inter-state thieves
-
మహారాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
కొన్ని రోజులుగా నగరంలో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. నగలు మెరుగు పెడతామంటూ జనాన్ని మభ్యపెట్టి ఆపై నగలతో మాయమవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీ బంగారంతోపాటు నాలుగు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై తెలంగాణ, మహారాష్ట్రల్లో 25 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
నల్లగొండ రూరల్, న్యూస్లైన్ : ఇళ్లు, దుకాణాల ఎదుట పార్కింగ్ చేసిన మోటార్సైకిళ్లను చాకచక్యంగా అపహరించే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. శనివారం తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రభాకర్రావు నిందితుల వివరాలు వెల్లడించారు. గుర్రంపోడు మం డలం కోయగూరోని బావి గ్రామానికి చెందిన షేక్ మహమూద్, షేక్ తాజుద్దీన్, మహబూబ్నగర్ జిల్లా చలకుర్తికి చెందిన షేక్ కదీర్లు స్నేహితులు. వీరు తాగుడు, జల్సాల కు అలవాటుపడి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ కమిషనరేట్ ప్రాంతాల్లో మొత్తంగా 55 బైకులను దొంగలించి కోయగూరోని బావి గ్రామంలోని ఓ బత్తాయి తోటలో ఉంచారు. వీటిని ఒక్కొక్కటిగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొనుగోలు దారులు కాగితాలు గురించి అడిగితే ఫైనాన్స్లో ఉన్నాయని, ఇంకా క్లియర్ కాలేదని చెబుతు కాలయాపన చేసుకుంటూ వచ్చారు. శుక్రవారం గుర్రంపోడులో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించగా బైకుల గుట్టు రట్టయింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 55 బైకుల విలువ రూ.25 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రమారాజేశ్వరి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్:నగదు,బంగారం స్వాధీనం
హైదరాబాద్: కృష్టా జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలలో అయిదుగురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, బైకులు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో నలుగురు అంతర్రాష్ట్ర బ్యాంక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని చిత్తూరు, తమిళనాడులకు చెందిన అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 32 లక్షల 84 వేల రూపాయల నగదు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పోలీసులు ఒక అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 34 సవర్ల బంగారం, 10 తులాల వెండి, 25 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఒక వ్యక్తి నుంచి 900 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి బ్యాంకాక్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.