Fluids
-
తల్లి కాబోతున్నారా? జాంపండు లాంటి బేబీ కోసం బెస్ట్ అండ్ హెల్దీ జ్యూసెస్
గర్భిణీ స్త్రీలు స్వయంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, పిండం పెరుగుదల, అభివృద్ధికి మంచి పోషకాహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో అధిక ప్రోటీన్ ఆహారాలతో పాటు తొందరగా శక్తిని, పోషకాలను అందించే జ్యూస్లను సేవించాలి. దీంతోపాటు గర్భిణీ స్త్రీలు గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏమిటంటే..చక్కెర వాడకాన్ని తగ్గించాలి. కృత్రిమ స్వీట్నర్లు ,ప్రిజర్వేటివ్లు లేని సహజ పండ్ల రసాలను మాత్రమే తాగాలి. ప్రెగ్నెంట్ లేడీస్ మెచ్చే జ్యూస్లు కొన్ని చూద్దాం.. బనానా జ్యూస్ అరటిపండులో శరీరానికి కావల్సిన పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B6 కూడా ఉంటుంది, అరటి పండులో కొద్దిగా తాగా మీగడ వేసుకుని జ్యూస్, కొద్దిగా తేనె లేదా బెల్లం పొడి కలుపుకుని తాగి కడుపు నిండినట్టూ ఉంటుంది. ప్రారంభ నెలల్లో ఈ జ్యూస్ శక్తిని, బలాన్నిస్తుంది. వాంతులు, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్లో విటమిన్లు ,మినరల్స్ అధికంగా ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైన ఫోలిక్ యాసిడ్ కంటెంట్ కూడా నారింజలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పిండంలోని లోపాలను నివారించడానికి , మెదడు , వెన్నెముకలో అసాధారణతలను నివారించడానికి సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ 1వ, 2వ , 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలకు క్యారెట్ రసం ఉత్తమమైన రసం. క్యారెట్లో విటమిన్ ఎ, ఐరన్, బి విటమిన్లు, పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఎ కంటెంట్ కడుపులోని పిండం ఎముకలు ,దంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలు క్యారెట్ రసాన్ని తగినంత పరిమాణంలోనే తీసుకోవాలి. రోజుకు 1 గ్లాసు చాలా ఎక్కువ విటమిన్ ఎ ఆరోగ్యానికి తగినది కాదు ఎందుకంటే ఇది విషపూరిత ప్రభావాలను కలిగిస్తుంది. ఆపిల్ జ్యూస్ ఆపిల్లో ఫైబర్తోపాటు విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించే ఫ్లేవనాయిడ్సీ , ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఐరన్ హిమోగ్లోబిన్ని పెంచుతుంది , రక్తహీనతను నివారిస్తుంది.రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవోకాడో జ్యూస్ అవకాడోస్లోని ఐరన్, ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం , పొటాషియం వంటి అనేక పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవకాడోలోని కోలిన్ శిశువు మెదడు, నరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అవకాడోలో అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి, ఇవి గర్భధారణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మిక్స్డ్ జ్యూస్ సన్నగా తరిగిన అరకప్పు లేత పాలకూర, నాలుగు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు ఆవకాడో, అరకప్పు నీళ్లు తీసుకుని జ్యూసర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్ను వడగట్టకుండా అలాగే తాగాలి. గర్భిణులకు ఈ స్మూతీ అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. గర్భిణీ స్త్రీకి అధిక పోషకాహారం ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, పానీయాలను కూడా తీసుకోవాలి. అందులోనూ వేసవి కదా మరికొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్యూస్లు అందరికీ ఒకేలా పనిచేయవు. ఏదైనా ఎలర్జీలాంటివి ఉంటే ఈ జ్యుసెస్ను సేవించటేపుడు అప్రమత్తంగా ఉండాలి. సమతుల ఆహారం,చిన్నపాటి వ్యాయామం, ఎవరి టేస్ట్కు తగినట్టు, ఆయా జ్యూస్లను తాగుతూ, ఒత్తిడికి దూరంగా ఉంటూ, ప్రసూతి వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉంటే పండంటి బిడ్డ మీసొంతం. -
సన్దడ
ఎండలు బాగా ముదిరాయి. గతంతో పోలిస్తే ఈ వేసవిలో ఎండ చండప్రచండంగా కాస్తూ ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదు కావచ్చంటూ వాతావరణశాఖ వారూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత ఎండలో బయటకు వెళ్లడం ప్రమాదకరం. కానీ పరీక్షలంటూ ఇటు విద్యార్థులూ, ఎన్నికల హడావుడిలో కార్యకర్తల రూపంలో అటు సాధారణ ప్రజలూ ఎండలో తిరగక తప్పని పరిస్థితి. అందుకే బాగా తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల వచ్చే సమస్యలూ, పిల్లల్లో ఎండదెబ్బకు అవకాశాలూ, ఎండ తీవ్రతకూ, వడదెబ్బకూ గురికాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసం ఈ కథనం. ఎండ తీవ్రత వల్ల చాలా రకాల సమస్యలొస్తుంటాయి. వాటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని... హీట్ సింకోప్: ఎండలో ఎక్కువసేపు తిరుగుతూ ఉండటం వల్ల తల తిరిగినట్లు అనిపించడం, మరీ ఎక్కువ సేపు తిరిగితే సొమ్మసిల్లి పడిపోవడం జరగవచ్చు. ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దాంతో మెదడుకు ఎంత రక్తం అందాలో అంతా అందకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో సొమ్మసిల్లడం జరుగుతుంది. ఈ పరిస్థితినే హీట్ సింకోప్ అంటారు. ఎంత ఆరోగ్యవంతులకైనా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం. అయితే కొన్ని జాగ్రత్తలతో రోగులు కోలుకుంటారు. చికిత్స: హీట్ సింకోప్కు గురైన వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. అక్కడ మంచినీరు, తాజా పండ్లరసాలు, కొబ్బరినీళ్ల వంటి ద్రవాలను తాగించాలి. హీట్ క్రాంప్స్ / మజిల్ క్రాంప్స్: ఎండలో బాగా తిరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో రాత్రివేళల్లో లేదా అప్పటికప్పుడు కూడా పిక్కలు పట్టేసినట్లుగా ఉండి, తీవ్రమైన నొప్పికి గురికావడం జరుగుతుంది. ఎండలో ఆరుబయట ఆటలాడే పిల్లలకూ, రాత్రివేళల్లో పిక్క బలంగా పట్టేసి నిద్రాభంగమయ్యే పెద్దలకు ఇది అనుభవమే. దీనికి కారణం మన ఒంట్లో లవణాలూ, ద్రవాలు తగ్గడమే. శరీరం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలందాలి. ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన అయాన్ల రూపంలో నరాల ద్వారా ప్రసరించి, కండరాలకు ఆదేశాలిస్తాయి. ఎండవేడిమి తీవ్రతతో నీటిని తీవ్రంగా కోల్పోయి, దాంతోపాటూ లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు ఆదేశాలు సరిగా అందవు. దాంతో నీరు కోల్పోయి డీ–హైడ్రేషన్కు గురి కాగానే... కండరాలు బిగుసుకు పోతాయి. వీటినే మజిల్క్రాంప్స్ అంటారు. జాగ్రత్తలు: మజిల్క్రాంప్స్కు గురైనప్పుడు శరీరం కోల్పోయిన నీటిని మళ్లీ వెంటనే భర్తీ చేయాలి. అందుకే గంటలకొద్దీ సాగే టెన్నిస్ వంటి ఆటలాడే సమయంలో ఆటగాళ్లు పొటాషియం లవణాలు ఉండే అరటిపండునూ, చక్కెరతోపాటు, ఇతర లవణాలు ఉండే నీళ్లను తరచూ కొద్దికొద్ది మోతాదుల్లో తాగుతూ ఉంటారు. చికిత్స: పిల్లలకు మజిల్క్రాంప్స్ వచ్చి వాళ్ల కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్–రీ–హైడ్రేషన్ (ఓఆర్ఎస్) ద్రావణాన్ని తాగించాలి. ఇప్పుడీ ఓఆర్ఎస్ పాకెట్లు అన్ని మెడికల్ దుకాణాలలోనూ ఓఆర్ఎస్ ద్రావణపు పౌడర్ మనకు ఇష్టమయ్యేలా ఎన్నో ఫ్లేవర్లలో దొరుకుతుంది. ►ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు. ►ఓఆర్ఎస్గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తిని, మంచినీళ్లు తాగాలి. పిల్లల విషయంలోనూ ఇదే జాగ్రత్త పనిచేస్తుంది. అరటిపండులో పొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండు, నీటితో అవి చాలావరకు భర్తీ అవుతాయి. హీట్ ఎగ్జషన్: శరీరంలోని నీరు, ఖనిజలవణాలు కోల్పోవడం వల్ల కలిగే పరిస్థితి ఇది. బాగా తీవ్రమైన ఎండకు కొన్నాళ్లపాటు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. నీరసం, నిస్సత్తువ, కండరాల్లో పట్టులేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. జాగ్రత్తలు / చికిత్స : ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిని చల్లటి ప్రదేశానికి తరలించి, అక్కడ తగినన్ని ద్రవాలు తాగించాలి. వెంటనే మళ్లీ ఎండకు వెళ్లకుండా చూడాలి. బయట తిరగాల్సిన అవసరం ఉంటే... బాగా చల్లబడ్డాకే వెళ్లనివ్వాలి. హీట్ హైపర్ పైరెక్సియా: బయటి ఎండ కారణంగా రోగికి జ్వరం వచ్చేస్తుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత గరిష్ఠంగా 104 డిగ్రీల ఫారెన్హీట్ వరకూ పెరుగుతుంది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితినే హైపర్ పైరెక్సియా అంటారు. దీనికీ, వడదెబ్బకూ కాస్త తేడా ఉంది. ఈ కండిషన్లో మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతింటే... వడదెబ్బ (హీట్స్ట్రోక్)లో మాత్రం తక్షణం వైద్యసహాయం అందితే తప్ప మెదడులో ఉష్ణోగ్రత వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించలేం. హీట్ స్ట్రోక్ / వడదెబ్బ : ఈ హీట్స్ట్రోక్నే మనం సాధారణ పరిభాషలో వడదెబ్బగా చెబుతుంటాం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో వచ్చే ఈ కండిషన్ వల్ల ఒక దశలో శరీర ఉష్ణోగ్రత గరిష్ఠంగా 106 డిగ్రీల ఫారెన్హీట్ను కూడా దాటిపోవచ్చు. కళ్లు తిరగడం, వాంతులు కావడం, శరీరాన్ని ముట్టుకుని చూస్తే విపరీతమైన వేడి కనిపిస్తుంది. రోగి క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది చాలా తీవ్రమైన దశ. చివరికి చంకల్లో కూడా చెమట పట్టని పరిస్థితి వస్తుంది. దీన్ని వడదెబ్బకు సూచనగా గుర్తుంచుకోవాలి. ఇదే పరిస్థితి వస్తే... రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లడానికి (మార్బిడిటీకి) 40% అవకాశం ఉంటుంది. అప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ ప్రాణాంతకం కూడా కావచ్చు. ఎందుకింత తీవ్రం : వడదెబ్బ ప్రాణాంతకంగా ఎందుకు పరిణమిస్తుందో చూద్దాం. మన పరిసరాల ఉష్ణోగ్రత బాగా ఎక్కువైనప్పటికీ లేదా బాగా తక్కువైనప్పటికీ మన శరీర ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా 98.4 డిగ్రీల ఫారిన్హీట్ ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతల వద్దనే మన శరీరం నిర్వహించాల్సిన జీవక్రియలన్నీ (మెటబాలిక్ ఫంక్షన్స్) సక్రమంగా జరుగుతుంటాయి. మన ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారిన్హీట్ ఉండేందుకు మెదడులోని హైపోథెలామస్ తోడ్పడుతుంది. మన ఒంటి ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు దాని ఆదేశాల మేరకు స్వేదగ్రంథులు మనకు చెమట పట్టేలా చూస్తాయి. ఇలా చెమటలు పట్టినప్పుడు బయటి గాలి తగిలితే... ఆ స్వేదం ఇగిరిపోతుంటుంది. ఇలా ఇగిరిపోడానికి అది మన ఒంటి ఉష్ణోగ్రత (లేటెంట్ హీట్)ను తీసేసుకుంటుంది. దాంతో ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే వాతావరణంలో వేడి మరీ ఎక్కువగా ఉండి, స్వేదగ్రంథులు అదేపనిగా నిరంతరం పనిచేయాల్సి వస్తే... అవి కూడా పూర్తిగా అలసిపోతాయి. ఇక దాంతో చెమటపట్టని పరిస్థితి. ఫలితంగా ఒంట్లోని ఉష్ణం బయటకు పోదు కాబట్టి... మన శరీర ఉష్ణోగ్రత అదేపనిగా, అనియంత్రితంగా పెరిగిపోతుంది. హైపోథెలామస్ కూడా దాన్ని తగ్గించలేని పరిస్థితి. మన దేహంలోని అన్ని వ్యవస్థలూ తమ జీవక్రియలను నిర్వహించేందుకు ఆదర్శ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ అన్న విషయం తెలిసిందే. కానీ శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106... కొన్ని సందర్భాల్లో 110కి కూడా చేరి అది ఎంతకూ తగ్గకపోవడంతో, దేహంలోని అన్ని వ్యవస్థల పనితీరుకు (మెటబాలిక్ ఫంక్షన్స్) తీవ్రంగా దెబ్బ తగులడంతో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోతాయి. దాంతో వృద్ధులు, బలహీనంగా ఉన్న కొందరిలో మరణం కూడా సంభవించే ఆస్కారం ఉంది. అది అపోహ మాత్రమే : కొంతమంది ఎండలో లేకుండా నీడ పట్టున ఉంటే వడదెబ్బ తగలదని అనుకుంటారు. అయితే ఎండలో ఉన్నా నీడలో ఉన్నా పరిసరాలు చాలా వేడిగా ఉన్నప్పుడు, వేడి చాలా అధికంగా ఉండే సముద్రప్రాంతాల్లో నేరుగా ఎండతగలని చోట ఉన్నప్పటికీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే వడదెబ్బనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే... మనకు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం మాత్రమే సరిపోదు. చల్లటి ప్రదేశంలో ఉండటం అవసరమని గుర్తించాలి. వడదెబ్బ లక్షణాలు : వికారం; వాంతులు; కళ్లు తిరగడం; నీరసం; ►స్పృహతప్పడం; ఫిట్స్ రావడం; ►చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు. వడదెబ్బకు చికిత్స ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్హీట్ డిగ్రీలకు మించుతున్నట్లు తెలియగానే పెద్దలనైనా, పిల్లలనైనా వెంటనే చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు). దుస్తులను వదులుగా చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఒకవేళ బట్టలు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, మిగతా బట్టలన్నీ తీసేయాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లలకు చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. పిల్లలకూ, వృద్ధులకూ వడదెబ్బ ప్రభావం మరింత ఎక్కువ: పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట పట్టడం తక్కువ. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోనూ చెమట గ్రంథుల పనితీరు తగ్గుతుంది. దాంతో పిల్లలూ, వృద్ధులు తేలిగ్గా వడదెబ్బ ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది. పిల్లలకు పెద్దగా చెమట పట్టకపోవడం వల్ల వారు పెద్దగా ద్రవాలను కోల్పోవడం లేదనీ, వారు సురక్షితంగానే ఉన్నారని అపోహ పడుతుంటారు. కానీ తమకు విపరీతంగా చెమటలు పడుతున్నందున పిల్లల కంటే తామే ఎక్కువగా ద్రవాలను కోల్పోతున్నామని అనుకుంటారు. కానీ ఈ అభిప్రాయాలు వాస్తవం కాదు. పిల్లలతో పోలిస్తే పెద్దల్లో చెమట గ్రంథులు ఎక్కువ. కాబట్టి ఉష్ణోగ్రతలు కాస్తంత ఎక్కువగా పెరగగానే పెద్దల్లో చెమటలు పట్టే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. కానీ పిల్లల్లో అలా కాదు. వాళ్లలో పెద్దల తరహాలోనే చెమటలు పట్టాలంటే పెద్దలకంటే ఉష్ణోగ్రత చాలా చాలా రెట్లు పెరగాలి. కానీ అమితంగా పెరిగినప్పుడు పిల్లల ఒంటిని చల్లబరిచే మెకానిజం అయిన చెమట పట్టడం తక్కువ కావడంతో పిల్లల ఒంటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే పిల్లల్లో పెద్దగా చెమటలు పట్టకపోయినా... వాళ్ల ఒంటి ఉష్ణోగ్రత తేలిగ్గా పెరుగుతుందని పెద్దలు గ్రహించాలి. పైగా ఒంటిని చల్లబరిచేందుకు ఉద్దేశించిన స్వేద గ్రంథుల సంఖ్య వాళ్లలో తక్కువ కాబట్టి ఒళ్లు వెంటనే ఒక పట్టాన చల్లబడదని గ్రహించాలి. అందుకే ఈ వేసవి సీజన్లో వారిని ఎప్పుడూ చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఆడుకొమ్మని చెప్పాలి. ఒకవేళ ఆరుబయట ఆడుకోడానికి వెళ్తుంటే సాయంత్రం 5 తర్వాతే వారిని బయటకు అనుమతించాలి. ఒబేస్ పిల్లల విషయంలో మరింత జాగ్రత్త.. మామూలు పిల్లలతో పోలిస్తే కాస్త ఒళ్లు చేసి ఉన్న పిల్లలూ, ఒబేసిటీతో బాధపడే పిల్లలూ వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బాగా ఒళ్లు చేసి ఉన్న పిల్లలు ఆటలాడుతున్నప్పుడు వాళ్లకు చెమట పట్టడం, బరువు తగ్గడం జరుగుతుంది. అలా తమ పిల్లలు బరువు తగ్గారు కదా అంటూ పెద్దలు ఆనందించడం మామూలే. కానీ ఇలా స్థూలకాయంతో ఉన్న పిల్లలు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గితే అది ఆనందించాల్సిన విషయం కాదు. ఆ పిల్లలు ఆటలాడటం వల్ల తమ ఒంట్లోంచి నీళ్లు కోల్పోవడంతో పాటు, ఆ నీటితో పాటు విలువైన ఖనిజలవణాలనూ కోల్పోయారని గ్రహించాలి. ఇలా స్థూలకాయం కలిగి ఉన్న పిల్లలు బాగా ఆటలాడితే ప్రతి కిలో బరువుకు 500 మిల్లీలీటర్ల మేరకు ద్రవాలను కోల్పోవచ్చు. ఆ మేరకు బరువూ తగ్గుతారు. దాంతో తమ పిల్లలు బరువు కోల్పోయి ఆరోగ్యంగా మారుతున్నారంటూ పెద్దలు అపోహ పడవచ్చు. కానీ అలా సరికాదు. వాళ్లు విలువైన ఖనిజలవణాలు కోల్పోయి డీ–హైడ్రేషన్కు గురవుతున్నారనే విషయాన్నే గ్రహించాలి. అందుకే ఇలా బరువు తగ్గుతున్నప్పుడు పెద్దలు వారి ఒంటిలో జరిగే జీవక్రియలకు (మెటబాలిక్ ఆక్టివిటీస్కు) అవసరమైన నీటిని భర్తీ చేస్తూ ఉండాలి. అందుకే స్థూలకాయులైన పిల్లలు వెంటవెంటనే మరింత బరుతు తగ్గుతున్నట్లు గ్రహిస్తే పెద్దలు వారి ఒంట్లోకి తగిన ఎలక్ట్రోలైట్స్ పంపించేందుకు కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ వంటివి ప్రతి 20 నిమిషాలకొకసారి తప్పనిసరిగా తాగిస్తూ ఉండాలి. ఎండ దుష్ప్రభావాల నివారణ ఇలా... ►ఎండవేళల్లో పెద్దలూ, పిల్లలూ ఎండకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పిల్లలను ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎండవేళల్లో పిల్లలను కేవలం ఇన్డోర్ గేమ్స్కు మాత్రమే పరిమితం చేయాలి. ►పెద్దలూ, పిల్లలూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండాలి. మరీ ఎక్కువ పని ఉంటే తప్ప ఉదయం పది తర్వాత పెద్దలు బయటకు ఎండవేడికి వెళ్లకూడదు. ►మనం నేరుగా ఎండ∙తగలకుండా నీడలోనే ఉన్నా లేదా గదిలోనే ఉన్నా ఒకవేళ ఆ గది ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్నప్పటికీ వడదెబ్బ తగలవచ్చు. కాబట్టి నేరుగా ఎండకు వెళ్లకపోవడమే కాదు... మనం ఉన్నచోట చల్లగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఉండండి. ►ఆరుబయటకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తప్పక గొడుగు తీసుకెళ్లండి. లేదా అంచు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ వాడాలి. ►బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా వాటర్బాటిల్ను దగ్గర ఉంచుకోండి. డ్రైవింగ్ చేసేవారు ఎప్పుడూ తప్పనిసరిగా తమతో వాటర్ బాటిల్ ఉంచుకోవాల్సిందే. ►మనం వేసవిలో తరచూ నీరు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఆటల్లో నిమగ్నమైపోయే పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే వారికి తరచూ మంచినీళ్లు తాగిస్తూ ఉండాలి. ఈ వేసవిలో కొబ్బరినీళ్లు, తాజా పండ్లరసాలు తీసుకుంటూ ఉండటం మంచిది. కూల్డ్రింక్స్ వద్దు. కార్బొనేటెడ్ డ్రింక్స్, శీతల పానీయాల వల్ల మరింత డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. దాంతో ఒంట్లోని లవణాలను మరింత వేగంగా కోల్పోతామని గుర్తుపెట్టుకోండి. -
అదృశ్యకరణి
తన ఎదురుగా కూర్చుని ఉన్న యువకుడి వంక విసుగ్గా చూశాడు మల్హోత్రా. ‘‘చెప్పండి. ఏం పని మీద వచ్చారు?’’ వాచీలో టైమ్ చూసుకుంటూ చెప్పాడు.‘‘మీరు ప్రాచీన కళాఖండాలు, కొత్త వస్తువుల్లో డీల్ చేస్తారని తెలిసి వచ్చాను. నా దగ్గర ఒక విచిత్రమైన వస్తువు ఉంది’’ గది చుట్టూ ఒకసారి పరికించి, చిన్నగా చెప్పాడు సఫారీ సూట్ యువకుడు.సఫారీ సూట్ యువకుడు మల్హోత్రా మాటలకు సంతృప్తి చెంది, లెదర్బ్యాగులోంచి ఒక పలచటి తెల్లటి వస్త్రాన్ని బయటకు తీశాడు. మల్హోత్రా దానివంక ఆశ్చర్యంగా చూశాడు.‘‘దీన్ని అదృశ్యకరణి అంటారు’’ అని ఆ యువకుడు జిప్బ్యాగులోంచి ఒక చిన్న సీసా తీసి, అందులోని ద్రవాన్ని కొంత ఆ వస్త్రానికి పూసి, తనపై ఆ గుడ్డను కప్పుకున్నాడు. మరుక్షణం మల్హోత్రా ముందు ఎవ్వరూ లేరు. మల్హోత్రా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. రెండు నిమిషాల తర్వాత మల్హోత్రా ముందు కుర్చీలోప్రత్యక్షమయ్యాడు ఆ యువకుడు.‘‘ఆశ్చర్యంగా ఉంది. ఈ మాయావస్త్రం నీకెక్కడిది?’’ అన్నాడు మల్హోత్రా.‘‘ఎక్స్పోర్ట్ బిజినెస్ మీద నేను తరచు హాంకాంగ్కు వెళుతుంటాను. అక్కడొక యూనివర్సిటీ ప్రొఫెసర్ తయారు చేశాడు దీన్ని. ఆయన కొడుకు నా కస్టమర్, మంచి మిత్రుడు. ప్రొఫెసర్ వద్ద కొన్నాను దీన్ని భారీ సొమ్ము చెల్లించి’’ అన్నాడు సూట్వాలా.మల్హోత్రాకు ఇంకా నమ్మకం కుదరకపోవడంతో మళ్లీ ఆ వస్త్రాన్ని తనపై కప్పుకొని అదృశ్యమయ్యాడా యువకుడు. క్షణం తర్వాత ఆ గది తలుపు దగ్గర ప్రత్యక్షమయ్యాడు.‘‘చెప్పు దీన్ని ఎంతకమ్ముతావు నాకు?’’ ఆశ్చర్యానందాలతో తలమునకలవుతూ అడిగాడు మల్హోత్రా.‘‘పది లక్షలు. అంతకంటే తక్కువకు అమ్మలేను’’ అన్నాడతను కరాఖండిగా.‘‘చాలా ఎక్కువ. రెండు లక్షలకు మించి ఇవ్వలేను’’ బింకంగా చెప్పాడు మల్హోత్రా.‘‘వద్దులెండి. ఇంకెవరైనా దీన్ని కొంటారేమో చూస్తాను’’ అంటూ లేచి నిలబడి డోర్వైపు కదిలాడా యువకుడు.‘‘వద్దు, వద్దు. నేనే కొంటాను దీన్ని. నీకు చెక్ ఇయ్యవచ్చా?’’ అన్నాడు మల్హోత్రా ఆత్రంగా.‘‘లేదు. క్యాష్ మాత్రమే తీసుకుంటా’’ అన్నాడతడు.‘‘సరే, నీ పేరు, వివరాలూ నాకనవసరం. ఇది నాకు అమ్మినట్లు నువ్వు ఎవరికీ చెప్పకూడదు’’ అన్నాడు మల్హోత్రా. అలాగేనన్నాడతను.మల్హోత్రా ఇంటి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల్లో డబ్బు తీసుకొని వచ్చి ఆ యువకుడికిచ్చాడు.సఫారీ సూట్వాలా వస్త్రాన్ని, చిన్న సీసాలోని ద్రవాన్ని మల్హోత్రాకిచ్చి చెప్పాడు: ‘‘మీరు ఈ వస్త్రంపై ఈ సీసాలోని ద్రవం ఒక ఐదు చుక్కలు పూసి కప్పుకుంటే అదృశ్యమవుతారు. కానీ ఈ వస్త్రం ప్రభావం రెండు గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత మీరందరికీ మామూలుగా కనిపిస్తారు’’ అన్నాడు. ‘‘రెండు గంటలు కావస్తుండగా మళ్లీ ఈ వస్త్రంపై ద్రవం పూస్తే మళ్లీ మాయం కావచ్చా?’’ అడిగాడు మల్హోత్రా.‘‘లేదు. రెండు వాడకాల మధ్య కనీసం పన్నెండు గంటలు గ్యాప్ ఉండాలి. వస్త్రాన్ని చెక్ చేసుకోండి’’ అని తన బ్యాగ్ తీసుకుని గది బయటకు నడిచాడా యువకుడు.మల్హోత్రా మనసు ఆనందంతో ఉరకలేస్తోంది. వస్త్రంపై ద్రవాన్ని పూసి కప్పుకొని అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో ఎవరూ లేరు. తన వంటిపై వస్త్రాన్ని తీసేయగానే మళ్లీ మల్హోత్రా ప్రతిరూపం అద్దంలో కనిపించింది. మల్హోత్రా పనివాడు మున్నాను కేకేసి, వాడు గదిలోకి వచ్చేలోగా మళ్లీ ఆ గుడ్డను కప్పుకొని అదృశ్యమయ్యాడు.మున్నా గదిలోకి వచ్చి, ‘‘సాబ్ మీరెక్కడ?’’ అని గదంతా కలియదిరగడం ముసిముసి నవ్వుతో గమనించాడు మల్హోత్రా. గది బయటకు నడిచి, ఆ గుడ్డను ఒంటిపై నుంచి తీసి జాగ్రత్తగా మడిచి, జేబులో పెట్టుకొని గదిలోపలికొస్తూ, ‘‘ఒరేదున్నపోతు వెధవా, టీ తీసుకొని రా’’ అన్నాడు. మున్నా ఆశ్చర్యంగా వెళ్లిపోయాడు.కొంతకాలంగా మల్హోత్రా చేసే బిజినెస్ నష్టాల్లో ఉంది. కొందరు చోరులు తస్కరించిన కళాఖండాలు కూడా కొంటూఉంటాడతను. అటువంటి దొంగసరుకులు బొంబాయిలోని ఒక కస్టమర్ కోసం తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకోవడంతో మల్హోత్రా చాలా ఖర్చుపెట్టి వాటిని విడిపించాల్సి వచ్చింది. ‘‘పది లక్షలు చిల్లపెంకుల్లా ధారబోసి ఈ వస్త్రాన్ని కొన్నాను. వెంటనే దీన్ని ఉపయోగించి, పెట్టుబడిని రాబట్టుకోవాలి’’ అనుకున్నాడు మల్హోత్రా.మల్హోత్రా భార్య రెండు రోజుల క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. వస్త్రాన్ని కొన్న సందర్భాన్ని షాంపేన్ తాగుతూ ఆ రాత్రి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడతను. అతని బట్టల బీరువాలో విదేశాల నుంచి ఒక మిత్రుడు తెచ్చిచ్చిన షాంపేన్ బాటిల్ ఉండనే ఉంది.కాసేపు ఆలోచించి, మల్హోత్రా ఆ వస్త్రాన్ని, ద్రవాన్ని ఒక జిప్ బ్యాగులో ఉంచుకుని తన కారులో బయల్దేరి కృపాల్బాగ్లోని జువెలరీ షాపులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. ఒక ప్రసిద్ధి పొందిన జువెలరీ షాపు సమీపంలో తన కారు పార్క్ చేసి, బ్యాగులోంచి వస్త్రాన్ని తీసి, దానిపై ఐదు చుక్కల ద్రవాన్ని పూసి తనపై కప్పుకొని డోర్ తీసి కారు దిగాడు. తన ఉనికిని చుట్టుపక్కల వాళ్లెవరూ గుర్తించకపోవడం చూసి నవ్వుకుంటూ జాగ్రత్తగా రోడ్డు దాటి ‘మయూర్ షా జువెలర్స్’ దుకాణంలోకి వెళ్లాడు. ఒక కస్టమర్ గ్లాస్డోర్లోంచి లోనికి ప్రవేశిస్తుండగా, అతని వెనుకనే అదృశ్యరూపంలో ఉన్న మల్హోత్రా కూడా షాపులోనికి వెళ్లిపోయాడు. మల్హోత్రా షాపంతా కలియదిరుగుతూ షోకేసుల్లో పేర్చిన రకరకాల వజ్రాల హారాలు, బ్రేస్లెట్స్, నగల వంక ఆనందంగా చూశాడు. వాటి జోలికి వెళ్లడం ప్రమాదం. కళ్ల ముందే నగలు మాయమైతే ఏ సేల్స్మెన్ కూడా ఊరుకోడు కదా అనుకున్నాడు.కౌంటరు ముందున్న మయూర్ షా ముందున్న ట్రేలో రకరకాల నగలు ఉన్నాయి. ఇదివరకు అదే షాపులో నగలు కొన్న కస్టమర్స్, ఆ రసీదులు నగలు తీసుకొచ్చి ఎప్పుడైనా తిరిగి ఆ షాపులో ఇస్తే ఆ కస్టమర్స్ కొన్న ధరకు తిరిగి నగదు చెల్లించే సదుపాయం ఉందా దుకాణంలో. అలా పాత కస్టమర్స్ ఆ రోజు తిరిగి ఇచ్చిన నగలవి. షాపు మూసే సమయం కావడంతో మయూర్ షా ఆ నగలన్నిటినీ క్యాష్ టేబుల్ కింది ర్యాక్లో ఉంచి తాళం వేసి, తాళం చెవి సొరుగుపై ఉంచి షాపంతా కలియదిరుగుతూ సేల్స్మెన్కు షోకేసులు మూసి లాక్ చేయాలని పురమాయిస్తున్నాడు.ఇదే అదనుగా మల్హోత్రా షా టేబుల్ సొరుగుపై ఉన్న తాళంచెవి సహాయంతో ఆ ర్యాక్ తెరిచి, ఆ నగలన్నింటినీ తన జేబులో కూరుకున్నాడు. షా అటువైపు రావడం గమనించి, ర్యాక్ మూసి తాళం వేసి, కొందరు కస్టమర్స్ స్వింగ్ డోర్స్ తెరుచుకొని బయటకు వెళ్తూ ఉంటే వారి వెనుకనే ఆ షాపు నుంచి బయటకు నడిచాడు. తన ఉనికిని ఎవరూ గమనించకపోవడం అతణ్ణి ఆనంద పారవశ్యంలో ముంచింది. మల్హోత్రా కారు డోర్ తీసుకుని, సీట్లో కూర్చోవడం ఆ రద్దీలో ఎవరూ గమనించలేదు. ఆనందంగా ఇల్లు చేరుకుని, పనివాడు మున్నాను ఇంటికి పంపించి, డోర్ లాక్ చేసుకుని బెడ్ రూమ్లోకి నడిచాడు. జేబులోంచి నగలు తీసి ఆనందంగా చూసుకుని వాటినీ, మాయవస్త్రం, ద్రవం ఉన్న జిప్బ్యాగ్ను ఒక అల్మరాలో ఉంచాడు. తనకు బాగా తెలిసిన నగల వర్తకుడు కరమ్చంద్కు ఫోన్చేసి తన వద్ద కొన్ని నగలు ఉన్నాయని, వాటిని కొనడానికి మర్నాటి పొద్దున ఎనిమిదింటికి సొమ్ము తీసుకురమ్మని పురమాయించాడు. తర్వాత బట్టల బీరువాలోంచి షాంపేన్ బాటిల్ బయటకు తీసి ఆనందంగా కాసేపు తాగి, మున్నా చేసి పెట్టి పోయిన పరోటాలు తిని ఉల్లాసంగా నిద్రకు ఉపక్రమించాడు.ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచిన మల్హోత్రా గబగబా తయారయ్యే సరికి తొమ్మిదింపావు దాటింది. ఎందుకో కరంచంద్ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే క్యాష్ రెడీ చేసుకోవడం ఆలస్యమైందని, దారిలో ఉన్నానని చెప్పాడు. పది గంటలకు కాలింగ్ బెల్ మోగింది. కరంచంద్ వచ్చి ఉంటాడని తలుపు తీసిన మల్హోత్రా ఎదురుగా యూనిఫామ్లోని పోలీసులనూ, మయూర్ షానూ చూసి నిశ్చేష్టుడయ్యాడు.‘‘మీరు నిన్న రాత్రి వీరి దుకాణంలో చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ నగలు ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి.’’ అన్నాడు ఇన్స్పెక్టర్. మల్హోత్రాకు మతిపోయినట్లైంది.‘‘నిన్న రాత్రి వీడు చోరీ చేస్తుంటే ఎవ్వరూ గమనించలేదు. సీసీ కెమెరా దృశ్యాల్లోనూ కనబడలేదు. ఏం మాయ చేశాడో ఏమో! మళ్లీ ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి షాపు తెరిచి, నగలు మిస్సవడంతో రాత్రి తాలుకా సీసీ కెమెరా ఫుటేజీ చూసేసరికి వీడునగలు చోరీ చేస్తూ కనపడ్డాడు. దగ్గరలో పార్క్ అయిన కారు వివరాలు ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ద్వారా ఇతని ఆచూకీ కనుక్కున్నాం’’ అప్పుడే అక్కడకు చేరుకున్న డీఎస్పీకి వివరించాడు షా. పోలీసు దెబ్బల భయంతో మల్హోత్రా గాభరాగా గత రాత్రి తాను నగలు దాచిన అలమరా తెరిచాడు. అందులో నగలు కాని, మాయావస్త్రం ఉన్న జిప్బ్యాగు కాని కనపడలేదు. సఫారీసూట్ యువకుడి వద్ద అలాంటిదే మరో వస్త్రం ఉండి ఉండాలి. దాన్ని గమనించి బయటకు నడవగానే కప్పుకొని తన బెడ్రూములోనే దాగి ఉండి, తాను నిద్రపోయాక నగలు, జిప్బ్యాగు చోరీ చేసి వెళ్లిపోయి ఉండవచ్చు.మాయావస్త్రం ప్రభావం రెండుగంటల తర్వాత తగ్గడంతో సీసీ కెమెరాల్లో తాను ఉన్న దృశ్యం కనిపించి ఉండవచ్చు. మల్హోత్రా చెప్పేది ఎవ్వరూ వినిపించుకోలేదు. దిగులుగా పోలీసుల వెనుక నడిచాడు మల్హోత్రా. - రాచపూటి రమేష్ -
అర్బన్ ‘హెల్’ సెంటర్లు
లేస‘మాత్ర’మైనా అందని వైద్యం షుగర్, బీపీ మాత్రలు లభించక రోగుల అవస్థ కానరాని ప్లూయిడ్స్ డ్రెస్సింగ్ మెటీరియల్ నిడదవోలు : విరోచనాలు, వాంతులు, జ్వరం వంటి తదితర రోగాలతో పట్టణ ఆరోగ్య కేంద్రాల(అర్బన్ హెల్త్ సెంటర్లు)కు మీరు పరుగుతీశారా!.. అంతే వేగంతో వెనక్కి వచ్చేస్తారు. ఇక ప్రమాదాల్లో గాయాలపాలైన వారిని అక్కడికి తీసుకెళ్తే కనీస ప్రాథమిక చికిత్స అందక విలవిల్లాడిపోతారు. కనీసం అక్కడ డ్రెసింగ్ చేసే దిక్కు కూడా కనిపించక నరకం అనుభవిస్తారు. ఎందుకంటే అక్కడ సెలైన్లు(ఐవీ ప్లూయిడ్స్, ప్రాథమిక చికిత్స డ్రెస్సింగ్ మెటీరియల్, షుగర్ పరీక్ష చేసే కిట్లు.. అంతెందుకు కనీసంలో కనీసం జ్వరానికి వాడే పారాసిట్మాల్ మాత్రలు కూడా దొరకవు. ఇదీ జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో పరిస్థితి. -నిడదవోలు హెల్త్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యాలివీ.. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థలో 7, భీమవరంలో మూడు, తాడేపల్లిగూడెంలో మూడు, నరసాపురంలో రెండు, పాల కొల్లు, నిడదడవోలు, కొవ్వూరు, తణుకు మునిసిపాలీటి పరిధిలో ఒక్కొక్కటి చొప్పున అర్బన్ హెల్త్ సెంటర్లున్నాయి. పట్టణ శివారులలో వెనుకబడిన ప్రాంతాలు (స్లమ్ ఏరియా) లలో ఎస్సీ, ఎస్టీ, నివాస ప్రాంతాలలో పేదలకు సత్వర వైద్యమందించేందుకు ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణుల నమోదు, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. అయితే రోగాలతో ఆవస్థలు పడుతూ హెల్త్ సెంటర్లకు వస్తున్న రోగులకు మందు బిళ్లలు లేకపోవడంతో నానా ఆవస్థలు పడుతున్నారు. ప్రతి కేంద్రంలో షుగర్ పరీక్షలకు అవసరమైన షుగర్ పరీక్షా యంత్రం లేకపోవడంతో పేదలు కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రయివేట్ లేబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా వేసవిలో వడదెబ్బకు గురైన వారికి అందించాల్సిన సెలెన్స్ (ఐవి ఫ్లూయిడ్స్)కూడా లేవు. నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్తో పాటు జిల్లాలోని ప్రతి సెంటర్లో ఇదే దుస్థితి నెలకొంది. -
ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం.. ప్రతిఘటించిన జగన్
-
బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం.. ప్రతిఘటించిన జగన్
సాక్షి, హైదరాబాద్: హైడ్రామా నడుమ జగన్ను శుక్రవారం అర్ధరాత్రి 11.45 సమయంలో ఉస్మానియా నుంచి నిమ్స్కు తీసుకొచ్చాక ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం జరిగింది. మొదటిసారి జరిగిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో అర్ధరాత్రి 12.30 సమయంలో రక్త నమూనాలను సేకరించే నెపంతో మరోసారి ఫ్లూయిడ్స్ గొట్టాలను ఆయన ఒంట్లోకి గుచ్చేందుకు ప్రయత్నించారు. దాన్ని కూడా జగన్ అడ్డుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మరోసారి జగన్కు నచ్చజెప్పేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ‘‘ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. కాబట్టి ఫ్లూయిడ్స్ ఇచ్చేందుకు అంగీకరించండి’’ అని కోరారు. మరోవైపు ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతూ, శరీరంలో ప్రమాదకరమైన కీటోన్స్ సంఖ్య పెరగడంతో నెఫ్రాలజిస్టులను పిలిపించి పరీక్షలు చేయించారు. -
ప్లూయిడ్స్ తీసుకోవడానికి నిరాకరణ