Cynthia relatives
-
పాపం... సానియా..
-
పాపం... సానియా..
- రోజంతా కోర్టుల్లో హైడ్రామా - తల్లిదండ్రులకు దూరమై ఒంటరైన చిన్నారి సాక్షి, హైదరాబాద్ : నాన్న చేతిలో కాలి బూడిదైన అమ్మ... ఆ హత్యానేరంతో జైలుకెళ్లిన నాన్న... తమకే కావాలని తల్లి వైపు... తండ్రి వైపు బంధువులు పటబట్టడంతో... ఎవరికీకాక ఒంటరైన బుజ్జితల్లి కంటనీరు కట్టలు తెగుతోంది. ఎనిమిదేళ్ల చిన్నారి సానియా శుక్రవారమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. గచ్జిబౌలిలో ఉండే రూపేశ్కుమార్ తన భార్య సింథియాను గత ఆదివారం హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి ఏకైక కుమార్తె సానియా(8) పరిస్థితి దైన్యంగా మారింది. చిన్నారిని తామే పెంచుతామని నానమ్మ లలిత చెబుతుండగా, తమదేశం కాంగోకు తీసుకెళ్తామంటూ మేనమామ పట్టుబడుతున్నారు. కాంగో రాయబారి కూడా సానియాను తమకు అప్పగించాలని కోరినట్లు తెలిసింది. కనిపించని బంధువులు... ఈ వివాదంతో నింబోలిఅడ్డాలోని రెస్క్యూ హోంలో ఉన్న సానియాను ఎవరికి అప్పచెప్పాలో తేల్చుకోని పోలీస్లు తొలుత రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని 8ఎంఎం కోర్టు న్యాయమూర్తి రాధిక జేస్వాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టుకు న్యాయమూర్తి బదిలీ చేశారు. సానియాను అక్కడికి తీసుకువెళ్లగా... తమ పరిధిలో లేదని ఫ్యామిలీ కోర్టు జడ్జి రమేష్బాబు వెల్లడించారు. దీంతో మళ్లీ రాజేంద్రనగర్ 8ఎంఎం కోర్టుకు తీసుకెళ్లగా... పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. అయితే... సానియా మాక్కావాలంటే మాక్కావాలన్న బంధువులు ఒక్కరు కూడా కోర్టులో పిటిషన్ వేయలేదు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు చిన్నారిని హైదర్షాకోటలోని కస్తూర్బా ట్రస్ట్కు తరలించారు. సోమవారం వరకు అక్కడే చిన్నారి యోగక్షేమాలు చూసుకోవాలన్నారు. బంధువులు పిటిషన్ దాఖలు చేస్తే తిరిగి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. -
సానియా వ్యవహారంపై తేలని వివాదం
-
సానియా వ్యవహారంపై తేలని వివాదం
హైదరాబాద్ : దారుణంగా హత్యకు గురైన తల్లి... ఓవైపు జైల్లో తండ్రి.. ఇంకోవైపు తమకు అప్పగించాలంటూ తల్లి తరఫు బంధువులు, మరోవైపు సానియా తమతోనే ఉంటుందని తండ్రి కుటుంబసభ్యలు డిమాండ్తో చిన్నారి సానియా పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో వారి కూతురు సానియా ఎక్కడ ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయిదు రోజుల క్రితం కాంగో దేశస్తురాలు అయిన సింథియాను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని దహనం చేసిన రూపేశ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె సోదరుడు డానీస్తోపాటు అతడి బంధువులు రెండురోజులుగా పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సానియాను పోలీసులు గురువారం రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసు తమ పరిధిలోకి రాదని, రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో పోలీసులు రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించనున్నారు. కాగా తల్లి హత్య అనంతరం సానియా తన నాయనమ్మ లీలావతి వద్ద ఉండగా, ఆ చిన్నారిని పోలీసులు గురువారం నాడు రెస్క్యూ హోంకు తరలించారు. ఆ ప్రదేశాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. -
సానియాను అప్పగించండి
సింథియా బంధువుల ఆందోళన శంషాబాద్ : భర్త చేతిలో హత్యకు గురైన ఆఫ్రికాలోని కాంగోవాసి సింథియా కూతురు సానియాను తమకప్పగించాలని ఆమె బంధువులు, స్నేహితులు రెండోరోజూ ఆందోళనకు దిగారు. గురువారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సింథి యాను హత్య చేసిన రూపేష్ను నడిరోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హత్య చేసి న వ్యక్తులను హతమార్చడమే కఠిన శిక్షంటూ నినాదాలు చేశారు. హంతకుడికి ముసుగు వేసి తీసుకురావాల్సిన అవసరం ఏంటని, అతడిని ముసుగు లేకుండా చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భారతదేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంపై తమకు అపారమైన గౌరవముందని, తమకు న్యాయం చేయాలని నినదించారు. పోలీస్స్టేషన్ పరిసరాలతోపాటు పక్కనే ఉన్న సర్వీసు రోడ్డుపై వారు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వారికి నచ్చచెబుతుండగా వారితో కూడా వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో పోలీసులతో చర్చించేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా ఎంబసీ అధికారులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు చొక్కాలు విప్పి రోడ్డుపై బైఠాయిం చారు. సానియాను తమకే అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు పలుమార్లు సముదాయించడంతో వారు అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్కు వెళ్లిపోయారు.