ganesh immertion
-
గణేష ఉత్సవ సమితి ప్రతినిధుల నిరాహార దీక్ష
-
హుస్సేన్ సాగర్లో గణేషుడి నిమజ్జనం
-
కాసేపట్లో ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనం
హైదరాబాద్ : నగరంలో లక్షలాది మంది భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ భారీ వినాయకుడిని కాసేపట్లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు సాగిన గణేశుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రైన్తో వినాయకుడిని సాగర్ జలాల్లో వదలనున్నారు. గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించగా, సచివాలయం వెళ్లేవైపు కాసేపు రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు ఖైరతాబాద్ గణేషుడు
-
తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు ఖైరతాబాద్ గణేషుడు
హైదరాబాద్ : నగరంలో రెండోరోజు కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఖైరతాబాద్ వినాయకుడు మంగళవారం మధ్యాహ్నానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు. అలాగే నిమజ్జనానికి గణనాధులు ఎన్టీఆర్ మార్గ్ వైపు భారీగా కొలువు తీరారు. దాంతో అధికారులు నిమజ్జం చేసేందుకు వినాయకులను ట్యాంక్బండ్ వైపు ఉన్న క్రేనుల వద్దకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు భారీ గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాంతో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయింది. ఇక సచివాలయం వెళ్లేవైపు రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్ మీదగా రాకపోకలను అనుమతి ఇచ్చారు.