breaking news
India-A Cricket Team
-
వైభవ్ వీరవిహారం.. ట్రై సిరీస్ విజేతగా భారత్
శ్రీలంక ఆతిథ్యమిచ్చిన అనాధికారిక ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచింది. ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-ఎ జట్టును 66 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ తుది పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చేసిన ఇండియా 'ఎ' జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ బాస్ బేబీ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఓవరాల్గా 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యవంశీ.. 10 ఫోర్లు, 8 సిక్స్లతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు తిలక్ వర్మ(67), రుతురాజ్ గైక్వాడ్(40), అనుకుల్ రాయ్(15 బంతుల్లో 39), ప్రియాన్ష్ ఆర్య(39) రాణించారు. లంక బౌలర్లలో వనజా సహాన్, కుగదాస్ మతులన్, రవిందు ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టును భారత పేసర్ యశ్ ఠాకూర్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. అయితే మిడిల్ ఆర్డర్లో సదీర సమరవిక్రమ (52), సహన్ అరచ్చిగే(38) నిలకడగా ఆడడంతో లంక తిరిగి గేమ్లోకి వచ్చింది. రన్ రేట్ ఒత్తిడి పెరగడంతో శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఆఖరిలో వనుజ సహన్ (62) దూకుడుగా ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో 47.1 ఓవర్లలో 311 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. రత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు అనుకుల్ రాయ్ రెండు, తిలక్ వర్మ, ఆశోక్ శర్మ చెరో వికెట్ సాధించారు.చదవండి: IND vs IRE: టీమిండియాకు భారీ షాక్ -
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
శ్రీలంక-ఎ జట్టు ప్లేయర్తో గొడవపడిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలింది. అతడి మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించింది. వైభవ్తో పాటు ఇండియా-ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మపై కూడా 30 శాతం జరిమానా పడింది. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ బోర్డు ఈ కఠిన చర్యలు తీసుకుంది. లంక ఆటగాడు విషేన్ హలంబెజ్పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంది. అతడి మ్యాచ్లో కూడా 50 శాతం కోత విధించారు.ఏమి జరిగిదింటే?ముక్కోణపు సిరీస్లో భాగంగా జూన్ 15న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ 'సూపర్ ఓవర్'కు దారితీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 'ఎ' జట్టు విజయం సాధించింది. 17 పరుగుల టార్గెట్ను భారత్ చేధించలేకపోయింది. అయితే సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం శ్రీలంక యువ ఆటగాడు విషేన్ హలంబెజ్ శృతిమించి ప్రవర్తించాడు. ఓటమి బాధలో ఉన్న వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లి.. “ఇక లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్ళు.. ఇది ఐపీఎల్ కాదు” అని వ్యంగ్యంగా అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. హలంబెజ్ వైపు దూసుకెళ్లి అతని ఛాతీపై బలంగా నెట్టాడు. లంక ఆటగాడు కూడా ప్రతిఘటించడంతో ఇద్దరి తీవ్ర వాగ్వదం మొదలైంది. తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. అంతకుముందు వెలుతురు సరిగ్గా లేకపోయినప్పటికి అంపైర్లు సూపర్ ఓవర్ నిర్ణయించడం పట్ల భారత కెప్టెన్ తిలక్ వర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహణ, నో-బాల్ కాల్స్ వంటి విషయాల్లో అంపైర్లతో తిలక్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తిలక్పై కూడా బోర్డు క్రమశిక్షణా చర్యలు చర్యలు తీసుకుంది.చదవండి: అఫ్గానిస్తాన్ను చిత్తు చేసి.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ -
ఎందుకు అలా చేశావు.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్!
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. ముక్కోణపు వన్డే సిరీస్లో దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఎ తరపున వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకపై విఫలమైనప్పటికి అఫ్గాన్పై మాత్రం అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు.15 ఏళ్ల సూర్యవంశీ తనదైన శైలిలో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు దూకుడు చూసి సెంచరీ బాదడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా వైభవ్ మలుచుకోలేకపోయాడు.చెత్త షాట్ ఆడి..కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి. తనకు ఉన్న ఏకైక వీక్నెస్ ఈ మ్యాచ్లోనూ బయటపడింది. 'షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్' బంతికి మరోసారి తన వికెట్ను కోల్పోయాడు. ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్జాయ్ టీమిండియా ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన అబ్దుల్లా అహ్మద్జాయ్.. తొలి బంతిని ఆఫ్ స్టంప్కు వెలుపలగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అతడు రాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా బంతి అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. అసలు ఆ బంతికి ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా లేని షాట్ను ఆడి తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఐపీఎల్-2026లోనూ చాలా మ్యాచ్లలో షార్ట్ లెంగ్త్ బంతికే వైభవ్ ఔటయ్యాడు. అతడి బలహీనతను పసిగట్టిన అఫ్గాన్ పేసర్.. ఒకే లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేసి బోల్తా కొట్టించాడు. -
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. శ్రీలంక-ఎతో జరిగిన తొలి మ్యాచ్లో విఫలమై వైభవ్.. రెండో మ్యాచ్లో తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. భారత్-ఎ తరపున బరిలోకి సూర్యవంశీ.. అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేశాడు. పవర్ప్లేలో అతడు వేసిన మూడు ఓవర్లలోనూ పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.15 ఏళ్ల వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. కాగా ఈ యువ సంచలనం ఇటీవల ఇర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్చదవండి: MPL 2026: సన్రైజర్స్ ఆల్రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనేIt's Vaibhav Suryavanshi show against Afghanistan 👏Vaibhav Sooryavanshi smashed 44 runs in just 22 balls vs Afghanistan A which included 9 fours at an strike rate of 200 💥This 15 year old kid is just phenomenal and nightmare for the bowlers 🫡pic.twitter.com/wrRLpUezgS— Ajay Jadeja (@AjayJadeja171) June 11, 2026 -
అఫ్గానిస్తాన్తో మ్యాచ్.. బ్యాటింగ్ భారత్దే
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై సంచలన విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.మెన్ ఇన్ బ్లూ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.కాగా అందరి కళ్లు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్లో విఫలమైన వైభవ్.. ఇప్పుడు అఫ్గాన్పై ఎలా రాణిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్ -
బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెటర్.. భారత జట్టులోకి స్వాగతం!
శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్ కోసం ఇప్పటికే భారత-ఏ జట్టు ఆ గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో తెలుగు కుర్రాడు షేక్ రషీద్కు చోటు దక్కడం ఆసక్తికర అంశంగా మారింది. ధ్రువ్ జురేల్ నేతృత్వంలోని జట్టులో సాయి సుదర్శన్, పడిక్కల్, రుతురాజ్, ఆయుష్ బదోని వంటి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. 2021 అండర్-19 ఆసియా కప్ టోర్నీ ద్వారా షేక్ రషీద్ తొలిసారి బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. జట్టు టైటిల్ గెలవడంలో షేక్ రషీద్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్కు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఆరంభంలోనే కోవిడ్ బారిన పడ్డాడు. అయితే లీగ్ దశ ఆఖరికి చేరుకున్న క్రమంలో తిరిగి జట్టులోకి వచ్చిన రషీద్ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 108 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఫైనల్లోనూ కీలక హాఫ్ సెంచరీతో మెరిసిన షేక్ రషీద్ టీమిండియా టైటిల్ గెలవడంలోనూ సహాయపడ్డాడు.ఎవరీ షేక్ రషీద్?ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్ క్రికెట్ ప్రయాణం అడ్డంకులతో సాగింది. అతడి తండ్రి షేక్ వలీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొడుకు లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కష్టపడ్డాడు. తండ్రి త్యాగంతో ఇవాళ ఇండియా-ఏ జట్టుకు ఎంపికైన షేక్ రషీద్ త్వరలోనే జాతీయ జట్టుకు కూడా ఎంపికవ్వాలని కోరుకుందాం. అండర్-19 టీ20 ప్రపంచకప్ అతడికి గుర్తింపు తెచ్చినప్పటికీ దేశవాలీ క్రికెట్లో రాణించాలంటే రంజీ మ్యాచ్లు ఆడడం తప్పనిసరి. అందుకే 2022లో ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన షేక్ రషీద్ ఓర్పు, టెక్నిక్, సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యాన్ని అలవరుచుకున్నాడు. 2025-26 రంజీ సీజన్లో షేక్ రషీద్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో షేక్ర రషీద్ మూడు శతకాలతో 627 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 27 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన షేక్ రషీద్ 46 సగటుతో 1831 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలున్నాయి. లంక పర్యటనలో ముందుగా శ్రీలంక, అఫ్గానిస్తాన్తో కలిసి ఇండియా-ఏ ట్రై వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి.శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, ఎన్ జగదీశన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీఇండియా-ఏ టూర్ ఆఫ్ శ్రీలంక షెడ్యూల్జూన్ 25- తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)జులై 2- రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)చదవండి: గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు! -
మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్లో మెరుపులు మెరిపించిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు భారత్-ఎ జట్టు తరపున సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్-ఎ, శ్రీలంక జట్లతో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత బృందం శనివారం లంక గడ్డపై అడుగుపెట్టింది.ఇందులో వైభవ్ కూడా ఉన్నాడు. అయితే దంబుల్లా ఎయిర్ పోర్ట్ వెలుపుల సూర్యవంశీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో సూర్యవంశీ అసహనానికి గురయ్యాడు. ఈ యువ క్రికెటర్ తన లగేజ్తో పాటు బస్సు వైపు వెళ్తుండగా, ఫ్యాన్స్ 'సెల్ఫీ'ల కోసం ఎగబడ్డారు. దీంతో తన సహనం కోల్పోయిన వైభవ్.. చేతులు జోడించి ఓ అభిమానిని దయచేసి దూరంగా వెళ్లండని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ట్రైసిరీస్లో భారత-ఎ జట్టు తిలక్ వర్మ కెప్టెన్సీలో ఆడనుంది. ఈ జట్టులో సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఆయుష్ బదోని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. మే 9న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.As soon as Vaibhav Suryavanshi arrived in Sri Lanka, he looked a bit upset. There was sadness and slight frustration visible on his face. He also seemed bothered by the fans, and his disappointment was clearly noticeable while taking pictures with them.👀 pic.twitter.com/8H48R1VLld— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 5, 2026 -
రుతురాజ్ గైక్వాడ్కు బంపర్ ఆఫర్
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ గాయం కారణంగా లంక టూర్కు దూరమయ్యాడు. అతడి స్దానాన్ని మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో బీసీసీఐ భర్తీ చేసింది. తిలక్ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్ దాదాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతవుతున్నాడు. ఐపీఎల్-2026లో రుతురాజ్ 14 మ్యాచ్లు ఆడి కేవలం 337 పరుగులు చేశాడు. అయితే రుతు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశం.ఇక పరాగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే హ్యామ్స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత కొన్ని మ్యాచ్లకు దూరమైనప్పటికీ, జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండటంతో నొప్పితోనే తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ రాజస్తాన్ ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు అతడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో లంక పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ను జట్టులోకి తీసుకున్నారు. అతడు చివరగా 2025లో ఇండియా-ఎ తరపున సౌతాఫ్రికా-ఎపై ఆడాడు. ఆ సిరీస్లో గైక్వాడ్ 210 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా లంక టూర్లో భాగంగా భారత్-ఎ జట్టు.. శ్రీలంక-ఎ, అఫ్గానిస్తాన్-ఎ టీమ్స్తో ముక్కోణపు వన్డే సిరీస్లో తలపడనుంది.శ్రీలంక సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్
ఈ ఏడాది జూన్లో శ్రీలంకలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత 'ఎ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు.ఇక ఈ జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఈ చిచ్చర పిడుగు దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్లలో 236.56 స్ట్రైక్-రేట్తో 440 పరుగులు సాధించాడు.ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో కూడా వైభవ్ అదరగొట్టాడు. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో 175 పరుగులు సాధించి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. ఈ క్రమంలోనే అతడికి ఇండియా-ఎ జట్టులో చోటు లభించింది. అదేవిధంగా ఐపీఎల్లో రాణిస్తున్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంశ్ షెడ్గే వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్లతో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఈ ట్రై-సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.ఈ టోర్నీ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. , జూన్ 21న జరిగే ఫైనల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఇండియా 'ఎ' జట్టు శ్రీలంక 'ఎ'తో రెండు మల్టీ-డే మ్యాచ్లు కూడా ఆడనుంది. వైట్-బాల్ సిరీస్ దంబుల్లాలో, రెడ్-బాల్ మ్యాచ్లు గాలే వేదికగా జరగనున్నాయి.భారత-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్చదవండి: హార్దిక్ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు! -
పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భారత యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ అదరగొడుతున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు పాకిస్తాన్పై కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 45 పరుగులు చేశాడు.ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన వైభవ్, క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడితో పాటు నమన్ ధీర్(20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 35) రాణించాడు. వీరిద్దరి మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.10 ఓవర్లలో భారత్ స్కోర్ 93-3 ఉండగా 43 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో షాహిద్ అజీజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాజ్ సదఖత్, షాహిద్ అజీజ్ తలా రెండు వికెట్లు సాధించారు. -
ఇండియా టూర్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది నవంబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ప్రోటీస్ ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. నవంబర్ 14న కోల్కతా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో సౌతాఫ్రికా జట్టు ఇండియా పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా-ఎ జట్టు కూడా భారత్కు రానుంది.రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేల సిరీస్లో ఇండియా-ఎ జట్టును ప్రోటీస్-ఎ జట్టు ఢీకొట్టనుంది. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా-ఎ జట్టు పర్యటన ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్ల అనాధికారిక టెస్టు సిరీస్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో జరగనుండగా.. మూడు వన్డేలకు సిరీస్కు రాజ్కోట్ ఆతిథ్యమివ్వనుంది.ఈ క్రమంలో భారత్ టూర్కు సౌతాఫ్రికా-ఎ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు సిరీస్లలోనూ ప్రోటీస్ జట్టు కెప్టెన్గా మార్క్వెస్ జానీ అకెర్మాన్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా సౌతాఫ్రికా సీనియర్ జట్టు కెప్టెన్ టెంబా బావుమా కూడా ఈ జట్టులో ఉన్నాడు.వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్లో గాయపడిన బావుమా.. అప్పటినుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఓ వైపు గాయంతో పోరాడుతూనే.. 27 సంవత్సరాల తర్వాత తన జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ను అందించాడు. గాయం కారణంగా పాకిస్తాన్ టూర్కు బావుమా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఐడైన్ మార్క్రమ్ సఫారీలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు భారత్తో సిరీస్కు ముందు తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించాలని టెంబా పట్టుదలతో ఉన్నాడు. ఇండియా-ఎతో జరిగే రెండో టెస్టులో అతడు ఆడనున్నాడు. తొలి టెస్టుకు దూరంగా ఉంటాడని సౌతాఫ్రికా క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది.అనధికారిక టెస్టుల కోసం సౌతాఫ్రికా జట్టు: మార్క్వెస్ అకెర్మాన్, టెంబా బావుమా*, ఓకుహ్లే సెలె, జుబేర్ హంజా, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్సామి, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, లెసెగో సెనోక్వానే, లెసెగో సెనోక్వానే, ప్రెనెలన్ సుబ్రాయెన్, కైల్ సిమ్మండ్స్, త్సెపో ద్వాండ్వా, జాసన్ స్మిత్, టియాన్ వాన్ వురెన్, కోడి యూసుఫ్.వన్డేల కోసం సౌతాఫ్రికా జట్టు: మార్క్వెస్ అకెర్మాన్, ఒట్నీల్ బార్ట్మన్, బ్జోర్న్ ఫోర్టుయిన్, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, క్వేనా మఫాకా, రివాల్డో మూన్సామి, త్షెపో మోరెకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, డెలానో పోట్గీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెథెంబ క్యూషీలే, జాసన్ స్మిత్, కోడి యూసుఫ్.చదవండి: హైదరాబాద్లో మెరుపులు.. ఇద్దరు డబుల్ సెంచరీలు.. ఏకంగా 529 రన్స్ -
శ్రేయస్, ఆర్య సెంచరీలు.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి అనాధికారిక వన్డేలో 171 పరుగుల తేడాతో భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. 414 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఆసీస్ జట్టు 33.1 ఓవర్లలో కేవలం 242 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ నిశాంత్ సింధూ 4 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. అతడితో పాటు రవి బిష్ణోయ్ రెండు, సిమ్రాన్జీత్ సింగ్, యుద్ద్వీర్ సింగ్, అయూష్ బదోని తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో మెకెంజీ హార్వే(68) టాప్ స్కోరర్గా నిలవగా.. సదర్లాండ్(50), లాచ్లాన్ షా(45) పర్వాలేదన్పించారు.అయ్యర్, ఆర్య సెంచరీలు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్( 83 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 110 పరుగులు), ప్రియాన్ష్ ఆర్య( 11 ఫోర్లు, 5 సిక్స్లతో 101) సూపర్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరితో పాటు ప్రభ్ సిమ్రాన్ సింగ్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 56), రియాన్ పరాగ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 67), బదోని(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. సీస్ బౌలర్లలో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆక్టోబర్ 3న కాన్పూర్ వేదికగానే జరగనుంది.చదవండి: ILT20: అశ్విన్కు ఘోర అవమానం.. అస్సలు ఊహించి ఉండడు -
భారత జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన
ఆస్ట్రేలియా-తో జరగనున్న రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. అయ్యర్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు.అదేవిధంగా దులీప్ ట్రోఫీ-2025కు దూరమైన బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు దేవ్దత్త్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డికి కూడా చోటు దక్కింది. నితీశ్ ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు.అతడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో అదరగొడుతున్న తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ నారయణ్ జగదీశన్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఇదే టోర్నీలో సెంచరీతో మెరిసిన రుతురాజ్ గైక్వాడ్ను మాత్రం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.అతడితో పాటు మధ్యప్రదేశ్ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ను కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. తద్వారా వీరిద్దరూ ఇండియా రెడ్ బాల్ క్రికెట్ సెటాప్లో లేనిట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ టూర్లో అరంగేట్రం చేసిన తమిళనాడు ఆటగాడు సాయిసుదర్శన్ సైతం ఈ జట్టులో ఉన్నాడు.ఫాస్ట్ బౌలర్లగా ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖాలీల్ అహ్మద్, యష్ ఠాకూర్లను ఎంపిక చేశారు. కాగా రెండో టెస్టుకు టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ జట్టుతో చేరనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.టెస్టు జట్టులోకి అయ్యర్ ఎంట్రీ?కాగా స్వదేశంలో వెస్టిండీస్ జరగనున్న టెస్టు సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసే అవకాశముంది. ఇంగ్లండ్ టూర్కు, ఆసియాకప్-2025కు అయ్యర్ను ఎంపికచేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని తిరిగి భారత టెస్టు జట్టులోకి తీసుకు వచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు కెప్టెన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియా-ఎ జట్టు రెండు టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు భారత్కు రానుంది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ సెప్టెంబర్-16 నుంచి సెప్టెంబర్-23 వరకు జరగనుంది. రెండు మ్యాచ్లు కూడా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరగనుంది. అనంతరం ఆక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్-భారత్ టెస్టు సిరీస్ మొదలు కానుంది.భారత్-ఎ జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్,ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ -
ఆస్ట్రేలియా టూర్.. రోహిత్ శర్మ ఊహించని నిర్ణయం!?
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనాధికారిక మూడు వన్డేల సిరీస్లో భారత్-ఎ తరపున ఆడేందుకు రోహిత్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. కాగా టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఈ ఏడాది ఆక్టోబర్లో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్-2025 తర్వాత క్రికెట్ దూరంగా ఉంటున్న హిట్మ్యాన్.. ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక సిరీస్ను సన్నహాకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవ్ స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది.కాగా ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోహిత్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపించాయి. వన్డే ప్రపంచకప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్, కోహ్లి స్దానాల్లో యువ ఆటగాళ్లను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అంతేకాకుండా వన్డేల్లో తన స్ధానాన్ని కాపాడుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడమని రోహిత్ను సెలక్టర్లు కోరనున్నట్లు సమాచారం. మరి రోహిత్ ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతాడో లేదో వేచి చూడాలి. అయితే ఆసియాకప్ ముగిసిన తర్వాత వన్డే జట్టు భవిష్యత్తు గురించి చర్చించడానికి సెలెక్టర్లు ముంబైలో సమావేశం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఒకవేళ రోహిత్ తన కెరీర్ను ముగిస్తే భారత వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2018లో ముంబై తరపున ఆడాడు.చదవండి: Ajinkya Rahane: ఇక గుడ్ బై.. అజింక్య రహానే సంచలన నిర్ణయం -
అదరగొట్టిన తనీష్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. టీమిండియా తమ సెకెండ్ ఇన్నింగ్స్ను 417/7 వద్ద డిక్లేర్ చేసింది. 163/4 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్-ఎ.. అదనంగా 254 పరుగులు జోడించింది.దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపునుకుని ఇంగ్లండ్ లయన్స్ ముందు 439 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు ఉంచింది. భారత బ్యాటర్లలో తనీష్ కోటియన్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. తనీష్(108 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 90) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిమన్యు ఈశ్వరన్(80), రాహుల్(51), కాంబోజ్(51) రాణించారు.ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో జార్జ్ హిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, జాక్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇదే ఆఖరి రోజు కావడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశముంది. -
IND-A vs ENG: 348 పరుగులకు భారత్-ఎ ఆలౌట్
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనాధికారిక భారత్-ఎ జట్టు బ్యాటర్లు రాణించారు. టాస్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. 319/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా 29 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్ను ముగించింది. ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 168 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 116 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. రాహుల్తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా..జోష్ టంగ్, జార్జ్ హిల్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.మరో 13 రోజుల్లో..ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. తొలి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండా ఇంగ్లండ్కు వెళ్లిన టీమిండియా.. ప్రత్యర్ధి జట్టును ఎలా ఎదుర్కొంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ఇంగ్లండ్ టూర్కు భారత-ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా అభిమన్యు ఈశ్వరన్ నియమితుడయ్యాడు. ఈ టూర్లో ఈశ్వరన్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు. కాగా ఇండియా-ఎ జట్టుకు చానాళ్ల తర్వాత వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ ఎంపికయ్యాడు. కరుణ్ 8 ఏళ్ల తర్వాత ఇండియా సీనియర్ టెస్టు జట్టులోకి సైతం రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక కరుణ్ నాయర్తో పాటు ఇషాన్ కిషన్కు కూడా భారత-ఎ జట్టులో చోటు దక్కింది. అయితే ఆశ్చర్యకరంగా శ్రేయాస్ అయ్యర్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అయ్యర్ ఇంగ్లండ్తో టెస్టులకు ప్రధాన భారత జట్టులో లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఈ 18 మంది సభ్యుల జట్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ కూడా ఉన్నారు. వారిని ప్రాక్టీస్ కోసం ముందుగా ఇంగ్లండ్కు బీసీసీఐ పంపింది. అదేవిదంగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ తర్వాత శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్లు ఇండియా-ఎ జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. వికెట్ల వీరుడికు చోటుఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ హర్ష్ దుబే కూడా భారత-ఎ జట్టులో భాగమయ్యాడు. ఈ విదర్భ స్పిన్నర్ 10 మ్యాచ్ల్లో 17 సగటుతో 69 వికెట్లు పడగొట్టాడు. మరో ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా ప్రధాన సిరీస్కు ముందు ఇండియా-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లు మే 30 నుండి జూన్ 9 వరకు జరగనున్నాయి.ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే -
తీరు మారని టీమిండియా.. ఆసీస్ చేతిలో మరో ఓటమి
ఆస్ట్రేలియా గడ్డపై భారత-ఎ జట్టుకు ఘోర పరభావం ఎదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ అయింది.168 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలుత ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ను శామ్ కాన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ (25) ఆదుకున్నారు.ఆ తర్వాత మెక్స్వీనీ ఔటైనప్పటకీ శామ్ కాన్స్టాస్(73), వెబ్స్టార్(46) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించారు.భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా, కొటియన్ ఒక్క వికెట్ సాధించారు.మరోసారి ధృవ్.. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 229 పరుగులకు ఆలౌటైంది. 75/5 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత-ఎ జట్టు అదనంగా 154 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది. మరోసారి వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 122 బంతులు ఎదుర్కొన్న జురెల్ 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు తనీష్ కొటియన్(44), నితీష్ కుమార్ రెడ్డి(38) పరుగులతో రాణించారు.కాగా తొలి ఇన్నింగ్స్లో కూడా ధృవ్ (80) ఒంటరిపోరాటం చేశాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్గా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ సిరీస్ను టీమిండియా కోల్పోయింది. ధ్రువ్ జురెల్తో పాటు భారత-ఎ జట్టుతో చేరిన మరో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు.చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో -
ఏంటి రాహుల్.. మరీ ఇంత చెత్తగా అవుటవుతావా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఇప్పుడు కీలకమైన సెకెండ్ ఇన్నింగ్స్లో అదే తీరును కనబరిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో రాహుల్ వినూత్న రీతిలో తన వికెట్ను కోల్పోయాడు.అసలేం జరిగిందంటే?భారత్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన స్పిన్నర్ కోరి రోకిసియోలి తొలి బంతిని రాహుల్ ఓవర్ ది వికెట్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. కానీ బంతి లెగ్ సైడ్ నుండి టర్న్ అవుతుండడంతో రాహుల్ తన ప్యాడ్లతో డిఫెండ్కు ప్రయత్నించాడు. కానీ బంతి రాహుల్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి బెయిల్స్ను గిరాటేసింది. దీంతో రాహుల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి రాహుల్ ఇంత చెత్తగా అవుటవుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(19), నితీష్ కుమార్ రెడ్డి(9) పరుగులతో ఉన్నారు. "Don't know what he was thinking!"Oops... that's an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz— cricket.com.au (@cricketcomau) November 8, 2024 -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టు బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 223 పరుగులకు ఆలౌటైంది. 52/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ అదనంగా 171 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్ను ముగించింది. దీంతో కంగారులకు మొదటి ఇన్నింగ్స్లో 62 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ హ్యారీస్(74) టాప్ స్కోరర్గా నిలవగా.. కోరీ రోకిసియోలి(35),పీర్సన్(30) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు పడగొట్టగా, ముఖేష్ కుమార్ మూడు, ఖాలీల్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించారు.ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం..అంతకుముందు భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్(80) మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో నీసర్ 4 వికెట్లు పడగొట్టగా, వెబ్స్టెర్ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్.. బంగ్లా బౌలర్లకు చుక్కలు
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 248 బంతులు ఎదుర్కొన్న ఈశ్వరన్ 14 ఫోర్లు, 2 సిక్స్లతో 157 పరుగులు సాధించాడు. మూడో రోజు ఆట ప్రారంభంలోనే ముస్ఫిక్ హసన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. కాగా ఈశ్వరన్కు బంగ్లా పర్యటనలో ఇది వరుసగా రెండో సెంచరీ. ఇక అతడితో పాటు చెతేశ్వర్ పుజారా (52), శ్రీకర్ భరత్(77) పరుగులతో రాణించారు. 110 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టుకు 159 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. క్రీజులో జయంత్ యాదవ్, సూరభ్ కుమార్ ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఆతిథ్య బంగ్లా జట్టులో షాహదత్ హుస్సేన్ (80; 9 ఫోర్లు, 2 సిక్స్లు), జకీర్ అలీ (62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్తో పాటు -
బంగ్లాదేశ్తో తొలి టెస్టు.. భారీ ఆధిక్యంలో భారత 'ఎ' జట్టు
కాక్స్ బజార్: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 353 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. గురువారం మూడో రోజు 404/5 ఓవర్నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్ను 465/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ బ్యాటర్స్లో ఉపేంద్ర (71 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం బంగ్లాదేశ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. హసన్ (21) నిష్క్రమించగా, జకీర్ (81 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్లు), నజ్ముల్ (56 బ్యాటింగ్; 7 ఫోర్లు) అబేధ్యమైన రెండో వికెట్కు 101 పరుగులు జోడించారు. న్నర్ సౌరభ్ కుమార్ ఒక వికెట్ తీశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... బంగ్లా ఇంకా 181 పరుగులు వెనుకంజలోనే ఉంది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. ఫోటోలు వైరల్ -
న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత జట్టులోకి హైదరాబాద్ ఆటగాడు!
ముంబై: పరిమితంగా జరిగిన దేశవాళీ టోర్నీలతో పాటు, ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మెరిసిన హైదరాబాదీ యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ భారత ‘ఎ’ జట్టులోకి ఎంపికయ్యాడు. ఇందులో ఆంధ్ర వికెట్ కీపర్–బ్యాటర్ శ్రీకర్ భరత్కు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఈ జట్టు భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్ ‘ఎ’తో నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్లు ఆడుతుంది. సెప్టెంబర్ 1 నుంచి బెంగళూరు, హుబ్లీ వేదికగా మూడు మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. అనంతరం ఇరు జట్ల మధ్య చెన్నైలో వన్డే సిరీస్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో తలపడే జట్టును మాత్రమే ఎంపిక చేశారు. వన్డే జట్టును తర్వాత ఎంపిక చేయనున్నట్లు ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ వర్గాలు తెలిపాయి. భారత్ ‘ఎ’ జట్టు: ప్రియాంక్ పాంచల్ (కెప్టెన్), తిలక్ వర్మ, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, రాహుల్ చహర్, ప్రసిధ్ కృష్ణ, ఉమ్రాన్ మలిక్, ముకేశ్ కుమార్, యశ్ దయాళ్, అర్జాన్ నాగ్వాస్వాలా. చదవండి: న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత కెప్టెన్గా శుబ్మన్ గిల్! -
న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత కెప్టెన్గా శుబ్మన్ గిల్!
స్వదేశంలో న్యూజిలాండ్-'ఎ' తో జరగనున్న సిరీస్(నాలుగు రోజులు పాటు జరిగే టెస్టు మ్యాచ్)కు భారత్- 'ఎ' జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. కాగా బీసీసీఐ ప్రకటించిన ఈ జట్టులో హనుమ విహారి, వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా రంజీట్రోఫీ(2021-22)లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, షామ్స్ మూలానీ, సర్ఫరాజ్ ఖాన్, యష్ దూబే వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. కాగా ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్తో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 1న బెంగళూరు వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్-‘ఎ’ టూర్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని మ్యాచ్లు అన్నీ బెంగళూరు వేదికగానే జరగనున్నాయి. అదే విధంగా వన్డే సిరీస్కు చెన్నై వేదికగా కానుంది. భారత్-ఏ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశ్ దూబే, హనుమ విహారి, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, జలజ్ సక్సేనా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, శుభమ్ శర్మ, అక్షయ్ వాడ్కర్, షాబాజ్ అహ్మద్, మణిశంకర్ మురాసింగ్ చదవండి: David Warner: వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ లీగ్లో రీ ఎంట్రీ! -
తొలి రోజు భారత్పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా...
India A bowlers toil on opening day against South Africa A: భారత్ ‘ఎ’తో ఆరంభమైన తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ మొదటి రోజు చెలరేగింది. ఓపెనర్ పీటర్ మలాన్ (258 బంతుల్లో 157 నాటౌట్; 18 ఫోర్లు), టోని డి జోర్జి (186 బంతుల్లో 117; 18 ఫోర్లు) శతకాలు సాధించడంతో మంగళవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్, అర్జాన్, సైనీ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: ఆటలో దూకుడు పెంచాను చతేశ్వర్ పుజారా వ్యాఖ్య -
భారత్ ‘ఎ’ గెలుపు
బెంగళూరు: స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1–1తో ముగించింది. ఆట చివరిరోజు మంగళవారం ఓవర్నైట్ స్కోరు 38/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ‘ఎ’ 213 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. నదీమ్కు రెండు వికెట్లు దక్కాయి. 8 ఓవర్లలో 55 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 6.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దానిని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (3), శుబ్మన్ గిల్ (4), కృష్ణప్ప గౌతమ్ (1), భరత్ (12) ఔటవ్వగా... అంకిత్ బావ్నే (18 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), సమర్థ్ (5 నాటౌట్) భారత్ విజయాన్ని ఖాయం చేశారు. సంక్షిప్త స్కోర్లు ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 346; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 505; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 213 (హ్యాండ్స్కోంబ్ 56, మార్‡్ష 36, చహర్ 2/30, నదీమ్ 2/67, గౌతమ్ 3/39, కుల్దీప్ 3/46); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 55/4. -
యో-యో టెస్టులో సంజు శాంసన్ విఫలం
ముంబై: ఐపీఎల్-11 సీజన్లో మెరుగ్గా రాణించి.. భారత-ఎ జట్టులో చోటు సంపాదించిన వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ సంజు శాంసన్ తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన నుంచి సంజు శాంసన్ తప్పుకోవాల్సి వచ్చింది. జూన్ 17 నుంచి ఇంగ్లండ్ వేదికగా మూడు జూనియర్ జాతీయ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. వెస్టిండీస్- ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ కోసం ఇటీవల భారత- ఎ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. కాగా, క్రికెటర్లందరికీ మూడు రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్టుని నిర్వహించారు. ఈ టెస్టులో సంజు శాంసన్ ఫెయిలవడంతో అతన్ని ఇంగ్లండ్కు వెళ్లే జట్టు నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తప్పించింది. భారతత-ఎ జట్టుకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. జట్టులో పృథ్వీ షా, శుభమన్ గిల్, రిషబ్ పంత్ తదితర యువ క్రికెటర్లకి చోటు దక్కింది. తాజాగా సంజూ శాంసన్ జట్టు నుంచి పక్కకి వెళ్లడంతో.. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపట్టనున్నాడు. -
రాణించిన రాయుడు, జాదవ్
డార్విన్: తెలుగు కుర్రాడు అంబటి రాయుడు, కేదార్ జాదవ్ అర్థ సెంచరీలు సాధించడంతో నాలుగు దేశాల సిరీస్లో భారత్-ఎ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా-ఎ జట్టును భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్ మనోజ్ కుమార్ తివారి 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాయుడు 77, జాదవ్ 42, శామ్సన్ 49, పర్వేజ్ రసూల్ 20, ఊతప్ప 13 పరుగులు చేశారు.


