distributes
-
గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్
గుంటూరు: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా గుంటూరులో మహిళా సాధికారత కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే గత శుక్రవారం నాట్స్ ఆధ్వర్యంలో నెహ్రు యువక కేంద్రంలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ కుట్టుశిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణి చేశారు. పేద మహిళలు స్వశక్తితో నిలబడేలా.. సాధికారత సాధించేలా చేసేందుకు నాట్స్ తన వంతు సహకారం అందిస్తుందని నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కో ఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే వారి కుటుంబాలు ఆర్ధిక స్థిరత్వం సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్తో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్కు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
ఇంటింటికీ చికెన్ పంపిణీ.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
-
రెండు బస్సు కథలు
బస్సు లోపల ఒక ఆర్టిస్ట్ బస్ ఎక్కాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. దాని వెనుక కండక్టర్ బొమ్మ గీశాడు. కండక్టర్ రియాక్షన్? ఓహో.. వైరల్ బస్సు బయట ప్రతి ఉదయం ఆ పెద్దమనిషి ముంబై రోడ్డు డివైడర్ దగ్గర నిలబడతాడు. తెల్లవారు షిఫ్ట్కి డ్యూటీ ఎక్కిన డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతాడు. ఆ పెద్దాయన కారుణ్యం? వైరలే కదా. మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే చిన్న చిన్న వాత్సల్యాలే మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి. సాటిమనిషి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తే ఎంత బాగుంటుంది. బొమ్మలు గీసే ఆషిక్ను అడగాలి. కేరళలోని మళప్పురంలో నివసించే ఆషిక్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. చూసిన మనిషి ముఖాన్ని క్షణాల్లో అచ్చుగుద్దినట్టు పెన్సిల్తో గీయడంలో దిట్ట. తన ఆర్ట్ను కష్టజీవులను సంతోషపెట్టడానికి అతడు వాడుతుంటాడు. నిత్యజీవితంలో తారసపడే పండ్లమ్ముకునేవాళ్లను, పంక్చర్లు వేసేవాళ్లను, కూలీలను, సేల్స్ బోయ్స్ను దూరం నుంచి చూసి వారికి తెలియకుండా వారి బొమ్మ గీస్తాడు. ఆ తర్వాత వారికి తీసుకెళ్లి ఇస్తాడు. తమ పనుల్లో మునిగివున్న ఆ కష్టజీవులు హటాత్తుగా తమ బొమ్మను చూసుకుని తెలియని ఆనందంతో నవ్వుతారు. ఆ నవ్వును కెమెరాలో బంధించి ఇన్స్టాలో పెడుతుంటాడు ఆషిక్. ఇటీవల ఒక బస్ కండక్టర్ బొమ్మను అతనిచ్చిన టికెట్ వెనుకే గీసిస్తే అతడు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు. డబ్బున్నవాళ్ల బొమ్మలు అందరూ గీస్తారు... కాని తమ బొమ్మ కూడా గీసే వారుంటారా... అని ఆనందంతో మురిసి పోవడం ఆషిక్ వీడియోల్లో చూస్తాం. అందుకే అవి వైరల్ అవుతుంటాయి. ఇక రెండో వైరల్ ఏమిటంటే ముంబైలో ఒక చౌరస్తా దగ్గర నిలుచున్న ఒక పెద్దమనిషి ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర మధ్య సిటీ సర్వీస్లను నడిపే బస్డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతుంటాడు. తెల్లవారి షిఫ్ట్ ఎక్కేవారు ఏం తింటారో తినరో. ఈ బిస్కెట్స్ వారికి ఉపయోగపడతాయి. తాను చేసేది గొప్పలు చెప్పుకోని ఆ పెద్దమనిషి నిశ్శబ్దంగా బిస్కెట్లు పంచి ఇంటిముఖం పడతాడు. అతని వీడియోను ఒకామె ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఈ మాత్రం కరుణ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంత బాగుండు అని అందరూ సంతోషించారు. మనుషులు మంచివాళ్లు. కాకపోతే తాము మంచివాళ్లమని అరుదుగా వారికి గుర్తుకొస్తుంటుంది. ఈ మాత్రం మంచిని అందరం చేయగలం. చేస్తే ఎంత బాగుండు. -
సింగుపురం పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ
-
ఆత్మకూరు PACS బ్యాంక్ డిపాజిట్స్ గోల్ మాల్ బాధితులకు చెక్కుల అందజేత
-
యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఆదివారం (ఏప్రిల్ 16) అక్కడి కార్మికులకు తెలుగు అసోసియేషన్ వారు (tauae.org) నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, పండ్లు తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్స్ అందజేశారు. తెలుగు అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సహాయ కార్యక్రమం పట్ల కార్మికులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్లు రవి ఉట్నూరి, సాయి ప్రకాష్ సుంకు సంయుక్త ఆధ్వర్యంలో విజయ భాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర, శ్రీమతి ఉషాదేవి, శ్రీమతి లతానగేష్ కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన, ఉపాధ్యక్షుడు మసిఉద్దీన్, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు యండూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేడ్కర్, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల, ఫహీమ్, మోహన కృష్ణ, సీహెచ్ శ్రీనివాస్, చైతన్య తదితరులు కార్యక్రమానికి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి
-
వాహన మిత్ర చెక్కులను పంపిణి చేసిన అంజద్ బాషా
-
ప్రూట్ జ్యూస్ పంపిణీ చేసిన విజయ్ దేవరకొండ
-
వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన ఎంపీ
-
‘వదంతులు నమ్మొద్దు.. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ’
సాక్షి, జంగారెడ్డి గూడెం: గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా జరుగుతాయని... వదంతులు నమ్మొద్దని చింతలపూడి ఎమ్మెల్యే ఏలీజా అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఇంటికొక ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి నాలుగు లక్షల వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయడంతో పాటు లక్షా ఇరవై ఏడు వేల గ్రామ సెక్రటేరియట్ పోస్టులను భర్తీ చేస్తున్నారని తెలిపారు. జంగారెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ఏలీజా ఆకస్మిక తనిఖీ చేశారు. ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయో విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన అల్పహారం చేశారు. ఎమ్మెల్యే వెంట పొల్నాటి బాబ్జి, పిపియన్ చంద్రరావు, ఇతర నాయకులు ఉన్నారు. -
బయోమెట్రిక్తోనే విత్తన పంపిణీ
– మే రెండో వారంలో వేరుశనగ పంపిణీకి శ్రీకారం అనంతపురం అగ్రికల్చర్ : గత ఏడాది మాదిరిగా ఈ సారీ ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ విధానంతోనే విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సారి చౌక దుకాణాలను ఉపయోగించుకుని గ్రామ గ్రామాన పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అయితే.. ఇప్పటికిప్పుడు అలా చేయడం కష్టమని ప్రాథమికంగా తేల్చేశారు. అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఒకట్రెండు గ్రామాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్ట కింద చౌక డిపోల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 4.50 లక్షల క్వింటాళ్లు కేటాయింపు ఈ ఖరీఫ్లో రాయితీపై 4.50 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని వ్యవసాయ కమిషనరేట్ నుంచి అనుమతులొచ్చాయి. ఇందులో ఏపీ సీడ్స్, ఆయిల్ఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా 3.50 లక్షల క్వింటాళ్లు సేకరించడంతో పాటు ప్రస్తుత రబీలో పండిన పంట ఉత్పత్తులు కనీసం లక్ష క్వింటాళ్లను ఎన్జీవోల ద్వారా సేకరించి మనవిత్తన కేంద్రాల (ఎంవీకే) ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి ధరలు, రాయితీలు ఖరారయ్యే అవకాశముంది. అంతలోపే అన్ని మండలాల్లో విత్తనకాయలు సిద్ధం చేసి ఉంచాలని సేకరణ సంస్థలను ఆదేశించారు. ఇప్పటికే ఆ సంస్థలు విత్తనకాయల ప్రాసెసింగ్ మొదలుపెట్టాయి. మే రెండో వారం నుంచి పంపిణీకి ప్రణాళికలు రచించారు. వర్షాలొస్తే జూన్లోనే ముందస్తుగా పంట వేసే పరిస్థితి ఉంది. దీంతో జూన్ మొదటి వారానికల్లా పంపిణీ ముగించేయాలని ఆలోచిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే.. రాష్ట్రంలోనే తొలిసారిగా గత ఏడాది జిల్లాలో ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ చేపట్టారు. మొదట్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా ఎలాగోలా 3.10 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు. గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి ఈ సారి పకడ్బందీగా మండల కేంద్రాల్లో పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అదే చౌకడిపోల ద్వారా అయితే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామాల్లో గోదాములు, కనీస సదుపాయాలు, బందోబస్తు, తగినంత సిబ్బంది, సర్వర్ కనెక్టివిటీ లాంటి సమస్యలతో పాటు విత్తన కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లోనే ఇస్తామంటే రైతులందరూ ఒకేసారి వస్తారని, వారికి విత్తనకాయలు సమకూర్చడం కష్టమని అంటున్నారు. -
ఔరంగాబాద్ శ్రీమంతుడి వినూత్న కానుక
-
మార్కుల జాబితాల పంపిణీ
అనంతపురం ఎడ్యుకేషన్ : మార్చిలో జరిగిన పరీక్షల్లో 20,179 మంది జనరల్ విద్యార్థులు, 1550 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే జూన్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో 4364 మంది జనరల్ విద్యార్థులు, 216 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరందరీ మార్కుల జాబితాలు బోర్డు నుంచి ఆర్ఐఓ కార్యాలయానికి వచ్చాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న 204 కళాశాలలకు గాను సుమారు 70 శాతానికి పైగా బుధవారం తీసుకెళ్లారు. తక్కిన వారు వెంటనే వచ్చి మార్కుల జాబితాలు తీసుకెళ్లాలని ఆర్ఐఓ వెంకటేశులు సూచించారు. -
గుర్తింపు కార్డుల పంపిణీ
చిలమత్తూరు : నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్నిశ్చల్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం కన్వీనర్ ఎం.సదాశివారెడ్డి, సర్పంచ్ శ్రీకళ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేయడంతో పాటు, పార్టీ ఆశయాల సాధన కు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల వ్యాప్తంగా 965 మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు కార్డులు రాగా తొలివిడతగా 750 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రామచంద్రప్ప, నరసారెడ్డి, బాబురెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, గంగరాజు తదితరులు ఉన్నారు. -
పరిహాసం
– ఏడాది అవుతున్నా పూర్తికాని ఇన్పుట్సబ్సిడీ పంపిణీ – రూ.559.68 కోట్లలో రైతుల ఖాతాల్లోకి చేరింది రూ.484 కోట్లు మాత్రమే – కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ ప్రహసనంగా మారింది. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ‘అనంత’ రైతులను అధికారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. వారికి చెందాల్సిన పరిహారాన్ని సకాలంలో ఇవ్వడం లేదు. ఆధార్, ఆన్లైన్, మిస్మ్యాచింగ్, మరో జాబితా అంటూ తిప్పుకుంటున్నారు. పరిహారం కోసం ఏడాదిగా అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2014లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్సబ్సిడీ ప్రకటించింది. మొదట్లో రూ.5,79,640 మంది రైతులకు రూ.567.32 కోట్లు మంజూరు చేసింది. అయితే.. కొన్ని నకిలీ పట్టాదారు పాస్పుస్తకాలు ఉన్నట్లు తేలడంతో పరిశీలన తర్వాత 5,72,111 మందికి రూ.559.68 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2015 జూలై 22న ఈ మొత్తాన్ని జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు పరిహారాన్ని విడుదల చేస్తూ వచ్చింది. అయితే.. ఇప్పటికీ పూర్తిగా పంపిణీ చేయలేదు. ఇచ్చే రూ.5 వేలు.. రూ.10 వేలు.. లేదంటే రూ.15 వేల పరిహారం కోసం రైతులు ఏడాదిగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికే వ్యయప్రయాసలకోర్చి 20–30 సార్లు మండల గ్రీవెన్స్లు, ఏవోలు, జిల్లా గ్రీవెన్స్, జేడీఏ కార్యాలయం, బ్యాంకర్ల చుట్టూ తిరిగారు. జాబితాలు తప్పుల తడక ఇన్పుట్సబ్సిడీ జాబితాల తయారీ, పరిహారం పంపిణీ పెద్ద ప్రహసనంగా మారింది. జాబితాల తయారీలోనే రెవెన్యూ, వ్యవసాయశాఖ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ కారణంగా రైతులకు సకాలంలో పరిహారం అందలేదు. కొన్నిచోట్ల అర్హులైన రైతులను అసలు జాబితాలోనే చేర్చలేదు. తెలుగు తమ్ముళ్ల జోక్యం ఎక్కువ కావడంతో అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతోంది. అధికారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర రాయితీలు, పథకాలను ‘తమ్ముళ్లు’ కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్పుట్సబ్సిడీలోనూ మాయాజాలం ప్రదర్శించినట్లు జాబితాలు చూస్తే స్పష్టమవుతోంది. ఇంకా రూ.75 కోట్లు పంపిణీ చేయాలి: కేటాయించిన రూ.559.68 కోట్లలో ఇప్పటివరకు 484 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి జమ అయింది. ఇంకా రూ.75 కోట్లకు పైగా పంపిణీ చేయాల్సివున్నా.. ఆధార్ లింక్ పెట్టి పెద్దఎత్తున రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. చివరకు రూ.506 కోట్లు పంపిణీ చేసి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. మిగతా రూ.53 కోట్లు ప్రభుత్వ ఖాజానాకే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇన్పుట్సబ్సిడీ పంపిణీకి ఎప్పుడు ముగింపు పలుకుతారో, రైతులందరికీ ఎన్నడు న్యాయం జరుగుతుందో అంతుచిక్కని పరిస్థితి. -
పోలీస్ వాహనాల పంపిణిలో ఈటెల
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నక్సల్స్ బాధితులకు చెక్కులు పంపిణి చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన నక్సల్స్ బాధితుల సభలో ఆయన మట్లాడారు. అనంతరం పోలీసులకు కేటాయించిన ద్విచక్రవాహనాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన బైక్ నడిపి అందరిని ఆకట్టుకున్నారు. -
విశాఖకు 30000ఆహార పొట్లాల పంపిణి