domestic air travelers
-
గగనతలంలోకి 16.13 కోట్ల మంది
భారతదేశంలో దేశీయ విమాన ట్రాఫిక్(domestic air traffic) 2024లో గణనీయంగా పెరిగింది. ఏడాదిలో 16.13 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఇది ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇలా విమాన ప్రయాణికులు అధికమవడం వేగంగా విస్తరిస్తున్న ఏవియేషన్ మార్కెట్ను ప్రతిబింబిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DCGC) వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.2024 డిసెంబర్లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.49 కోట్లకు చేరుకుంది. ఇది 2023 డిసెంబర్తో పోలిస్తే 8.19% ఎక్కువ. ఇండిగో 64.4 శాతం వాటాతో మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, ఎయిరిండియా 26.4 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. అకాసా ఎయిర్, స్పైస్ జెట్ వరుసగా 4.6 శాతం, 3.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇండిగో అత్యధికంగా 73.4 శాతం ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్(OTP)తో అగ్రస్థానంలో నిలవగా, ఎయిరిండియా 67.6 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, విమానాల రద్దు, జాప్యం కారణంగా డిసెంబరులో మొత్తం ఓటీపీ దెబ్బతింది.మొత్తం విమానాల రద్దు రేటు 1.07%గా ఉంది. ఇది 67,622 మంది ప్రయాణీకులపై ప్రభావం చూపింది. ఈ రద్దులకు పరిహారం, సౌకర్యాల కోసం విమానయాన సంస్థలు రూ.1.26 కోట్లు ఖర్చు చేశాయి. విమానాల ఆలస్యం 2,79,985 మంది ప్రయాణీకులపై ప్రభావం చూపింది. విమానయాన సంస్థలు వీరి సౌకర్యాల ప్రయత్నాల కోసం రూ.3.78 కోట్లు ఖర్చు చేశాయి. 2,147 మంది ప్రయాణీకులకు బోర్డింగ్ నిరాకరించారు. అందుకోసం విమానయాన సంస్థలు రూ.1.76 కోట్లు పరిహారం చెల్లించాయి.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్, హడ్కో ఫలితాలుకొవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి విమానయాన రంగం క్రమంగా కోలుకుంది. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి విమానయాన సంస్థలు విమాన సంఖ్యలు, నెట్వర్క్లను విస్తరిస్తున్నాయి. విమాన ప్రయాణ డిమాండ్ను పెంచడంలో భారత ఆర్థిక వృద్ధి కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత విమానయాన రంగం మరింత వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఈ రంగం ఒకటని అభిప్రాయపడుతున్నారు. -
ఎక్కేద్దాం... ఎగిరిపోదాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే 2.6 శాతం ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం విశేషం.నవరాత్రి, దసరా, దుర్గా పూజ ముగిసిన తర్వాత తొలి పనిదినం కావడంతో ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా నమోదైంది. అక్టోబర్ 14న మొత్తం 6,435 విమాన సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందించాయి. భారత్లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దూసుకుపోతుండడంతో విమానయాన సంస్థల మధ్య పోటీ వేడి మీద ఉంది. ఈ ఏడాది ఆగస్ట్తో పోలిస్తే సెప్టెంబర్లో ఇండిగో మార్కెట్ వాటా 60 బేసిస్ పాయింట్లు, ఎయిర్ ఇండియా 40 బేసిస్ పాయింట్లు పెరిగింది. స్పైస్జెట్ 30 బేసిస్ పాయింట్లు, ఆకాశ ఎయిర్ 10 బేసిస్ పాయింట్లు క్షీణించాయి. సెప్టెంబర్లో ఇలా.. ఈ ఏడాది సెప్టెంబర్లో 1.30 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం సాగించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం 2023 సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ల సంఖ్య 6.4 శాతం దూసుకెళ్లింది. వాస్తవానికి నాలుగు నెలలుగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో క్షీణత నమోదవుతోంది. 2024 మే నెలలో 1.38 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ప్యాసింజర్ల సంఖ్య జూన్ నుంచి వరుసగా 1.32 కోట్లు, 1.29 కోట్లు, 1.31 కోట్లుగా ఉంది. రద్దు అయిన విమాన సర్వీసుల సంఖ్య 0.85 శాతం ఉంది. మే నెలలో ఇది 1.7 శాతంగా నమోదైంది.ఫ్లైబిగ్ ఎయిర్ అత్యధికంగా 17.97 శాతం క్యాన్సలేషన్ రేటుతో మొదట నిలుస్తోంది. 4.74 శాతం వాటాతో అలయన్స్ ఎయిర్, 4.12 శాతం వాటాతో స్పైస్జెట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. క్యాన్సలేషన్ రేటు అతి తక్కువగా ఎయిర్ ఇండియా 0.13 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 0.27, ఇండిగో 0.62, విస్తారా 0.88 శాతం నమోదైంది. విమానాల రద్దు ప్రభావం గత నెలలో 48,222 మంది ప్రయాణికులపై పడింది. పరిహారం, సౌకర్యాలకు విమానయాన సంస్థలు రూ.88.14 లక్షలు ఖర్చు చేశాయి. సర్వీసులు ఆలస్యం కావడంతో 2,16,484 మందికి అసౌకర్యం కలిగింది. నష్టపరిహారంగా విమానయాన సంస్థలు రూ.2.41 కోట్లు చెల్లించాయి. గత నెలలో మొత్తం 765 ఫిర్యాదులు అందాయి. 10,000 మంది ప్రయాణికులకు ఫిర్యాదుల శాతం 0.59 ఉంది. మార్కెట్ లీడర్గా ఇండిగో.. సమయానికి విమాన సర్వీసులు అందించడంలో దేశంలో తొలి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిలిచింది. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండిగో మార్కెట్ వాటా ఏకంగా 63 శాతానికి ఎగసింది. సెప్టెంబర్ నెలలో ఈ సంస్థ 82.12 లక్షల మందికి సేవలు అందించింది. రెండవ స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా 15 శాతం వాటాతో 19.69 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చింది.13.08 లక్షల మంది ప్రయాణికులతో విస్తారా 10 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 5.35 లక్షల మంది ప్రయాణికులతో 4.1 శాతం వాటా సొంతం చేసుకుంది. 2022 ఫిబ్రవరిలో 10.7 శాతం మార్కెట్ వాటా కైవసం చేసుకున్న స్పైస్జెట్ గత నెలలో 2 శాతం వాటాకు పరిమితమైంది. సెప్టెంబర్లో ఈ సంస్థ 2,61,000 మందికి సేవలు అందించింది. ఆక్యుపెన్సీ రేషియో స్పైస్జెట్ 80.4 శాతం, విస్తారా 90.9, ఇండిగో 82.6, ఎయిర్ ఇండియా 80.1, ఏఐఎక్స్ కనెక్ట్ 81.6 శాతం నమోదైంది. -
విమాన ప్రయాణాల జోరు..
ముంబై: గత నెల దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా నమోదైంది. గతేడాది మే నెలలో నమోదైన 1.14 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం ఇండిగో మార్కెట్ వాటా ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో 57.5 శాతం నుంచి 61.4 శాతానికి పెరిగింది. మొత్తం 81 లక్షల మందిని ఇండిగో గమ్యస్థానాలకు చేర్చింది. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా, విస్తారాల మార్కెట్ వాటా వరుసగా 9.4 శాతం, 7.9 శాతం, 9 శాతంగా నిల్చింది. ఎయిరిండియా 12.44 లక్షల మందిని, విస్తారా 11.95 లక్షల మందిని, ఎయిర్ఏషియా ఇండియా 10.41 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఈ మూడింటికి కలిపి 26.3 శాతం మార్కెట్ వాటా లభించింది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా ఏప్రిల్తో పోలిస్తే 4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి విమాన సర్వీసులు నిలిపివేసింది. సమయపాలన విషయంలో ఆకాశ ఎయిర్ అగ్ర స్థానంలో (92.6 శాతం) నిల్చింది. -
దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో భారత్ టాప్
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల పెరుగుదల్లో భారత్.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రయాణికుల సంఖ్య నవంబర్లో 22.3%మేర పెరిగింది. ప్రయాణికుల సంఖ్య పెరగుతూ రావడం ఇది వరుసగా 20వ నెల. అలాగే ప్రయాణికుల సంఖ్యలో గత వరుస 13 నెలలుగా 20%కి పైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) గణాంకాల ప్రకారం.. భారత్తోపాటు కేవలం రష్యా, చైనాల్లో మాత్రమే నవంబర్ నెల ప్రయాణికుల సంఖ్య పెరుగుదలలో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. విమాన ప్రయాణికుల వృద్ధి రష్యాలో 15.5%గా, చైనాలో 14.9%గా ఉంది. ముడిచమురు ధరలు తక్కువగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ రికవరీ అంశాలు ఈ ఏడాదిలో డిమాండ్ పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.