Investors and investments
-
ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంచుతున్న ఫండ్స్ ఇవి..
అగ్రెస్సివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా గడిచిన ఏడాది కాలంలో ఈ విభాగంలో కొత్తగా 3.5 లక్షల మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. దీంతో 2025 ఏప్రిల్ నాటికి హైబ్రిడ్ ఫండ్స్ పరిధిలోని మొత్తం ఇన్వెస్టర్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 58 లక్షలకు చేరాయి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ సైతం 12 శాతం పెరిగి రూ.2.26 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 ఏప్రిల్ నాటికి ఈ మొత్తం రూ.2.02 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.అగ్రెస్సివ్ హైబిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలతోపాటు డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈక్విటీలకు 65–80 శాతం మధ్య.. మిగిలిన మేర డెట్కు కేటాయింపులు చేస్తుంటాయి. తద్వారా పెట్టుబడుల వృద్ధితోపాటు, స్థిరత్వానికి ఇవి ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈక్విటీ పెట్టుబడుల అస్థిరతలను కొంత తగ్గించుకోవాలని చూసే వారికి ఇవి అనుకూలం. గతేడాది కాలంలో ఈక్విటీల్లో ఆటుపోట్లు పెరిగిపోయిన తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్కు ఇన్వెస్టర్ల ప్రాధాన్యం పెరిగినట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ 9 శాతం రాబడులను ఇవ్వగా.. రెండేళ్ల కాలంలో వార్షిక రాబడి 20 శాతం, మూడేళ్లలో 15 శాతం, ఐదేళ్లలో సగటున 21 శాతం చొప్పున ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఇవి అనుకూలమని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ సూచించారు.ఇదీ చదవండి: పేటీఎమ్లో రూ.2,104 కోట్ల బ్లాక్డీల్భవిష్యత్కు అనుకూలం..రానున్న కాలానికి పెట్టుబడుల కోసంయాక్టివ్ నిర్వహణలోని అగ్రెస్సివ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ మొత్తంగా కాకుండా.. రంగాల వారీ, స్టాక్స్ వారీ కదలికలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. చురుకైన విధానంతో నడిచే అగ్రెస్సివ్ ఫండ్స్ మెరుగైన అవకాశాలను సొంతం చేసుకోగలవన్న అభిప్రాయాన్ని జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ వ్యక్తం చేశారు. సెబీ ఎఫ్అండ్వో నిబంధనలను కఠినతరం చేయడంతో కొందరు ఇన్వెస్టర్లు పన్ను ఆదా, బ్యాలన్స్డ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలున్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 18.5–24 శాతం మధ్య ఉంది. ఈ తరహా ఫండ్స్లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను నిపుణులు సూచిస్తున్నారు. -
ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ మార్పుల కారణంగా భారతదేశ రక్షణ సాంకేతిక రంగాన్ని పెట్టుబడిదారులు అవకాశంగా చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం బలమైన విధాన మద్దతు, వేగవంతమైన సాంకేతిక పురోగతి ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్రం దృష్టి సారించడం, పరిశ్రమ ఆవిష్కరణలు, వ్యూహాత్మక పరిష్కారాలకు భారత్ గ్లోబల్ హబ్గా రూపాంతరం చెందే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తిగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.పెట్టుబడుల వృద్ధికి కారణాలుదేశీయ రక్షణ తయారీని బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చర్యల వల్ల వివిధ కంపెనీలతో ఇటీవల 253 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోవడంతో రూ.53,439 కోట్ల పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం వల్ల రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడిదారులకు భారత్ ఆకర్షణీయంగా మారుతోంది.సాంకేతికత అభివృద్ధిసివిలియన్, మిలిటరీ అప్లికేషన్లకు సర్వీసులు అందించే డ్యుయల్-యూజ్ టెక్నాలజీలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. నిఘా, వ్యూహాత్మక కార్యకలాపాల కోసం స్వయంప్రతిపత్తి కలిగిన డ్రోన్ల తయారీ సంస్థలపై దృష్టి సారిస్తున్నారు. రియల్ టైమ్ ముప్పును గుర్తించడం కోసం ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను రూపొందించే కంపెనీలను గుర్తిస్తున్నారు. సముద్ర భద్రత, అన్వేషణ కోసం అండర్ వాటర్ డ్రోన్లు, అధునాతన డిఫెన్స్ ఇమేజింగ్, ఇంటెలిజెన్స్ కోసం హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాల వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ అంతరించనుందా..?కంపెనీల తీరుడిఫెన్స్ టెక్ స్టార్టప్లు డీప్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ), మాడ్యులర్ టెక్నాలజీ, రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇస్తూ దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నాయి. కంపెనీలు తక్కువ ఖర్చుతో సుస్థిరమైన, కృత్రిమ మేధ ఆధారిత రక్షణ పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నాయి. -
వచ్చే ఏడాదిలోనూ పసిడిలో రాబడులు
న్యూఢిల్లీ: సంవత్ 2081లోనూ (వచ్చే ఏడాది కాలంలో) బంగారం, వెండి ఇన్వెస్టర్లకు రాబడులు కురిపించనున్నాయి!. దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధికి తోడు, అనిశి్చతుల్లో సురక్షిత సాధనంగా ఉన్న గుర్తింపు బంగారంలో ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్ 2080లో నిఫ్టీ 25 శాతం పెరగ్గా, బంగారం 30 శాతం రాబడులను ఇచ్చింది. ‘‘సంవత్ 2081 బంగారానికి అనుకూలంగా ఉంటుంది. కనీసం 10 శాతం రాబడులు ఇవ్వొచ్చు. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రభావంతో కొనుగోళ్లు ఇదే మాదిరి కొనసాగితే గరిష్టంగా 15–18% రాబడులకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ దిగుమతులపై సుంకాలు పెంచితే బంగారం పనితీరు 15 శాతాన్ని మించొచ్చు. స్థిరమైన వడ్డీ రేట్ల వాతావరణం సైతం బంగారం ఎగువవైపు ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. సంవత్ 2080లో వెండి ధర 40% ర్యాలీ చేసిందని, రాబడుల్లో స్థిరమైన ధోరణి కొనసాగుతుందని అన్నారు. -
ఈ వారం ఐపీఓల ఇన్వెస్టర్లకు పండగే
-
పెట్టుబడులు తిరిగివ్వాలని స్టార్టప్లు భావించడం లేదు
న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి తీసుకున్న పెట్టుబడులను తిరిగి ఇచ్చేయడం తమ బాధ్యతని అంకుర సంస్థల వ్యవస్థాపకులు భావించడం లేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్లలో గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్లు పడిపోతుండటం మొదలైన వాటన్నింటికీ ఇదే కారణమని వారు చెబుతున్నారు. బైజూస్, భారత్పే వంటి టాప్ స్టార్టప్స్ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలువురు మదుపుదారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘వ్యవస్థాపకులు తాము తీసుకున్న పెట్టుబడులను బాధ్యతగా తిరిగి ఇచ్చేయాలని భావించకపోతుండటమే కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్ల పతనానికి దారి తీస్తోంది‘ అని 100ఎక్స్డాట్వీసీ వ్యవస్థాపకుడు యజ్ఞేష్ సంఘ్రాజ్కా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల సమస్యలు చాలా కాలంగా ఉన్నవేనని, ఇవి స్టార్టప్లకే పరిమితం కాకుండా సాధారణంగా లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీల్లోనూ కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, లాభాలు, వృద్ధిపై అత్యుత్సాహం చూపించే క్రమంలో స్టార్టప్లు కీలకమైన గవర్నెన్స్, నిబంధనల పాటింపు వంటి ప్రక్రియలను ఒకోసారి విస్మరిస్తుంటాయని సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ చెప్పారు. వ్యవస్థాపకులు లాభాలపై దృష్టి పెట్టాలి కానీ గవర్నెన్స్ను పట్టించుకోవడం మానేయకూడదు అని ఆయన సూచించారు. ప్రతి స్టార్టప్ .. కస్టమర్ల కోసం టెక్నాలజీని తయారు చేయడంపైనే పూర్తిగా దృష్టి పెడుతుందే తప్ప తమ సంస్థలో అంతర్గతంగా పాటించాల్సిన వాటికోసం టెక్నాలజీని రూపొందించుకోవడంపై అంతగా శ్రద్ధ చూపించదని యూనికస్ కన్సల్టెక్ సహ వ్యవస్థాపకుడు సందీప్ ఖేతాన్ తెలిపారు. అయితే, దేశీయంగా 95 శాతం స్టార్టప్లు నిజాయితీగా, నిబంధనలను పాటించే విధంగానే ఉంటున్నాయని ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ అభిప్రాయపడ్డారు. -
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు: రెండో రోజు ఫొటోలు
-
ఇన్నోవేషన్లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది: రెడ్డీస్ ల్యాబ్ సతీష్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సమ్మిట్ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో పెట్టబోయే పెట్టుబడులను ప్రకటిస్తున్నారు. సమ్మిట్లో భాగంగా.. రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషి అమోఘం అని అన్నారు. అవాడ గ్రూప్ ఛైర్మన్ వినిత్ మిట్టల్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ అప్రోచ్ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ వన్గా నిలిచింది. నెంబర్ వన్గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు. సెయింట్ గొబెయిన్ సీఈవో సంతానం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది. లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నాయి. నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాజర్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జోష్గా సాగింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు. అపాచీ అండ్ హిల్టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియో లీ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. మూడు దేశాల్లో అపాచీ గ్రూప్ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్ విజనరీ లీడర్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో డైనమిక్ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు. -
విశాఖ జీఐఎస్: దిగ్గజ కంపెనీలతో ఏపీ ఎంవోయూలు (ఫొటోలు)
-
విశాఖ జీఐఎస్: వ్యాపార ప్రముఖులను సత్కరించిన సీఎం వైఎస్ జగన్(ఫొటోలు)
-
జీఐఎస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్
GIS-2023 Updates.. సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ►రెండు రోజుల్లో 352 ఎంవోయూలు ►మొత్తం రూ. 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు ► రూ. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి ►జీఐఎస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్ ►గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోంది కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించాం ►ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతున్నాం ►15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయి ►కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయి ►ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులో వేస్తోంది ►పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నాం ►కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించాం ►పలు రంగాల్లో నాణ్యమైన పెట్టుబడులు ►గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం ►పారిశ్రామిక వేత్తలకు సంపూర్ణ సహకారం ►ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వ సహకారం ►జీఐఎస్ విజయానికి కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు ►నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్ ►బ్లూస్టార్ యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్ ►పోర్టులు, షిప్పింగ్శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘జీఐఎస్ పాల్గొనడం సంతోషకరం. దేశంలో విశాఖ ప్రత్యేక నగరంగా నిలిచింది: విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. శతాబ్దాలుగా భారత్లో విశాఖ కీలకంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ ఇండియా అభివృద్ధి. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం’అని అన్నారు. ►కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జీఐఎస్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించింది. ప్రతిభగల యువత ఏపీలో ఉంది. నైపుణ్యంగల మానవ వనరులు ఏపీ సొంతం’ అని పేర్కొన్నారు. ►భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర కె ఎల్లా మాట్లాడుతూ.. ‘ ఏపీ అభివృద్ధిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా భావించి జీవిఎస్ నిర్వహించారు.పలు కీలక రంగాల్లో ఏపీ ప్రగతి బాగుంది. సీఐఐకి దివంగత సీఎం వైఎస్సార్ సహకారం మరువలేనిది. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూడటం ప్రశంసనీయం. ఇండియా ప్రగతిలో ఏపీ కీలక భాగస్వామి అవుతోంది. సమ్మిళిత వృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు’ అని ప్రశంసించారు. ► రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషి అమోఘం’ అని పేర్కొన్నారు. ► అపాచీ అండ్ హిల్టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియో లీ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. మూడు దేశాల్లో అపాచీ గ్రూప్ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్ విజనరీ లీడర్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో డైనమిక్ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు. ► సెయింట్ గొబెయిన్ సీఈవో సంతానం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది. ► హెటిరో గ్రూప్ ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ బండి మాట్లాడుతూ.. ప్రపంచ ఫార్మా రంగంలో ఏపీ కీలక ప్రాత పోషిస్తోంది. ఏపీలో ఫార్మా విధానాలతో ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమలకు ఏపీ సర్కార్ సహకారం అమోఘం అని అన్నారు. ► లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నాయి. ► నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాజర్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జోష్గా సాగింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు. ► అవాడ గ్రూప్ ఛైర్మన్ వినిత్ మిట్టల్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ అప్రోచ్ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ వన్గా నిలిచింది. నెంబర్ వన్గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు. ► మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి. సీఎం జగన్ దార్శనికతతో పారిశ్రామికంగా మందడుగు వేస్తున్నాం. జీఐఎస్ చారిత్రాత్మక విజయం సాధించింది. వివిధ దేశాల నుంచి ప్రసిద్ధ సంస్థలు జీఐఎస్కు వచ్చాయి. రెండు రోజల సదస్సులో విలువైన చర్చలు జరిగాయి. పారిశ్రామికవేత్తల అంచనాలకు తగినట్టు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ► సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జీఐఎస్ అంచనాలకు మించి విజయం సాధించింది. పారిశ్రామిక దిగ్గజాలు తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. జీఐఎస్ సూపర్ సక్సెస్ సాధించింది. ► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ. ► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. స్వాగతం పలికిన సీఎం జగన్. ► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పారిశ్రామికవేత్తలతో మాటామంతి. ► లారెస్ కంపెనీ అధినేత సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇది వరకే 5వేల మందికి ఉపాధి కల్పించాము. ఇంకా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. కెమికల్స్, లాజిస్టిక్స్, ఫార్మా రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం. ► మంత్రి రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ సమర్ధవంతమైన నాయకత్వం వల్లే భారీగా పెట్టుబడులు వచ్చాయి. ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మీద పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శనం. పారదర్శకమైన పాలన వల్లే ఇది సాధ్యమైంది. ► మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్. ► బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఏపీకి పెట్టుబడులు రావడం చాలా సంతోషం. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్దికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తారని భావిస్తున్నాను. ► విశాఖ చేరుకున్న కేంద్ర పోర్టులు, షిప్పింగ్స్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాలా 2వ రోజు ఎంవోయూలు ►రిలయన్స్ ఎంవోయూ రూ. 50,000 కోట్లు ►హెచ్పీసీఎల్ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్ల ►టీవీఎస్ ఐఎల్పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు ►ఎకో స్టీల్ ఎంవోయూ రూ. 894 కోట్లు ►బ్లూస్టార్ ఎంవోయూ రూ. 890 కోట్లు ►ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ రూ. 850 కోట్లు ►గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►ఎక్స్ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►రామ్కో ఎంవోయూ రూ. 750 కోట్లు ►క్రిబ్కో గ్రీన్ ఎంవోయూ రూ. 725 కోట్లు ►ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ రూ. 723 కోట్లు ►ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►తాజ్ గ్రూప్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►కింబర్లీ క్లార్క్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►అలియన్న్ టైర్ గ్రూప్ ఎంవోయూ రూ. 679 కోట్లు ►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు ►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు ►డీఎక్స్ఎన్ ఎంవోయూ రూ. 600 కోట్లు ►ఈ-ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ రూ. 550 కోట్లు ►నాట్ సొల్యూషన్న్ ఎంవోయూ రూ. 500 కోట్లు ►అకౌంటిఫై ఇంక్ ఎంవోయూ రూ. 488 కోట్లు ►కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►ఆటమ్స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►క్లేరియన్ సర్వీసెస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►వీఆర్ఎమ్ గ్రూప్ ఎంవోయూ రూ. 342 కోట్లు ►రివర్ బే గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►హావెల్స్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►పోలో టవర్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఇండియా అసిస్ట్ ఇన్సైట్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►స్పార్క్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►టెక్ విషెన్ సాఫ్ట్వేర్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►మిస్టిక్ పామ్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►నియోలింక్ గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు ►అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు ►సర్ రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►హ్యాపీ వండర్లాండ్ రిసార్ట్స్ ఎంవోయూరూ. 250 కోట్లు ►చాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు ►ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు ►ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు ►హైథియన్ హ్యూయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు ►గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు ►ఎస్పీఎస్ ఇన్ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు ►డీవీవీ బయో ఫ్యూయల్స్ ఎంవోయూ రూ. 223 కోట్లు ►దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►ఆమ్ కన్స్ట్రక్షన్స్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►కేపిటల్ బిజినెస్ పార్క్ ఎంవోయూ రూ. 184 కోట్లు ►చాంయిన్ యాచ్ ఎంవోయూ రూ. 190 కోట్లు ►ఎన్జీసీ ట్రాన్స్మిషన్ ఎంవోయూ రూ. 185 కోట్లు ►యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ఎంవోయూ రూ. 176 కోట్లు ►విన్విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ ఎంవోయూ రూ. 174 కోట్లు ►ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్మెంట్ ఎంవోయూ రూ. 165 కోట్లు ►చాంపియన్ ఇన్ఫ్రాటెక్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►స్విచ్గేర్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►ఆంబర్ ఎంటర్ప్రైజస్ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు ►ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లు 9:20AM ►నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు ►రెండో రోజు కొనసాగుతున్న ఎంవోయూలు ►ఎంవోయూలతో సదస్సు ప్రారంభం 9:10AM సభాప్థలి వద్ద మీడియాతో మంత్రి గుడివాడ అమర్నాథ్ ►సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలీటీగల నాయకుడు ►పారిశ్రామికవేత్తల అభిప్రాయాల అధారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్వన్ అయ్యింది ►రాష్ట్రంలో సంస్కరణలకు ఇతర రాష్ట్రాల ఆదర్శంగా తీసుకుంటున్నాయి ►ఏపీలో పలు రంగాల్లో అవకాశాలు పుష్కలం ►నేడు ఏపీకి వస్తున్నది రియలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ►పారిశ్రామిక దిగ్గజాలు చెప్పిన మాటలను ప్రతిపక్షాలు అవగాహన చేసుకోవాలి ►ప్రతి ఎంవోయూ పారదర్శకంగా రూపొందింది ►మూడేళ్లలో 89 శాతం ఎంవోయూలు వాస్తవరూపం దాల్చాయి 9:00AM 2వ రోజు ప్రారంభమైన జీఐఎస్-2023 ►రెండవ రోజు శనివారం ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభమైంది రెండో రోజు 8 రంగాలపై సెషన్లు విశాఖపట్నం: రెండో రోజు శనివారం ఉదయం 9 గంటలకు ఆటోరియం 1లో పెట్రోలియం అండ్ పెట్రో కెమికల్స్, 2లో హయ్యర్ ఎడ్యుకేషన్, 3లో స్కిల్ డెవలప్మెంట్, 4లో వియత్నాం కంట్రీ సెషన్ జరగనుంది. 9.45 గంటలకు ఆడిటోరియం 1లో టూరిజం అండ్ హాస్పిటాలిటీ, 2లో టెక్స్టైల్స్ అండ్ అపరెల్స్, 3లో ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, 4లో వెస్టర్న్ ఆస్ట్రేలియా కంట్రీ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాబర్, అవాడ గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ సత్యనారాయణ చావ, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ బండి, గ్రీన్కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీల్కుమార్ చలమశెట్టి, సెయింట్ గోబిన్ ఆసియా–పసిఫిక్ అండ్ ఇండియా సీఈఓ సంతానం.బి ప్రసంగాలు ఉంటాయి. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, అపాచీ అండ్ హిల్టాప్ గ్రూప్ డైరెక్టర్ అండ్ గ్రూప్ హెడ్ ఇండియా ఆపరేషన్స్ సర్జియో లీ, బ్లెండ్ హబ్ ఫౌండర్ హెన్రిక్ స్టామ్ క్రిస్టెన్సన్, వెల్స్పన్ గ్రూప్ ఎండీ రాజేష్ మండవేవాలా, వెల్స్పన్ గ్రూప్ ఎండీ సతీష్రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ, సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్ సుచిత్ర కె.ఎల్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కీలక ఉపన్యాసం ఉంటుంది. అనంతరం సమ్మిట్ వేదికపై నుంచి కొత్త పరిశ్రమ యూనిట్ల ప్రారంభోత్సవం, సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ఉంటుంది. -
గణాంకాలపై ఇన్వెస్టర్ల చూపు
కేంద్ర మంత్రివర్గ విస్తరణకూ ప్రాధాన్యత సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి వివరాలు అక్టోబర్ నెలకు ద్ర వ్యోల్బణం వెల్లడి మిగిలిన బ్లూచిప్స్ ఫలితాలూ కీలకమే ఈ వారం మార్కెట్పై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్లను పలుఅంశాలు ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు, అక్టోబర్ నెలకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడికానున్నాయి. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి ఆటో దిగ్గజం టాటా మోటార్స్, బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐతోపాటు, ప్రభుత్వ రంగ బ్లూచిప్లు ఓఎన్జీసీ, బీహెచ్ఈఎల్ ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితోపాటు సన్ ఫార్మా, టాటా స్టీల్, సిప్లా, టాటా పవర్, డీఎల్ఎఫ్, హిందాల్కో, యునెటైడ్ స్పిరిట్స్ తదితరాలు క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, విస్తరణ సైతం మార్కెట్ల నడకను నిర్దేశించనున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఇవికాకుండా విదేశీ పరిణామాలు, సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు కూడా సెంటిమెంట్కు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలిపారు. బుధవారం ఎఫెక్ట్ సెప్టెంబర్ నెల ఐఐపీతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు బుధవారం(12న) వెలువడనున్నాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు శుక్రవారం(14న) వెల్లడికానున్నాయి. వీటితోపాటు బ్లూచిప్ కంపెనీల క్యూ2 ఫలితాలు సమీప కాలంలో మార్కెట్ల కదలికలను నిర్దేశిస్తాయని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ డెరైక్టర్ వివేక్ గుప్తా అంచనా వేశారు. ప్రధాని మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో తదుపరి సంస్కరణలపై ఇన్వెస్టర్లు దృష్టి నిలుపుతారని చెప్పారు. నిఫ్టీకి 7,900-7,950 వద్ద మద్దతు గత 2 వారాల నుంచి ఎఫ్ఐఐల పెట్టుబడులు భారీగా పుంజుకున్న నేపథ్యంలో రానున్న కాలంలో విదేశీ పెట్టుబడులు కీలకంగా నిలవనున్నాయని బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ వైస్ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అభిప్రాయపడ్డారు. ఎన్ఎస్ఈ నిఫ్టీకి సమీపకాలంలో 7,900-7,950 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. విదేశీ సంకేతాలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. కాగా, గడిచిన వారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 27,869 వద్ద ముగియడం గమనార్హం. అయితే నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 8,337 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 5,200 కోట్లు ఈ నెల తొలి వారంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లో రూ. 5,200 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిన సానుకూల పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా, నవంబర్ 3-7 కాలంలో ఎఫ్పీఐలు ఓవైపు ఈక్విటీల్లో నికరంగా రూ. 4,412 కోట్లు(71.8 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్చేయగా, మరోపక్క రూ. 765 కోట్ల (12.5 కోట్ల డాలర్లు)విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. ఇప్పటికే అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీని జపాన్ మరింత పెంచగా, యూరోజోన్ దేశాల ఆర్థిక వృద్ధికి యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) సైతం భారీ స్థాయిలో నిధులను వెచ్చించే యోచనలో ఉంది. ఈ ఏడాది జనవరి మొదలు అక్టోబర్వరకూ ఎఫ్పీఐలు ఈక్విటీల్లో నికరంగా రూ. 86,678 కోట్లు పెట్టుబడిపెట్టగా... రూ. 1.37 లక్షల కోట్లను రుణ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు.