husbend fight
-
నా భార్య వేధిస్తోంది, మనోవర్తి ఇప్పించండి..
సాక్షి, విజయనగరం : భర్త, అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని ఇంతవరకు భార్యలు గృహహింస కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలోనే కాదు, రాష్ట్ర చరిత్రలో కూడా సంచలనం కల్గించేలా ఓ వ్యక్తి తన భార్య వేధిస్తోందనీ, తనకు మనోవర్తి ఇప్పించాలని కేసు వేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బలిజిపేటకు చెందిన బొమ్మాళి ప్రసాద్రావుకు నెల్లిమర్లకు చెందిన ఎర్రంశెట్టి రాజేశ్వరితో 2006 ఏప్రిల్ 23వ తేదిన వివాహం అయింది. 2008లో వీరికి ఒక పాప జన్మించింది. ప్రసాద్ రావు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. రాజేశ్వరి నెల్లిమర్లలో టీచర్గా పనిచేస్తున్నారు. 2006లో వివాహం అయిన తర్వాత విజయనగరం పట్టణంలోని తోటపాలెంలో నివాసం ఉండేవారు. 2008 తర్వాత రాజేశ్వరి నెల్లిమర్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం భార్య భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రాజేశ్వరి పోలీస్శాఖలో పనిచేసే తన సోదరి ద్వారా తనను మానసిక హింసకు గురిచేస్తోందని, తనకు రక్షణ కల్పించాలని ప్రసాద్రావు బొబ్బిలి కోర్టులో గత నెల 13వ తేదీన పిటిషన్ వేశారు. అంతేగాకుండా తనకు నెలకు రూ.20 వేలు మనోవర్తి కింద, ఇంటి అద్దెకు రూ.3 వేలు చొప్పన ఇప్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో కోర్టువారు ఆ పిటిషన్ను పరిశీలించాల్సిందిగా జిల్లా కేంద్రంలో ఉన్న గృహ హింస విభాగానికి పంపించారు. దీనిపై ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ వద్ద సాక్షి ప్రస్తావించగా ప్రసాద్రావు అనే వ్యక్తి గృహ హింస కింద వేసిన పిటిషన్ కోర్టు నుంచి తన వద్దకు వచ్చిందని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పులో ఇటువంటి పిటిషన్ స్వీకరించవచ్చని ఉందని, అయితే న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండడానికి ఈ కేసును రిజిస్ట్రర్ చేయాలా వద్దా అని జిల్లా జడ్జికి లేఖ రాశామని తెలిపారు. -
నిర్లక్ష్యంతోనే నా భార్యను చంపేశారు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : నిర్లక్ష్యంతో తన భార్యను చంపేసారని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆరోపించాడు. కోలమూరుకు చెందిన కె.వెంకటరమణమ్మ(50) చికిత్సపొందుతూ మృతి చెందడంతో ఆసుపత్రి వద్ద కుటింబీకులు, బంధువులు మంగళవారం ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు...రాజమహేంద్రవరం రూరల్ కోలమూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కె.వెంకటేశ్వరావు భార్య వెంకటరమణమ్మ కొంతకాలంగా ఆయాసంతో బాధపడుతోంది. ఆమెను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు గుండెలో వాల్వ్ పాడైందని చెప్పారు. వారు అక్కడ నుంచి తిరిగి ఆర్టీసీ డిపోలో ఉండే సంస్థ వైద్యురాలికి విషయం తెలిపారు. ఆమె సంస్థ తరపున వైద్యం చేయించేందుకు దానవాయిపేటలోని కమలాకర్ హార్ట్కేర్కు మాత్రమే వెసులుబాటు ఉందని చెప్పడంతో గత నెల 25న కమలాకర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు 29న వాల్్వకు సంబంధించి ఆపరేష¯ŒS చేశారు. తర్వాత ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. తిరిగి ఆమెకు ఆయాసం రావడంతో వేరే ఆసుపత్రికి మార్చాలని చెప్పారని, మళ్లీ ఎందుకో ఆసుపత్రి మార్చకుండా ఆ వైద్యులే ఇక్కడికి వస్తారని తాత్సారం చేసినట్టు భర్త వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో ఆమెకు పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతిచెందింది. విషయాన్ని కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో వారు వైద్యుని నిలదీసారు. దీనిపై ఆసుపత్రి ఎదుట ఆందోళనచేపట్టి ధర్నా చేశారు. తన భార్య మృతికి బ్రెయి¯ŒSస్ట్రోక్, పక్షవాతం, ఊపిరితిత్తుల సమస్య ఇలా పొంతనలేని కారణాలు చెబుతున్నారన్నారు. విషయం తెలిసిన ప్రకాశ్నగర్ పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతోను, డాక్టర్తోను మాట్లాడారు. జరిగినదానిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ రోగి పరిస్థితి బాగానే ఉందని, అయితే వాల్వ్ ఆపరేష¯ŒS చాలా క్లిష్టమైందని, సర్జరీ తర్వాత రోగి కోలుకునే శరీరం సహకరించడం బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు.