Custom Officials
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో పాములు కలకలం
-
45 తుపాకులతో విమానం దిగిన జంట.. అధికారుల షాక్
ఢిల్లీ: బ్యాగుల నిండా తుపాకులతో దేశంలోకి వచ్చిన ఇద్దరు భారతీయులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఆ పిస్తోళ్లు నకిలివా, నిజమైనవా అని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అవి నిజమైన తుపాకులేనని తెలిపారు. అరెస్టయిన ఇద్దరు జగ్జిత్ సింగ్, జస్విందర్ కౌర్లుగా గుర్తించారు అధికారులు. వారిద్దరినీ భార్యాభర్తలుగా నిర్ధారించారు. కాగా, వారిద్దరూ జూలై 10న వియాత్నం నుంచి భారత్కు వచ్చారు. జగ్జిత్ సింగ్ తీసుకొచ్చిన రెండు ట్రాలీబ్యాగుల్లో 45 తుపాకులు లభించాయి. వాటిని అతడి సోదరుడు మంజిత్ సింగ్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. జగ్జిత్ సింగ్ ఫ్రాన్స్లోని ప్యారీస్ నుంచి వియాత్నంకు వచ్చిన క్రమంలో ఆ ట్రాలీ బ్యాగులను మంజిత్ సింగ్కు ఇచ్చాడు. అందులోని మొత్తం 45 తుపాకుల విలువ సుమారు రూ.22,50,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలోనూ 25 తుపాకుల చేరవేత.. అయితే, వీరిద్దరూ ఇలా తుపాకులను చేరవేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి పిస్తోళ్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. టర్కీ నుంచి భారత్కు 25 తుపాకులు తెచ్చినట్లు విచారణ సందర్భంగా నిందితులు అంగీకరించారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్టు తెలిపారు. Delhi | An Indian couple that arrived from Vietnam was nabbed & 45 guns worth over Rs 22 lakh from two trolley bags seized. They admitted their previous indulgence in smuggling 25 pieces of guns having a value of over Rs 12 lakh: Commissioner of Customs, IGI Airport & General pic.twitter.com/TvjNbJt5yA — ANI (@ANI) July 13, 2022 ఇదీ చూడండి: కోవిడ్ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత? -
పేస్టుగా చేసి బంగారం దాచి..
శంషాబాద్ (హైదరాబాద్): బూట్ సాక్సుల్లో కొంత.. మలద్వారంలో మరికొంత బంగారం దాచి విమానం దిగిన ఒక ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. వివరాలివి. శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున జె9403 కువైట్ విమానం దిగిన ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె బూటు సాక్సుల్లో నల్లటి కవర్లలో దాచి ఉంచిన బంగారం బయటపడింది. మహిళను మరింత విచారించగా.. నల్లటి ఉండల మాదిరిగా చేసి మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చిన బంగారం పేస్టు గురించి ఆమె వివరించింది. దీంతో ఆ మహిళకు వైద్యులతో శస్త్రచికిత్స చేయించి బంగారాన్ని బయటికి తీయించారు. మొత్తం ఆమె నుంచి 1.646 కేజీల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.86 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. -
పార్శిల్లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు
సాక్షి, చెన్నై: శ్రీలంక నుంచి చెన్నైకు వచ్చిన పార్శిల్లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు, రత్నాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానం వచ్చింది. ఇందులో వచ్చిన పార్శిల్పై అధికారులకు అనుమానం కలిగింది. చెన్నైకు చెందిన ఓ పారిశ్రామివేత్త చిరునామాతో రావడం.. రూ.5.85 లక్షల విలువైన సెమీ వజ్రాలు ఉన్నట్లు రశీదులో పేర్కొని ఉండటంతో అనుమానంతో తెరిచి చూశారు. అందులో ఉన్న వజ్రాలు, రత్నాలను నిపుణుల ద్వారా పరీక్షించగా, వాటి విలువ రూ.4.45 కోట్లుగా తేలింది. దీంతో చెన్నైలోని ఆ పారిశ్రామికవేత్తను కస్టమ్స్ అధికారులు విచారించే పనిలో పడ్డారు. -
బంగారం అక్రమ రవాణా
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి మణిపూర్ రాజధాని ఇంపాల్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడిని తనిఖీ చేశారు. మలద్వారంలో బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 975 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ. 50.7 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్టు హుక్స్లో బంగారం
శంషాబాద్: బెల్టు హుక్స్లో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి లగేజీలో ఉన్న ఓ బెల్టును తనిఖీ చేయగా దాని హుక్స్కు ఉన్న పైపూతను తీయడంతో వాటిని బంగారంగా గుర్తించారు. 300 గ్రాముల బరువు ఉన్న బంగారు హుక్స్ రూ.18.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం ఇవ్వకుంటే బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయి బెయిల్పై వచ్చిన ఓ నిందితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసి కస్టమ్స్ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. రూ.20 వేల కోసం దిగజారి ఊచలు లెక్కబెట్టాల్సిన స్థితి తెచ్చుకున్నారు. యాకత్పురాకు చెందిన మీర్ అస్గర్ అలీ గత ఏప్రిల్ 29న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులకు బంగారం స్మగ్లింగ్లో దొరికిపోయాడు. అరెస్టయి జైలుకు పోయిన అస్గర్కు.. తండ్రి చనిపోవడంతో మే 30న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, ప్రతీ పదిహేను రోజులకోసారి దర్యాప్తు అధికారి వద్ద సంతకం చేయాలని షరతు విధించింది. ఇలా కొద్దిరోజుల నుంచి కస్టమ్స్ కార్యాలయానికి వస్తూ సంతకం చేసి వెళ్తున్నాడు. రెండు నెలల క్రితం కస్టమ్స్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న హవాల్దార్ సుందర్... అస్గర్ను ఇక రావద్దని, తాము పిలిచినప్పుడు వస్తే సరిపోతుందని చెప్పాడు. దీంతో అస్గర్ అప్పటి నుంచి కస్టమ్స్ కార్యాలయానికి రాలేదు. ఈనెల 7న కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం ఇన్స్పెక్టర్ కృషన్పాల్నుంచి అస్గర్కు ఫోన్ కాల్ వచ్చింది. తాము ఇంటికి వస్తే ఎవరూ లేరని, ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించారు. అయితే తాను కొద్దిరోజుల క్రితమే ఇల్లు మారానని, కొత్త ఇంటి అడ్రస్ పంపిస్తానని చెప్పాడు. బెయిల్ రద్దు చేయిస్తాం తర్వాతి రోజు అస్గర్ ఇల్లు ధ్రువీకరించుకున్న ఈ ముగ్గురు.. రూ.20వేలు డిమాండ్ చేశారు. చెప్పకుండా అడ్రస్ మారావని, ఇది కుట్రపూరితమని బెదిరించారు. అంతేకాకుండా కొత్త ఇంటిని పంచనామా చేయాలని, తెలిసిన ఇద్దరిని తీసుకురావాలని అస్గర్కు చెప్పారు. అయితే ఈ సమయంలో తనకు తెలిసిన వాళ్లు ఎవరూ ఇక్కడ లేరని చెప్పాడు. పంచానామా చేయకపోతే బెయిల్ రద్దు అవుతుందని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు. మరుసటి రోజు ఇద్దరు స్థానికులను తీసుకొని బషీర్బాగ్లోని కస్టమ్స్ జీఎస్టీ భవన్ రావాలని చెప్పారు. తర్వాతి రోజు అస్గర్.. సుందర్కు ఫోన్ చేసి ఇద్దరు స్థానికులు దొరకలేదని, రూ.20 వేలు కూడా ఇవ్వలేనని చెప్పాడు. 11వ తేదీన కస్టమ్స్ ఆఫీస్కు వస్తే బేరసారాలు చేసుకుందామని సుందర్ చెప్పాడు. దీంతో అస్గర్ సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఆడియో నిర్ధారణ.. ఈ నెల 11న అస్గర్ కస్టమ్స్ కార్యాలయానికి ఇద్దరిని తీసుకెళ్లాడు. రూ.20 వేలు ఇస్తే గానీ పంచానామా చేయమని, బెయిల్ రద్దుకు ప్రతిపాదన చేస్తామని బెదిరించారు. అయితే చివరకు రూ.10వేలకు డీల్ చేసుకున్నారు. సోమవారం డబ్బులు ఇస్తానని చెప్పిన అస్గర్ రికార్డు చేసిన ఫుటేజ్ను సీబీఐకి సమర్పించాడు. సోమవారం అస్గర్ కస్టమ్స్ సిబ్బందికి రూ.10వేలు ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆఫీసుతోపాటు వారి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించి పలు ధ్రువపత్రాలు స్వాధీ నం చేసుకున్నారు. సురేష్కుమార్, కృషన్పాల్, సుందర్లను చేసి అరెస్ట్ చేసి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
కడుపులో 4.15 కిలోల బంగారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగారాన్ని మాత్రల రూపంలో మింగేసి అక్రమరవాణాకు పాల్పడిన 8 మందిని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీరి కడుపులో నుంచి రూ. 2.17 కోట్ల విలువైన 4.15 కిలోల బంగారాన్ని బయటకు తీశారు. వందేభారత్ ఎయిర్ ఇండియా విమానం జనవరి 30న దుబాయ్ నుంచి చెన్నైకి చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికుల్లో 8 మందిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. ఏమీ దొరకలేదు. అయినా అనుమానం తీరకపోవడంతో విమానాశ్రయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి కడుపు భాగాన్ని ఎక్స్రే తీయగా బంగారు ఉండలు మాత్రల రూపంలో కనపడ్డాయి. (చదవండి: నువ్వు గ్రేట్ బంగారం!) మంచినీళ్లు తాగుతూ మాత్రల రూపంలో బంగారాన్ని మింగినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ 8 మందిని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బంగారు మాత్రలను బయటకు తీశారు. వారి కడుపులో నుంచి వచ్చిన రూ.2.17 కోట్ల విలువైన 4.15 కిలోల 161 బంగారు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కనకవల్లి, నిషాంతి, కళా, ఫాతిమా, పుదుకోటైకి చెందిన జయరాజ్, జగదీష్, కబర్ఖాన్, రామనాథపురానికి చెందిన హకీంలను చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. -
పట్టుకున్న బంగారం ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, వజ్రాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడడం తెలిసిందే. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పసిడి, వెండి, వజ్రాలు తదితర విలువైన వస్తువులను తర్వాత ఏం చేస్తారు? అనేది తెలుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనితోపాటు మరికొన్ని ప్రశ్నలను నగరానికి చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగితే ఏం సమాధానం వచ్చిందో తెలుసా? ‘‘మా వద్ద సమాచారం లేదు’’అని!! అది చదివి అవాక్కవడం అతని వంతైంది. పన్ను ఎగ్గొట్టే యత్నంలో.. యూఏఈ, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి బంగారం, ఇతర దేశాల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీని కొందరు విమానాల ద్వారా అక్రమంగా హైదరాబాద్కు తెస్తుంటారు. పన్ను ఎగ్గొట్టే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా వీటిని తీసుకొస్తుంటారు. అత్యంత ఆధునిక విధానాల్లో వీటిని తెస్తూ కస్టమ్స్ అధికారుల కంట పడకుండా బురిడీ కొట్టిస్తుంటారు. అయితే, బాడీ స్కానింగ్ తదితర అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక.. స్మగ్లర్ల పప్పులు ఉడకడం లేదు. ఇలా పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, కరెన్సీ, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు? వీటిని వేలం వేస్తారా? లేక ఇతర శాఖలకు పంపుతారా? కోర్టుకు స్వాధీనం చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఇవే ప్రశ్నలను సంధిస్తూ నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక ఉద్యమకారుడు శంషాబాద్లోని హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్నగర్లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్కు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశాడు. చెన్నై సీబీఐ లాకర్లా అయితే ఎలా?: రాబిన్ తన ప్రశ్నలకు కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంపై ఆర్టీఐ దరఖాస్తుదారుడు రాబిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిత్యం కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటున్న బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాల గురించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుంటాయని, స్వాధీనం చేసుకున్న వాటిన ఏంచేస్తారో ప్రజలకు చెప్పకపోవడం ఏంటని వాపోయాడు. అసలు ఈ వస్తువుల రికార్డు నిర్వహణ సరిగా ఉందా? అని నిలదీశాడు. నిర్వహణ సరిగా లేకపోతే ఇటీవల చెన్నైలోని సీబీఐ కస్టడీ నుంచి దాదాపు 100 కిలోల బంగారం మాయమైన తరహాలో జరిగితే ఏమేం మాయమయ్యాయనే సంగతి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాడు. ఈ తొమ్మిది ప్రశ్నలు సంధించాడు! (1) 2015 నుంచి 2020 వరకు కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల వివరాలు (2) స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏయే దేశాలవి? (3) 2015–2020 వరకు నమోదు చేసిన కేసులు (4) స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తారు? (5) ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత? (6) సీజ్ చేసిన వçస్తువులను హైదరాబాద్ కస్టమ్స్ వేలం వేస్తుందా? (7) మీరు నిర్వహించిన వేలంలో విక్రయించిన పది వస్తువులు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు (8) వేలం సమాచారం ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గత పది వేలంల గురించిన వివరాలు (9) హైదరాబాద్ కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల్లో ఎన్ని కస్టడీలో ఉన్నాయి? ఇతర విభాగాలు, కోర్టుకు ఎన్నింటిని అప్పగించారు? -
వీడి తెలివికి ఆస్కార్, నోబెల్ కూడా తక్కువే..!
స్మగ్లింగ్ నుంచి నియంత్రించడానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్న మాట వాస్తవం. ముఖ్యంగా విమానాశ్రయల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మనం కూడా నిత్యం ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత వంటి వార్తల్ని అనేకం చూస్తూనే ఉంటాం. అయితే కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పడానికి జనాలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో చెప్పుకొచ్చారు ఓ సీనియర్ కస్టమ్స్ అధికారి. ఓ వ్యక్తి ఏకంగా వేరు శనకాయల్లో డ్రగ్స్ని కుక్కి స్మగుల్ చేయడానికి ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నారు నార్బర్ట్ అల్మేడియా అనే వ్యక్తి 2000 - 2005 వరకూ కస్టమ్స్ అధికారిగా విధులు నిర్వహించాడు. అయితే ఏ దేశంలో అనే వివరాలు పేర్కొనలేదు. ఈ క్రమంలో జనాలు ఎలాంటి వస్తువులను ఎక్కువగా స్మగుల్ చేయడానికి ప్రయత్నించేవారు.. అందుకు ఏలాంటి మార్గాన్ని ఎంచుకునేవారో తెలిపారు. స్మగ్లింగ్కు గురయ్యే వాటిల్లో ఎక్కువగా తాబేళు పిల్లలు, తేళ్లు, ఆహార పదార్థలతో పాటు డ్రగ్స్ను కూడా ఉండేవని తెలిపారు. అయితే వీటన్నింటిలో డ్రగ్స్ని తరలించడం కోసం జనాలు రకరకాల ప్రయత్నాలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. కార్పెట్ను డ్రగ్స్లో ముంచి తీసుకురావడం.. కంప్యూటర్లలో డ్రగ్స్ను నింపి పైన ఉత్త గ్లాస్ను అంటించడం.. ఆఖరికి సూట్కేస్లు, వీల్ చైర్లలో కూడా డ్రగ్స్ను తరలించడానికి ప్రయత్నించేవారు అని తెలిపారు. అయితే వీటన్నింటికి కన్నా ఆసక్తికర సంఘటన ఒకసారి చోటు చేసుకుందని తెలిపారు. ఒక వ్యక్తి వేరు శనక్కాయల లోపల డ్రగ్స్ను కుక్కి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అతన్ని అరెస్ట్ చేసినప్పటికి కూడా అతని సృజనాత్మక ఆలోచనని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డ్రగ్స్ని వేరు శనక్కాయల్లో తరలించే ఆలోచన వచ్చినందుకు సదరు వ్యక్తికి ఆస్కార్, నోబల్ కన్నా ఉత్తమ అవార్డు ఇవ్వాలి అని.. ఇలాంటి పనుల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం బుర్రను వాడితే మంచిదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
అరకేజీ బంగారం స్వాధీనం
హైదరాబాద్ : సింగపూర్ నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికుడి నుంచి అరకేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సదరు ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆ లగేజీలో అరకేలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో బంగారాన్ని సీజ్ చేశారు. -
ఎయిర్పోర్ట్లో కేజీ బంగారం స్వాధీనం
-
ఎయిర్పోర్ట్లో కేజీ బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దుబాయి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతడి లగేజీలో కేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రయాణికుడి నుంచి అరకేజీ బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దుబాయి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతడి లగేజీలో అరకేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు మంగళవారం 1.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్న క్రమంలో... సదరు ప్రయాణికుల లగేజీలో ఆ బంగారాన్ని కనుగొన్నారు. కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ఎయిర్పోర్ట్లో అరకిలో బంగారం స్వాధీనం
-
ఎయిర్పోర్ట్లో అరకిలో బంగారం స్వాధీనం
బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఖాజా అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఖాజా హైదరాబాద్ చేరుకున్నాడు. అనంతరం ఖాజా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో కస్టమ్స్ అధికారులు అనుమానం వచ్చింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా ఖాజా వద్ద నుంచి అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అనంతరం అతడిని ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.