hero raviteja
-
డ్రగ్స్ కేసు: ముగిసిన రవితేజ విచారణ
హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. నేటి ఉదయం పదిన్నర గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటలవరకు దాదాపు తొమ్మిది గంటల పాటు సిట్ అధికారులు రవితేజను విచారించారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, డ్రగ్ డీలర్ అయిన కెల్విన్, జీశాన్తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నించారు. రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితుడు జీశాన్ వెల్లడించడంతో ఆ కోణంలో అధికారులు ఆరా తీశారు. శుక్రవారం రవితేజతో పాటు సయ్యద్ యునిఫ్, కబిర్ అహ్మద్లను సిట్ విచారించింది. రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్రావును అధికారులు విచారించనున్నారు. గతంలో రవితేజ సోదరులు రఘు, భరత్ డ్రగ్స్ కేసులో పట్టబడటంతో.. ఇదే అంశంపై సిట్ అధికారులు ఆయనను ఆరా తీసినట్లు తెలుస్తోంది. 'సోదరులతో రవితేజకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా?. కెల్విన్, జీశాన్ లతో ఎన్నేళ్లుగా పరిచయం ఉంది?. కెల్విన్ ఏ పరిస్థితుల్లో పరిచయం అయ్యాడు. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం' అంటూ విచారణలో భాగంగా రవితేజను ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను కూడా సిట్ విచారించింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిని 19వ తేదీ నుంచి వరుసగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ ఇద్దరు విదేశీయులు సహా 22మందిని అరెస్ట్ చేశారు. -
రవితేజపై సిట్ ప్రశ్నల వర్షం!
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన హీరో రవితేజకు సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్, జీశాన్తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘మీ సోదరులతో మీకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా?. కెల్విన్, జీశాన్ మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. కెల్విన్తో మీకు పనేంటి...ఏ పరిస్థితుల్లో అతడు పరిచయం అయ్యాడు?. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. మీ రక్త నమూనాలు తీసుకోవచ్చా?.’ అంటూ ప్రశ్నలు కురిపించినట్లు సమాచారం. కాగా ఈ కేసులో నోటీసులు అందుకున్న రవితేజ శుక్రవారం ఉదయం విచారణ నిమిత్తం సిట్ అధికారుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను కూడా సిట్ విచారణ చేసింది. ఈ కేసుల్లో నోటీసులు జారీ చేసిన వారిని వరుసగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా కేసులో ఇప్పటివరకూ సిట్ అధికారులు 19మందిని అరెస్ట్ చేశారు. కాగా మైక్ కమింగతో లింకులు ఉన్న మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. -
సిట్ విచారణకు హాజరైన హీరో రవితేజ
-
సిట్ విచారణకు హాజరైన హీరో రవితేజ
హైదరాబాద్ : ప్రముఖ హీరో రవితేజ శుక్రవారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న ఆయన ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాదుల సలహాలు తీసుకున్న రవితేజ సిట్ విచారణకు వచ్చారు. రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్స్ మాఫియా కేసులో నిందితుడు జీశాన్ వెల్లడించడంతో ఆ కోణంలో అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే కెల్విన్, జీశాన్తో గల సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు హీరో రవితేజను చూసేందుకు సిట్ కార్యాలయం వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక తన కుమారుడికి డ్రగ్స్ వాడే అలవాటే లేదని, ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
భరత్ మృతి: విమర్శలపై స్పందించిన రవితేజ
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన భరత్ను కడసారి చూడలేకనే.. అతని అంత్యక్రియలకు తానుగానీ, తన తల్లిగానీ వెళ్లలేదని హీరో రవితేజ తెలిపారు. తమ్ముడు భరత్ మరణం తర్వాత తొలిసారి ఆయన బుధవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. భరత్ మరణం గురించి తెలిసిన వెంటనే తమ కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదన చెంది కుప్పకూలారని తెలిపారు. భరత్ అంత్యక్రియలకు తాము హాజరుకాని విషయంలో సోషల్ మీడియాలో, కొన్ని చానెళ్లలో వచ్చిన కథనాలు సరికావని, అవి అసత్య ప్రచారాలని చెప్పారు. భరత్ అంత్యక్రియలను జూనియర్ అర్టిస్టుతో జరిపించారన్న కథనాలు అసత్యమన్నారు. తన చిన్నాన్న, సోదరుడు భరత్ అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు. నెక్ట్స్ డే షూటింగ్కు వెళ్లాను! భరత్ మృతి చెందిన తెల్లారే తాను షూటింగ్కు వెళ్లానంటూ వచ్చిన కథనాలపై హీరో రవితేజ స్పందిస్తూ.. తెల్లారే షూటింగ్కు వెళ్లలేనది, నెక్ట్స్ డే వెళ్లానని వివరణ ఇచ్చారు. పాతికమంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుందని, అందుకే తాను షూటింగ్కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఈ షూటింగ్లో నవ్వుతూ సెల్ఫీలు దిగారన్న కథనాలను తోసిపుచ్చారు. తమ కుటుంబం గురించి రాస్తున్న ఇలాంటి కథనాలు ఆవేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో తమ కుటుంబం గురించి పరిధిని అతిక్రమించి రాస్తున్నారని అన్నారు. దయచేసి ఇలాంటి కథనాలు రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరో రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం
ఓఆర్ఆర్పై కొత్వాల్గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై కొత్వాల్గూడ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్రాజ్(50) దుర్మరణం చెందారు. మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో చనిపోయిన భరత్.. రవితేజ సోదరుడని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా జూబ్లీహిల్స్ రోడ్డులోని మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. నోవాటెల్ నుంచి వస్తుండగా ప్రమాదం వివాహితుడైన భరత్రాజ్ భార్య అమెరికాలో నివసిస్తుండగా.. ఆయన ప్రస్తుతం మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్కు వెళ్లినట్లు అక్కడి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి 9.20 గంటల సమయంలో భరత్ హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారు(టీఎస్09ఈసీ0799)లో ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20–25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టి.. ఓఆర్ఆర్పై శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలివైపు లోడ్తో వెళ్తున్న లారీ గురువారం మరమ్మతులకు లోనైంది. దాని ఇంజన్ ఫెయిల్ కావడంతో వాహనాన్ని క్యారేజ్ వేలో ఉంచారు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం లారీ(ఏపీ16టీవై3167) బ్రేక్డౌన్ అయిన విషయం గుర్తించారు. లారీకి వెనుక వైపు 30 మీటర్ల దూరంలో రిఫ్లెక్టివ్ క్రోన్స్ ఏర్పాటు చేసి, వాటిని అనుసంధానిస్తూ రిఫ్లెక్టివ్ టేప్ సైతం కట్టారు. ఆ ప్రాంతంలో లైటింగ్ కూడా స్పష్టంగా ఉంది. శనివారం రాత్రి 9.45–10 గంటల మధ్య మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన భరత్ వాహనం క్రోన్స్ను గుద్దుకుంటూ ముందుకెళ్లి లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొంది. రవితేజ సోదరుడిగా ఆదివారం గుర్తింపు.. ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని.. అతికష్టమ్మీద కారును లారీ కింది నుంచి బయటకు లాగారు. ఆపై అందులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వద్ద లభ్యమైన ఆధార్ కార్డును బట్టి చనిపోయిన వ్యక్తి భరత్ రాజ్గా గుర్తించారు. కారులో లభ్యమైన ఫోన్లోని కొన్ని నంబర్లకు పోలీసులు డయల్ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఓ నంబర్కు కాల్ చేసి ప్రమాద విషయం తెలుపగా.. ‘ఆస్పత్రికి తీసుకువెళ్లండి’అంటూ సమాధానం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆదివారం ఉదయం రవితేజ మరో సోదరుడు రఘు పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో చనిపోయింది రవితేజ మరో సోదరుడు భరత్గా పోలీసులు గుర్తించారు. ఈ కారు ఆయన తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉంది. గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు దీనిపై రెండు ఈ–చలాన్లు(రూ.370) జారీ అయి పెండింగ్లో ఉన్నాయి. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. అక్కడ నుంచి నేరుగా విష్ఫర్వ్యాలీలోని మహా ప్రస్థానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆది నుంచీ వివాదాస్పదుడే.. ఆది నుంచీ వివాదాస్పదుడైన భరత్ మంచి క్రికెట్ ప్లేయర్. సినీ తారల మ్యాచ్లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. భరత్పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి. సోదరుడు రవితేజ నటించిన కొన్ని సినిమాలతో పాటు పలు చిత్రాల్లో సహాయ నటుడిగా.. ప్రతినాయకునిగా భరత్ నటించాడు. దూకుడు, ఆగడు, అతడే ఒక సైన్యం, పెదబాబు, 143, నేనింతే తదితర చిత్రాల్లో పాత్రలు పోషించాడు. అతివేగమే ప్రాణం తీసిందా..? కారు ముందు టైరు.. లారీ వెనుక టైరుకు ఢీ కొనే వరకు కారు చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయ్యింది. ఆ సమయంలో కారు గంటకు 145 కి.మీ. వేగంతో దూసుకెళ్లినట్లు లాక్ అయిన స్పీడో మీటర్ స్పష్టం చేస్తోంది. ఎయిర్బ్యాగ్స్ తెరుచు కున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకు పోవడంతో అవి భరత్ ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారులో సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో భరత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో కారులో వస్తున్న భరత్ ఆగి ఉన్న లారీని గుర్తించి ఉండడని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కారుకు బ్రేక్ వేసినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ భరత్ అంత్యక్రియలను రవితేజ మరో సోదరుడు రఘు, బాబాయ్ మూర్తి రాజు పూర్తి చేశారు. రవితేజతో పాటు కుటుంబ సభ్యులెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదు. అయితే ప్రమాదంలో నుజ్జునుజ్జయిన తమ్ముడి మృత దేహాన్ని తాను చూసి తట్టుకోలేనని, అందుకే అంత్యక్రియలకు వెళ్లలేనని, తమ కుటుంబ సభ్యుల పరిస్థితి అర్థం చేసుకోవాలని రవితేజ తన సన్నిహిత వర్గాల వద్ద వాపోయినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగు తోంది. కాగా, భరత్ అంత్యక్రియలకు జీవితా రాజ శేఖర్, అలీ, ఉత్తేజ్, రఘుబాబు హాజరయ్యారు. -
రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం.. పూర్తివివరాలు
- ఔటర్ ప్రమాదంలో స్పాట్డెడ్.. మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఆలస్యం - ఉస్మానియా మార్చురీ నుంచి నేరుగా అంత్యక్రియలకు - అమెరికాలో భరత్ సతీమణి.. పిల్లలు లేరు - పోస్ట్మార్టం రిపోర్టులు వస్తే మిగతా విషయాలు తేలతాయన్న డీసీపీ సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్పై (ఓఆర్ఆర్) కొత్వాల్గూడ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భూపతి భరత్ రాజ్ (50) దుర్మరణం చెందారు. మితిమీరిన వేగంతో వచ్చిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన భరత్ సినీ హీరో రవితేజ సోదరుడని గుర్తించడానికీ చాలా సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ... పోస్టుమార్టం పరీక్షల రిపోర్ట్ వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. వివాహితుడైన భరత్ రాజ్ భార్య అమెరికాలో నివసిస్తుండగా... ఆయన ప్రస్తుతం మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్కు వెళ్ళారు. ఈ మేరకు అక్కడి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చాలా సేపటి వరకు అక్కడి గదిలో ఉన్న భరత్ రాత్రి 9.20 గంటల సమయంలో హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారులో (టీఎస్ 09 ఈసీ 0799) ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20–25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. భరత్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. రిఫ్లెక్టివ్ క్రోన్స్ను దాటి లారీని ఢీ కొట్టి... ఓఆర్ఆర్పై శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న లోడ్తో కూడిన లారీ గురువారం మరమ్మతులకు లోనైంది. దాని ఇంజన్ ఫెయిల్ కావడంతో వాహనాన్ని క్యారేజ్ వేలో ఉంచారు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ లారీ (ఏపీ 16 టీవై 3167) బ్రేక్డౌన్ అయిన విషయం గుర్తించారు. లారీకి వెనుక వైపు 30 మీటర్ల దూరంలో రిఫ్లెక్టివ్ క్రోన్స్ ఏర్పాటు చేసి, వాటిని అనుసంధానిస్తూ రిఫ్లెక్టివ్ టేప్ సైతం కట్టారు. ఆ ప్రాంతంలో లైటింగ్ కూడా స్పష్టంగా ఉంది. శనివారం రాత్రి 9.45–10 గంటల మధ్య మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన భరత్ రాజ్ వాహనం క్రోన్స్ను గుద్దుకుంటూ ముందుకు వెళ్ళి లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదం ధాటికి కారు దాదాపు సగం వరకు లారీ కిందికి చొచ్చుకుపోయి నజ్జునుజ్జయింది. కారు ముందు టైరు... లారీ వెనుక టైరుకు ఢీ కొనే వరకు కారు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో కారు గంటకు 145 కిమీ వేగంతో దూసుకువచ్చినట్లు లాక్ అయిన స్పీడో మీటర్ స్పష్టం చేస్తోంది. ఎయిర్బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకుకోవడంతో అవి ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారులో సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో భరత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న భరత్ ఆగి ఉన్న లారీని గుర్తించి ఉండడని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కారుకు బ్రేక్ వేసినట్లు ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండని సమాధానం! ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ అధికారులు ఘటనాస్థలికి వచ్చారు. అతికష్టమ్మీద కారును లారీ కింది నుంచి బయటకు లాగారు. ఆపై అందులో ఉన్న భరత్ మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వద్ద లభ్యమైన ఆధార్ కార్డును బట్టి చనిపోయిన వ్యక్తి భూపతి భరత్ రాజ్గా గుర్తించారు. కారులో లభ్యమైన ఫోన్ను పరిశీలించిన పోలీసులు కొన్ని నెంబర్లకు డయల్ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఓ నెంబర్కు కాల్ చేసి ప్రమాద విషయం తెలుపగా... ‘ఆస్పత్రికి తీసుకువెళ్ళండి’ అంటూ సమాధానం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆదివారం ఉదయం రవితేజ మరో సోదరుడు రఘు పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో చనిపోయింది రవితేజ మరో సోదరుడు భరత్గా పోలీసులు గుర్తించారు. ఈ కారు ఆయన తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉంది. గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో దీనిపై రెండు ఈ–చలాన్లు (రూ.370) జారీ అయి పెండింగ్లో ఉన్నాయి. సాగర్ సొసైటీ, అన్నపూర్ణ చౌరస్తాల్లోని క్యారేజ్ వేల్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు బంజారాహిల్స్, శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీటిని జారీ చేశారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. అక్కడ నుంచి నేరుగా విష్ఫర్వ్యాలీలోని మహా ప్రస్థానానికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. ఆది నుంచీ వివాదాస్పదుడైన భరత్ మంచి క్రికెట్ ప్లేయర్. సినీ తారల మ్యాచ్లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. అతడు మంచి బౌలర్ అయి పలువురు చెప్తున్నారు. భరత్పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి.