Godavari water level
-
భద్రాచలం వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు కాగా, 9,18,164 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.కాగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. -
భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/కాళేశ్వరం/వాజేడు: తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు చేరువైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. చదవండి: మీ వాహనం సేఫ్గా ఉండాలా.. వానాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి 55 అడుగులు దాటే అవకాశమున్నందని, ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి–బైరాగులపాడు ప్రధాన రహదారిపైకి వరద భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపునకు గురైంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో మంగళవారం 9 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. -
గోదావరి ఉధృతి.. పాత రికార్డులన్నీ బద్దలు..?!
భద్రాచలం: భద్రాచలం వద్ద ఈసారి గోదావరి ఉధృతి పాత రికార్డులన్నీ బద్దలుగొట్టే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న 75.6 అడుగుల వరద రావడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఆ తర్వాత 1990 ఆగస్టు 24న 70.8 అడుగుల వరద రెండో స్థానంలో నిలిచింది. ఈసారి వరద రెండో రికార్డును శుక్రవారం రాత్రి 8గంటలకు దాటేసింది. ఇప్పటివరకు జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదల్లో ఇదే అత్యధికం. ప్రవాహం మరింతగా పెరుగుతుందన్న అంచనాల మేరకు.. 1986 నాటి రికార్డును కూడా తాజా వరద అధిగమిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జూలై నెలలోనే కాకుండా.. గోదావరి వరదల్లోనే ఇదే అతి పెద్దదిగా నమోదు కానుంది. -
శాంతించిన గోదారమ్మ
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది వరద ప్రవాహం కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద నాలుగు రోజుల కిందట 10.70 మీటర్ల ఎత్తు ఉంటే.. ప్రస్తుతం 5.44 మీటర్లకు చేరింది. ప్రస్తుతం లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి ఇన్ ఫ్లో 75వేల క్యూసెక్కులు వస్తుండగా.. 14 గేట్లు ఎత్తారు. 75వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. బ్యారేజీలో ప్రస్తుత నిల్వ 5.812 టీఎంసీలు. సరస్వతీ(అన్నారం) బ్యారేజీకి ఇన్ఫ్లో 2300 క్యూ సెక్కులు ఉండగా.. 66 గేట్లు మూశారు. ప్రస్తుతం బ్యారేజీలో 7.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరదలు తగ్గితేనే మోటార్లు రన్! కన్నెపల్లి పంపుహౌస్లో నెల రోజులుగా మోటార్లు నడవడం లేదు. తెలంగాణ, మహారాష్ట్రల్లో వర్షాలు పూర్తిగా తగ్గితేనే మోటార్లు మళ్లీ నడవనున్నాయని అధికారులు తెలిపారు. గత నెలలో ఆరు మోటార్లకు వెట్రన్ నిర్వహించగా సుమారు 1,560 గంటలు మోటార్లు నడవగా.. 15 టీఎంసీల నీరు ఎగువకు తరలించిన విషయం తెలిసిందే. వర్షాలు లేకుంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి మోటార్లు నడిచే వీలున్నట్లు సమాచారం. -
గోదారే.. సాగరమైనట్టు
గలగల సవ్వడితో.. ఎంతో నిర్మలంగా ప్రవహించే పావన గోదావరి.. వరుణుడు తోడవడంతో.. ప్రళయ స్వరూపిణిగా రూపుదాల్చింది. మార్గం మధ్యలో ఉన్న ఉప నదులను, వాగులను కలుపుకొని, శక్తిని పెంచుకొని.. నడకలే పరుగులై.. పరుగులే ఉరకలై.. వడి పెంచి.. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకూ ఒరుసుకుంటూ పారుతూ.. తీరంలోని పల్లెలను, తనలోని లంకలను చుట్టుముట్టి.. ముంచెత్తుతూ.. సాగర సంగమం దిశగా ఉధృత వేగంతో పరుగులు తీస్తోంది. వారం రోజులుగా గోదావరికి పోటెత్తుతున్న వరద ఆదివారం మరింత ఉధృతమైంది. దీంతో ఎగువన విలీన మండలాలు మొదలు, దేవీపట్నం, కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. వరద బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : నాలుగైదు రోజులుగా ఉగ్రరూపమెత్తిన గోదావరి ఆదివారం ప్రళయస్వరూపిణిగా మారింది. ఎగువన స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద దిగువన కోనసీమ లంక గ్రామాలను చుట్టుముట్టింది. అక్కడ నిలకడగా ఉండగా ఇక్కడ ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 గంటల్లో ఏజెన్సీలో వరద అడుగు మేర తగ్గగా, కోనసీమలో రెండు మూడడుగులు పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 14.20 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. బ్యారేజి నుంచి 13,50,363 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తెలంగాణలోని దుమ్ముగుడెం, భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతూండడంతో సోమవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ఏజెన్సీలో నిలకడగా ఉంది. అయితే కాఫర్ డ్యామ్ కారణంగా వరద నీరు తీయడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో దేవీపట్నం మండలంలోని గ్రామాలు మరో రెండు మూడు రోజులు ముంపులోనే ఉండే అవకాశముంది. ఈ మండలానికి చెందిన సుమారు 3,800 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఐదు వేల మందికి పైగా భోజనాలు చేస్తున్నారు. గండిపోచమ్మ అమ్మవారు ఇంకా ముంపునీటిలోనే ఉన్నారు. లంకలను ముంచెత్తుతూ.. ఏజెన్సీలో వరద తగ్గుతూండగా కోనసీమలో దీని ప్రభావం పెరుగుతోంది. గంటగంటకూ గోదావరి నీటిమట్టం పెరగడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకువస్తోంది. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది మధ్య ఉన్న గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మామిడికుదురు, ముక్తేశ్వరం, కనకాయలంక, గంటిపెదపూడి కాజ్వేలు మునిగిపోవడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్వేల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పడవల ద్వారా లంక వాసులను, రైతులను, వ్యవసాయ ఉత్పత్తులను అధికారులు దాటిస్తున్నారు. ముందస్తుగా సహాయ పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే వరద తగ్గుతున్న సూచనలు ఉండడంతో వీటి అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాలకు ఇప్పటికే నిత్యావసర వస్తువులను చేరవేసిన అధికారులు.. వాటిని స్థానికులకు అందజేస్తున్నారు. వరద తీవ్రతకు గోదావరి నదీ కోత ఉధృతమవుతోంది. ముఖ్యంగా ముమ్మిడివరం మండలం కమిని, సలాదివారిపాలెం, లంకాఫ్ ఠాణేలంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కొండుకుదురులంక, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వంటిచోట్ల నదీ కోత ఎక్కువగా ఉంది. 10,354 ఎకరాల్లో నీట మునిగిన వరి జిల్లాలోని సుమారు 10,354 ఎకరాల్లో వరి చేలు నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అంతకంటే అధికంగానే చేలు ముంపులో ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం రామరాజులంక వంటి ప్రాంతాల్లో వరిసాగు చేస్తూంటారు. వీటితో పాటు డెల్టాలో చేలు సహితం ముంపు బారిన పడ్డాయి. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని ప్రధాన డ్రెయిన్ల నుంచి ముంపు నీరు దిగడం లేదు. పైగా రెండు రోజుల నుంచి నదుల నుంచి వస్తున్న నీరు డ్రెయిన్ల ద్వారా చేలల్లోకి చొచ్చుకువస్తోంది. దీనివల్ల ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, తూర్పు డెల్టాలోని రామచంద్రపురం, కరప, కాకినాడ సబ్ డివిజన్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో వరిచేలు ముంపు బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లోని తుల్యభాగ, బండారులంక కౌశిక, గొరగనమూడి, ఓల్డ్ అయినాపురం, నార్త్ అడ్డాల్. పెరుమళ్లరాజుకోడు, గొంది నోవా, శంకరగుప్తం, వేపచెట్టు, అంతర్వేది రాళ్ల కాలువల నుంచి కూడా ముంపు నీరు నదుల్లోకి దిగడం లేదు. దీనికితోడు ఆదివారం వరద ఉధృతి పెరగడంతో ముంపు మరింత పెరిగింది. పరిస్థితి చూస్తే మరో రెండు మూడు రోజులు చేలు ముంపులోనే ఉండనున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే చేలు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క వరదల వల్ల సుమారు 2,061 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపు బారిన పడ్డాయి. లంక గ్రామాల్లోని అరటి, తమలపాకు, కూరగాయల పంటలకు సహితం ముప్పు వాటిల్లనుంది. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి పర్యటించారు. కోనసీమలోని మలికిపురం, అల్లవరం మండలాల్లో ముంపు తీవ్రతను పరిశీలించిన ఆయన స్థానిక అధికారులతో వరద పరిస్థితిపై సమీక్ష జరిపారు. -
చినుకు చిటికేస్తే.. సిటీ వణుకుడే
మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం - సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు - 513 అడుగులకు ‘సాగర్’ నీటిమట్టం - రాష్ట్రవ్యాప్తంగా పొంగుతున్న వాగులు, వంకలు - మధిరలో అత్యధికంగా 9.4 సెంటీమీటర్లు - ఉధృతంగా మూసీ, పెరుగుతున్న గోదావరి నీటిమట్టం సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాజధాని హైదరాబాద్ను వర్షం విడవడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా 3 రోజులుగా వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రానికి నగరంలో సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని సుమారు 200కు పైగా బస్తీలను వర్షపునీరు ముంచెత్తింది. ప్రధాన రహదారులపై 234 బాటిల్నెక్స్ వద్ద భారీగా నీరు నిలవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉద్యోగులు, విద్యార్థులు 4 గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకొని విలవిల్లాడారు. వర్షం విడవకుండా కురుస్తుం డటం తో నగరంలోని పురాతన భవనాల్లో నివసిస్తున్న వారు తక్షణం ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. గతేడాది గ్రేటర్ పరిధిలో 2,010 శిథిల భవనాలను గుర్తిం చగా.. ఇప్పటివరకు 1,451 భవనాలను కూల్చి వేశామని.. మిగిలిన 559 భవనాల్లో నివసిస్తున్నవారు తక్షణం ఖాళీచేయాలని నోటీసులి చ్చామని అధికా రులు తెలిపారు. కాగా, నగర శివార్లలోని పర్వతా పూర్లో మూసీలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో వరద నీరు రహదారిపై నిలిచి వాహనాల రాకపోక లకు అంతరాయం కలిగింది. గ్రేటర్ జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్ల ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుం డడంతో జలాశయాల్లోకి వరద ప్రవాహం మొదల వలేదని జలమండలి వర్గాలు తెలిపాయి. పెరిగిన ‘సాగర్’ నీటి మట్టం ► హుస్సేన్సాగర్ నీటిమట్టం 513.41 మీ. కాగా మంగళవారం 513.32 మీ.కు చేరుకుంది ► హుస్సేన్సాగర్లోకి 1,625 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుం డగా 600క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు మధిరలో 9.4 సెం.మీ. వర్షం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం మధిరలో అత్యధికంగా 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోగుళాంబ గద్వా ల జిల్లాలో 10.2, ఖమ్మం జిల్లాలో 5.1 సెం.మీ, రంగారెడ్డి జిల్లాలో 3.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగా రెడ్డి జిల్లాలో జంట జలాశయాలైన గండిపేటలో 1,576.88, హిమాయత్సాగర్లో 1,745.34 అడు గుల నీటి మట్టం పెరిగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో అత్యధికంగా 1.4 సెంటీ మీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 2 సెంటీ మీటర్లకు పైగా సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో 3.9 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వరంగల్ రూరల్ జిల్లాలో 1.4 సెం.మీ., జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. రూరల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారు చిన్నమాటుకు గండిపడింది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో వేమనపల్ మండలంలో అత్యధికంగా 1.7 సెం.మీ., మంచిర్యాల, మంద మర్రి, నస్పూర్ మండలాల్లో అత్యల్పంగా 0.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్, వనపర్తిలో వర్షాలు ఖమ్మం జిల్లాలోని 1,407 చెరువులు, కుంటల్లో.. 550 చెరువుల్లోకి 25 శాతం నీరు చేరింది. పాలేరు రిజర్వా యర్లోకి అడుగు మేర వరద నీరు చేరింది. లంకాసాగర్ ప్రాజెక్టు 8.6 అడుగులకు నీరు చేరింది. తల్లాడ మండలంలోని ముద్దునూరి పడమటి చెరువు గండిపడింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మా జిపేట, తాడూరు, వెల్దండ, వంగూరు, తెలక్కపల్లి, అచ్చంపేట, అమ్రాబాద్ మండలాలల్లో సాధారణ వర్షపాతాని కంటే రెట్టింపు నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బాలానగర్లో 1.5, కోస్గిలో 1.3, మిడ్జిల్ 1.3, గండీడ్ 1.1, నవాబ్పేటలో 1.1, దేవరకద్రలో 0.8 సెం.మీ. వర్షం కురిసింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో అత్యధికంగా 1.3 సెం.మీ, అత్యల్పంగా పెద్దమందడిలో 0.7, జోగుళాంబ గద్వా ల జిల్లాలో 10.2 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గద్వాలలో 1.7, అత్య ల్పంగా ఐజలో 0.1 సెం.మీ. వర్షం కురిసింది. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 17 అడుగులకు చేరింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు వదులుతుండటంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రా జెక్ట్కు వరద పోటెత్తింది. మంగళవారం ఉదయం నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో 15 గేట్లను ఎత్తి 85 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సింగూరుకు జలకళ సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. నారాయణఖేడ్, జహీరాబాద్, కోహిర్ నుంచి వరద వస్తుండటంతో మంగళవారం నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 523.6 మీటర్లు కాగా ప్రస్తుతం 521 మీటర్లకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 29.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.28 టీఎంసీల నీరుంది. ఉధృతంగా మూసీ.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్టులోకి వర దనీరు వస్తోంది. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు సామర్థ్యం 645 అడు గులు కాగా ప్రస్తుతం 629.5 అడుగుల మేర నీరుంది. మునగాల మండలంలో 7.2 సెం. మీ. నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిలాయిపల్లి నుంచి బీబీనగర్, వలిగొండ మండలాల్లో మూసీ ఉధృతంగా పారుతోంది. -
మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు