ex director
-
ఏసీబీ ఎంక్వయిరీలో షాకింగ్ నిజాలు
-
శివ బాలకృష్ణ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు షాక్..
-
మేనళ్లుల్లను సైన్యంగా మలచుకొని కోట్లు సంపాదన
-
ఏసీబీ దూకుడు.. శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో వేగం మరింత పెంచింది అవినీతి నిరోధక శాఖ(ACB). ఈ క్రమంలో విచారణకు రావాల్సిందేనంటూ బినామీలందరికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన భరత్, సత్యానారాయణ, భరణిలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆయనకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తులో దొరికిన పత్రాల ఆధారంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆ ఐఏఎస్పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. 2021-23 సంవత్సరాల మధ్య శివబాలకృష్ణ కోట్ల ఆస్తుల్ని కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఆ ఆస్తులన్నింటినీ ఆయన తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేయించారు.ఈ క్రమంలో యాదాద్రిలో 57 ఎకరాల భూమిపై ప్రత్యేక విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది. -
శివ బాలకృష్ణ కేసులో బయటపడ్డ అసలు నిజాలు
-
శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్
-
బాలకృష్ణ కేసులో భారీ ట్విస్ట్..
-
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో విస్తుపోయే నిజాలు
-
శివబాలకృష్ణకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏసీబీ
-
ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ !
-
శివబాలకృష్ణ అక్రమ సంపాదన విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
-
సాక్షిటీవీ చేతిలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్
-
శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
శివబాలకృష్ణ అరెస్ట్ తో HMDA అధికారుల్లో టెన్షన్
-
బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ చైర్మన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేసే క్రమంలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకునేందుకు బాలకృష్ణ ఎలాంటి మార్గాల్ని అనుసరించాడో తెలిసి అధికారులే కంగుతింటున్నారు. పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. ఇక.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. బంజారాహిల్స్ స్టేషన్ను తరలించి విచారిస్తోంది. ఆయన ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చిందో ఆరా తీస్తోంది. మరోవైపు బంధువులు, మిత్రుల పేర్లు మీద కూడా ఎకరాల కొద్దీ ఆయన భూములు కొన్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. కీలకమైన డాక్యుమెంట్లనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా బయటపడిన పత్రాలు, ఇతరాలను బట్టి.. ఆయన కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 300-400 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం జరిగిన సోదాల్లో.. ఒక్క నానక్రామ్గూడ లోని బాలకృష్ణ ఇంట్లోనే రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు.. నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఆయన వెనకేసినట్లు గుర్తించారు. -
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్
-
అవినీతి అనకొండ..HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
బాలకృష్ణను అదుపులో తీసుకున్నాం: ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో చేసిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ‘‘బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నాం. రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తాం. ఆ తర్వాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటాం. తనిఖీల సమయంలో కుటుంబ సభ్యులెవరూ మాకు సహకరించలేదు’’ అని ఏసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగియగా.. మరో నాలుగు చోట్ల మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఆయన బ్యాంకు లాకర్స్ను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. మొత్తం 20 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ.. భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలకు స్వాధీనం చేసుకుంది. తన పదవిని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు అయ్యింది. గుర్తించిన ఆస్తులు ఇవే.. రూ. 40 లక్షల నగదు, ఐదుకోట్ల విలువైన బంగారం భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం 70 ఎకరాల భూమి, ఇండ్లు 60 ఖరీదైన చేతి గడియారాలు.. 100 మొబైల్ ఫోన్లు(భారీగా ఐఫోన్లు), నాలుగు కార్లు భారీగా ల్యాప్ టాప్స్ వీటితో పాటు ఇంట్లోనే ఆయన క్యాష్ కౌంటింగ్ యంత్రాలు ఉంచుకోవడం గమనార్హం. అలాగే.. ఆయన బ్యాంకు లాకర్లు తెరవడంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శివ బాలకృష్ణతో సంబంధం ఉన్న అధికారులను వదలకుండా ప్రశ్నిస్తామని ఏసీబీ తాజాగా ప్రకటించింది. ఇక బుధవారం సాయంత్రం వరకు స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువే బహిరంగ మార్కెట్లో రూ.వంద కోట్లకుపైగానే ఉందని తేలింది. ఏసీబీ దాడుల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడటం ఇదే తొలి సారి అని అధికారులు పేర్కొంటున్నారు. ‘‘బాలకృష్ణ 2018–2023 మధ్య హెచ్ఎండీఏ డైరెక్టర్గా కొనసాగారు. హెచ్ఎండీఏ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. భారీ ఎత్తున అతి విలువైన భూముల పత్రాలు దొరికాయి. అవన్నీ బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. బాలకృష్ణ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది..’’అని ఏసీబీ డీజీ తెలిపారు. -
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎల్లుండి మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. విజయరామారావు మాజీ ఎమ్మెల్యే కూడా. సర్వీస్ నుంచి రిటైర్డ్ అయ్యాక.. టీడీపీలో చేరి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్(హైదరాబాద్) నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీ జనార్థన్రెడ్డి మీద విజయం సాధించారు. ఆ వెంటనే కేబినెట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి దానం నాగేందర్(కాంగ్రెస్) చేతిలో ఓడారు. విజయరామారావు పుట్టింది వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో!. అయితే కుటుంబ మూలాలున్న ఏపీలోనే(నెల్లూరు) ఉన్నత చదువులు సాగాయి. పైచదువులకు మద్రాసు యూనివర్సిటీలో చేరి బీఏ చేశారు. ఆపై 1958 అక్టోబరులో కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో లెక్చరర్ ఉద్యోగంలో చేరాడు. ఆ మరుసటి ఏడాదే సివిల్స్ అర్హత సాధించి.. ట్రైనింగ్తర్వాత చిత్తూరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డైరెక్టర్గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు,ముంబై బాంబు పేలుళ్లు లాంటి ప్రముఖ కేసులను దర్యాప్తు చేశారు. -
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ అరెస్ట్
-
ఎన్ఎంఎం డైరెక్టర్గా వెంకటరమణారెడ్డి
యూనివర్సిటీ క్యాంపస్: న్యూఢిల్లీలోని నేషనల్ మిషన్ ఫర్ మ్యాన్స్క్రిప్ట్(ఎన్ఎంఎం) డైరెక్టర్గా ఎస్వీయూనివర్సిటీ ప్రాశ్చ్యపరిశోధనా సంస్థ మాజీ సంచాలకులు ప్రొఫెసర్ వి.వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. కేంద్రప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారుు. దేశంలోని అరుదైన తాళ్ల పత్రాలు, చేతి ప్రతులను సేకరించి వాటిని ప్రాంతీయ భాషలోకి అనువదించడంతో పాటు ప్రచురించడం, వాటిని భద్రపరచడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. 2003లో ఏర్పాటైన ఈ సంస్థకు 9వ డైరెక్టర్గా వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. సౌత్ ఇండియా నుంచి తొలిసారిగా ఎంపికైన ఆంధ్రుడు వెంకటరమణారెడ్డి కావడం విశేషం. -
నిమ్స్ మాజీ డైరెక్టర్ నివాసంపై ఏసీబీ దాడులు