glass blast
-
‘అద్దాలు పగులగొడితే.. ఈడ్చుకెళ్లాల్సిందే’
యూపీలో జరుగుతున్న కుంభమేళా నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొన్ని విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తొలుత ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట, తాజాగా న్యూఢిల్లీలో తొక్కిసలాట.. ఈ రెండూ ఉదంతాలకు అధికారుల వైఫల్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. వీటిపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా కుంభమేళాకు వెళుతున్న రైలుకు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. Pakda gya 🐒 (Police Caught a guy who was trying to break the Door of train) pic.twitter.com/NPGHMUXxc6— Ghar Ke Kalesh (@gharkekalesh) February 16, 2025ఆ వీడియోలో కొందరు ప్రయాణికులు స్టేషన్కు వచ్చిన రైలు డోర్ లాక్ అయి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఒక యువకుడు అసహనంతో రగిలిపోతూ, గట్టిగా కొడుతూ, రైలు కోచ్ అద్దాలను పగులగొట్టే ప్రయత్నం చేస్తాడు. దీనిని గమనించిన ఒక రైల్వే పోలీసు ఆ యువకుని షర్టు కాలర్ పట్టుకుని, కొడుతూ లాక్కెళుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను చూసిన కొందరు యూజర్స్ పోలీసుల చర్యను మెచ్చుకుంటున్నారు. అద్దాలు పగులగొట్టేవారిని అలా ఈడ్చుకెళ్లాల్సిందేనంటూ సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: Railway Station Stampede: ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత -
బెంజ్ కారుపై అపర కాళిలా..
ఈవ్టీజింగ్పై యువతి ఆగ్రహం ఆగ్రా: ఈవ్టీజింగ్పై ఓ యువతి అపరకాళి అవతారం ఎత్తింది. ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సమాజ్వాదీ పార్టీ నేత గన్మన్ తనకు కన్నుకొట్టడమేకాక వెకిలివేషాలేయడంతో మెర్సిడెస్ బెంజ్ కారు బానెట్ పెకైక్కి శివతాండవం చేసింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుకుంది. ఆ రోజు సాయంత్రం సాధ్వీ పాండే (23) తన సోదరితో కలసి స్కూటీపై వెళుతూ ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. ఎస్పీ నేత అభినవ్ శర్మ బెంజ్ కారు వీరి పక్కనే ఆగింది. కారులో ఉన్న శర్మ గన్మన్.. సాధ్వీని చూసి కన్నుకొట్టడమే కాక వెకిలి సంజ్ఞలు చేశాడు. దీంతో కారును ఆపేసిన సాధ్వీ.. తన మొబైల్తో గన్మన్ ఫొటో తీసేందుకు ప్రయత్నించింది. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆమె మొబైల్ను లాక్కుని నేలకేసి కొట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన సాధ్వీ.. శర్మ బెంజ్ కారు బానెట్పైకి ఎక్కి.. దానిపై ఉన్న సమాజ్వాదీ పార్టీ జెండాను లాగేసి దానితోనే విండ్షీల్డ్స్(కారు అద్దాలు) ధ్వంసం చేసింది. పోలీసులు శర్మను, గన్మన్ను అక్కడి నుంచి పంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. యువతి కారు అద్దాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు ఎక్కడంతో ఆమె తెగువపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో తన గొప్పతనం ఏమీ లేదని, కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న వస్తువును పగలగొడితే మీరైనా ఇలాగే స్పందిస్తారని సాధ్వీ చెప్పింది. వారు తన మొబైల్ను పగలగొట్టకుండా.. గన్మన్పై చర్య తీసుకుని ఉంటే తాను ఇంతగా స్పందించేదాన్ని కాదంది. శర్మ తన తండ్రి తమ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పి, తమకు జరిగిన నష్టానికి పరిహారం అందించారని చెప్పింది. మరోవైపు పక్కకు తప్పుకోవాలని మాత్రమే కోరానని తన గన్మన్ చెపుతున్నాడని, అయినా అతడిని విధులనుంచి తొలగించినట్టు శర్మ చెప్పాడు. గన్మన్ అసభ్యంగా ప్రవర్తించాడని యువతి తనతో చెప్పివుంటే అతడిని అక్కడికక్కడే కొట్టేవాడినని, కానీ ఆమె తన కారును ధ్వంసం చేసిందన్నాడు. ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ స్పందిస్తూ.. అభినవ్ తమ పార్టీ నేత కానే కాదని, యూపీలో అధికార పార్టీ జెండాను కారుపై పెట్టుకోవడం ఒక ఫ్యాషన్గా మారిందని పేర్కొన్నాడు.