Advertisement
GANGULA bhanumurti
-
పరిటాల సునీత అండతోనే సూరీ హత్య : భానుమతి
సాక్షి, అనంతపురం: మద్దెలచెరువు సూరీ హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్కు ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని సూరీ భార్య గంగుల భానుమతి హైకోర్టును అభ్యర్థించారు. మద్దెలచెరువు సూరీ హత్యకేసు విషయమై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. భానుకిరణ్ సూరీ పేరు చెప్పి జిల్లాలో సూమారు 700 కోట్ల రూపాయలు సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. తన భర్త సూరీ హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని ఆమె ఆరోపించారు. పరిటాల కుటుంబం అండ లేకపోతే భానుకిరణ్ ఇంతటి దారుణానికి పాల్పడేవాడు కాదని అన్నారు. పరిటాల కుటుంబ అండతోనే ఈ దారుణానికి పాల్పడ్డాని భానుమతి తెలిపారు. -
సీబీఐ విచారణకు సిద్ధం
భానుమూర్తి ఆరోపణలపై గంగు ఉపేంద్రశర్మ స్పందన కాచిగూడ: మతైక ఉద్యోగుల సంఘం నేత గంగు భానుమూర్తిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు. బర్కత్పురలోని అర్చక భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై భానుమూర్తి తన అనుచరులతో చేయించిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే తనపై సీబీఐ విచారణ కూడా జరిపించుకోవచ్చని అన్నారు. సీబీఐ విచారణకు భానుమూర్తి సిద్ధమా అని ప్రశ్నించారు. ఐదువేల మంది అర్చకులకు ట్రెజరీ వేతనాలు వస్తాయని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ.5 వేల చొప్పున వసూళ్లకు శ్రీకారం చుట్టిన గంగు భానుమూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అర్చక సమాఖ్య ప్రతినిధులు భాస్కరభట్ల రామశర్మ, రాజేశ్వరశర్మ, తెలంగాణ మతైక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ శర్మ, చిరంజీవి శర్మ, సంతోష్ శర్మ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి.మోహన్ మాట్లాడుతూ ఉపేంద్రశర్మపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య తమదేనని, అర్చక సమాఖ్య పేరుతో ఏవరైనా ఇక నుంచి ప్రకటనలు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.