐఐటి-బొంబాయి పూర్వ విద్యార్ధి పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి (ఐఐటీ-బి) పూర్వ విద్యార్ధి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. 2016 చివరలో రాజీనామా చేసిన అడాం మెసెంజర్ స్థానంలో అగర్వాల్ను కొత్తగా నియమించినట్టు ట్విటర్ ప్రకటించింది. సోషల్ మీడియాలో అబ్యూసింగ్ నివారణ, ట్వీట్ల ఔచిత్యాన్ని పెంచడానికి ప్రధాన ప్రయత్నంలో భాగంగా ఎఐ ప్లాట్ఫాంపై ఆయన పనిచేయనున్నారని ట్విటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాజిక నెట్వర్క్ దుర్వినియోగాన్ని నివారించడంలో సీటీవోగా అగర్వాల్ దృష్టి పెట్టనున్నారని ట్విటర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా 2011లో స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీనుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేశారు. ఈ పదవికి ఎంపిక కాకముందు అగర్వాల్ ఏటి అండ్టీ, మైక్రోసాఫ్ట్, యాహూలలో ఇంటర్నషిప్గా పరిశోధనలు చేశారు. -
బోధన్ స్కాంలో మరో ఇద్దరు సీటీవోల అరెస్ట్
- సీఐడీ అదుపులో సంజయ్గౌడ్, పూర్ణచందర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: బోధన్ స్కాం వ్యవహారంతో వాణిజ్య పన్నుల శాఖలో తీవ్ర కలవరం మొదలైంది. వరుసగా సీఐడీ చేస్తున్న అరెస్టులు ఆరోపణలెదుర్కుంటున్న అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్రావుతో పాటు రిటైర్డ్ సీటీవో కృష్ణమాచారిని సీఐడీ ఆదివారం ఉదయం అరెస్ట్ చేసింది. ఈ వార్త వెలుగులోకి రాకముందే మరో ఇద్దరు సీటీవోలను నిజామాబాద్లో సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వరుస పరిణామాలు కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ధరణి శ్రీనివాస్రావు, కృష్ణమాచారికి రిమాండ్... బోధన్లో పనిచేసిన ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంజయ్గౌడ్, పూర్ణచందర్రెడ్డిలను సీఐడీ చాకచక్యంగా సోమవారం అదుపులోకి తీసుకుంది. దాడులు చేసేందుకు వస్తున్నారని ముందే పసిగట్టిన సీటీవోలు... ఇళ్లకు తాళాలు వేసి పరారయ్యారు. ఎట్టకేలకు వారిని గుర్తించి నిజామాబాద్లో అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. వీరితోపాటు ఆదివారం అరెస్ట్ చేసిన డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్రావు, రిటైర్డ్ సీటీవో కృష్ణమాచారిని నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామని, వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తామన్నారు. వణికిపోతున్న మహిళ అధికారులు... రూ. 350 కోట్లకు పైగా జరిగిన కుంభకోణంలో తాజాగా ముగ్గురు మహిళా అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఓ ఉన్నతాధికారి శివరాజు అండ్ గ్యాంగ్ నుంచి నెలకు రూ.10 లక్షలు కమిషన్ పద్ధతిన తీసుకున్నట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. మరో ఇద్దరిలో ఒక డీసీటీవో, ఒక సీటీవో మహిళా అధికారి ఉన్నారని, వీరి అరెస్టుకు సంబంధించి ఇప్పటికే సీఎంఓ నుంచి సీఐడీకి అనుమతి వచ్చినట్టు తెలిసింది. -
ఏసీబీకి చిక్కిన సీటీవో
నరసన్నపేట : అవినీతి నిరోధక శాఖ వలలో వాణిజ్యపన్నుల శాఖ అధికారి (సీటీవో) చిక్కారు. ఓ హోటల్కు సంబంధించి వ్యాట్ లైసెన్స్, ఇద్దరు పేరున ఉన్న వ్యాట్ లెసెన్స్ రద్దు కోసం ఊణ్ణ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి మంగళవారం పది వేల రూపాయల లంచం తీసుకుంటూ నరసన్నపేట సీటీవో కె.నాగరాజు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేటలోని లక్ష్మీ టాకీస్ వద్ద ఊణ్ణ వెంకటేశ్వరరావు పేరున అన్నపూర్ణ గార్డెన్ రెస్టారెంట్ ఉంది. దీన్ని ఎన్.గోవిందరావు అనే వ్యక్తి ఇటీవల లీజుకు తీసుకున్నారు. ఈయన పేరున వ్యాట్ లైసెన్స్ కావాలని సీటీఓను వెంకటేశ్వరరావు సంప్రదించారు. అయితే అప్పటికే గోవిందరావు పేరున మరో చిరునామాతో వ్యాట్ లైసెన్స్ ఉంది. దీన్ని రద్దు చేస్తేనే కొత్తది ఇవ్వగలమని సీటీఓ స్పష్టం చేశారు. అలాగే వెంకటేశ్వరరావు, గోవిందుల పేరున ఉన్న వ్యాట్ లైసెన్స్లు రద్దు చేస్తూ కొత్తగా అన్నపూర్ణ గార్డెన్ రెస్టారెంట్ పేరుతో గోవింద్కు కొత్తగా వ్యాట్ రిజిస్టేషన్ కావాలని వీరు కోరారు. ఈ పనులన్నీ పూర్తికావాలంటే 25 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని సీటీవో నాగరాజు డిమాండ్ చేయగా.. పది వేల రూపాయలు ఇచ్చేందుకు హోటల్ నిర్వాహకులు అంగీకరించినట్టు డీఎస్పీ చెప్పారు. తరువాత లంచం డిమాండ్ చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి వెంకటేశ్వరరావు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఆయన చేతికి పది వేల రూపాయలు ఇచ్చి.. సీటీవోకు ఇవ్వాలని మంగళవారం మధ్యాహ్నం పంపించామన్నారు. కార్యాలయంలోనే వెంకటేశ్వరరావు నుంచి సీటీవో నాగరాజు లంచం తీసుకుంటుండగా.. దాడి చేసి రెడ్హ్యాడెడ్గా పట్టుకున్నట్టు వివరించారు. సీటీవోను అరెస్టు చేశామని..విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో బుధవారం హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. స్థానికంగా సంచలనం అవినీతి నిరోధక శాఖ అధికారులకు సీటీవో చిక్కిన విషయం నరసన్నపేటలో సంచలనమైంది. సీటీఓ నాగరాజు ఉదయం 11 గంటలకే కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ విధులు నిర్వహించుకుంటున్నారు. ఒంటి గంట సమయంలో హోటల్ యజమాని వెంకటేశ్వరరావు సీటీవో కార్యాలయానికి రావడం, కొద్ది సమయానికే ఏసీబీ అధికారులు దాడి చేసి సీటీవోను అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏసీబీ దాడుల్లో సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దుకాణం మూసేసినా.. పన్ను కట్టాల్సిందే!
* పాత బకాయిల వసూలుకు వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయం * వచ్చే నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ * పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.5,200 కోట్లు * మూతపడ్డ పరిశ్రమలు, సంస్థలపై సర్కార్ దృష్టి * వసూళ్లపై సీటీవోలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: మూతపడ్డ సంస్థల నుంచి రావలసిన వేల కోట్ల రూపాయల పాత బకాయిలను వసూలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాత బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా ఉన్న సంబంధిత సంస్థలు, వ్యక్తుల నుంచి దాదాపు పదేళ్ల నుంచి రూ.5,200 కోట్లు బకాయిల రూపంలో రావలసి ఉందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఈ మేరకు మూతపడ్డ సంస్థలు, పరిశ్రమలతో పాటు దేశంలోని వివిధ కంపెనీలతో లావాదేవీలు జరిపి చేతులెత్తేసిన డీలర్ల వివరాలను సర్కిళ్ల వారీగా సంపాదించేందుకు ఇప్పటికే సీటీవోలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు సర్కిళ్లలోని సీటీవోల ద్వారా బకాయిలు వసూలు చేయాల్సి ఉంటుంది. కాగా రూ.5,200 కోట్ల బకాయిల్లో కేవలం హైదరాబాద్ నుంచే సుమారు రూ.4వేల కోట్ల వరకు రావలసి ఉందని సమాచారం. వ్యాట్కు ముందు.. తరువాత... దేశవ్యాప్తంగా 2005 ఏప్రిల్ నుంచి విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అమలులోకి వచ్చింది. అంతకు ముందు అమ్మకపు పన్ను వసూలు చేసేవారు. అయితే అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్ అమలైన సమయంలో అప్పటి వరకు ఉన్న బకాయిల గురించి అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. కొందరు డీలర్లు కూడా వ్యాట్ పరిధిలోకి రావడం ఇష్టం లేక వ్యాపారాలను మూసేసినట్లు ప్రకటించి, బకాయిలు చెల్లించలేదు. వ్యాట్ అమలులోకి వచ్చిన తరువాత కూడా కొన్ని పరిశ్రమలు, సంస్థలు తమ లావాదేవీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించకుండా పన్ను ఎగవేతకే ప్రాధాన్యమిచ్చాయి. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల ద్వారా లావాదేవీలు జరిపిన వేలాది మంది డీలర్లు కూడా మూతపడ్డ కంపెనీ (క్లోజ్డ్ కేస్) ఖాతాలో చేరిపోయారు. మూతపడ్డ, ఖాయిలా పరిశ్రమల విషయంలో వాణిజ్యపన్నుల శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాట్కు ముందు, తరువాత ఇప్పటి వరకు మూతపడ్డ కేసుల ఖాతాలో రూ. 5,200 కోట్ల మేర పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ పాత బకాయిలపై అధికారులు సమీక్షించి, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల రావలసిన బకాయిలు మరో రూ. 4,000 కోట్ల వరకు ఉన్నప్పటికీ, వచ్చే నెల నుంచి స్పెషల్ డ్రైవ్ ద్వారా పాత బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తాం: కమిషనర్ వాణిజ్యపన్నుల శాఖకు వ్యాట్, ఇతర పన్నుల రూపంలో రావలసిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు. మూతపడ్డ వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలకు సంబంధించి బకాయిలు ఉన్నవారు వెంటనే సంబంధిత సీటీవోలను సంప్రదించి, పన్నులు చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు. -
ఏసీబీ చేతికి చిక్కిన సీటీవో
గుడివాడ: మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. లంచం తీసుకుంటుండగా ఓ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన గురువారం చోటు చేసుకుంది. గుడివాడ సీటీవో వీవీయస్ఎల్ ప్రసాదబాబు రూ. 25 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గుడ్లవల్లెరు మండలం గౌతవరం గ్రామానికి చెందిన నక్క రవికుమార్కి చెందిన మిల్లు సరిగా నడవకపోవడంతో లైసెన్స్ రద్దు చేయాలని రెండు నెలల క్రితం ప్రసాదబాబును సంప్రదించాడు. అందుకు ప్రసాదబాబు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని రూ. 25 వేలు తీసుకొవాలని రవికుమార్ కోరాడు. అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం వల పన్నిన ఏసీబీ అధికారులు గురువారం రవికుమార్ నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా సీటీవో ప్రసాద బాబును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
మహిళా సీటీఓకు వేధింపులు