Delhi Election results
-
చంద్రబాబు కొత్త పల్లవి.. గతం గుర్తుందా?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతం చంద్రబాబుకు గుర్తుకు రాదా?.. కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్త పల్లవి, కొత్త కీర్తనలు పాడటం మొదలు పెట్టాడంటూ దుయ్యబట్టారు.‘‘మోదీ రైట్ టైం రైట్ లీడర్ షిప్ అని మోదీని చంద్రబాబు ఎప్పుడు గుర్తించారు. చంద్రబాబే పెద్ద దిక్సూచి అని గతంలో కేజ్రీవాల్ కీర్తించారు. మోదీ సరైనా నాయకుడు కాదని 2017, 18, 19లో చెప్పింది చంద్రబాబే. మోదీ డిక్టేటర్ అని.. అలాంటి మోదీని తలదన్నుతున్నాని చంద్రబాబు చెప్పాడు. అవినీతి కుడితిలో మోదీ పడి విలవిల లాడుతున్నాడని చంద్రబాబు అన్నారు. మోదీ మీద చంద్రబాబు చేసిన వాఖ్యలన్ని రికార్డ్ కాబడినవే’’ అని కన్నబాబు గుర్తు చేశారు.‘‘మోదీని నమ్మి మోసపోయామని చంద్రబాబు అన్నారు. మోదీ హటావో.. దేశ్ బచావో అని ఐదేళ్ల క్రిందట విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం ఊసరవెల్లిని మించిపోతారు. చంద్రబాబు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే మీడియా ఉంది. అందుకే ఆయన ఆటలు సాగుతున్నాయి. సంక్షేమ ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించడం లేదని చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టితో సంక్షేమం ఇవ్వాలని చెప్పారు. ఏపీ, ఢిల్లీలో ఉచితాలు ఫెల్యూర్ అయ్యాయని అన్నారు. ఉచితాలు ఫెల్యూర్ అయితే.. సూపర్ సిక్స్ ఇస్తానని ఏ రకమైన హమీలు చంద్రబాబు ఇచ్చారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అని విధంగా చంద్రబాబు తీరు ఉంది’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.‘‘సంక్షేమం ముఖ్యం కాదు రాష్ట్ర గ్రోత్ను పెంచడం అని తనకి నచ్చినట్లు పాలన చేస్తానని చెబుతున్నాడు. సంక్షేమం తన ప్రాముఖ్యత కాదని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? పచ్చిగా తన హామీలను తుంగలోకి తొక్కడానికి చంద్రబాబు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రజల మైండ్ను సెట్ చేస్తున్నాడు. ఆడిన ఆబద్ధం ఆడకుండా. ఎంత కాలం విశ్వసనీయత లేకుండా పాలన చేస్తారు. సంపద సృష్టి కర్త ఈ ఎనిమిది నెలలో ఏం చేశారు?. ఎవరి కోసం సంపద సృష్టి చేశారు. తన వాళ్లు.. పార్టీ నాయకుల కోసం చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారు. పేకాట క్లబ్ల కోసం కూటమి నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరికి బూడిద కోసం కూడా కూటమి నేతల మధ్య గొడవలు జరిగాయి...విద్యుత్ ఛార్జీలు రూ.15 వేలకోట్లు సంపద సృష్టి అనుకోవాలా?. ఉచిత ఇసుక ద్వారా ఎవరేవరికి సంపద సృష్టి జరుగుతుందో తెలుసుకోండి. చంద్రబాబు ఎప్పటికప్పుడు మనస్సు మార్చుకుంటారా?. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది?. 2019లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించారు. దానికి కట్టుబడి ముందుకు వెళ్తారా?. విభజన చట్టంలో హమీలు ఎంత వరకు వచ్చాయి?. ప్రజల ఎకౌంట్లో డబ్బులు వేయనని చంద్రబాబు చెబుతున్నట్లు ఉంది.కొన్ని పెద్ద శాఖలకు ఎక్కువ ఫైల్స్ వస్తాయి. అలాగే చిన్న శాఖలకు తక్కువ ఫైల్స్ వస్తాయి. మంత్రుల ర్యాంకుల విషయంలో అందరిని ఒక గాడిన పెట్టడం సరికాదు. ఆర్థిక శాఖకు 24 ఇచ్చారంటా.. మీ పాలనలో ఆర్థిక పరిస్థితి బాగోలేదనేగా?. ర్యాంకుల కోసం కూటమి నేతల మధ్య విబేధాల నెలకొన్నాయి. మీ ర్యాంకులకు పాస్ మార్కులు కూడా రాలేదు. అమరావతి కోసం కలలు కనడం తప్పా... మీరు చేసింది ఏమిటీ?. చంద్రన్న పగ.. చంద్రన్న దగా ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి’’ కన్నబాబు దుయ్యబట్టారు. -
కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.. ఉచితాలతో అధికారం రాదు
-
బీజేపీ విక్టరీకి.. ప్రధాన కారణాలు ఇవే!
-
కేజ్రీవాల్ ఓటమి
-
మళ్లీ వెనకబడ్డ కేజీవాల్.. ఢిల్లీలో బీజేపీ సంబరాలు
-
ఢిల్లీలో వికసించిన కమలం
-
అరవింద్ కేజ్రీవాల్ ముందంజ
-
ఢిల్లీ కోటపై కాషాయ రెపరెపలు
-
అరెస్టే కొంప ముంచింది.. ఢిల్లీ ఫలితాలపై AAP నేత రియాక్షన్
-
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నాహజారే రియాక్షన్
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్న అన్నాహజారే.. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. అందుకే కేజ్రీవాల్ను ప్రజలు ఓడించారన్నారు.గతంలో అరవింద్ కేజ్రీవాల్తో కలిసి అన్నాహజారే.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్పై అన్నాహజారే మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు.. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన సందర్భంలోనూ ఆయన మండిపడ్డారు.కాగా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. 50 సీట్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలోనూ బీజేపీదే హవా చూపుతోంది. ఔటర్ ఢిల్లీలోనూ ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. ఆప్ అగ్రనేతలు, మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అవినీతి కేసుల్లో చాలామంది నేతలు ఇరుక్కోవడం ఆప్కు వ్యతిరేకతగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లి రావడంతో పలువురు ఆప్ అగ్రనేతలు బీజేపీలోకి చేరారు. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీకి విజయావకాశాలు పెరిగాయి. మరోవైపు, ఢిల్లీసీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవినీతి, లిక్కర్ స్కాం అభియోగాలు ఆప్ ప్రతిష్ఠను మరింత దిగజార్చాయి. -
సత్తా చాటిన ఆప్
-
ఓటమికి బాధ్యత వహిస్తా :మనోజ్ తివారీ
-
ఆప్ కార్యాలయంలో సంబరాలు
-
న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ముందంజ
-
ముందంజలో కేజ్రీవాల్, సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 51 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 14 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
ఢిల్లీ పీఠం మాదే : బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 55 స్ధానాల్లో గెలుపొందినా ఆశ్చర్యం లేదని అన్నారు. అంతకుముందు బీజేపీ నేత విజయ్ గోయల్ మంగళవారం ఉదయం కన్నాట్ప్లేస్లో హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇక కౌంటింగ్కు ముందు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన నివాసంలో ప్రార్ధన చేశారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. -
ఏఐసీసీలో కూడా ప్రక్షాళన: పొంగులేటి
హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంటోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. ఏప్రిల్లో జరిగే ఏఐసీసీ సమావేశాల్లో వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష ఉంటుందన్నారు. తెలంగాణతో పాటు ఏఐసీసీలో కూడా ప్రక్షాళన ఉండే అవకాశం ఉందన్నారు. తెలంగాణకు రావల్సిన విద్యుత్, నీటి వాటాల గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించడాన్ని ప్రజలు సహించరని పొంగులేటి వ్యాఖ్యానించారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 490 పాయింట్లు కోల్పోయి 28227 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 134 పాయింట్ల నష్టపోయి 8526 వద్ద ముగిసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయ్... * జీడీపీ, ఐఐపీ డేటా కూడా... * ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియాల ఫలితాలపై దృష్టి * ఈ వారం మార్కెట్ ట్రెండ్పై నిపుణుల అంచనా... న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ (ఏఏపీ) విజయం సాధించవచ్చంటూ వెలువడిన ఎగ్జిట్పోల్స్కు అనుగుణంగా ఈ సోమవారం స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయని, అటుతర్వాత మంగళవారం ప్రకటితమయ్యే వాస్తవ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్లు కదలవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఢిల్లీ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం వున్నందున, స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని వారంటున్నారు. ఈ వారం వెలువడే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)గణాంకాలు, కొన్ని బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ట్రెండ్ను నిర్దేశించే పలు అంశాల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా వుంటాయని ట్రేడ్స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘానియా అన్నారు. సోమవారం జీడీపీ అడ్వాన్సు అంచనాల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని, 2014 డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి, గత జనవరి నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చే గురువారం ప్రకటితమవుతాయని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ చెప్పారు. ఇవి ఈ వారం ద్వితీయార్థంలో ట్రెండ్ను ప్రభావితం చేస్తాయన్నారు. బ్లూచిప్ కంపెనీలైన లార్సన్ అండ్ టూబ్రో, డీఎల్ ఎఫ్, బీహెచ్ఈఎల్, సిప్లా, కోల్ ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, మహీంద్రా, ఎస్బీఐలు క్యూ3 ఆర్థిక ఫలితాల్ని ఈ వారం వెల్లడించనున్నాయి. ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియాల ఫలితాలు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటాల ఆధారంగా స్టాక్ సూచీలు కదలవచ్చని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ పరిణామాలకొస్తే... గ్రీసు రుణ ప్రతిపాదనలను చర్చించేందుకు యూరో దేశాల ఆర్థిక మంత్రులు బుధవారం సమావేశం కానున్నారు. యూరో ప్రాంతపు జీడీపీ గణాంకాలు శుక్రవారం విడుదలకానున్నాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 12,000 కోట్లు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఫిబ్రవరి నెల తొలివారంలో భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 12,000 కోట్ల నికర పెట్టుబడులు జరిపారు. వీటిలో ఫిబ్రవరి2-6వ తేదీల మధ్య షేర్లలోకి రూ. 4,702 కోట్లు ప్రవహించగా, రూ. 7,059 కోట్లు రుణపత్రాల్లోకి తరలివ చ్చాయి. తాజా నిధులతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు దేశంలో మొత్తం రూ. 45,000 కోట్లు నికరంగా పెట్టుబడి చేసినట్లయ్యింది. ఈక్విటీ స్కీముల్లోకి రూ. 5,850 కోట్లు: ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్కు చెందిన ఈక్విటీ పథకాల్లో రూ. 5,850 కోట్లు పెట్టుబడి చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఈక్విటీ స్కీములు సమీకరించిన నిధుల మొత్తం రూ. 56,000 కోట్లకు చేరినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో అధిక రాబడులు, సెంటిమెంట్ మెరుగుపడటంతో ఈక్విటీ స్కీములు అధిక పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతున్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. తాజా నిధుల ప్రవాహంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 12 లక్షల కోట్లకు పెరిగింది.