Dr harshavardan
-
వాళ్లిద్దరూ తోడుదొంగలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి అవినీతిని పారదోలుతామంటూ చెబుతున్న ఆప్ సర్కార్ అవినీతిలో ‘పెద్ద చేపలను’ వదులుతోందని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్గోయల్ ఆరోపించారు. ఆమ్ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం తో ఢిల్లీ వాసులకు ఒరిగిందేమీ లేదని విమర్శించా రు. ఆమ్ఆద్మీపార్టీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాజ్ఘాట్లో శుక్రవారం నిర్వహించిన ధర్నాలో బీజేపీ శాసనసభాపక్షనాయకుడు డా.హర్షవర్ధన్తోపాటు పార్టీ జాతీయ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వి, విజయ్కుమార్ మల్హోత్రా,విజయేంద్రగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ..ఆమ్ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి నఖలు వంటిది. రెండు పార్టీలు అవకాశవాదంతోనే పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అవి నీతిని అంతమొందిస్తామంటూ రోజు కో ప్రకటన చేస్తున్న ఆప్ మంత్రులు ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో పనిని మరిచి ఆప్ సర్కార్మీడియా జిమ్మిక్కులు ప్రదర్శిస్తోందని బీజేపీ శాసనసభ పక్షనేత డా.హర్షవర్ధన్ ఆరోపించారు. కాశ్మీర్పై ఆప్ నాయకులు చేసిన వ్యాఖ్యలతోనే ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ విధానం ఏంటో అర్థమవుతోందని గోయల్ దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఆప్ సర్కార్ దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ధర్నాలో బీజేపీ నాయకులంతా ‘మోడీ ఫర్ పీఎం’ అని రాసి ఉన్న కాషాయరంగు టోపీలను ధరించి కనిపించారు. దేశ ప్రజలం తా మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ఆ సందేశాన్ని తెలియజెప్పేందుకే తాము ఈ టోపీలను ధరించి వచ్చినట్టు ఓ నేత పేర్కొన్నారు. ఆప్ది ప్రచారార్భాటం: అరుణజైట్లీ రాష్ట్రంలో కేజ్రీవాల్ సర్కారు మీడియాలో ఎలా ప్రచారం పొందాలన్న విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతోందని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విమర్శించారు. చిన్నచిన్న విషయాలపై దృష్టి పెట్టినట్లు నటిస్తున్న ఆ ప్రభుత్వం కాంగ్రెస్ అవినీతిపై దృష్టిపెట్టేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ హయాంలో జరిగిన సీడబ్ల్యూజీ స్కాం, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపులేకాక షీలా దీక్షిత్ సర్కారు అవినీతి ఆరోపణలపై కనీసం మాట్లాడేందుకు కూడా ఆప్ సర్కార్ ధైర్యం చేయలేకపోతోంద’ని అని ఎద్దేవా చేశారు. అధికార పార్టీగా మారిన ఆప్ పనితీరు అంత స్ఫూర్తివంతంగా లేదన్నారు. ఢిల్లీపై ఎలాగైనా తన పట్టు కొనసాగించేందుకే ఆప్తో కాంగ్రెస్ జతకలిసింద ని ఆయన ఎద్దేవా చేశారు. -
వద్దన్నా కాపలా
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వద్దంటున్నప్పటికీ నగర పోలీసు శాఖ భద్రత విషయంలో ఎంతమాత్రం రాజీపడడం లేదు. వీఐపీ సంస్కృతిని అంతం చేయడమే తమ ఉద్దేశమని, అందువల్ల భద్రత అవసరం లేదని, భగవంతుడే తనకు అండ అంటూ సీఎం పదేపదే పేర్కొంటున్నప్పటికీ నగర పోలీసు శాఖ భద్రత విషయంలో అప్రమత్తంగానే ఉంటోంది. భద్రత కల్పిస్తామని నగర పోలీసులు ఇప్పటికి రెండు పర్యాయాలు లేఖలు రాసినప్పటికీ సీఎం అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో ఆయనకు గుట్టుగానే భద్రత కల్పిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, యూపీ పోలీసులు కలసి ముఖ్యమంత్రి భద్రతపై సంయుక్త సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ సమీక్ష నివేదికను నగర పోలీసు కమిషనర్ బస్సీ, లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోం మంత్రిత్వ శాఖలకు సమర్పించే అవకాశముంది. ఆ తరువాత ముఖ్యమంత్రికి ఎటువంటి భద్రత కల్పించాలనే అంశంపై నిర్ణయం తీసుకుం టారని అనధికార వర్గాలు చె బుతున్నాయి. విశ్వాస తీర్మానం సమయంలో బీజేపీ నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ ఆరోపించినట్లుగా ముఖ్యమంత్రికి తాము మూడంచెల భద్రతను కల్పించడం లేదని వారు తేల్చిచెప్పారు, సీఎం అరవింద్ నిరాకరించినప్పటికీ నగర పోలీసులు ఆయన భద్రతపై దృష్టి సారిస్తున్నారని, అయితే మూడంచెల భద్రత మాత్రం కల్పించడం లేదని వారు చెప్పారు. కౌశాం బి ప్రాంతంలోని నివాసంలోగానీ లేదా ఢిల్లీ సచివాలయంలోగానీ, విధానసభలోగానీ భద్రతాపరంగా సీఎం అరవింద్కు ఎటువంటి ముప్పూ లేదని వార ంటున్నారు. జనతా దర్బార్ సమయంలో భారీ సంఖ్యలో తరలివస్తున్న సామాన్యులను నియంత్రించడానికి శతవిధాలా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ జనసభల్లో వారు కేజ్రీవాల్కు కూడా భద్రత సమకూరుస్తున్నారు. అయితే కౌశాంబీ లోని నివాసం నుంచి నగరానికి వచ్చే మార్గంలో ఆయనకు భద్రతకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు వెళతారనే విషయం ముందుగానే తెలుసుకుని భద్రత సమకూర్చాలని పోలీసులు యోచిస్తున్నారు.