dumb girl
-
దారుణం: మూగ యువతిపై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో..
సాక్షి, ఖిలా వరంగల్ : మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శంభునిపేటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మూగ యువతి తన తల్లి మరణంతో అమ్మమ్మ ఇంట్లో తండ్రితో పాటు ఆశ్రయం పొందుతోంది. ఆదివారం మధ్యాహ్నం తండ్రి పనికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడిన ముగ్గురు నిందితులు మూగ యువతిపై లైంగిక దాడికి పాల్పడుతూ సెల్ఫోన్లో వీడియో చిత్రికరించినట్లు సమాచారం. ఇంట్లో ఉన్న యువతి ఆమ్మమ్మకు కళ్లు కనిపించవు. చొరబడిన ముగ్గురిలో ఒకరు వృద్ధురాలి వద్ద కాపలా ఉండి మిగతా వారు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూసినట్లు తెలిసింది. నిందితులు ముగ్గురూ అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పథకం ప్రకారం ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. నిందితులు తీసిన వీడియో పోలీసులకు చిక్కినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి రాగానే విలపిస్తున్న కూతురుని చూసిన తండ్రి ఏమి జరిగిందని అడగ్గా.. విషయం చెప్పడంతో మిల్స్కాలనీ పోలీస్ స్ట్రేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించినట్లు సమాచారం. ఈఘటన విషయమై ఇన్స్పెక్టర్ రవికిరణ్ను వివరణ కోరగా మూగ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు, ఒక యువకుడున్నాడని తెలిపారు. చదవండి: విషాదం: పెళ్లైన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య -
మూగరోదనపై మౌనమేల..?
గిరిజన మూగ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు గాజువాకలో ధర్నా నిర్వహించి, బాధితురాలికి బాసటగా నిలిచారు. మరోవైపు కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్సీపీ మహిళా నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జరిగిన దురాగతాన్ని గోప్యంగా ఉంచేందుకు యత్నించిన యాజమాన్యాన్ని మాత్రం కావాలనే పోలీసులు తప్పించారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అగనంపూడి(గాజువాక): బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాడిని శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దళిత హక్కుల పోరాట సమితి, ఏపీ మహిళా çసమాఖ్య ప్రతినిధులు కూర్మన్న పాలెం జంక్షన్లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కేసు నీరు గార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ అధికారితోపాటు బస్సు డ్రైవర్ను అరెస్టు చేసిన పోలీసులు అసలు మైనర్ను విధుల్లో ఎలా చేర్చుకున్నారనే దానిపై మాత్రం దృష్టి సారించనేలేదు. సంఘటన జరిగిన సందర్భంలో కేసు రాజీ చేసేందుకు యాజమాన్య ప్రతినిధులే రాయబేరాలు కుదర్చినా వారిని ఎందుకు వదిలేసినట్టు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇద్దరినే అదుపులోకి తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్బీఎల్ ప్రతినిధులు కంపెనీ పరువు పోతుందని భావించి వారే సెక్యూరిటీ అధికారితో వెలగట్టి డబ్బులు సమకూర్చారని భోగట్టా. కాని వారి జోలికి వెళ్లకుండా కేవలం మైనర్తో పనులు చేయించుకోవడం (బాల కార్మికులతో పనులు చేయించుకోవడం)పై చిన్నపాటి కేసుతో సరిపెట్టారని ప్రచారం జరుగుతోంది. మైనర్ను పనిలోకి పెట్టుకోవడం ఒక తప్పయితే... మైనర్కు పాస్ మంజూరు కోసం ఆమె ఏ పత్రాలు సమర్పించింది అనే విషయాలు కూడా పరిగణలోకి తీసుకోలేదు. రాయబేరాలు మొత్తం హెచ్బీఎల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో జరిగా యని తోటి కార్మికులే చెబుతున్నారు. అలాంటప్పుడు కంపెనీ ప్రతినిధుల జోలికి ఎందుకు వెళ్లలేదు? కేసును పోలీసులు పక్కదారి పట్టించి నీ టరు గార్చడానికే ఇలా చేస్తున్నారనే అరోపణలు వెల్లువెతుతున్నాయి. సెజ్లోని కంపెనీల్లో మైనర్లు! దువ్వాడ సెజ్లోని కంపెనీల్లో కనీస వేతనాలు అమలు చేయడం లేదని, కాంట్రాక్టు కార్మికులకు అయితే రూ.3వేల కూడా చెల్లించే పరిస్థితి లేదని చెబతున్నారు. మైనర్లకు తక్కువ డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని భావించి వారిని ఈ పనులకు వినియోగిస్తున్నారని తెలిసింది. ఇటువంటి వాటిపై కార్మిక శాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అఘాయిత్యం కేసులో ముగ్గురి అరెస్ట్ అగనంపూడి (గాజువాక): గిరిజన బధిర బాలికపై జరిగిన అత్యాచారం కేసును నీరు గార్చేం దుకు ప్రయత్నించారనే ఆరోపణలు రావడంతో దువ్వాడ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దువ్వాడ పోలీస్టేషన్లో విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ రామోహనరావు వెల్లడించిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన సీహచ్.విశ్వనాథం దువ్వాడ సెజ్లోని హెచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత నెల 30న ఒంటరిగా తోట పనులు చేసుకుంటున్న గిరిజన,బధిర బాలికను సమీపంలోని బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారం చేశాడు. ఆమెను వివస్త్రను చేసి కోరిక తీర్చుకున్నాడు. అనంతరం బాధితురాలు ఏడుస్తూ పరుగు తీయడంతో ఆమెతోపాటు పనిచేస్తున్న మహిళలు విషయం తెలుసుకుని సెక్యూరిటీ సిబ్బందికి వివరించారు. అయితే విషయం బయటకు పొక్కితే కంపెనీతోపాటు సెజ్కు చెడ్డ పేరు వస్తుందని సెజ్ ఏఎస్వో ప్రకాశరావు, బస్సు యజమాని ఎం.అప్పలరాజు బాధితురాలికి లక్ష రూపాయలు చెల్లించారు. సంఘటన రోజు బాధితురాలు ధరించిన దుస్తులను తీసుకొని కాల్చేశారు. అయితే విషయం బయటకు పొక్కడంతో దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన విశ్వనాథం, కేసు మాఫీ చేయడానికి వెలగట్టిన సెజ్ ఏఎస్వో ప్రకాశ్రావు, బస్సు యజమాని ఎం.అప్పలరాజులను అరెస్టు చేసి న్యాయం స్థానంలో బుధవారం హాజరుపర్చారు. విశ్వనాథంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మానభంగం, నిర్భయ కేసులు, కంపెనీ యాజమాన్యంపై బాల కార్మికులతో పనిచేయించుకుంటున్న కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు. అలాగే సంఘటనకు సంబంధించి బాధితురాలి శీలానికి వెలగట్టిన లక్ష రూపాయలతోపాటు బస్సును సీజ్ చేశామని తెలిపారు. కేసును ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ ప్రవీణ్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో గాజువాక సీఐ ఇమ్యానుయేల్ రాజు పాల్గొన్నారు. రూ.20లక్షల పరిహారమివ్వాలి- వైఎస్సార్ సీపీ మహిళా నాయకుల డిమాండ్ పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. కేజీ హెచ్లో చికిత్స పొందుతున్న మైనరు బాలికను బుధవారం పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, నిందితుడికి సహకరించిన సెక్యూరిటీ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్బీఎల్ కంపెనీ యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘించి బాలికను ఎలా పనిలో పెట్టుకుందని ప్రశ్నించారు. మైనర్లచేత పని చేయించకూడదని తెలిసీ పని చేయిస్తున్న యాజమాన్యంపై కార్మిక శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికకు ప్రభుత్వం రూ.20లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని, అమ్మాయితో పాటు ఆమె కుటుంబానికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖ రైల్వే న్యూ కాలనీలో పట్టపగలు మతిస్థిమితం లేని మహిళపై తాగిన మైకంలో ఒక యువకుడు అత్యాచారం చేసిన సంఘటన మరువక ముందే మరొక సంఘటన జరగడం విచారకరమన్నారు. పటిష్టమైన పోలీసు వ్యవస్థ లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర అనుబంధ విభాగం నాయకులు పీలా వెంకట ధనలక్ష్మి, యువశ్రీ, శ్రీదేవి, మధులత, వెంటలక్ష్మి తదితరులు మైనర్ బాలికను పరామర్శించారు. -
దూరమై... దగ్గరయ్యారు..
బెల్లంపల్లి: మూగ ప్రేమికులు మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. ఒకేచోట కలిసి చదువుకుని, మధ్యలో వచ్చిన ఎడబాటులో స్నేహాన్ని కొనసాగించి, చివరకు తల్లిదండ్రులను ఒప్పించి ఆ ప్రేమికులు పెళ్లి పీటలెక్కారు. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య ఆనందోత్సహాలతో పెళ్లి చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన బైరి సునీత–సత్యనారాయణ దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె సౌజన్య, కుమారులు ప్రణీత్, ప్రశాంత్. కొడుకులు ఇద్దరు పుట్టుకతోనే నోటిమాటలు రాకుండా, చెవుడుతో జన్మించారు. వరంగల్ జిల్లా పెద్ద పెండ్యాలలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ డెఫ్ అండ్ డెమ్ పాఠశాలలో ప్రణీత్ను చేర్పించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రణీత్ అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కోల కృష్ణకుమారి–వెంకటేశ్వర్లు దంపతులకు కుమార్తె మ«ధులత, కుమారుడు సుధీర్ ఉన్నారు. మధులత కూడా నోటిమాటలు రాకుండా, వినికిడి సమస్యతో జన్మించింది. ఆమెను కూడా తల్లిద్రండులు పెద్ద పెండ్యాలలోని లిటిల్ ఫ్లవర్స్ డెఫ్ అండ్ డెమ్ పాఠశాలలో చేర్పించారు. ప్రణీత్, మధులత ఒకే పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఐదేళ్లు కలిసి చదువుకోవడంతో వీరిమధ్య స్నేహం ఏర్పడింది. దూరమై... దగ్గరయ్యారు.. పెద్ద పెండ్యాలలో పదో తరగతి పూర్తికాగానే మధులత విజయవాడలో ఇంటర్మీడియెట్ చదివి, డిగ్రీ మధ్యంతరంగా మానేసింది. ప్రణీత్ పై చదువులకు వెళ్లలేకపోయాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. సైగలు తప్ప మాట్లాడలేని మధులత, ప్రణీత్ సెల్ చాటింగ్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. క్రమంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకే పాఠశాలలో చదివిన బ«ధిరులు తరచుగా ఏదో ఓ చోట అందరూ కలుసుకునేవారు. ఒకరితో ఒకరు అనుబంధాలను పంచుకుని ఆత్మీయతలను కనబర్చేవారు. ఆరు నెలల క్రితం మధులత ప్రేమ విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పి, ప్రణీత్ తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడాలని కోరింది. ఆమె కోరిక మేరకు మధులత తల్లిదండ్రులు వెంటనే ప్రణీత్ తల్లిదండ్రులను సంప్రదించారు. దీంతో వారు కూడా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. కట్నకానుకలు లేకుండా పెళ్లి.. మ«ధులత, ప్రణీత్ కులాలు వేర్వేరు. అయినప్పటికీ ఇరు కుటుంబాల పెద్దలు కట్నకానుకలు లేకుండా పెళ్లి చేయడానికి అంగీకరించారు. ప్రణీత్ తండ్రి సింగరేణిలో కార్మికుడు. మధులత తండ్రి కూరగాయల వ్యాపారి. మధులత, ప్రణీత్ల పెళ్లికి బధిరులైన వారి స్నేహితులు 50 మందికి పైగా హాజరు కాగా.. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశీర్వాదంతో ఇద్దరూ ఏకమయ్యారు. -
ఈ చిన్నారిని ఆదుకొండి
రామాయంపేట (మెదక్ ): మాటలు రాని ఈ చిన్నారిని ఆదుకోవాలని మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన ఆమె తాత నందు వెంకట్రాంరెడ్డి అధికారులకు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెలితే... గ్రామానికి చెందిన రాజు, భాగ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలే. వీరిలో పెద్ద పాప విజ్ఞేత (9) పుట్టినప్పటి నుంచి మూగ. దీనితో ఆమె తల్లిదండ్రులు తమ కూతురును ఎన్నో ఆసుపత్రుల్లో చూపించినా ఫలితంలేదు. రాజు కూలీ పనులు చే స్తూ తన కుటుంబంతోపాటు వృద్దులైన తన తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. కాగా విజ్ఞేతకు పింఛన్ సైతం రావడంలేదని వారు ఆవేధన వ్యక్తం చేశారు. కాగా జిల్లా కలెక్టర్ శనివారం గ్రామానికి రాగా ఆమె తాత, నానమ్మ తమ మనుమరాలిని కలెక్టర్ వద్దకు తీసుకొచ్చారు. తమ మనుమరాలికి వికలాంగుల కోటాలో పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని వారు కలెక్టర్ను వేడుకున్నారు. విజ్ఞేతను తీసుకొని జిల్లా కేంద్రమైన మెదక్లో జరిగే సదరం క్యాంపునకు హాజరై డాక్టర్ సర్టిఫికెట్ పొందితే పింఛన్ వస్తుందని కలెక్టర్ వారికి సూచించారు. -
మూగ బాలికపై అమానుషం
-
మూగ బాలికపై అమానుషం
వెంగళరావునగర్: అత్యాచారానికి గురై రెస్క్యూ హోంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికను అదే హోంలో ఉంటున్న యువతి తీవ్రంగా కొట్టి గాయపరిచిన సంఘటన శనివారం స్థానిక యూసుఫ్గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండేళ్ళ కిందట మెదక్ జిల్లాకు చెందిన ఓ మూగబాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనలో ఆమెను కోర్టు ఆదేశాల మేరకు యూసుఫ్గూడ స్టేట్హోం ప్రాంగణంలో ఉన్న రెస్క్యూ హోం తరలించారు. కాగా అదే రెస్క్యూ హోంలో ఉంటున్న సన అనే యువతి కొద్దిరోజులుగా మూగ బాలికను తీవ్రంగా కొడుతోంది. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. తోటి యువతులు బాలికను కాపాడుతూ వస్తున్నారు. కాగా బాలిక తాను హోంలో ఉండలేనని, పంపించాలని మూగ సైగలతో ఇన్చార్జిని అడుగుతోందని, అందుకే సనతో ఆమెను కొట్టించిందని ప్రచారం జరిగింది. ఇదే విషయంపై విలేకరులు రెస్క్యూ హోం ఇన్చార్జి నిర్మలను వివరణ కోరగా తాను ఎవరినీ కొట్టించలేదని పేర్కొన్నారు. మూగ బాలిక ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేస్తుండగా స్థానికంగా ఉన్న యువతులు రక్షించారని తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆశ్రిత శనివారం రాత్రి హుటాహుటిన రెస్కూ్యహోంకు వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ విషయంపై విచారణ చేపడుతున్నామని అన్నారు. -
మూగ బాలికపై అత్యాచారయత్నం
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): మూగ బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రంలోని మొహిన్మహల్లా సమీపంలోని శివాజీ కాలనీలో ఉండే మూగబాలిక(10)పై స్థానికంగా ఉండే ఓ బాలుడు (14) మంగళవారం అత్యాచార యత్నం చేశాడు. భయాందోళనకు గురైన బాలిక ఏడ్వడంతో ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆర్జీఐఏ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మూగ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ చింతల్మెట్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మూగ బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బస్తీకి చెందిన జాఫర్బీ, మహ్మద్ల కూతురు(15) పుట్టు మూగ. రోడ్లపై బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ అమ్మాయిని జూన్ 29 రాత్రి ఆటో డ్రైవర్ జాఫర్(28) తన ఆటోలో ఎక్కించుకొని.. రాజేంద్రనగర్ శివారులోని మానస హిల్స్ వెనక భాగంలో ఉన్న నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆ అమ్మాయి పై అత్యాచారానికి పాల్పడి వదిలేసి వచ్చాడు. రాత్రి ఇంటికి చేరిన అమ్మాయి తల్లి దండ్రులకు చెప్పుకోలేక నరక యాతన అనుభవించింది. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మూగ బాలికపై అత్యాచారం
వరంగల్: వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం గంగారంలో దారుణం జరింగింది. ఓ కామాంధుడైన యవకుడు మూగ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అనంతపురంలో మూగబాలిక కిడ్నాప్ కలకలం