eedara haribabu
-
బీజేపీలోకి ప్రకాశం జెడ్పీ చైర్మన్
సాక్షి, ఢిల్లీ : ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మంగళవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు భరత్ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హరిబాబు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. -
మళ్లీ శిక్ష విధించుకున్న హరిబాబు
అద్దంకి: ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మరోసారి తనను తాను శిక్షించుకున్నారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం జడ్పీ హై స్కూల్లో హరిబాబు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో 15 మంది టీచర్లకు గాను 5 మంది మాత్రమే హాజరయ్యారు. సమయానికి టీచర్లు రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ల గైర్హాజరుకు నైతిక బాధ్యత వహిస్తూ పది నిమిషాలు ఎండలో నిలబడి తనకు తాను శిక్షను విధించుకున్నారు. కాగా గతంలో కూడా హరిబాబు ప్రభుత్వ వాహనాన్ని తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారని జడ్పీ సభ్యులు ఆరోపించడంతో స్పందించిన ఆయన ఎండలో నిలబడి శిక్ష విధించుకున్నారు. ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా తాను తప్పు చేశానని చెబుతూ, అందుకే తనకు తాను శిక్ష వేసుకుంటున్నట్టు అప్పట్లో తెలిపారు. -
నా పొరపాటుకు నేనే శిక్షించుకుంటున్నా
20 నిమిషాలు ఎండలో నిలబడిన ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ఒంగోలు: ప్రజాప్రతినిధిగా అధికార కార్యక్రమాలకు వినియోగించుకోవాల్సిన జెడ్పీ కారును రెండుసార్లు సొంతానికి వినియోగించుకున్నందుకు ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు స్వయంగా శిక్ష విధించుకున్నారు. 20 నిమిషాలు ఎండలో నిలబడ్డారు. ఒంగోలులో సోమవారం జరిగిన జెడ్పీ సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ సొంతానికి వాహనాలు వాడుకుంటున్న విషయంపై ప్రస్తావన రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో పొదిలి జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు ప్రస్తావించిన అంశంపై హరిబాబు స్పందించారు.తానెలా జడ్పీ వాహనాన్ని వినియోగించిందీ తెలిపారు. అధికారుల సూచన ప్రకారం లాగ్బుక్లో ప్రైవేటు వినియోగాన్ని రాసి ఆ ఖర్చులు చెల్లించవచ్చని తెలిసిందనీ అరుుతే తాను అలా రాయలేదని, చలానా కట్టకుండా సొంతానికి వాడుకున్నానని, ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు బాధ్యుడిగా తనను తాను శిక్ష వేసుకుంటూ 20 నిమిషాలపాటు ఎండలో నిలబడతానని ప్రకటించారు. ఆ మేరకు సమావేశం బయటకు వచ్చి ఎండలో నిలబడ్డారు. -
జెడ్పీ చైర్మన్ చాంబర్కు మరో తాళం!
ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజకీయం మరో మలుపు తిరిగింది. జెడ్పీ చైర్మన్ చాంబర్కు టీడీపీ బహిష్కృత నేత, ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మరో తాళం వేశారు. చాంబర్లో తనకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని హరిబాబు చెప్పారు. వాటి భద్రత కోసమే తాను మరో తాళం వేసినట్లు తెలిపారు. అంతకు ముందు ఉదయం హరిబాబు వచ్చేసరికి చాంబర్కు తాళాలు వేసి ఉన్నాయి. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించారు. తాను జెడ్పీ చైర్మన్గా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా సీఈఓ సహకరించటం లేదని ఆవేదన చెందారు. ** -
ఈదర అవుట్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పదవి పోయింది. పార్టీ విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేస్తూ సోమవారం సాయంత్రం ప్రిసైడింగ్ అధికారి హోదాలో కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిషత్కు చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు కో-ఆప్షన్ మెంబర్ల ఎంపికకు గత నెల 13న ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ విజయకుమార్ వ్యవహరించారు. చైర్మన్ ఎన్నిక సందర్భంలో పొన్నలూరు జెడ్పీటీసీ ఈదర హరిబాబు ఇండిపెండెంట్ అభ్యర్థికి, వైస్ చైర్మన్ ఎన్నికలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి విప్ ధిక్కరించి చేతులు ఎత్తినందున పార్టీ విప్ ధిక్కరించినట్లు భావించి పంచాయతీరాజ్ చట్టం 2006 ప్రకారంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎలక్షన్ రూల్స్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నం.173, తేదీ 10.5.2006 మేరకు విప్ ధిక్కరించినందున జెడ్పీటీసీ పొన్నలూరు అభ్యర్థి హరిబాబుపై కలెక్టర్ అనర్హత ఉత్తర్వులు జారీ చేశారు.’ అంటూ అధికారిక ప్రకటన వెలువడింది. వేటు పడిందిలా... పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన అంశంలో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ చేపట్టారు. దీనిపై నోటీసులు జారీ చేసినపుడు తాను పార్టీ విప్ తీసుకోలేదని, అందువల్ల విప్ ధిక్కరించే అవకాశం లేదంటూ ఈదర హరిబాబు, ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే విప్ జారీ చేసిన సమయంలో పెట్టిన సంతకం, గత నెల 13వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశం హాజరు రిజిస్టర్లో సంతకం సరిచూడగా రెండు సంతకాలు ఒక్కటే కావడంతో కలెక్టర్ విప్ ధిక్కరించినట్లు భావించి వేటు వేశారు. కిం కర్తవ్యం... జెడ్పీ చైర్మన్పై వేటు పడటంతో తర్వాత ఏం చేయాలనే దానిపై కలెక్టర్ దృష్టి పెట్టారు. చట్ట ప్రకారం వైస్ చైర్మన్ను ఇన్చార్జిగా నియమించాల్సి ఉంటుంది. దీని కోసం ఎన్నికల సంఘాన్ని స్పష్టత ఇవ్వాల్సిందిగా లేఖ రాశారు. మంగళవారానికి దీనిపై ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదేశాలు రాగానే వైస్ చైర్మన్గా ఉన్న నూకసాని బాలాజీకి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు? జెడ్పీ చైర్మన్పై వేటు పడటంతో ఆయనకు కోర్టు నుంచి ఎటువంటి ఊరట లభించని పక్షంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మళ్లీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. హరిబాబు జెడ్పీటీసీ సభ్యత్వం రద్దు కావడంతో పొన్నలూరు జెడ్పీటీసీకి ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికను ఆరు నెలల్లోపు ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అప్పటి వరకూ నూకసాని బాలాజీ చైర్మన్గా కొనసాగుతారు. పొన్నలూరు జెడ్పీటీసీ ఎన్నిక జరగకముందే చైర్మన్ ఎన్నిక జరిపించాలని తెలుగుదేశం నాయకులు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే ఎన్నికల సంఘందే తుది నిర్ణయం కావడంతో అక్కడి నుంచి ఆదేశాలు వచ్చే వరకూ చైర్మన్ ఎన్నిక ఉండకపోవచ్చు. -
ప్రకాశం జడ్పీ ఛైర్మన్పై అనర్హత వేటు
-
ప్రకాశం జడ్పీ ఛైర్మన్పై అనర్హత వేటు
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అక్కడి జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో ఆయన జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు.. ఛైర్మన్ పదవి కూడా పోయినట్లు అవుతుంది. గతనెల 13వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో అసలు తెలుగుదేశం పార్టీ తనకు విప్ ఇవ్వనే లేదని, అలాంటప్పుడు దాన్ని ధిక్కరించే ప్రశ్న ఎక్కడినుంచి వస్తుందని హరిబాబు అంటున్నారు. ఇంతకుముందే ప్రిసైడింగ్ అధికారి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు కావడం గమనార్హం. -
నువ్వా.. నేనా..?
సాక్షి, ఒంగోలు: ప్రజాసమస్యల్ని గాలికొదిలేసిన అధికార టీడీపీ.. సొంత కుంపటిని చల్లార్చుకునే పనిలో పడింది. కొన్నాళ్లుగా నడుస్తోన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ఎన్నిక వ్యవహారం తాజాగా ఆ పార్టీలో చిచ్చురేపింది. సీనియర్, జూనియర్ల వివాదాన్ని తెరమీదికి తెచ్చింది. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెండు వర్గాలుగా చీలి కత్తులు దూసుకుంటున్నారు. పార్టీని నడపటంలో ఇరువురి ఆధిపత్యపోరు ఆది నుంచి కొనసాగుతూనే ఉన్నా.. అధినేత వద్ద తేలాల్సిన పంచాయితీల విషయమై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఈదర హరిబాబును ఇప్పటికే అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. అయితే, ఆయన్ను మరలా పార్టీలోకి చేర్చుకోవాలని కరణం బలరాం ప్రయత్నిస్తోండగా, మరోవైపు దామచర్ల జనార్దన్ తీవ్రంగా అడ్డుకుంటున్నారు. మిగతా నేతలను కలుపుకుని వర్గపోరును పోషిస్తున్న వీరిద్దరూ ‘ఈదర’ పంచాయితీ నేపథ్యంలో నువ్వా..నేనా..? అన్నట్టు తలపడుతున్నారు. అధిష్టానం వద్ద తమ మాటే నెగ్గించుకోవాలనే పట్టుదలతో కసరత్తు చేస్తున్నారు. పార్టీ పగ్గాల కోసమే సిగపట్లు.. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైన ఈదర హరిబాబు స్వతంత్రంగా పోటీ చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యులు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.. అదేవిధంగా ఆయన కూడా వైస్చైర్పర్సన్గా స్వతంత్ర అభ్యర్థికే ఓటేశారు. ఈ వ్యవహారంలో హరిబాబు విప్ను ధిక్కరించారా..? లేదా..? అనే వ్యవహారం కొద్దిరోజుల్లో అధికారులు తేల్చనున్నారు. ఇదిలా ఉండగా, ఆయనపై అనర్హత వేటు వేయడానికి వీల్లేదంటూ కరణం బలరాం తనవర్గాన్ని తోడుగా తీసుకుని చంద్రబాబుతో మాట్లాడారు. మరోవైపు దామచర్ల జనార్దన్ సైతం బాబు వద్దకెళ్లి ఈదరను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోరాదంటూ.. నమ్మకద్రోహం కారణంగా పరువు పోగొట్టుకున్నామని చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. ఇరువురి వాదనలు విన్న చంద్రబాబు మాత్రం బలరాం నిర్ణయం వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి వర్గం ఈ విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ వ్యవహారాల్లో జనార్దన్ నిర్ణయాలకు అడ్డుతగులుతున్న కరణం బలరాంకు.. తాజాగా ఈ పంచాయితీ మరింత గుర్తింపును తెస్తోందని ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాను జిల్లాలో ఎవరికీ పోటీదారుడ్ని కాదని.. గొట్టిపాటి హనుమంతరావు సన్నిహితుడ్ని అని విలేకరుల సమావేశంలో చెప్పుకున్న ఈదర హరిబాబుకు కరణం బలరాం మద్దతివ్వడాన్ని పార్టీవర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గొట్టిపాటి కుటుంబంతో బద్ధవైరం నడుపుతున్న బలరాం ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జెడ్పీచైర్పర్సన్పై అనర్హత వేటు వేసినప్పటికీ.. ఎటూ ఆ పదవి అధికారపార్టీకి దక్కదనే ఉద్దేశాన్ని అధినేతకు వివరించి.. జిల్లాపార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలనే ఆలోచనతో బలరాం పావులు కదుపుతున్నట్టు చర్చ జరుగుతోంది. సమీపంలో ఉన్న ఒంగోలు నగరపాలకసంస్థ ఎన్నికల్లో జనార్దన్ ప్రాభవాన్ని పూర్తిగా తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగానే ఈదర పంచాయితీని బలరాం భుజానికెత్తుకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరువర్గాలకు దూరంగా మంత్రి శిద్దా.. పార్టీలో సీనియర్గా ఉంటూ జిల్లా రాజకీయాలు కొనసాగిస్తున్న కరణం బలరాం వైఖరిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భానుసారం అధినేత చంద్రబాబు కూడా బలరాంను కాదని ఇక్కడ వ్యవహారాలకు సంబంధించి దామచర్ల జనార్దన్ను సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే.. బలరాం తనకు సంబంధంలేని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడాన్ని జనార్దన్ తరచూ అధినేత దృష్టికి తెస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిపదవి పొందిన శిద్దా రాఘవరావును అడ్డం పెట్టుకుని జనార్దన్ హవాకు చెక్పెడదామనే వ్యూహంతో కరణం బలరాం రాజకీయం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల వరుస ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, సీట్లపంపకం, బీఫారంల పంపిణీ తదితర పనులన్నింటినీ శిద్దా రాఘవరావుతోనే నడిపించారు. మంత్రి అయిన తర్వాత కూడా శిద్దా రాఘవరావును తన నివాసానికి పిలిపించుకుని మరీ బలరాం మంతనాలు సాగించారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు, కార్యకర్తలతో పాటు సామాన్యజనం సైతం మంత్రిని కలవకుండా.. కరణం బలరాంతో సంప్రదించడం.. ఆమేరకు ఆయన ఆదేశాలతో మంత్రి శిద్దా అధికారులకు ఫోన్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదిలోనే విషయం గుర్తించిన మంత్రి.. కొద్దికాలంగా బలరాంకు దూరంగా ఉంటున్నట్టు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఈదర హరిబాబు వ్యవహారంలో కూడా ఇరువర్గాల అభిప్రాయాలకు భిన్నంగా చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమంటూ తేల్చేసి ముందుకెళ్తున్నారు. నిన్నటిదాకా జనార్దన్ పక్కనే ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావులు సైతం పార్టీ అధినేత నిర్ణయానికే కట్టుబడతామన్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాత్రం జనార్దన్ వర్గంలో ఉంటూ బలరాం ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏది ఏమైనా, అధికార నేతలు జిల్లాలో రైతాంగ, డ్వాక్రాసంఘాల రుణ సమస్యల్ని గాలికొదిలేసి.. స్వపక్ష కుమ్ములాటలకు అధికప్రాధాన్యమిచ్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.