dps school
-
స్కూల్ బస్సు, ట్రక్ ఢీ విద్యార్ధులు మృతి
-
డీపీఎస్ స్కూల్ విద్యార్థులు దుర్మరణం
ఇండోర్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ కనాడియలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు, ట్రక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా డ్రైవర్ దుర్మరణం చెందారు. ఇండోర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు విద్యార్థులతో వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వారిలో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది - శ్రీయ
‘‘నేను ఢిల్లీలోని డీపీయస్ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ ఓ అంధుల పాఠ శాల ఉండేది. ప్రతివారం నేను ఆ స్కూలుకి వెళ్లి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేదాన్ని. నాకు వీలైనంత వరకూ వారికి సమయం కేటాయిస్తుంటాను. కల్మషంలేని మనస్తత్వంతో పాటు, అద్భుతమైన ప్రతిభ వారిలో ఉంటుంది. ‘మిణుగురులు’ చిత్రం అద్భుతంగా ఉంది. అంధుల సమస్యను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇలాంటి చిత్రాల్ని ప్రోత్సహించాలి’’ అని శ్రీయ చెప్పారు. అంధుల సమస్యలపై అయోధ్యకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మిణుగురులు’ చిత్రాన్ని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న హైదరాబాద్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. శ్రీయ పలువురు అంధ విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు.