IPL 2026
-
వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు!
ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడిచింది. ఈ సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడంతో పాటు మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంపై దిగ్గజాలు సహా మాజీ క్రికెటర్లు అభినందించారు. వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు విదేశాలకు కూడా పాకింది. విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా వైభవ్ను టీమిండియాకు ఎంపిక చేయాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన వచ్చింది. మ్యాచ్ తొలిరోజు మధ్యలో వర్షం పడడంతో విరామ సమయంలో కామెంటేటర్ సైమన్ డౌల్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్ అద్భుతమంటూ, నేరుగా భారత జట్టులోకి తీసుకుంటారేమోనని పేర్కొన్నాడు. దీనికి సహచర కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్, ఇయన్ వార్డ్ కూడా.. 'అవును వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసినట్లుంది'అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ఇంకా సమయం ఉందని బీసీసీఐ పేర్కొంది. 15 ఏళ్లే కావడంతో అతడికి క్రికెటర్గా చాలా భవిష్యత్తు ఉందని, ఈలోగా ఇండియా-ఏ తరఫున తన ఆటను చూపించే అవకాశమిస్తున్నట్లు తెలిపింది. లంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా-ఏ జట్టు శ్రీలంక-ఏ, అఫ్గానిస్తాన్-ఏ జట్లతో ట్రై సిరీస్ ఆడనుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 151 పరుగుల లీడ్లో ఉంది."Open the batting with Sooryavanshi!" 😅👀 pic.twitter.com/PL21ZRvWFA— Sky Sports Cricket (@SkyCricket) June 4, 2026చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఐపీఎల్-2026 ఫైనల్ ముగిసిన తర్వాత తాను ఘోరమైన ప్రమాదం బారినపడ్డాడనన్నాడు. దేవుడి దయ, భారత ప్రజల మంచితనం వల్ల సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని తెలిపాడు.రెండోసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీకాగా మార్చి 28- మే 31 మధ్య ఐపీఎల్ తాజా ఎడిషన్ జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో టైటాన్స్ను చిత్తు చేసి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది.ఈ మ్యాచ్ కామెంట్రీ బృందంలో మైకేల్ క్లార్క్ కూడా భాగం. ఫైనల్ ముగిసిన తర్వాత అతడు నరేంద్ర మోదీ స్టేడియం నుంచి విమానాశ్రయానికి కారులో బయల్దేరాడు. కొద్దిదూరం వెళ్లగానే కారు ఘోర ప్రమాదానికి గురైంది. అప్పటికి క్లార్క్ నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా శబ్దం రావడంతో నిద్రలేవగా.. అప్పటికే కారు ఓ ట్రక్కు కిందకి వెళ్లిపోయింది.మా కారు ట్రక్కు కిందకి దూసుకువెళ్లిందిఈ చేదు ఘటన గురించి మైకేల్ క్లార్క్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇండియాలో ఇంత మంచి వ్యక్తులు ఉన్నందుకు ఆయనకు థాంక్యూ చెప్పాల్సిందే. వారి వల్లే నేను సురక్షితంగా మా ఇంటికి వెళ్లగలిగాను.ఆరోజు నేను కారులో నిద్రపోతున్నాను. అలసట వల్ల ఒళ్లు తెలీకుండా నిద్రపట్టేసింది. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. లేచి చూసే సరికి మా కారు ఓ ట్రక్కు కిందకి దూసుకువెళ్లింది. డ్రైవర్ అప్పుడు నాకు జరిగిన విషయం చెప్పాడు.ట్రక్కు బ్రేక్ లైట్లు కనిపించకపోవడం వల్ల తాను కన్ఫ్యూజ్ అయ్యానన్నాడు. అందుకే వెనుక నుంచి మా కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రక్కు కిందకి దూసుకువెళ్లిపోయింది. నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి.కాలు విరిగిపోయింది!అయితే, మా డ్రైవర్ కాలు మాత్రం విరిగిపోయే ఉంటుంది. అతడు చాలా భయపడ్డాడు. అది అతడి సొంతకారు కూడా కాదు. పాపం కంపెనీ తరఫున కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు.విషయం తెలియగానే చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి సాయం చేశారు. ఇక బీసీసీఐకి చెందిన ప్రతి ఒక్కరు నా బాగోగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. నిజంగా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను.చాలా భయపడిపోయానుఅదొక ఘోర ప్రమాదం. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉండొచ్చు. అయితే, నేను మాత్రం చాలా భయపడిపోయాను. నిద్రలో ఉన్నవాడిని లేచి చూసే సరికి ట్రక్కు కింద ఉంటే ఎవరైనా కంగారు పడతారు కదా!’’ అని మైకేల్ క్లార్క్ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.చదవండి: అతడికి అన్యాయం: గంభీర్ -
‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. కోహ్లిని ఒక్కసారి నేరుగా చూస్తే తమ జన్మ ధన్యమైనట్లు భావించే వీరాభిమానులు కూడా కోకొల్లలు.కోహ్లికి ఉన్న విపరీతమైన ఈ క్రేజ్ అతడికి ఒక రకంగా శాపంగా మారిందంటున్నాడు ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్. నిజానికి భారత్లో జీవించడం కోహ్లికి కష్టంగా మారిందని.. అందుకే అతడు లండన్కు మకాం మార్చి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2025లో లివింగ్స్టోన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ లెజెండ్ కోహ్లి (Virat Kohli)తో తనకు ఏర్పడిన అనుబంధం, సహచర ఆటగాళ్ల పట్ల అతడు వ్యవహరించే తీరుపై లివింగ్స్టోన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తిస్టిక్ టు క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తి. విరాట్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగడం నాకెంతో ఇష్టం. అతడితో కలిసి ఆడటాన్ని కూడా ఆస్వాదిస్తా. అతడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు.ఎవరికి ఏ అవసరం ఉన్నా.. సలహా, సూచన కావాలన్నా అతడు ముందుంటాడు. అయితే, ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత అతడిలోని పోటీతత్వం తారస్థాయికి చేరుకుంటుంది. అతడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తాడు.కుటుంబానికే ప్రాధాన్యంఅయితే, ముందుగా చెప్పినట్లు మైదానం వెలుపల మాత్రం అతడు అందరితో చాలా చాలా బాగుంటాడు. కుటుంబంతో సమయం గడపడం అంటే అతడికి ఎంతో ఇష్టం. నిజానికి ఇండియాలో జీవించే జీవితం అతడికి అసలు ఇష్టం లేదనే చెప్పవచ్చు.ఇండియాలో లైఫ్ అతడికి నచ్చదుప్రతి ఒక్కరూ తననే గమనిస్తూ ఉండటం అతడికి అస్సలు నచ్చదు. కోహ్లి చాలా మంచివాడు. మనసులో ఒకటి.. బయటకు ఒకటి ఉండదు. అయితే, మైదానంలోకి వెళ్లిన తర్వాత మాత్రం అతడిలా పూర్తిగా మారిపోయే మరొక ప్లేయర్ని మాత్రం నేను ఇంతవరకు చూడలేదు’’ అని లియామ్ లివింగ్స్టోన్ చెప్పుకొచ్చాడు.లండన్లో నివాసంకాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లికి.. కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అనుష్క లండన్లోనే అకాయ్కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్లోనే నివసిస్తోంది. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్, స్వదేశంలో జరిగే మ్యాచ్లు, ఆశ్రమాలకు వెళ్లేందుకు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు.తమకున్న క్రేజ్ తన పిల్లలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో విరుష్క దంపతులు ఇప్పటి వరకు వారి ఫొటోలు కూడా రివీల్ చేయలేదు. లండన్లో సామాన్యుల్లా రోడ్ల మీద నడుస్తూ చిల్ అవడమే తమకు సంతోషంగా ఉంటుందని ఈ జంట పలుమార్లు చెప్పకనే చెప్పింది.ఇక ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న కోహ్లి కల గతేడాది నెరవేరింది. పద్దెమినిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ చాంపియన్గా నిలిచింది. దీంతో కోహ్లి సంతోషం రెట్టింపు అయింది.చదవండి: భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం! -
‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’
ఐపీఎల్-2026 ఆరంభంలో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాలు సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఊహించనిరీతిలో వరుసగా ఆరు మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. వచ్చే సీజన్ ఆరంభానికి ముందు ఈ ఐదుగురు ఆటగాళ్లను తప్పక వదిలించుకోవాలన్నాడు. ఇందులో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్కు విహారి ప్రథమ స్థానం ఇచ్చాడు.రూ. 11 కోట్లు అందుకునే అర్హత లేదుతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం.. పంజాబ్ మొట్టమొదటగా మార్కస్ స్టొయినిస్ను వదిలేయాలి. అతడిని ఏకంగా రూ. 11 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ధరకు రిటైన్ చేసుకున్నారు.ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడతాడని ఇంత ధర పెట్టారు. కానీ అందుకు అతడు అర్హుడు కాడు. వచ్చే రెండు- మూడేళ్లలో అతడు రిటైర్మెంట్కు చేరువవుతాడు. బౌలింగ్లోనూ అతడు ప్రభావం చూపడం లేదు.వీళ్లను కూడా వదిలేయండిఅతడిని వేలంలోకి వదిలి.. కావాలంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. స్టొయినిస్తో పాటు నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మిచెల్ ఓవెన్లను కూడా వేలంలోకి వదిలేయండి. అసలు వాళ్లతో ఈ సీజన్లో ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు.లాకీ ఫెర్గూసన్ కూడా జట్టుకు అవసరం లేదు. వీళ్లందరినీ వదిలేస్తే పర్సులో కనీసం రూ. 25 కోట్లు మిగులుతాయి’’ అని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2026లో స్టొయినిస్ తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 216 పరుగులు చేశాడు. అదే విధంగా నాలుగు మ్యాచ్లలో బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.ఇక నేహాల్ వధేరా ఆరు ఇన్నింగ్స్ ఆడి 65 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు.. శశాంక్ సింగ్ సైతం తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 132 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫెర్గూసన్ మూడు మ్యాచ్లు ఆడగా.. మిచెల్ ఓవెన్కు అసలు ఒక్క మ్యాచ్లోనూ అవకాశం రాలేదు.చదవండి: టీమిండియాలోకి కొత్త ప్లేయర్! -
కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన ఆరోపణలు!
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. దేశీ స్టార్ ఇషాన్ కిషన్ జట్టును ముందుకు నడిపించాడు. అతడి సారథ్యంలో జట్టు ఏడింట నాలుగు మ్యాచ్లు గెలిచింది.ఇక కమిన్స్ తిరిగి వచ్చిన తర్వాత కూడా సన్రైజర్స్ హవా కొనసాగింది. మొత్తంగా ఈ సీజన్లో లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్లకు గానూ హైదరాబాద్ జట్టు తొమ్మిది గెలిచి.. 18 పాయింట్లతో పట్టికలో టాప్-3లో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించింది.ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమిఅయితే, అనూహ్య రీతిలో ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి.. సన్రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు ఇంటిబాటపట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ సన్రైజర్స్ యాజమాన్యాన్ని (కావ్యా మారన్) ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశాడు.తనకు తుదిజట్టులో చోటు దక్కకపోవడానికి కావ్యా మారన్ కారణమని పరోక్షంగా లివింగ్స్టోన్ వ్యాఖ్యానించాడు. స్టిక్ టు క్రికెట్ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్కి అత్యవసరమైన ఓ ఆటగాడిని మా జట్టు కొనుగోలు చేసింది.అతడిని అమితంగా ప్రేమిస్తారువేలం సమయంలో మా యాజమాన్యం పర్సులో బోలెడు డబ్బు ఉంది. కాబట్టి అతడిని సొంతం చేసుకోగలిగింది. మా యజమానులకు అతడంటే చాలా చాలా ఇష్టం. అతడిని అమితంగా ప్రేమిస్తారు. అందుకే జట్టులోకి తీసుకున్నారు.మా కోచ్ డాన్ (డానియల్ వెటోరి) స్వయంగా నాతో ఈ మాట చెప్పాడు. అప్పుడే నాకో విషయం అర్థమైంది. ఎవరో ఒకరు గాయపడితే తప్ప నాకు తుదిజట్టులో చోటు దక్కదని తెలిసింది’’ అని లివింగ్స్టోన్ పేర్కొన్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో లివింగ్స్టోన్ ప్రస్తావించిన ఆటగాడు ఎవరా? అని నెట్టింట చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది సలీల్ అరోరా పేరును తెరమీదకు తెస్తున్నారు.ఆ ఆటగాడు ఎవరు?పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సలీల్ అరోరా వికెట్ కీపర్ బ్యాటర్. ఐపీఎల్-2026 మినీ వేలంలో సన్రైజర్స్- ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఆఖరికి రూ. 1.5 కోట్లకు సన్రైజర్స్ సలీల్ను సొంతం చేసుకుంది.సీజన్ ఆరంభ మ్యాచ్లో భాగంగా ఆర్సీబీతో పోరు సందర్భంగా సలీల్ అరోరా సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆరో స్థానంలో బరిలోకి దిగి 9 పరుగులకే నిష్క్రమించాడు. సీజన్లో మొత్తంగా పదకొండు ఇన్నింగ్స్ ఆడి 156 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే.. గతేడాది ఆర్సీబీ తరఫున ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎనిమిది ఇన్నింగ్స్ ఆడి కేవలం 112 పరుగులే చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఆర్సీబీ అతడిని వదిలేయగా.. సన్రైజర్స్ ఊహించని రీతిలో రూ. 13 కోట్ల భారీ ధరకు లివింగ్స్టోన్ను కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్లే ఆడించగా.. అతడు 15 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. Liam Livingstone reveals SRH owners interefered in team selection"We bought a player Mumbai really wanted. We had more money, so we got him. The owners loved him, so he was locked in. Dan told me that, and I knew I wasn't getting a chance unless someone got injured."Who is… pic.twitter.com/jvoyzgTgGa— Brutal Truth (@sarkarstix) June 3, 2026చదవండి: భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్, భువీకి చోటు! -
ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్
ఐపీఎల్-2026 విజేతగా రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. రన్నరప్గా గుజరాత్ టైటాన్స్ నిలవగా, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2, ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్లో ఓడిపోయాయి.అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఎవరూ ఊహించని విధంగా ముగిసింది. మొదటి ఏడు మ్యాచ్లలో ఒక్క ఓటమి కూడా చూడని పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లలో దారుణ ఓటమిపాలై కనీసం ప్లే ఆఫ్స్కు చేరకుండా నిష్క్రమించింది. తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచినా పంజాబ్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంతో సరిపెట్టుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ పతనానికి గల కారణాలను తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్లేషించారు.పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది సీజన్కు మంచి ఊపు తీసుకొచ్చింది. వారి క్రికెట్ చాలా చాలా పాజిటివ్గా, సాహసోపేతంగా, కొన్ని సార్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేలా కొనసాగింది. ఇలాంటి సుదీర్ఘమైన టోర్నీల్లో 'మొమెంటం' కీలక పాత్ర పోషిస్తుంది. ఇంత వేగంగా సాగిపోయే టోర్నమెంట్లో ఆయా జట్లు కేవలం తమ 'ఆట విధానం' పైనే దృష్టి పెట్టాలి.అంతే తప్ప ఫలితాలు గురుంచి ఎక్కువగా ఆలోచించకూడదు. పంజాబ్ ఇప్పుడు అదే తప్పు చేసింది. ఫస్ట్ హాఫ్లో పంజాబ్ ఫలితాలను పట్టించుకోకుండా కేవలం తమ ఆటపై మాత్రమే ఫోకస్ చేసింది. అందుకే అద్భుతంగా రాణించింది. కానీ సెకెండ్ హాఫ్నకు వచ్చేసారికి పరిస్థితి తారుమారు అయిపోయింది. ఒత్తిడి పెరగడంతో పంజాబ్ జట్టు ఆట విధానాన్ని పక్కనబెట్టి.. కేవలం ఫలితాలపై దృష్టి పెట్టింది. అందుకే టోర్నీలో ముందుకు సాగలేకపోయింది సచిన్ 'రెడ్డిట్' పోస్ట్లో రాసుకొచ్చారు.చదవండి: సూర్యకుమార్కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్గా తెలుగోడు! -
ఐపీఎల్ 2026లో అత్యంత ప్రమాదకర పేస్ దళం ఏది..?
ఐపీఎల్ 2026లో బ్యాటర్ల హవా కొనసాగినా, పేస్ బౌలర్లు కూడా తమదైన ముద్ర వేశారు. ఈ సీజన్లో అత్యధిక 200+ స్కోర్లు నమోదైనా, కొన్ని జట్లు తమ బలమైన ఫాస్ట్ బౌలింగ్ దళంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాయి. సీజన్ మొత్తంలో ఏ జట్టుకు అత్యంత ప్రమాదకర పేస్ దళం ఉందో ఈ కంటెంట్లో చూద్దాం. చివరి నుంచి మొదలుపెడితే..కోల్కతా నైట్రైడర్స్ (2/10)ఈ సీజన్లో అత్యంత బలహీనమైన పేస్ అటాక్ కేకేఆర్ది అని చెప్పవచ్చు. హర్షిత్ రాణా, మతీష పతిరణ గాయాలతో దూరమవ్వడం ఈ సీజన్లో ఆ జట్టుకు భారీ దెబ్బ. కార్తీక్ త్యాగి 18 వికెట్లు తీసినా మిగతా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.పంజాబ్ కింగ్స్ (2/10)ఈ జట్టులో అర్షదీప్ సింగ్ వంటి స్టార్ పేసర్ ఉన్నప్పటికీ, మిగతా పేసర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వీరి కారణంగా కీలక మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లను కూడా కాపాడుకోలేకపోయారు.ముంబై ఇండియన్స్ (3/10)ఈ జట్టు పేస్ దళం ఈ సీజన్లో అతిపెద్ద నిరాశగా నిలిచింది. బుమ్రా, బౌల్ట్ లాంటి స్టార్ పేసర్లు ఆశించిన ప్రభావం చూపలేకపోయారు.చెన్నై సూపర్ కింగ్స్ (4/10)ఈ జట్టు తరఫున అన్షుల్ కంబోజ్ 21 వికెట్లతో మెరిసినా.. గాయాలు, అస్థిర ప్రదర్శనల కారణంగా పేస్ విభాగం బలహీనంగా కనిపించింది.ఢిల్లీ క్యాపిటల్స్ (4/10)ఈ జట్టులో స్టార్క్, నటరాజన్ కొంత మేర రాణించినా, మిగతా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.లక్నో సూపర్ జెయింట్స్ (5/10)ఈ సీజన్లో ఎల్ఎస్జీ చివరి స్థానంలో నిలిచినా, పేస్ బౌలింగ్లో మంచి సామర్థ్యం చూపింది. ప్రిన్స్ యాదవ్, షమీ ఆకట్టుకున్నారు. అయితే గాయాలు జట్టును దెబ్బతీశాయి.రాజస్థాన్ రాయల్స్ (6/10)ఈ సీజన్లో రాయల్స్ విజయాల్లో జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. 25 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.సన్రైజర్స్ హైదరాబాద్ (7/10)ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పేస్ విభాగం బలంగా కనిపించింది. కమిన్స్ నేతృత్వంలో ఆ జట్టు పేస్ దళం మంచి సమతుల్యతను ప్రదర్శించింది. ఎషాన్ మలింగ 20 వికెట్లతో మెరిశాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8/10)బ్యాక్ టు బ్యాక్ టైటిళ్లు గెలవడంలో ఆర్సీబీ పేస్ బౌలర్ల పాత్ర అమోఘం. భువనేశ్వర్ కుమార్ 28 వికెట్లతో అదరగొట్టగా, రసిక్ సలాం, హాజిల్వుడ్ మంచి ప్రదర్శనలు ఇచ్చారు.గుజరాత్ టైటాన్స్ (9/10)ఈ సీజన్లో అత్యంత భయంకరమైన పేస్ దళం మాత్రం గుజరాత్ టైటాన్స్దే. ఈ జట్టులోని రబాడ, సిరాజ్, హోల్డర్, ప్రసిద్ద్ సమిష్టిగా సత్తా చాటారు. 29 వికెట్లు తీసి రబాడ పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. -
వైభవ్తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే.. వీడియో వైరల్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్ తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఈ రన్మెషీన్ కల గతేడాది ఫలించింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ నుంచి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2025లో తొలిసారి ట్రోఫీ గెలిచింది.ఐపీఎల్-2026లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్లో కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.వైభవ్ నమస్కారం చేయగా.. ఇదిలా ఉంటే.. ఫైనల్లో విజయం తర్వాత రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, ఆరెంజ్క్యాప్ విన్నర్ వైభవ్ సూర్యవంశీతో కోహ్లి కాసేపు ముచ్చటించాడు. కోహ్లిని చూసి వైభవ్ నమస్కారం చేయగా.. ప్రతిగా అతడి భుజం తట్టి హత్తుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.వాళ్ల మాటలు పట్టించుకోకుఈ నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. కోహ్లి- వైభవ్ల వీడియోను బుధవారం షేర్ చేసిన యాజమాన్యం.. కోహ్లి వైభవ్కు ఇచ్చిన సలహా ఏమిటో తెలియజేసింది. వీడియో ప్రకారం.. ‘‘నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. నీ కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం వల్లే నువ్వు ఇది సాధించగలిగావు.అయితే, నీ గురించి ఎవరు.. ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోకు. నిజం చెప్పాలంటే.. బిహారీ ఎవరినైనా ఓడించగలడు. ఎవరినైనా అధిగమించగలడు’’ అని కోహ్లి వైభవ్తో పేర్కొన్నాడు.776 పరుగులుకాగా గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. కోహ్లి ఈ సీజన్లో 675 పరుగులు సాధించి టాప్-4లో నిలిచాడు. ఫైనల్లో రాణించి ఆర్సీబీ రెండో టైటిల్ గెలవడంలో తన వంతు సాయం అందించాడు.చదవండి: నువ్వు కూర్చో.. అతడినే వన్డౌన్లో పంపుతాం అన్నాడు!𝗧𝗵𝗲 𝗺𝗮𝗻 𝘄𝗵𝗼 𝗺𝗮𝗱𝗲 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🤝 𝘁𝗵𝗲 𝗯𝗼𝘆 𝘄𝗵𝗼 𝗯𝗮𝘁𝘀 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🫶💪The best piece of advice the 15-year old Vaibhav Suryavanshi could get! And who better than Virat Kohli to help fuel his fire in the right direction.… pic.twitter.com/MUqCRBo0la— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026 -
వైభవ్ సూర్యవంశీపై పరిశోధనలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో సంచలనాలు చేస్తుండడంపై దిగ్గజ క్రికెటర్లు కూడా వైభవ్ను అభినందించకుండా ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలో అతడి జీవితాన్ని, చిన్న వయసులోనే ఒత్తిడిని అధిగమించి ఇవాళ స్టార్ క్రికెటర్ రేంజ్కు ఎదిగిన వైభవ్ సూర్యవంశీ ఘనతను తమ పాఠ్యాంశంలో చేర్చాలని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్ భావిస్తోంది. త్వరలోనే ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్పై ఐఐఎం-ఇండోర్ పరిశోధనలు చేపట్టనుంది. చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన వైభవ్ సూర్యవంశీపై ఒక ప్రత్యేక కేస్స్టడీ చేయనున్నట్లు ఐఐఎం ఇండోర్ ప్రతినిధులుతెలిపారు. దీంతో వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, కెరీర్ భవిష్యత్తు, ఒత్తిళ్లు, సవాళ్లు.. వాటి ప్రభావాలను వైభవ్ ఎలా అధిగమించాడనే దానిపై తమ సంస్థ అధ్యయనం చేయనుందని ఐఐఎం ఇండోర్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.‘బాల మేధావుల అసాధారణ ప్రదర్శనకు ఎలాంటి కారకాలు దోహదపడుతాయనేవి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం చిన్నతనం నుంచే అలవడే వ్యక్తిత్వం, ప్రవర్తన, సాధన పద్దతులు.. కుటుంబం నుంచి అందుతున్న సహకారం, ఉపాధ్యాయులు, కోచ్లు, సీనియర్ల మద్దతుతో వివిధ రంగాల్లో ఎదుగుతున్న పిల్లలపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. స్పోర్ట్స్ విభాగంలో వైభవ్ సూర్యవం శీని ఎంపిక చేసుకున్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని అతడికి తెలియజేశాము.’ అని ఐఐఎం డైరక్టర్ తెలిపారు.బాలల ప్రతిభపై సంస్థ జరిపే అధ్యయనంలో మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ వనరులు, సమాచారవ్యాప్తి, ప్రవర్తనకు సంబంధించి ప్రత్యేక పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనం కేవలం క్రీడలకే కాకుండా చిన్న వయసులోనే గణితం, సైన్స్, కళలు, ఇతర వృత్తుల్లో రాణిస్తున్న ప్రతిభావంతులపై కూడా జరగనుంది. అయితే ఈ అధ్యయనం పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశముందని ఐఐఎం ఇండోర్ తెలిపింది.చదవండి: వరల్డ్ నంబర్వన్ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద! -
‘నువ్వు కూర్చో.. అతడినే వన్డౌన్లో పంపుతాం అన్నాడు’
గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ అద్భుతంగా రాణిస్తోంది. ఐపీఎల్-2025లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్లు ఆడి 759 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.పరుగుల వీరులుఇక మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా 15 మ్యాచ్లలో కలిపి 650 పరుగులు రాబట్టి సత్తా చాటాడు. వీరికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 14 మ్యాచ్లు ఆడి 538 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2026లోనూ ఈ ముగ్గురూ రాణించారు.గిల్ 732, సాయి సుదర్శన్ 722 పరుగులతో మరోసారి సత్తా చాటగా.. బట్లర్ 526 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఫైనల్లో గుజరాత్ యాజమాన్యం బట్లర్ను వన్డౌన్లో కాకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపింది.అనూహ్య నిర్ణయంమూడో స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ నిశాంత్ సింధు (20)ను పంపగా.. అతడు విఫలమయ్యాడు. ఇక నాలుగో స్థానంలో వెళ్లిన బట్లర్ సైతం 19 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక గిల్, సాయి వరుసగా 10, 12 పరుగులే చేశారు. ఫలితంగా 155 పరుగులే చేసిన గుజరాత్.. ఐదు వికెట్ల తేడాతో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.కాగా బట్లర్ను వన్డౌన్లో కాకుండా నాలుగో నంబర్ బ్యాటర్గా పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ విషయంలో గుజరాత్ నాయకత్వ బృందాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ విషయంపై బట్లర్ తాజాగా స్పందించాడు.నువ్వు ఇక్కడే కూర్చో.. తనను నాలుగో స్థానంలో ఆడించాలన్న ఆలోచన హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాదేనని బట్లర్ స్పష్టం చేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’తో మాట్లాడుతూ.. ‘‘తొలి వికెట్ (గిల్) పడగానే.. బ్యాటింగ్కు వెళ్లేందుకు హెల్మెట్ పెట్టుకుని సిద్ధమయ్యాను.ఇంతలో ఆశిష్ నెహ్రా.. ‘నువ్వు ఇక్కడే కూర్చో.. వన్డౌన్లో మేము నిశాంత్ను పంపాలని నిర్ణయించుకున్నాము’ అని చెప్పాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయం గురించి నేను నెహ్రాను అడిగాను.అప్పుడు నిశాంత్ను పంపితే బాగుంటుందని.. టాపార్డర్లో ఆడేందుకు అతడికి ఇదే మంచి అవకాశం అని నెహ్రా నాతో అన్నాడు.వర్కౌట్ కాలేదుఅతడిని ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపలేము కదా.. అందుకే ఫైనల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. కోల్కతా మ్యాచ్లో కూడా అతడు నాకంటే ముందే బ్యాటింగ్కు వెళ్లాడు. అది తప్పో.. ఒప్పో తెలియదు. ఫైనల్లో మాత్రం ఆ నిర్ణయం మాకు వర్కౌట్ కాలేదు’’ అని బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విఫలం.. ఘోర పరాజయం -
కప్పు గెలిచారు.. అంతలోనే ఆర్సీబీ లెజెండ్ రిటైర్మెంట్
ఐపీఎల్-2026 సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాసు శంకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ బుధవారం ఎక్స్వేదికగా ధ్రువీకరించింది.మా అందరి కళ్లల్లో నీళ్లు"మీరు తీసుకున్న ఈ నిర్ణయం మా అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. బసు శంకర్ సార్… ఈ సీజన్ విజయంలో మీ పాత్ర వెలకట్టలేనిది. ఈ విజయం.. తెరవెనుక మీరు పడిన లెక్కలేనన్ని గంటల కష్టానికి ప్రతిఫలం. ఈ సక్సెస్లో భాగమైన మా సపోర్ట్ స్టాఫ్ ,మేనేజ్మెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు" ఆర్సీబీ ఓ భావోద్వేగ పోస్ట్ను ఎక్స్లో షేర్ చేసింది. ఎనిమిది సీజన్ల పాటు2019లో ఆర్సీబీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బసు శంకర్, ఎనిమిది సీజన్ల పాటు తన సేవలను అందించాడు. బెంగళూరు జట్టు వరుసగా రెండు సార్లు విజేతగా నిలవడంలో ఆయనది కీలక పాత్ర. ప్లేయర్లతో వివిధ రకాల వ్యాయామాలు చేయిస్తూ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఆయన తెరవెనుక పోషించిన పాత్ర అసాధారణమైనది. అంతకంటే ముందు భారత జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా పనిచేశారు. భారత క్రికెట్లో 'యో-యో' (Yo-Yo) టెస్ట్ను ప్రాచుర్యంలోకి తెచ్చి, టీమిండియాను ప్రపంచంలోనే అత్యంత ఫిట్ ప్రొఫెషనల్ జట్టుగా మార్చిన ఘనత ఆయనదే. విరాట్ కోహ్లి లాంటి దిగ్గజం ఫిట్నెస్ సక్సెస్ వెనక కూడా బసు శంకర్ ఉన్నారు.This news made us all teary eyed. 𝐁𝐚𝐬𝐮 𝐒𝐡𝐚𝐧𝐤𝐞𝐫 𝐒𝐢𝐫… ❤️🥺This season was built on countless hours of hard work behind the scenes. To every member of our support staff and management who made this journey possible, thank you. 🤗🫶A special salute to Basu Shanker… pic.twitter.com/K2UInIBhC9— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026 -
IPL 2026లో ఎవరికి ఏ అవార్డు.. ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?
-
'వైభవ్, కోహ్లి కాదు.. అతడిదే అద్భుతమైన ఇన్నింగ్స్'
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-2026కు ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్కు సంబంధించిన అత్యుత్తమ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చోప్రా విశ్లేషించాడు.పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ను.. ఈ సీజన్లోనే అత్యుత్తమ నాక్గా ఆకాశ్ చోప్రా ఎంపిక చేశాడు. ఈ టోర్నీ లీగ్ దశలో భాగంగా అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ కేవలం 67 బంతుల్లోనే 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వక్తిగత స్కోర్ సాధించిన భారత బ్యాటర్గా రాహుల్ రికార్డులెక్కాడు. అయితే ఈ మ్యాచ్లో దురదృష్టవశాత్తూ ఢిల్లీ ఓటమి చవిచూసింది. ఇక ప్లేఆఫ్స్లో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్లు కూడా ఈ రేసులో ఉన్నాయని చోప్రా పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికి రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమని అతడు కొనియాడాడు.లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మోహ్సిన్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ పై వేసిన స్పెల్ను చోప్రా ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనగా ఎంపిక చేశాడు. ఈ మ్యాచ్లో మోహ్సిన్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ మాదిరే మోహ్సిన్ కూడా ప్రదర్శన కూడా వృథా అయిపోయింది. కేకేఆర్పై లక్నో సూపర్ ఓవర్లో ఓటమి చవిచూసింది.కాగా ఈ ఏడాది సీజన్లో బెస్ట్ ఓపెనర్గా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. రాజస్తాన్ ఫైనల్కు చేరకపోయినప్పటికి, వైభవ్ మాత్రం దుమ్ములేపాడు. 776 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఉత్తమ మిడిలార్డర్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్, బెస్ట్ బౌలర్గా భువనేశ్వర్ కుమార్లను అతడు ఎంచుకున్నాడు.చదవండి: IND vs NZ: 12 మ్యాచ్లు.. 40 రోజులు! టీమిండియా ఫ్యాన్స్కు పండగే -
పంజాబ్ స్పిన్ కింగ్కు టీమిండియా కీలక పదవి
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులేకు టీమిండియాలో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్ స్పిన్నర్ను టీమిండియా ప్రత్యేక స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్ 2) అధికారికంగా ప్రకటించింది. మాజీ టీమిండియా ఆటగాడిగా, దేశీయ క్రికెట్లో దిగ్గజ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన బహుతులేకు ఆటగాడిగా, కోచ్గా విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది.బహుతులే భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్క్లాస్ కెరీర్లో 6,176 పరుగులు చేసి, 630 వికెట్లు సాధించి దేశీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకరిగా నిలిచాడు.కోచ్గా కూడా బహుతులే విజయవంతమైన ప్రయాణం కొనసాగించాడు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ దేశవాలీ జట్లకు హెడ్ కోచ్గా సేవలందించాడు. అలాగే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు సుదీర్ఘంగా స్పిన్ బౌలింగ్ కోచ్గా పని చేశాడు.భారత క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ బహుతులే కీలక పాత్ర పోషించాడు. 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2024 అండర్-19 ప్రపంచకప్లో కూడా కోచింగ్ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండియా-ఏ, సీనియర్ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్ కోచ్గా పని చేశాడు.2021 నుంచి 2024 వరకు బీసీసీఐ నిర్వహించే నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)లో కూడా కోచింగ్ బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి బీసీసీఐని ఆకట్టుకుంది.తన నియామకంపై స్పందించిన సాయిరాజ్ బహుతులే, భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు. ఆటగాడిగా భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఎంత గర్వకారణమో, కోచ్గా సేవలందించడం కూడా అంతే ప్రత్యేకమని అన్నాడు. -
వారెవ్వా కోహ్లీ.. రోజు వ్యవధిలో ఎంత మార్పు!
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని మంగవారం సందర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమానికి వచ్చాడు. ప్రేమానంద్ మహారాజ్కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లారు. కాగా కోహ్లీ, అనుష్క దంపతులు ఇప్పటికే అనేక సార్లు ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ, అనుష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ అనుష్క, కోహ్లీ జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ట్రోఫీ పట్టుకున్న సమయంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ తర్వాత ఆర్సీబీ గెలుపు సంబరాలకు సంబంధించిన ఒక ఈవెంట్లోనూ విరుష్క జంట అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. 🎥 | Virat Kohli and Anushka Sharma’s visit to #PremanandMaharaj’s Radha Keli Kunj Ashram in #Vrindavan has gone viral on #socialmedia, with a video showing the couple seeking blessings from the spiritual leader. The visit came days after #RCB’s historic #IPL title triumph, and… pic.twitter.com/QPucsbjK6i— The Statesman (@TheStatesmanLtd) June 2, 2026చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
ఐపీఎల్ తర్వాత కూడా 'స్కై' వైఫల్యాలు కొనసాగింపు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యాల పరంపర ఐపీఎల్ 2026 తర్వాత కూడా కొనసాగుతోంది. క్యాష్ రిచ్ లీగ్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ చేతులెత్తేశాడు. ముంబై టీ20 లీగ్లో ట్రయంప్స్ నైట్స్ ఎంఎన్ఈకి ఆడుతున్న స్కై.. నార్త్ ముంబై పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో 11 బంతుల్లో 19 పరుగులు (4 ఫోర్లు) మాత్రమే చేసి ఔటయ్యాడు.తాజా వైఫల్యం తర్వాత స్కై టీమిండియా భవిష్యత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కైను భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా, జట్టు నుంచి కూడా తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ సైతం స్కైకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.స్కై గతకొంతకాలంగా టీ20 ఫార్మాట్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2026 అతడు 13 మ్యాచ్ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. అంతకుముందు టీమిండియా ఛాంపియన్గా నిలిచిన టీ20 వరల్డ్కప్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా పసికూన యూఎస్ఏపై.ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో స్కైకు వ్యతిరేకులు ఎక్కువయ్యారు. తాజా వైఫల్యం తర్వాత సోషల్ మీడియాలో అభిమానుల స్పందనలు వైరల్గా మారాయి. కొందరు అతడికి మద్దతుగా నిలబడుతుంటే.. మరికొందరు వ్యతిరేకంగా భారీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు.ముంబై టీ20 లీగ్లో స్కై వైఫల్యం అతడి జట్టు కొంప ముంచింది. కీలక దశలో ఔట్ కావడంతో అతడి జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కై ప్రత్యర్ది జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్కై జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమై, 21 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై టీ20 లీగ్లో స్కైతో పాటు చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ లక్నో సూపర్జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ గోయెంకా అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడిగా అభివర్ణించాడు. నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్ గోయెంకానే అంటూ ఘాటుగా పేర్కొన్నాడు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్కాస్ట్ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘అతడికి (గోయెంకా) ఒక ఫ్రాంచైజీని కొనడం కానీ, నడిపించే హక్కు కానీ లేదు. సంజీవ్ గోయెంకా ఒక బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తి. తన విద్యుత్ వ్యాపారానికి పరిమితమవ్వాల్సింది. అనవసరంగా ఐపీఎల్లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. లక్నో సూపర్జెయింట్స్ను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ కారణమయ్యాడు. లక్నో జట్టు కూడా ప్రతీ సీజన్లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా లక్నో ఒట్టి చేతులతోనే లీగ్ నుంచి నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్కు దొరికిపోయారు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ అయిపోయారు.’ అంటూ లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. గోయెంకాపై వచ్చిన మీమ్స్లో అత్యధిక మంది చూసిన మీమ్కు కృతజ్ఞతగా రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తానని లలిత్ మోదీ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ గోయెంకాపై లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించడం పరిపాటిగా మారిపోయింది. ఈ సీజన్లో ఒక మ్యాచ్లో ఓటమి చెందడంపై జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్తో సంజీవ్ గోయెంకా వాడీ వేడీ చర్చ జరపడంపై లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చాడు. అయితే సీజన్లో లక్నో ఆట ముగిసిన తర్వాత ఆ జట్టు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంపై స్పందించిన లలిత్ మోదీ.. ‘పంత్కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఒక పెద్ద మనిషి (సంజీవ్ గోయెంకా) తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు’ అంటూ విమర్శలు సంధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. సీజన్లో 14 మ్యాచ్లాడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.చదవండి: సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది! -
కోహ్లీ, పాటీదార్ కాదు.. ఆర్సీబీ రాత మారింది ఆమె వల్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది చాంపియన్గా నిలిచింది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి 'ఈ సాలా కప్ నమ్దే' అంటూ 17 ఏళ్లుగా టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది. అప్పటికీ మూడుసార్లు ఫైనల్ చేరినా తుది మెట్టుపై బోల్తా పడడంతో ఇక ఆర్సీబీ టైటిల్ కల కష్టమే అని ఫ్యాన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.కానీ 17 ఏళ్లలో దక్కని టైటిల్ గతేడాది తమ చెంత చేరడంతో ఆర్సీబీ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ రెండోసారి కప్ ఒడిసిపట్టడంతో రజత్ పాటీదార్ లక్కీ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన మూడో కెప్టెన్గా పాటీదార్ నిలిచాడు. ఈ క్రమంలో పాటీదార్ను ఆర్సీబీకి ట్రోఫీ అందించిన లక్కీ కెప్టెన్ అని పొగుడుతున్నారు.కానీ ఆర్సీబీ రాత అంతకుముందే మారిందని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు టైటిల్ సాధించ డానికి ముందే మహిళల జట్టు ఆ ఘనత సాధించింది. స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సీబీ వుమెన్ టీం 2024లోనే తొలి టైటిల్ సాధించింది. అయితే 2023లో మొదలైన డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ మహిళల జట్టు కూడా మొదట్లో ఓటమిబాటలోనే నడిచింది. ఆ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయి పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో పురుషుల జట్టు మాదిరే మహిళల జట్టు కూడా ట్రోలింగ్కు గురైంది. అయితే మరుసటి సీజన్లోనే మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ కమ్బ్యాక్ ఇచ్చింది. ఆ సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ వుమెన్ తొలిసారి ఫ్రాంచైజీకి టైటిల్ అందించింది. దీంతో కెప్టెన్గా మంధాన పేరు మార్మోగిపోయింది. 2025 సీజన్లో టైటిల్ సాధించడంలో విఫలమైనప్పటికీ, 2026 సీజన్లో మరోసారి ఆర్సీబీ మహిళల జట్టు చాంపియన్గా నిలిచింది. ముఖ్యంగా కెప్టెన్గా, బ్యాటర్గా మంధాన అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో మంధాన 41 బంతుల్లోనే 87 పరుగులు సాధించి ఒంటిచేత్తో ఆర్సీబీకి రెండో కప్పును అందించింది. దీంతో ఆర్సీబీ కూడా చాంపియన్గా నిలవగలదని మంధాన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది. మహిళల జట్టును ఆదర్శంగా తీసుకున్న పురుషుల జట్టు లెగసీని కంటిన్యూ చేస్తూ ఇవాళ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. రాబోయే రెండు మూడేళ్లు ఆర్సీబీకి చెందిన మహిళల జట్టు డబ్ల్యూపీఎల్లో.. పురుషుల జట్టు ఐపీఎల్లో వరుస టైటిల్స్ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఆర్సీబీని మార్చిన కోహ్లీ సందేశం..2023 డబ్ల్యూపీఎల్లో వైఫల్యం తర్వాత ఆర్సీబీ మహిళల జట్టుతో కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో మహిళల జట్టుకు 'ఫలితం కోసం ఆశించకుండా 110 శాతం కష్టపడండి' అంటూ కోహ్లీ తన మోటివేషన్ స్పీచ్తో ఆ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలా కోహ్లీ సందేశాన్ని ఒంటబట్టించుకున్న మంధాన సేన 2024 సీజన్లో టైటిల్ను సాధించింది. ఆర్సీబీ తలరాత మార్చింది కోహ్లీ, పాటీదార్ కాదు.. మంధాన అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.𝙀𝙚 𝙎𝙖𝙡𝙖 𝘾𝙪𝙥 𝙉𝙖𝙢𝙙𝙪 x 2⃣ 🏆🏆Smriti Mandhana 🤝 Rajat Patidar #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/QxVAOX8oq2— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్ను షేక్చేస్తోన్న ఫిఫా పాట! -
సాల్ట్, సుయాశ్ చారిత్రక ఘనత
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కరికి దక్కిన అరుదైన ఘనతను, తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, సుయాశ్ శర్మ సాధించారు. ఆర్సీబీతో ఐపీఎల్ 2026 ఛాంపియన్గా నిలవడంతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిళ్ల (సీజన్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడిన ఆటగాళ్లలో) అరుదైన ఫీట్ను నమోదు చేశారు. గతంలో కర్ణ్ శర్మ ఒక్కడే ఈ ఫీట్ను సాధించగా.. తాజాగా సాల్ట్, సుయాశ్ అతని సరసన చేరారు.కర్ణ్ శర్మ 2016లో ఎస్ఆర్హెచ్తో, 2017లో ముంబై ఇండియన్స్తో, 2018లో సీఎస్కేతో ఐపీఎల్ టైటిళ్లు సాధించగా.. సాల్ట్, సుయాశ్ 2024లో కేకేఆర్తో, 2025, 2026లో ఆర్సీబీతో ఐపీఎల్ టైటిళ్లు సాధించి, చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నారు.మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా రెండో ఎడిషన్లో టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలి 17 ఎడిషన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని ఆర్సీబీ వరుసగా రెండు ఎడిషన్లు టైటిల్ సాధించి, టైటిళ్ల కరువును తీర్చుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. -
వైభవ్ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే!
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్లో వండర్కిడ్ అనడంలో సందేహం లేదు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికిప్పుడు వేలంలోకి వస్తే 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ సహా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎంపికైన వైభవ్ రూ.55 లక్షలు అందుకున్నాడు. దీంతో వైభవ్ ఆట మారడంతోనే అతడి బ్రాండ్వాల్యూ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు తాను సంతకాలు చేసిన ఎండార్స్మెంట్లకు సంబంధించిన ఫీజులన్నింటిని డబుల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వైభవ్ ఇప్పటికే కాంప్లాన్, రెడ్బుల్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వైభవ్.. ఇటీవలే ఐపీఎల్లో విధ్వంసకర ప్రదర్శనతో అతడితో ఒప్పందం కుదుర్చుకోవడానికి అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ తన ఎండార్స్మెంట్ ఫీజులను రెట్టింపు చేసినట్లు ఒక కంపెనీకి చెందిన అడ్వర్టైజింగ్ అధికారి పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు వైభవ్ ఒక్కో ఒప్పందానికి సుమారు రూ.కోటి చొప్పున సంతకాలు చేశాడు. సీజన్ ముగిసిన తర్వాత మాత్రం అతడు ఒక్కో ఒప్పందానికి రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నాడు. ఆట మారడంతోనే బ్రాండ్ కూడా మారిపోయిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఉన్నత దశలో ఉంది. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని కెరీర్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం వైభవ్ సమీప భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవడం ఖాయం. క్రికెట్లో ఇప్పటికే వైభవ్ను దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్తో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో పోలుస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ వాల్యూలకు ఆకర్షితుడవ్వకుండా కెరీర్ కోసం కష్టపడితే మాత్రం వైభవ్కు ఇంతమించి ఎండార్స్మెంట్లు వస్తాయనడంలో సందేహాం లేదు.చదవండి: కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి! -
IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే?
భారత మెగా క్రికెట్ సంబరం ఐపీఎల్-2026 ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.ఇక రెండు నెలలకు పైగా వినోదం పంచిన క్యాష్ రిచ్ లీగ్లో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి ఫైనల్లో 75 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించి.. వింటేజ్ కింగ్ను గుర్తుచేశాడు.అయితే, సీజన్ ఆసాంతం అదరగొట్టిన గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచారు. సాయి 12, గిల్ 10 పరుగులకే నిష్క్రమించడంతో గుజరాత్ ఓటమికి అక్కడే పునాది పడింది.అత్యుత్తమ జట్టుఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఈ సీజన్కు గానూ తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఇందులో పన్నెండు మందికి చోటిచ్చాడు. ఈ మేరకు..ఓపెనర్లుగా ఎవరంటే?‘‘వైభవ్ సూర్యవంశీ.. మరో మాటకు తావు లేకుండా నా జట్టులో అతడు ఉంటాడు. పదిహేనేళ్ల వయసులోనే అతడు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతడితో పాటు దిగ్గజ విరాట్ కోహ్లి నా జట్టు ఓపెనర్గా ఉంటాడు.మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ను ఆడిస్తాను. అతడే నా వికెట్ కీపర్.. అదే విధంగా వైస్ కెప్టెన్ కూడానూ!.. నాలుగో స్థానానికి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎంచుకుంటాను. అతడే నా జట్టు సారథి.అతడు లేకుంటే ఎలా?ఐదో స్థానంలో హైదరాబాద్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడు. అతడు లేకుండా అసలు ఈ జట్టు కూర్పు సాధ్యమే కాదు. పందొమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడ్డ ఏకైక మిడిలార్డర్ బ్యాటర్ అతడు.అతడికి తోడుగా హైదరాబాద్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా నా జట్టులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఈసారి దారుణం గా విఫలం కాగా.. అదే సమయంలో నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా సరైనోడు.ఎనిమిదో స్థానానికి సునిల్ నరైన్ లేదంటే రషీద్ ఖాన్ను ఎంచుకుంటాను. నాకు ఒక్క స్పిన్నర్ అవసరం మాత్రమే ఉంది. కాబట్టి సునిల్తో వెళ్తాను. ఇక తొమ్మిదో స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉంటాడనడంలో సందేహం లేదు.బౌలింగ్ దళం ఇదేఈ సీజన్లోనూ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. కగిసో రబడ, జోఫ్రా ఆర్చర్లకు కూడా నా జట్టులో చోటు ఉంటుంది. ఇక పన్నెండో స్థానం కోసం అన్షుల్ కాంబోజ్, సకీబ్ హుసేన్, రసిఖ్ సలామ్ దర్ పేర్లను పరిశీలించాను.సకీబ్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. రసిఖ్ కూడా తక్కువేమీ కాదు. అన్క్యాప్డ్ కేటగిరీలో అతడే అత్యధిక వికెట్ల వీరుడు. కాబట్టి రసిఖ్కే నా ఓటు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఉన్న రెండు, మూడు స్థానాల్లో ఉన్న గిల్ (732 రన్స్), సాయి (722)లకు మాత్రం ఆకాశ్ చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు.ఐపీఎల్-2026 సీజన్కు గానూ ఆకాశ్ చోప్రా ప్రకటించిన అత్యుత్తమ జట్టు (12 member).వైభవ్ సూర్యవంశీ (776 రన్స్), విరాట్ కోహ్లి (675 రన్స్), ఇషాన్ కిషన్ (602 రన్స్), రజత్ పాటిదార్ (కెప్టెన్- 501 రన్స్), హెన్రిచ్ క్లాసెన్ (624 రన్స్), నితీశ్ కుమార్ రెడ్డి (302 రన్స్, 8 వికెట్లు ), కృనాల్ పాండ్యా (226 రన్స్, 14 వికెట్లు), సునిల్ నరైన్ (15 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), కగిసో రబడ (29 వికెట్లు), జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు), రసిఖ్ సలామ్ దర్ (19 వికెట్లు).చదవండి: నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు! -
నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!
పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్గా భారీ అంచనాలతో ఐపీఎల్-2026లో బరిలోకి దిగి.. మరోసారి టైటిల్ సాధించి సత్తా చాటింది.అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. తద్వారా రజత్ పాటిదార్ సారథ్యంలో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి.. అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పూసర్ల వెంకట సింధు (PV Sindhu) ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పిన తీరు వైరల్గా మారింది. తాను బెంగళూరుకు మకాం మార్చిన తర్వాత.. అకస్మాత్తుగా ఆర్సీబీ ట్రోఫీల మీద ట్రోఫీలు గెలుస్తోందని సరదాగా ఆమె కామెంట్ చేశారు.నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!‘‘ఆర్సీబీ అభిమానులారా!... నేనేమీ మీ లక్కీ చార్మ్ అని చెప్పడం లేదు. కానీ.. మీరొకటి గమనించారా.. నేను బెంగళూరుకు మకాం మార్చినప్పటి నుంచి అకస్మాత్తుగా మీరు వరుసగా ట్రోఫీలు సాధిస్తున్నారు. అవునో.. కాదో మీరే లెక్కలు కట్టేయండి.ఏదేమైనా ఆర్సీబీ ఒక అసామాన్యమైన జట్టు. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది.. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా జట్టును తమ సొంతంగా భావించే అభిమానులకు కంగ్రాట్స్. ఈ ఫ్రాంఛైజీ భావోద్వేగాలకు నిలయం.అత్యంత ప్రత్యేకంఆర్సీబీ అంటే ఫ్యాన్స్కు ఒక రకంగా పిచ్చి. ఎన్నో ఏళ్లుగా ట్రోఫీ గెలుస్తామనే నమ్మకంతో వారు జట్టుకు అండగా నిలిచారు. ఇప్పుడిలా వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలవడం నిజంగా అత్యంత ప్రత్యేకం’’ అని పీవీ సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపారు.అయితే, ఫైనల్లో చాలా మంది మాదిరే తానూ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పోరును చూడాలనుకున్నానన్న సింధు.. బెంగళూరు ఈ విజయానికి వందశాతం అర్హమైందని పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) సరసన రజత్ పాటిదార్ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చదవండి: అతడేమీ రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోందా? -
ఐపీఎల్ ఫైనల్లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?
ఐపిఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ నటి, స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి ఆకర్షణీయంగా నిలిచారు. గుజరాత్లోని అహ్మదా బాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్లో అనుష్క శర్మ స్టాండ్స్ నుండి ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆమె చేతి రూ. 28 లక్షల విలువైన 'కార్టియర్ పాంథర్' (Cartier Panthère) లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సింపుల్ అండ్ లగ్జరీ స్టైల్, ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది.సెజాన్ లియోనార్డ్ వైట్ టాప్, వైడ్ లెగ్ ట్రౌజర్ల ధరించి సింపుల్ అండ్ క్లాసీ లుక్లో కనిపించింది. దీని ధర విలువ దాదాపు 25 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆమె లుక్ సింపుల్గా ఉన్నప్పటికీ, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం హైలైట్గా నిలిచింది. అభిమానులు అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్ పాంథర్' వాచ్ అని గుర్తుపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఈ ఐకానిక్ వాచ్ ధర దాదాపు రూ. 28 లక్షల వరకు ఉంటుందని అంచనా. స్క్వేర్ డయల్, రోమన్ అంకెలు, బ్రాస్లెట్ స్టైల్తో ఉండే ఈ వాచ్ సెలబ్రిటీలలో చాలా ఫేమస్. నీతా అంబానీ లాంటి ఫ్యాషన్ ఐకాన్లతో ప్రజాదరణ పొందింది.కాగా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలవడంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్, అనుష్క కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి అనుష్క ఎల్లప్పుడూ అండగా నిలిచే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో విరాట్ కోహ్లీ 'One felt nice, we did twice' (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రెండుసార్లు గెలిచాం) అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి అనుష్కతో కలిసి డాన్స్ చేయడం విశేషం. మొత్తానికి ఆర్సీబీ విజయోత్సవాల్లో అనుష్క లగ్జరీ వాచ్ ఒక అనూహ్యమైన ఫ్యాషన్ హైలైట్గా నిలిచింది. ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే! -
అతడేమి రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోంది?
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం అత్యంత ఫిట్గా ఉన్న భారత క్రికెటర్లలో ఒకడు. ఎంత అలసిపోయినా అదే వేగంతో, పట్టుదలతో బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అది కొత్త సీజన్లోని మొదటి బంతి అయినా.. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని చివరి రోజైనా సరే సిరాజ్లో ఏ మాత్రం అలుపు కనిపించదు.2026లో సిరాజ్ ఇప్పటికే విశ్రాంతి లేకుండా దాదాపు 6 లిస్ట్ ఎ మ్యాచ్లు, 18 టీ20 మ్యాచ్లు, 2 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అంతకముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా సిరాజ్ మొత్తం 5 మ్యాచ్లు ఆడి మరోసారి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2026, ఐపీఎల్-2026లో కూడా ఈ హైదరాబాదీ భాగమయ్యాడు.సిరాజ్కు విశ్రాంతి?ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్కు సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు బీసీసీఐని సూచిస్తున్నారు. బుమ్రా తరహాలోనే సిరాజ్ వర్క్లోడ్ను కూడా మేనేజ్ చేయాల్సిన అవసరముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సిరాజ్ ఏకంగా 17 మ్యాచ్లు ఆడాడు. సిరాజ్ చివరగా మే 31న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగాడు.ఇప్పుడు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే.. అఫ్గాన్తో టెస్ట్లో అతడు ఆడాల్సి ఉంది. 4 నెలల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన ఒక ఫాస్ట్ బౌలర్ను 5 రోజుల సుదీర్ఘ టెస్ట్ మ్యాచ్ ఆడమనడం ఎంతవరకు సమంజసం? ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడేమి రోబో కాదు కదా? అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ఇదే కొనసాగితే అతడు గాయాల బారిన పడే అవకాశముంది. కాబట్టి బీసీసీఐ అతడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్లు సైతం హెచ్చరిస్తున్నారు. అఫ్గానిస్తాన్తో జరిగే వన్డే సిరీస్ నుండి సిరాజ్కు విశ్రాంతి ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్ పర్యటనలతో మళ్లీ బిజీ కానున్నాడు.ముఖ్యంగా శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగే రెడ్ బాల్ సిరీస్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరగనున్నాయి. ఈ సిరీస్ల సమయానికి సిరాజ్ 100% ఫిట్నెస్తో ఉండటం ముఖ్యం. కాగా అఫ్గాన్తో జరిగే టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ పేసర్లను వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ముల్లాన్పూర్ పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. జట్టులో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే వంటి స్పిన్నర్లు ఉన్నారు.చదవండి: ఒకే ఓవర్లో 6 సిక్స్లు -
మా ఆధిపత్యం కొనసాగింది: పాటీదార్
గత ఏడాదితో పోలిస్తే ఈసారి తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగామని, అందుకే స్వేచ్ఛగా ఆడి ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించామని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ వ్యాఖ్యానించాడు. విజయానంతరం తన ఆనందాన్ని అతను మీడియాతో పంచుకున్నాడు. ‘టోర్నీలో ఏ దశలోనూ ఒత్తిడిని ఎదుర్కోలేదు. ప్రతీ మ్యాచ్లో ప్రశాంతంగా ఆడాం. ఈసారి ఇతర జట్లను ఓడించడం మాత్రమే కాదు, సంపూర్ణంగా ఆధిపత్యం ప్రదర్శించాం. ఇలాగే ఆడితే రెండో టైటిల్ సాధించగలమనే నమ్మకం ఆరంభంలోనే కలిగింది.ఇంతకంటే మంచి పుట్టిన రోజు కానుక ఏదీ ఉండదు. ఇకపై వరుసగా మూడో టైటిల్ ఎలా గెలవాలనే దానిపైనే మా దృష్టి’ అని అతను అన్నాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా పాటీదార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్లో స్వల్ప మార్పులతో ఈ దూకుడు సాధ్యమైందని అతను వెల్లడించాడు. ‘నా కెప్టెన్సీ శైలి భిన్నంగా ఉంటుందని అందరికీ తెలుసు. నేను ఎక్కువగా మాట్లాడకపోయినా మ్యాచ్లో పరిస్థితులపై పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటాను. టీమ్ మేనేజ్మెంట్, ఆటగాళ్ల మద్దతు కూడా నాకు ఉండటంతో అంతా సానుకూలంగా మారిపోయింది. ఐపీఎల్కు ముందు బ్యాటింగ్ విషయంలో తీవ్రంగా సాధన చేశాను. మెంటార్ దినేశ్ కార్తీక్తో చర్చించి కొన్ని సాంకేతిక అంశాలను మార్చుకున్నాను. మ్యాచ్లో నా పాత్రపై నాకు చాలా స్పష్టత ఉండటం వల్లే ఈ స్కోర్లు సాధించగలిగాను’ అని పాటీదార్ చెప్పాడు. 2025లో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల సమయంలో మరణించిన 11 మంది ఆర్సీబీ అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు అతను ప్రకటించాడు. నాటి ఘటన నేపథ్యంలోనే ఈ సారి బెంగళూరు నగరంలో ఎలాంటి విక్టరీ పరేడ్ నిర్వహించరాదని, బహిరంగంగా ఏ తరహా సంబరాలు చేయరాదని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఆదివారం రాత్రి ఫైనల్ ముగిసిన తర్వాత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ బెంగళూరు రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. ఇవన్నీ కూడా పోలీసుల పర్యవేక్షణలో, బ్యారికేడ్ల నియంత్రణలోనే జరగడం గమనార్హం. -
రాయల్గా సంబరాలు
అహ్మదాబాద్: ‘వన్ ఫెల్ట్ నైస్... వి డిడ్ ఇట్ ట్వైస్’... ఒక్క విజయం ఎంతో బాగు... రెండో విజయం బహు బాగు’ అంటూ ప్రత్యేకంగా సిద్ధం చేసిన టీ షర్ట్పై వ్యాఖ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు సంబరాలకు చిరునామాగా నిలిచింది. కోహ్లి సిక్సర్తో వరుసగా రెండో ఐపీఎల్ ట్రోఫీ ఖాయం కాగానే స్టేడియంలో మొదలైన వేడుకలు రాత్రంతా నిర్విరామంగా సాగాయి. ముందుగా మైదానంలో విజయోత్సవ వేడుకల్లో ఆటగాళ్లంతా భాగమయ్యారు. ఆ తర్వాత ఈ ఆనందం హోటల్ వరకు చేరింది. అక్కడ ఢోల్ బాజాలతో జట్టుకు ఘనమైన స్వాగతం లభించింది. ముందుగా కెప్టెన్ పాటీదార్ తన డ్యాన్స్తో ఇన్నింగ్స్ మొదలు పెట్టగా... ఆ తర్వాత కోహ్లి, కృనాల్ పాండ్యా బల్లే బల్లే అంటూ జత కలిశారు. రసిఖ్ సలామ్ తదితర కుర్రాళ్ల బృందం చేసిన హంగామాతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఆ తర్వాత హోటల్లో అసలు పార్టీ మొదలైంది. జట్టు విజయోత్సవంలో అంతా పాల్గొని తెల్లవారే వరకు నిర్విరామంగా సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లి, అనుష్క శర్మ కలిసి చేసిన డ్యాన్స్ ఈ మొత్తం ప్రోగ్రామ్కే హైలైట్గా నిలిచింది. జట్టు మెంటార్ దినేశ్ కార్తీక్ కూడా కోహ్లితో జత కట్టి ‘నాటు నాటు’ స్టెప్పులేశాడు. సోమవారం పుట్టిన రోజు జరుపుకున్న రజత్ పాటీదార్, దినేశ్ కార్తీక్లతో పాటు ఫిల్ సాల్ట్ ఏడాది బాబుకు కూడా కలిపి ముగ్గురి బర్త్డే వేడుకలు కూడా ఇదే వేదికపై నిర్వహించారు. మరోవైపు ఫైనల్లో ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ అనూహ్య ఘటనలో బాధితులయ్యారు. మ్యాచ్ ముగిశాక హోటల్కు వెళుతుండగా టీమ్ బస్సును దారి మధ్యలో నిలిపి వేయాల్సి వచ్చింది. షార్ట్ సర్క్యూట్తో బస్సు ఆగిపోవడంతో ఆటగాళ్లందరినీ కిందకు దించేశారు. ఆ తర్వాత మరో బస్సు లో గుజరాత్ ప్లేయర్లు హోటల్కు చేరుకున్నారు. విన్నింగ్ షాట్ కల తీరింది: కోహ్లి విరాట్ కోహ్లి తన అత్యద్భుత కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలందించాడు. ఛేదనలో చివరి వరకు నిలిచి మరెన్నో మ్యాచ్లలో భారత జట్టును లక్ష్యానికి చేర్చాడు. కానీ ఐపీఎల్లో కూడా అలాగే గెలిపించాలని చాలాసార్లు కోరుకున్నాడు. చివరకు ఇప్పుడు అది జరిగిందని కోహ్లి సంతోషాన్ని ప్రదర్శించాడు. 2025లోనే ఆర్సీబీ టైటిల్ నెగ్గినా... నాడు జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆదివారం కూడా విజయానికి 11 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనట్లు కనిపించినా... చివరకు రీప్లేలో నాటౌట్గా తేలాడు. ‘ఐపీఎల్లో విన్నింగ్ షాట్ కొట్టాలనేది నా కల. దీని గురించి నిజంగా చాలాసార్లు ఆలోచించాను. ఎట్టకేలకు ఈ రోజు సాధ్యమైంది. ఛేదనలో ఏం చేయాలో నాకు సరిగ్గా తెలుసు. ఈతరం కుర్రాళ్ల జోరులో మరింత సాహసంతో ఆడాలనే విధంగా నా ఆలోచనా శైలి మారింది. అందుకే వేగవంతమైన అర్ధసెంచరీ సాధించగలిగా. పవర్ప్లేలోనే గెలుపు ఖాయం కావాలని వెంకటేశ్ అయ్యర్కు చెప్పాను. ఫ్యాన్స్కు మాకు అండగా నిలిచిన తీరు చూస్తే 7 కాదు 14 హోం మ్యాచ్లు ఆడినట్లుగా అనిపించింది. ఫైనల్లో కూడా వేదిక ప్రత్యర్థి జట్టుదే అయినా 90 శాతం ఫ్యాన్స్ మాకు మద్దతిచ్చారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. -
ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీకి బిగ్షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్గా నిలిచిన ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ జరిమానా నుంచి తప్పించుకోలేకపోయాడు. వరుసగా రెండో సీజన్లోనూ టైటిల్ గెలిచి జోరు మీదున్న ఆర్సీబీకి టిమ్ డేవిడ్పై చర్య తీసుకోవడం కంటికి ఇంపుగా మారింది. టైటిల్ గెలిచిన ఉత్సాహం, సంబరాల నడుమ ఫైనల్ మ్యాచ్లో మైదానంలో దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతేకాదు ఐపీఎల్ 2027 సీజన్లో ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్ లేదా అతడు ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ ఆడే తొలి మ్యాచ్లో టిమ్ డేవిడ్ ఆడకుండా అతడిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో టిమ్ డేవిడ్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్బ్యాగ్ను విసరడం కనిపించింది. ఇది ఫన్నీగా చేశాడా లేక కావాలనే చేశాడా అన్నది పక్కనబెడితే.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు.. జట్టుపై లేదా అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ లేదా మూడో వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించడం లేదా ఏదైనా వస్తువును విసరడం నిబంధనలకు విరుద్ధం. 30 ఏళ్ల టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించినందున తన దుష్ప్రవర్తనతో నిబంధనలను ఉల్లఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ఈ సీజన్లో టిమ్ డేవిడ్ బీసీసీఐ ఆగ్రహానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. ఈ టోర్నీలో అతడు మూడుసార్లు ఐపీఎల్ లెవెల్ 1 నిబంధనను ఉల్లఘించడం గమనార్హం. మొదటిసారి ఈ సీజన్లో 20వ మ్యాచ్లో (ఒక డీమెరిట్ పాయింట్), 54వ మ్యాచ్లో రెండో ఉల్లంఘన కింద రెండు డీమెరిట్ పాయింట్లు కోత పడింది. మూడోసారి కూడా టిమ్ డేవిడ్ నిబంధన ఉల్లంఘించడంతో నిబంధనల ప్రకారం వచ్చే సీజన్లో అతడు తొలి మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ పడనుంది.చదవండి: ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త! -
కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది?
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో కోహ్లీ(75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించడమే గాక రెండోసారి టైటిల్ అందించాడు.అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శర్మల మధ్య జరిగిన ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఆ వీడియోలో అనుష్క, కోహ్లీ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో, అనుష్క చేతిలో ఒక కవర్ కనిపించింది. ఇది చూసిన కోహ్లీ అందులో ఏముందో తెలుసుకోవడానికి అది ఒకసారి ఇవ్వాలని అడిగాడు. కానీ అనుష్క మాత్రం కోహ్లీకి లెటర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.అయినా కోహ్లీ అదే పనిగా ఆమె చేతి నుంచి లెటర్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనుష్క శర్మ డగౌట్కు చేరుకున్న తర్వాత ఇస్తానులే అని చెప్పింది. దీంతో కోహ్లీ ఏంటి ఇలా చేస్తున్నావనడం వీడియోలో కనిపించింది. ఇది చూసిన అభిమానులు ఇంతకీ ఆ కవర్లో ఏముంది చెప్మా అంటూ కామెంట్లు పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.FUNNY MOMENT AFTER THE FINAL 🤣🔥- Anushka had an envelope.- Virat Kohli was trying to take it.- But Anushka didn't want to give it.- Kohli tried multiple times but failed.- He was curious to know what was inside.Meanwhile, Anushka: "I'll give it to you there." 😅🔥 pic.twitter.com/v8k7jyaZ4z— Jara (@JARA_Memer) June 1, 2026చదవండి: కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం! -
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే! -
అతడిని వన్డౌన్లో ఆడిస్తారా?: ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. అసలు గుజరాత్ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.జోస్ బట్లర్ను కాదని నిశాంత్ సింధును వన్డౌన్లో ఎలా ఆడిస్తారని బ్రాడ్ ప్రశ్నించాడు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్ సందర్భంగా గుజరాత్ తమ టాపార్డర్ను మార్చిన సంగతి తెలిసిందే.ఆదిలోనే షాక్ఓపెనర్లుగా సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కొనసాగగా.. వన్డౌన్లో మాత్రం బట్లర్ను కాదని నిశాంత్ సింధును ఆడించారు. అయితే, సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్ 10 పరుగులే చేయడంతో గుజరాత్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఇలాంటి తరుణంలో అన్క్యాప్డ్ నిశాంత్ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ గుజరాత్ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్ మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.నాకైతే అర్థం కావడం లేదుఅసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్ను పరీక్షించేందుకు వీలుకాదు. ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ విమర్శించాడు.బహుశా అందుకేనేమో!ఇక ఇదే షోలో ఇంగ్లండ్ మరో మాజీ ఆటగాడు స్టీవెన్ ఫిన్స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్గా ఆడిన అనుభవం బట్లర్కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని గుజరాత్ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్ స్టాండింగ్ ఇస్తే బట్లర్ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్ టాపార్డర్ కుదేలు కాగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్ విజేతగా నిలిచింది.చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?! -
ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?!
ఐపీఎల్ పందొమ్మిదో సీజన్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.ఇదిలా ఉంటే.. ఈ సీజన్తో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ కెరీర్ చరమాంకానికి చేరినట్లు తెలుస్తోంది. అంచనాలు అందుకోలేక చతికిలపడిన కొందరు ప్లేయర్లను వదిలించుకునేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టాప్-5లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!కరుణ్ నాయర్కరుణ్ నాయర్ను ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో రాణిస్తాడనే ఉద్దేశంతో 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్కు అవకాశం ఇచ్చింది. ఇక, ఐపీఎల్-2025లో కరుణ్ నాయర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి 198 పరుగులు చేయగలిగాడు. దీంతో ఈ ఏడాది కూడా ఫ్రాంఛైజీ అతడిని కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2026లో రెండు ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ కేవలం 18 పరుగులే చేశాడు. ఫీల్డింగ్లోనూ విఫలమయ్యాడు.వచ్చే సీజన్ నాటికి కరుణ్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో కరుణ్ నాయర్కు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఇక అతడికి కొత్త జట్టు దొరకడం కూడా కష్టమే!టి.నటరాజన్సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్గా వచ్చి.. ఐపీఎల్లో ఇటీవలి కాలంలో ప్రభావం చూపిన లెఫ్టార్మ్ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు టి.నటరాజన్. ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది అతడిని ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో రాణించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించకలేకపోయాడు ఈ తమిళనాడు బౌలర్. పది ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు వికెట్లే తీశాడు. ఎకానమీ 11.18.వరుసగా ఆరు మ్యాచ్లలో నటరాజన్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. కాబట్టి ఢిల్లీ అతడిని వదిలివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.అన్రిచ్ నోర్జేసౌతాఫ్రికా స్పీడ్స్టర్ అన్నిచ్ నోర్జేను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. పదునైన పేస్ ఆయుధంతో రాణించగల నోర్జే.. అదే స్థాయిలో గాయాల బారిన పడటం ప్రతికూలంగా మారింది.తాజా ఎడిషన్లో అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగలిగాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. గతంలో కేకేఆర్ తరఫున కూడా కేవలం రెండు మ్యాచ్లే ఆడి వెళ్లిపోయాడు. దీంతో గాయాల బెడదతో బాధపడుతున్న నోర్జేకు ఫ్రాంఛైజీలు మళ్లీ అవకాశం ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అనిపిస్తోంది.ట్రెంట్ బౌల్ట్న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ఫాస్ట్బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు ఐపీఎల్లోనూ ఘన చరిత్రే ఉంది. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్ బౌలర్.. ఇప్పటికి 124 మ్యాచ్లలో కలిపి 145 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్-2026కు ముందు ముంబై ఇండియన్స్ రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్ను కొనుగోలు చేసింది. అయితే, ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు. దీంతో అతడికి బౌలింగ్ కోటా పూర్తి చేసే అవకాశం కూడా రాలేదు. కాబట్టి 36 ఏళ్ల బౌల్ట్ను ముంబై వదిలేస్తే.. అతడికి మరో ఫ్రాంఛైజీ నుంచి అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది.హర్షల్ పటేల్ఐపీఎల్-2026కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. గతేడాది 13 ఇన్నింగ్స్లో కలిపి అతడు 16 వికెట్లు తీశాడు అయితే, గతంలో మాదిరి ఈసారి హర్షల్ రాణించలేదు.ఐదు మ్యాచ్లు ఆడి 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్ నాటికి హర్షల్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హర్షల్ వేలంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్రాంఛైజీ అతడి వైపు మొగ్గుచూపకపోవచ్చు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్మనీ? -
‘కడుపున పుట్టిన పిల్లల్లాగే.. అప్పుడే సగం గెలిచేశాము’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కడుపున పుట్టిన సంతానంలో ఎవరు ప్రత్యేకమో చెప్పడం కష్టమని.. ఐపీఎల్ ట్రోఫీల విషయంలోనూ తాను ఇదే మాట చెబుతానన్నాడు. ఈ ట్రోఫీలు కూడా తన సొంత పిల్లల్లాంటివే అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా గతేడాది ఆర్సీబీ తరఫున 109 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. 17 వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ కృనాల్ అదరగొట్టాడు.ఐదుసార్లుఈసారి 226 పరుగులు చేసిన కృనాల్.. 14 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవడంలో కీలకంగా మారాడు. ఈ క్రమంలో ఐదుసార్లు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా కృనాల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున 2017, 2019, 2020లలో టైటిల్ గెలిచిన ఈ బరోడా ఆల్రౌండర్... ప్రస్తుతం ఆర్సీబీతో ప్రయాణం కొనసాగిస్తూ.. 2025, 2026లలో విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.కడుపున పుట్టిన పిల్లల్లాంటివే..ఈ నేపథ్యంలో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై విజయానంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఐపీఎల్ ట్రోఫీ దేనికదే ప్రత్యేకం. ఇది కూడా పిల్లల్ని కలిగి ఉండటం లాంటిదే. కడుపున పుట్టిన పిల్లల్లో ఎవరు ప్రత్యేకమో చెప్పలేము.అలాగే ఈ ట్రోఫీల విషయంలోనూ నేనేమీ చెప్పలేను. ఎంతో కష్టపడితే గానీ ట్రోఫీని ముద్దాడలేము. పదకొండేళ్ల వ్యవధిలో ఐదు ట్రోఫీలు గెలవడం నిజంగా నాకెంతో ప్రత్యేకం’’ అని తెలిపాడు.వేలం సమయంలోనే సగం గెలిచేశాముఇక తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి విజేతగా నిలవడం పట్ల కృనాల్ స్పందించాడు. ‘‘నిజానికి గతేడాది వేలానికి ముందే మేము ఎంతగానో చర్చించాము.సమతుల్యమైన జట్టును తయారు చేసుకున్నాము. వేలం సమయంలోనే మేము సగం టోర్నీ గెలిచేశామని చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ఎదురుచూపుల తర్వాత ఇలా వరుసగా ట్రోఫీలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ్యాచ్ ఎక్కడైనా సరే.. అక్కడ మాకు అభిమానులు ఉంటారు. ఇదొక అద్వితీయమైన అనుభూతి’’ అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.Celebration rukenge nahi ft. Krunal Pandya. 🕺🤭😂 pic.twitter.com/s6RgvHdxaR— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026కృనాల్తో పాటు వీళ్లు కూడాఆర్సీబీ వరుస రెండు టైటిల్ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. కెప్టెన్ రజత్ పాటీదార్, దిగ్గజ ఓపెనర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, స్వప్నిల్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జోష్ హాజల్వుడ్, రసిఖ్ సలామ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, అభినందన్కి ఇది రెండో ట్రోఫీ. మరో 10 మంది దేవ్దత్ పడిక్కల్, కాక్స్, బెతెల్, వెంకటేశ్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్మనీ? -
ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటిగా నిలిచిపోనుంది. 2022 సీజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2022లో చాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 2023లో రన్నరప్గా, 2024 సీజన్లో లీగ్ దశ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్, తాజా సీజన్లో మరోసారి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆడిన తుది జట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆటగాళ్ల రేటింగ్ను విడుదల చేశారు. 10 పాయింట్లతో కూడిన రేటింగ్లో జట్టును అంతా తానై నడిపించిన కెప్టెన్ శుబ్మన్ గిల్, బౌలర్ కగిసో రబాడ చెరో 9 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, సాయి సుదర్శన్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లు ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఇక వికెట్ కీపర్ జాస్ బట్లర్ 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ చెరో 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శర్మ, అర్షద్ ఖాన్లు చెరో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, 3 పాయింట్లతో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో ద్దగా ప్రభావం చూపని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్తో ఆఖరి స్థానాల్లో ఉన్నారు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చతికిలపడిన గుజరాత్ రన్నరప్కు పరిమితమైంది.చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
నాపై ఒత్తిడి పెరిగింది.. ఇకపై: వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానన్నాడు. అయితే, చిన్న వయసులోనే వచ్చిన ఈ ‘అమితాదరణ’ ఒక్కోసారి తనను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని తెలిపాడు.గతేడాది.. పద్నాలుగేళ్ల వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా సత్తా చాటి వరల్డ్కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఇక ఐపీఎల్-2026లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ ఓపెనర్గా ఈసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగి.. ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలుచుకున్నాడు.ఈ క్రమంలో ప్రజెంటర్, టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రితో మాట్లాడుతూ వైభవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘అందరూ నా గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. అయితే, వరుస ఇంటర్వ్యూలు నాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. నేను గర్వించదగ్గ క్షణం ఇది.నాపై ఒత్తిడి.. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానువచ్చే సీజన్లోనూ ఇలాగే ఆడటానికి ప్రయత్నిస్తాను. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని జయించడం ఎలాగో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యాచ్.. మ్యాచ్కూ నా ఆట తీరు మారుతుంది. పరిస్థితులకు తగ్గట్లుగా.. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడతాను. ఈ సీజన్లో నేను నేర్చుకున్న ప్రధాన అంశాలు ఇవే.ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం ఫిట్నెస్ మీదే ఉంది. నేను సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే.. గాయాల బారిన పడకుండా ఉండాలి. అందుకోసం ఫిట్గా ఉండాలి. మా జట్టు మొత్తం నాకు అండగా నిలబడింది. సీనియర్ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్ మనీ?! -
రెండో టైటిల్.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్లో ఆదివారం టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.టాపార్డర్ను కుదేలు చేసి ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టిన ఆర్సీబీ.. గుజరాత్ను 155 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పనిపూర్తి చేసింది. తద్వారా ఏకపక్ష విజయం సాధించి.. తమ స్థాయి ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ తమ పేరిట పలు రికార్డులు లిఖించుకుంది. అవేమిటంటే..ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్ టోర్నీ టైటిల్ను వరుసగా రెండేళ్లు గెల్చుకున్న మూడో జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011లో), ముంబై ఇండియన్స్ (2019, 2020లో) మాత్రమే ఈ ఘనత సాధించాయి.👉ఐపీఎల్లో 2011లో ‘ప్లే ఆఫ్స్’ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ‘ప్లే ఆఫ్స్’లోని క్వాలిఫయర్–1 మ్యాచ్లో గెలిచిన జట్టే విజేతగా నిలువడం ఇది 13వసారి కావడం విశేషం. చెన్నై (2011, 2018, 2021, 2023లో), కోల్కతా (2012, 2014, 2024లో), ముంబై (2015, 2019, 2020లో), బెంగళూరు (2025, 2026), గుజరాత్ టైటాన్స్ (2022లో) జట్లు ఈ ఘనత సాధించాయి. 👉చెన్నై (5 సార్లు), ముంబై (5 సార్లు), కోల్కతా (3 సార్లు) జట్ల తర్వాత ఐపీఎల్ టోర్నీ టైటిల్ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో జట్టుగా బెంగళూరు నిలిచింది.దిగ్గజాల సరసన రజత్ పాటీదార్👉ఐపీఎల్ టైటిల్ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో కెప్టెన్ రజత్ పాటీదార్. గతేడాది (2025) పాటీదార్ సారథ్యంలోనే బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ధోని, రోహిత్ శర్మ (5 సార్లు చొప్పున), గౌతమ్ గంభీర్ (2 సార్లు) ఉన్నారు.👉ఒకే వేదికపై రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టు బెంగళూరు. 2025లోనూ అహ్మదాబాద్లోనే బెంగళూరు టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ (కోల్కతా, ఈడెన్గార్డెన్స్; 2013, 2015లో; హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం; 2017, 2019లో), కోల్కతా నైట్రైడర్స్ (చెన్నై, ఎంఎ చిదంబరం స్టేడియం; 2012, 2024లో) ఉన్నాయి.చదవండి: వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026 -
గాయాన్ని కూడా లెక్కచేయకుండా భరించలేని నొప్పిని తట్టుకుంటూ...
-
ఐపీఎల్ 2026 చెత్త జట్టు.. కెప్టెన్గా హార్దిక్.. స్కై కూడా చోటు
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఈ సీజన్లో నిరాశపరిచిన ఆటగాళ్లతో ఒక "ఫ్లాప్ జట్టు" రూపొందించబడింది. క్రెక్స్ అనే ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ రూపొందించిన ఈ జట్టులో అనూహ్యంగా పెద్ద పెద్ద స్టార్లు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్గా ముంబై ఇండియన్స్ను లీడ్ చేసిన హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. ఆశ్చర్యకరంగా పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య పేరు ఈ జట్టులో ప్రత్యక్షమైంది.ప్రియాంశ్ మినహా మిగతా ప్లేయర్ల పేర్లు ఊహించినవే అయినా, ఒకరిద్దరి పేర్లు తొలగించి ఉండాల్సిందన్న భావన కలిగింది. అలాంటి వారిలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేరు ఒకటి. రుతు ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయినా, 337 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.ప్రియాంశ్ ఆర్య సైతం ఈ సీజన్లో 364 పరుగులు సాధించినా, నిలకడలేమి అతన్ని ఈ జట్టులో చేర్చింది. టాపార్డర్లో సూర్యకుమార్ యాదవ్ పేరు ఊహించిందే.మిడిలార్డర్లో ఈ సీజన్ వైఫల్యాధికుల పేర్లు ఉన్నాయి. లక్నో తరఫున ఘోర ప్రదర్శన చేసిన పూరన్, వైఫల్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన అదే జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, డ్రాప్ క్యాచ్లతో ఈ సీజన్లో హైలైట్ అయిన పంజాబ్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్, అదే జట్టు మరో ఆల్రౌండర్ మార్కో జన్సెన్ ఫ్లాప్ జట్టు మిడిలార్డర్లో చోటు దక్కించుకున్నారు.కెప్టెన్గా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా ఈ ఫ్లాప్ జట్టుకు ఫస్ట్ ఛాయిస్ కెప్టెన్ అయ్యాడు.బౌలింగ్ విభాగానికొస్తే.. ఈ విభాగం కూడా స్టార్లతో నిండింది. మరిముఖ్యంగా టీమిండియా స్టార్లంతా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆల్రౌండ్గా మిక్స్డ్ సీజన్ కలిగిన అక్షర్ పటేల్.. వికెట్లు లేకా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్న కుల్దీప్ యాదవ్.. వికెట్ల కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూసిన బుమ్రా, వికెట్లు తీయగలిగినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ సింగ్ ఈ ఫ్లాప్ టీమ్లో చోటు దక్కించుకున్నారు.మొత్తంగా హార్దిక్, సూర్యకుమార్, బుమ్రా, పంత్ వంటి పెద్ద పేర్లు ఈ జట్టులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్లో ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. క్రెక్స్ ప్రకటించిన ఫ్లాప్ జట్టులో ఛాంపియన్, రన్నరప్ ఆర్సీబీ, గుజరాత్ జట్లలో నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. -
‘బాస్ బేబీ’ వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!
ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన ఈ బిహారీ పిల్లాడు.. జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తంగా 16 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 776 పరుగులు సాధించాడు.తద్వారా తాజా ఎడిషన్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అంతేకాదు ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు (72) బాదిన ప్లేయర్గానూ నిలిచి.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.యూనివర్స్ బాస్ బేబీఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని అభిమానులు ముద్దుగా ‘యూనివర్స్ బాస్ బేబీ’ అని పిలుచుకుంటున్నారు. ఇక అతడి ఆట తీరుకు టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్.. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, విండీస్ స్టార్ గేల్ తదితరులు ఇప్పటికే ఫిదా అయిన సంగతి తెలిసిందే.తాజాగా... భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఆర్సీబీ ‘కింగ్’ కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Virat Kohli' talking with "Vaibhav Suryavanshi ❤️ pic.twitter.com/0OVwtASeVp— Priyanka Yadav (@Priyankaji1998) June 1, 2026వైభవ్ సూర్యవంశీతో కోహ్లి ముచ్చటఇక అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచి.. కింగ్ హవాలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ విజయానంతరం కోహ్లి వైభవ్ సూర్యవంశీతో కాసేపు ముచ్చటించాడు.తనకు వినయంగా నమస్కరించిన ‘బేబీ బాస్’ భుజం తట్టి.. ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడబ్బా!.. మాకూ తెలిస్తే బాగుండు’ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!ఈ నేపథ్యంలో ఆర్సీబీ దిగ్గజం, కామెంటేటర్ ఏబీ డివిలియర్స్ కోహ్లి.. వైభవ్ గురించి తనతో మాట్లాడిన విషయాన్ని బయటపెట్టాడు. ‘‘విరాట్ ఏం చెప్పాడోనని మీరంతా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా!.. వైభవ్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి స్టేజీ పైకి వెళ్తుంటే విరాట్ నాతో అతడి గురించి మాట్లాడాడు.‘ఏబీ.. ఈ పిల్లాడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ అబ్బాయి చాలా కాలం క్రికెట్ను ఏలగలడు’ అని విరాట్ నాతో అన్నాడు’’ అని డివిలియర్స్ తెలియజేశాడు. కాగా సచిన్ సైతం వైభవ్ రిస్ట్ వర్క్, టెక్నిక్ అద్భుతం అంటూ కొనియాడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫైనల్ వీక్షించేందుకు ఆదివారం అహ్మదాబాద్కు వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఐసీసీ చైర్మన్ జై షా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో కలిసి మ్యాచ్ను ఆస్వాదించాడు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ? -
GT ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు..
-
ఐపీఎల్ ముగిసింది.. వారంలోపే రంగంలోకి దిగనున్న టీమిండియా
ఐపీఎల్ 2026 ముగిసిన వారం వ్యవధిలోనే టీమిండియా రంగంలోకి దిగనుంది. జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్తో భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ ఏడాది ఆసాంతం టీమిండియా అన్ని ఫార్మాట్ల సిరీస్లతో బిజీగా ఉండనుంది. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి.భారత్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పర్యటనజూన్ 6-10: ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ (ముల్లాన్పూర్)జూన్ 13- ఆఫ్ఘనిస్తాన్తో తొలి వన్డే (ధర్మశాల)జూన్ 17- ఆఫ్ఘనిస్తాన్తో రెండో వన్డే (లక్నో)జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్తో మూడో వన్డే (చెన్నై)ఐర్లాండ్లో టీమిండియా పర్యటనజూన్ 26- తొలి టీ20 (బెల్ఫాస్ట్)జూన్ 28- రెండో టీ20 (బెల్ఫాస్ట్)టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్జులై 1- తొలి టీ20 (చెస్టర్ లీ స్ట్రీట్)జులై 4- రెండో టీ20 (మాంచెస్టర్)జులై 7- మూడో టీ20 (నాటింగ్హమ్)జులై 9- నాలుగో టీ20 (బ్రిస్టల్)జులై 11- ఐదో టీ20 (సౌతాంప్టన్)జులై 14- తొలి వన్డే (ఎడ్జ్బాస్టన్)జులై 16- రెండో వన్డే (కార్డిఫ్)జులై 19- మూడో వన్డే (లండన్)టీమిండియా టూర్ ఆఫ్ జింబాబ్వేజులై 23- తొలి టీ20 (హరారే)జులై 25- రెండో టీ20 (హరారే)జులై 26- మూడో టీ20 (హరారే)టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక (అధికారికంగా ఖరారు కాలేదు)2 టెస్టులు, 3 టీ20లుఏషియన్ గేమ్స్ 2026 (టీ20 ఫార్మాట్, సెప్టెంబర్ 17 – అక్టోబర్ 3)ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది.భారత్లో వెస్టిండీస్ జట్టు పర్యటనసెప్టెంబర్ 27- తొలి వన్డే (తిరువనంతపురం)సెప్టెంబర్ 30- రెండో వన్డే (గౌహతి)అక్టోబర్ 3- మూడో వన్డే (ముల్లాన్పూర్)అక్టోబర్ 6- తొలి టీ20 (లక్నో)అక్టోబర్ 9- రెండో టీ20 (రాంచీ)అక్టోబర్ 11- మూడో టీ20 (ఇండోర్)అక్టోబర్ 14- నాలుగో టీ20 (హైదరాబాద్)అక్టోబర్ 17- ఐదో టీ20 (బెంగళూరు)భారత్లో శ్రీలంక జట్టు పర్యటనడిసెంబర్ 13- తొలి వన్డే (ఢిల్లీ)డిసెంబర్ 16- రెండో వన్డే (బెంగళూరు)డిసెంబర్ 19- మూడో వన్డే (అహ్మదాబాద్)డిసెంబర్ 22- తొలి టీ20 (రాజ్కోట్)డిసెంబర్ 24- రెండో టీ20 (కటక్)డిసెంబర్ 27- మూడో టీ20 (పూణే)భారత్లో జింబాబ్వే జట్టు పర్యటన2027, జనవరి 3- తొలి వన్డే (కోల్కతా)జనవరి 6- రెండో వన్డే (హైదరాబాద్)జనవరి 9- మూడో వన్డే (ముంబై)భారత్లో ఆస్ట్రేలియా పర్యటనజనవరి 21- తొలి టెస్ట్ (నాగ్పూర్)జనవరి 29- రెండో టెస్ట్ (చెన్నై)ఫిబ్రవరి 11- మూడో టెస్ట్ (గౌహతి)ఫిబ్రవరి 19- నాలుగో టెస్ట్ (రాంచీ)ఫిబ్రవరి 27- ఐదో టెస్ట్ (అహ్మదాబాద్) -
అప్పుడు బీసీసీఐ నిషేధం!.. ఇప్పుడీ కుర్రాడికి ‘సలామ్’ కొట్టాల్సిందే!
‘ఈ సాలా కప్ నమ్దూ’ అంటూ పద్దెనిమిదేళ్లుగా ఎదురుచూసిన అభిమానుల కలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది నిజం చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే, అంతటితో ఆర్సీబీ ఆకలి తీరలేదు.ఆత్మ విశ్వాసంతో ఐపీఎల్-2026లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్లో ఆదివారం నాటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి.. ‘ఈ సాలనూ కప్ నమ్దూ’ (ఈసారీ కప్పు మనదే) అంటూ విజిల్స్ వేయించింది.చివరి నిమిషంలో సువర్ణావకాశంనిజానికి ఆర్సీబీ అ‘ద్వితీయ’విజయంలో పేస్ బౌలింగ్ దళానిదే కీలక పాత్ర. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్వుడ్ (15 వికెట్లు) ముందుండి నడిపించగా... మరో భారత కుర్రాడి పాత్ర కూడా మరువలేనిది. గతేడాది సత్తా చాటినా.. వివాదం కారణంగా చివరి నిమిషంలో యశ్ దయాళ్ దూరం కావడంతో మూడో పేసర్గా సత్తా చాటాల్సిన స్థితిలో తనకు లభించిన అవకాశాన్ని అతడు సమర్థంగా వినియోగించుకున్నాడు.అతడు మరెవరో కాదు జమ్ము కశ్మీర్కు చెందిన 26 ఏళ్ల రసిఖ్ సలామ్. ఈ సీజన్లో 19 వికెట్లతో రాణించి.. తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయంలో భాగమయ్యాడు. అనూహ్య మలుపులతో సాగిన కెరీర్లో అతడు ఇక్కడి వరకు రాగలిగాడు.రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ!ఐపీఎల్లో 2019లో తొలిసారి ముంబై ఇండియన్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడి సలామ్ అరంగేట్రం చేశాడు. కొద్ది రోజుల్లోనే ‘తప్పుడు వయసు’ను చూపించిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో 2020 అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోయాడు సలామ.ముంబై అండతో..అయితే ముంబై ఇండియన్స్ అండగా నిలిచి అన్ని సౌకర్యాలతో తమ ప్రైవేట్ క్లబ్లో అతడికి రెండేళ్ల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో 2022లో మళ్లీ ఐపీఎల్ అవకాశం దక్కగా కేకేఆర్ 2 మ్యాచ్లే ఆడించింది. ఇక 2023లో సలామ్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్న రిషభ్ పంత్... సలామ్ బౌలింగ్ పదును చూసి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో అవకాశం కల్పించాడు.రసిఖ్ అంటే ‘నిలకడ’ అలా 2024లో 8 మ్యాచ్లు ఆడే చాన్స్ లభించడంతో సలామ్ ఆకట్టుకున్నాడు. ఇక గతేడాది ఆర్సీబీ రూ.6 కోట్లకు అతడిని తీసుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో రెండు మ్యాచ్లలోనే అవకాశం దక్కింది కానీ జట్టు అతడిలో మంచి భవిష్యత్తును చూసింది. దాని ఫలితం ఈ సారి కనిపించింది. కశ్మీరీ భాషలో రసిఖ్ అంటే ‘నిలకడ’ అని అర్థం.ఈసారి 12 మ్యాచ్లలో నిలకడగా రాణించిన సలామ్ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టి.. జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో సీనియర్లు భువీ, హాజిల్వుడ్ కంటే.. సలామ్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి.. నిశాంత్ సింధు (20), రాహుల్ తెవాటియా (7), రషీద్ ఖాన్ (7) రూపంలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026చదవండి: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ అంటే?! -
IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ?
ఐపీఎల్-2026 టోర్నీ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా అవతరించింది. తద్వారా వరుసగా రెండోసారి ట్రోఫీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఆర్సీబీ గతేడాది ఫైనల్లో.. పంజాబ్ కింగ్స్ను ఓడించి చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే జోరు కొనసాగిస్తూ తాజా ఎడిషన్లోనూ జయభేరి మోగించింది.Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026ఇక ఐపీఎల్ తాజా సీజన్లో చాంపియన్ ఆర్సీబీ, రన్నరప్ గుజరాత్ ప్రైజ్ మనీలతో పాటు.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలిచిన ప్లేయర్లు, వారికి దక్కిన మొత్తం ఎంతో తెలుసుకుందామా?!ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్) 👉మ్యాచ్లు: 16; పరుగులు: 776 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలుపర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) కగిసో రబాడ (గుజరాత్) 👉మ్యాచ్లు: 17; వికెట్లు: 29 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్మనీ: రూ. 15 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్’ వైభవ్ సూర్యవంశీ👉స్ట్రయిక్ రేట్: 237.30 👉ప్రైజ్మనీ: టాటా కార్ ‘బెస్ట్ క్యాచ్’ ఆఫ్ ద టోర్నీ మనీశ్ పాండే (కోల్కతా)👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు‘ఫెయిర్ ప్లే’ అవార్డుపంజాబ్ కింగ్స్ అత్యధిక సిక్స్లువైభవ్ (72 సిక్స్లు) 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు అత్యధిక ఫోర్లుసాయి సుదర్శన్ (75 ఫోర్లు)👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ‘గ్రీన్ డాట్బాల్స్ ఆఫ్ ద సీజన్’ సిరాజ్ (గుజరాత్) 👉మొత్తం 172 డాట్ బాల్స్ 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలుటైటిల్ విజేతకు ఎంతంటే?ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. రన్నరప్ గుజరాత్ టైటాన్స్కు రూ. 12.50 కోట్లు దక్కాయి.వైభవ్దే హవారాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు ఈ సీజన్లో మొత్తం దాదాపుగా రూ. 55 లక్షల ప్రైజ్మనీ గెలిచాడు. ఓ టాటా కారు కూడా అతడి సొంతమైంది.చదవండి: రజతాభిషేకం -
ఆర్సీబీ విజయం.. టీజీ, ఏపీలో అభిమానుల వీరంగం
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. తమ అభిమాన జట్టు వరుసగా రెండు టైటిళ్లు కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు సంబురాలు చేసుకున్నాయి. కానీ, పలుచోట్ల అభిమానులు రచ్చ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.విజయవాడ.. విజయవాడలో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ అభిమాన జట్టు గెలవడంతో రోడ్లపైకి వచ్చి ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బైకులతో రోడ్లపై ప్రమాదకర ఫీట్స్ చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు యువకులను చెదరగొట్టారు.Em chillar gallu unnara 🤧🤧 #Rcbfans pic.twitter.com/IopXcuy6zu— 𝕩 SunRise Reddy ™ (@HarshaReddy_07) May 31, 2026 కర్నూలు..కర్నూలులో ఆర్బీబీ అభిమానులు వీరంగం సృష్టించారు. ఆర్బీసీ విజయం ఆనందంలో అభిమానులు అరాచకాలకు పాల్పడ్డారు. సంబురాలను శృతి మించే విధంగా నిర్వహించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్నూలు రాజ్ విహర్ సెంటర్ చేరుకొని ట్రాఫిక్ బ్యారికేడ్స్తో పాటు ప్రైవేటు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని చెదరగొట్టారు.After RCB won the IPL Final, fans were celebrating on the road.During the celebrations, 3 RCB fans climbed onto a Tata Safari and started dancing and jumping on it.The Tata Safari had a full-size panoramic sunroof, and all three fans were standing and dancing on top of it.… pic.twitter.com/QZGcbkrhGJ— Saffron Chargers (@SaffronChargers) June 1, 2026విశాఖ.. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తి గెలుపు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ కారు ఎక్కి, జెండాలు ఊపుతూ రోడ్లపై రచ్చ రచ్చ చేశారు.హైదరాబాద్..హైదరాబాద్లోనూ ఆర్సీబీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. ఆర్సీబీ విజయంతో ట్యాంక్ బండ్ వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి ‘ఆర్సీబీ.. ఆర్సీబీ’ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చారు. Celebrations at different places including near Secrtariat, SR Nagar, Kukatpally... in #Hyderabad, by RCB and Virat Kohli fans.As #RCB clinches a second consecutive IPL title, after being trophyless for 18 years.#ViratKohli #RCBvsGT #IPL2026final pic.twitter.com/7PLCLwLmjY— Surya Reddy (@jsuryareddy) May 31, 2026 -
కలలో కూడా ఊహించలేదు.. రాసి పెట్టి ఉంది: రజత్ పాటిదార్
19 ఎడిషన్ల ఐపీఎల్ చరిత్రలో తొలి 17 ఎడిషన్లు టైటిల్ కోసం ముఖం వాచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.. ఇప్పుడు వరుసగా రెండో ఎడిషన్లో టైటిల్ సాధించి కరువు తీర్చుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 31) జరిగిన 2026 ఎడిషన్ ఫైనల్లో ఆ జట్టు గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, టైటిల్ను నిలబెట్టుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.ఈ సీజన్ ప్రారంభం నుంచి గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు, ఆఖరి మెట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహాయించి, ఏ దశలోనూ బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు.ఈ మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్రోఫీని అందుకున్న తర్వాత మాట్లాడుతూ..ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించి వరుసగా రెండు టైటిళ్లు గెలిపిస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. టాస్ గెలిస్తే ఛేజ్ చేయడమే తమ ప్రణాళిక అని, పవర్ప్లేలోనే గుజరాత్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేయాలని ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. ఆ ప్లాన్ను బౌలర్లు అద్భుతంగా అమలు చేశారని ప్రశంసించాడు.భువీ, హాజిల్వుడ్, రసిక్, కృనాల్, సుయాశ్ సీజన్ మొత్తం అద్భుతంగా రాణించారని కొనియాడాడు. గతేడాది తొలి టైటిల్ గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, ఈసారి మాత్రం జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిందని చెప్పుకొచ్చాడు. సీజన్ ప్రారంభం నుంచి మంచి క్రికెట్ ఆడటమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నాడు.తన బ్యాటింగ్లో మెరుగుదల కోసం టోర్నీకి ముందు ప్రత్యేకంగా శ్రమించానని, వేగవంతమైన బౌలర్లపై కొన్ని షాట్లను మెరుగుపర్చుకునేందుకు కృషి చేశానని తెలిపాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి సహా పలువురు సీనియర్ల నుంచి విలువైన సూచనలు అందాయని చెప్పాడు.కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మైదానంలోనూ, బయటా జట్టు కోసమే ఆలోచిస్తాడు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ల వద్దకు తానే వెళ్లి మాట్లాడతాడు. వారికి ధైర్యం ఇస్తాడు. జట్టుకు అతను గొప్ప బలమని కొనియాడాడు.చివరగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఈసారి కూడా కప్ మనదే (Ee Sala Nu Cup Namdu) అంటూ అభిమానులకు ట్రోఫీని అంకితం చేశాడు. -
ఫైనల్ లో మ్యాచ్ ఫిక్సింగ్? అంపైర్ పై పటిదార్ సీరియస్!
-
ఫైనల్లో ఓటమి అనంతరం గిల్ విశ్లేషణ
నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమై, ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.సీజన్ ఆధ్యాంతం గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు తుది సమరంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహా, మిగతా బౌలర్లు చేసిందేమీ లేదు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారధి శుభ్మన్ గిల్ విశ్లేషణ ఇలా ఉంది. "180-190 పరుగులు చేసుంటే, మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. పిచ్ పూర్తిగా స్లోగా లేదు. ఆరంభ ఓవర్లలో మాత్రం పేసర్లకు కొంత సహకారం లభించింది.ఆదిలోనే వికెట్లు కోల్పోవడం జట్టు మోమెంటంను దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడం కష్టాలను అధికం చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగులు చేసినా, పవర్ప్లేలో రెండు-మూడు వికెట్లు తీసుంటే పోటీలో ఉండేవాళ్లం.టార్గెట్ను కాపాడుకునే క్రమంలో పవర్ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాము. ఆ దశలో ప్రత్యర్థిని 50-55 పరుగులకు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.సీజన్ మొత్తాన్ని పరిశీలిస్తే, మా బౌలింగ్ యూనిట్ అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా జట్టు వెనక్కి తగ్గకుండా, చిన్నచిన్న అంశాల్లో మెరుగుపడుతూ బలంగా తిరిగి వచ్చింది.తుది మెట్టుపై ట్రోఫీ చేజారినా ఈ సీజన్ చాలా సంతృప్తినిచ్చింది. గెలిచినా, ఓడినా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎప్పుడూ ఉంటాయి. జట్టుగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అంశాలపై దృష్టి పెడతాము" -
గుజరాత్ టైటాన్స్కు తప్పిన పెను ప్రమాదం
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే, గుజరాత్ టైటాన్స్కు మరో ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు ప్రయాణిస్తున్న టీమ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.బస్సులో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా క్యాజువాలిటీలు లేవు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.ఊహించని ఈ ఘటన కారణంగా గుజరాత్ బృందం మొత్తం దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం నిర్వాహకులు మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్కు తరలించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి హోటల్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగా, నిన్న (మే 31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఛాంపియన్గా నిలిచింది.ఈ మ్యాచ్లో గుజరాత్ ఏ దశలోనూ ఆర్సీబీకి పోటీనివ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన ఆ జట్టు.. అనంతరం దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. -
వరుసగా రెండో సారి IPL ట్రోఫీ గెలిచిన RCB
-
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)
-
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
-
చరిత్ర సృష్టించిన కోహ్లి.. RCB ఘన విజయం
-
IPL 2026: సత్తా చాటిన యంగ్ గన్స్
గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్ 19వ సీజన్ ముగిసింది! ‘బేబీ బాస్’ వైభవ్ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... అనామక అన్షుల్ ‘పర్పుల్ క్యాప్’ రేసులో చివరి వరకు నిలిచాడు!జోఫ్రా ఆర్చర్ తన పేస్ పవర్ తగ్గలేదని నిరూపించుకుంటే... రబాడ తానెంత ప్రమాదకర బౌలరో మరోసారి చాటాడు!ఐదేసిసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం పరాజయాలతో సహవాసం చేయగా... లక్నో సూపర్ జెయింట్స్ను నడిపించలేక రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలకు రాం రాం చెప్పాడు! చెన్నై భారీ ధర పెట్టిన కార్తీక్, ప్రశాంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... హైదరాబాద్ కొత్త పేసర్లు ప్రఫుల్, సాకిబ్ లీగ్పై తమదైన ముద్ర వేశారు!ఢిల్లీ హార్డ్ హిట్టర్ సమీర్ రిజ్వీ మెరుపులు ఆరంభ మ్యాచ్లకే పరిమితమైతే... లక్నో పించ్హిట్టర్ ముకుల్ ఒక్క ఇన్నింగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు!అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికినా తన పరుగుల దాహం తీరలేదని కోహ్లి నిరూపించుకుంటే... లయ దొరకబుచ్చుకోలేక సూర్యకుమార్, హార్దిక్ విమర్శల పాలయ్యారు!వెస్టిండీస్ ప్లేయర్ల విధ్వంసకర విన్యాసాలు కొన్ని మ్యాచ్లకే పరిమితం కాగా... అన్క్యాప్డ్ ప్లేయర్ల మెరుపులు భారత బెంచ్ బలాన్ని చాటాయి! టెస్టు ప్లేయర్లుగా ముద్రపడ్డ ఆటగాళ్లు ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ముందుంటే.. దేశవాళీల్లో రాణించిన అఖీబ్ నబీ ఐపీఎల్లో అదే జోరు కనబర్చలేకపోయాడు!ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో జరిగిన కొన్ని కీలక అంశాలపై ఓ కన్నేస్తే... 10 జట్లు, 65 రోజులు, 74 మ్యాచ్లు, వందలకొద్దీ రికార్డులు, వేలాది బౌండరీలు... ఇలా వేసవిలో మస్తు మజా పంచిన ఐపీఎల్–19వ సీజన్ ఎప్పటిలాగే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొంది. దినదిన ప్రవర్ధమానంగా దూసుకెళ్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఈసారి కూడా ఎందరో యువ ఆటగాళ్లను అందలం ఎక్కించింది. బ్యాటింగ్కు అనుకూలమైన నిబంధనల కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యాయనే అపవాదు ఉన్నా... ఈ సీజన్లో పరుగుల వరద పారిందనేది వాస్తవం. 200 స్కోరు సాధారణం అయిపోయిన తరుణంలో... రాజస్తాన్ రాయల్స్ తమ పదునైన బౌలింగ్తో 159 పరుగుల మ్యాచ్లో 40 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. మొహమ్మద్ షమీ తొలి బంతికి వికెట్ తీసే అలవాటును కొనసాగించగా... ప్రిన్స్ యాదవ్ తన వేగంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలవలేకపోగా... అంత పెద్ద లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులుండగానే ఛేదించి ‘వావ్’ అనిపించింది. గత సీజన్లోనే మెరుపు సెంచరీతో వెలుగులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది నిలకడైన బాదుడుతో ప్రపంచవ్యాప్తంగా తనపేరు మారుమోగేలా చేసి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ‘టెస్టు’ ప్లేయర్ల సత్తా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఎందులో తీసుకున్న టెస్టు ప్లేయర్లే ఐపీఎల్లో తమదైన ముద్ర వేశారు. బౌలింగ్లో రబాడ, ఆర్చర్, భువనేశ్వర్ విజృంభిస్తే... బ్యాటింగ్లో శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ సత్తా చాటారు. టీమిండియా టెస్టు కెపె్టన్ గిల్ 16 మ్యాచ్ల్లో 45.75 సగటుతో 732 పరుగులు సాధించి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయన గిల్... తాజా సీజన్లో తన బ్యాట్తోనే బదులిచ్చాడు. నిదానంగా ఆడతాడనే ముద్రను చెరిపేసుకుంటూ 163.02 స్ట్రయిక్రేట్తో చెలరేగిపోయాడు. క్వాలిఫయర్–2 మ్యాచ్ను పరిశీలిస్తే అతడి ధాటి ఎలాంటిదో అర్థమవుతుంది. వైభవ్ సూర్యవంశీ మినహా మిగిలినవాళ్లంతా బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన పిచ్పై గిల్ మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టాడు. ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్, జడేజాతో కూడిన బౌలింగ్ లైనప్ను ఎదుర్కొంటూ 53 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అందులో ఎక్కడా మచ్చుకు కూడా అడ్డదిడ్డమైన బాదుడు లేదు. అచ్చమైన క్రికెటింగ్ షాట్లతో చాపకింద నీరులా పరుగులు సాధిస్తూ చూస్తుండగానే రాయల్స్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. పట్టు సాధించేంత వరకు సిక్స్ల జోలికి పోని గిల్... సరైన టైమింగ్ వాడితే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపించాడు. మరోవైపు అతడి ఓపెనింగ్ సహచరుడు సాయి సుదర్శన్ కూడా ఈ సీజన్లో తనదైన ముద్ర వేశాడు. భారత టెస్టు జట్టు సభ్యుడైన సుదర్శన్ తాజా సీజన్లో 17 మ్యాచ్ల్లో 45.13 సగటుతో 722 పరుగులు సాధించాడు. గిల్, సుదర్శన్ల ఆటతీరు కారణంగానే టైటాన్స్ నిలకడైన ప్రదర్శన కొనసాగించగలిగిందనేది నిజం! టెస్టు ప్లేయర్లుగా ముద్ర పడ్డ ఈ ఇద్దరూ ఎక్కడా తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడటంతోనే పరుగుల వీరుల జాబితాలో చోటు దక్కించుకోగలిగారు. ఫార్మాట్ ఏదైనా టెక్నిక్ ముఖ్యం అని ఈ జంట మరోసారి చాటింది. అన్షుల్ అదుర్స్ రంజీ ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చిన అన్షుల్ కంబోజ్... ఈ సీజన్లో తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ కుడిచేతి వాటం పేసర్... 14 మ్యాచ్ల్లో 26.32 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా జట్లతో పోల్చుకుంటే... పాతికేళ్ల అన్షుల్కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేనçప్పటికీ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. కోల్కతా నైట్రైడర్స్ పేసర్ కార్తీక్ త్యాగీ మంచి వేగంతో అభిమానులను ఆకర్షించాడు. ఈ సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ల్లో 27.66 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ 14 మ్యాచ్ల్లో 28.68 సగటుతో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 36 ఏళ్ల వయసులో భువనేశ్వర్ తన స్వింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. కళ్లు చెదిరే అవుట్ స్వింగర్లతో బెంగళూరుకు ఇతోధిక సాయం చేశాడు. భారీగా పరుగులు ఇచ్చుకుంటాడనే ముద్రపడ్డ సిరాజ్ ఈసారి పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకుంటే... టి20 ప్రంపచకప్ హీరోలు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ అనామక బౌలర్లుగా కనిపించారు. వారెవ్వా వైభవ్ సూర్యవంశీ... నూనుగు మీసాలు కూడా రాని ఓ 15 ఏళ్ల కుర్రాడు... అంతర్జాతీయ స్థాయిలో కొమ్ములు తిరిగిన బౌలర్లను ఊచకోత కోయడం ఈ సీజన్కే హైలైట్గా నిలిచింది. గత సీజన్లో 35 బంతుల్లో సెంచరీతో తన రాకను ఘనంగా చాటిన రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ... ఈ ఏడాది ప్రతి క్రికెట్ అభిమాని తన పేరు జపించేలా చేశాడు. 16 మ్యాచ్ల్లో 48.50 సగటుతో 776 పరుగులు చేసి ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. మామూలుగా ఒక వంద పరుగులు రెండొందల స్ట్రయిక్ రేట్తో కొట్టడమే కష్టం అనుకుంటే... వైభవ్ 776 పరుగులను ఏకంగా 237.30 స్ట్రయిక్రేట్తో బాదాడు. గణాంకాలు చూస్తే అతడి దూకుడును అర్ధం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు మాత్రం నభూతో! మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్ల బౌలింగ్లో ఏమాత్రం బెరుకు లేకుండా తొలి బంతికే సిక్స్లు కొట్టిన అతడి తెగువకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సీజన్లో ఒక సెంచరీ తన పేరిట రాసుకున్న వైభవ్... మరో రెండుసార్లు శతకం గుమ్మం వద్ద అవుటయ్యాడు. ఫోర్ (63)ల కంటే సిక్స్ (72)లే ఎక్కువ కొట్టిన సూర్యవంశీ... అవసరమైతే నిదానంగానూ ఆడగలనని క్వాలిఫయర్–2లో నిరూపించుకున్నాడు. సహచరుల విఫలమైన చోట వికెట్ విలువ గుర్తెరిగి ఆచితూచి ఆడటంతోనే అతడిపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. 90వ దశకంలో సచిన్ టెండూల్కర్ తరహాలో... రాజస్తాన్ రాయల్స్ జట్టును ఈ సీజన్లో వైభవ్ తన భుజస్కందాలపై మోశాడు. అతడు ఇదే నిలకడ, క్రమశిక్షణ, కఠోర శ్రమ కొనసాగిస్తే... క్రికెట్కు మరో ఆణిముత్యం దొరికినట్లే! –సాక్షి, క్రీడావిభాగం -
‘రజతాభిషేకం’
ఐపీఎల్లో వరుసగా రెండు టైటిల్స్ నెగ్గిన కెప్టెన్లు గతంలో ఇద్దరు ఉన్నారు. అయితే మిగతా ఇద్దరిలో పోలిస్తే నాయకుడిగా రజత్ పాటీదార్ ప్రస్థానం ఎంతో భిన్నం. రెండు ట్రోఫీలు గెలిపించే సమయానికి ధోని దిగ్గజ కెప్టెన్గా గుర్తింపు పొంది రెండు ప్రపంచ కప్లు కూడా అందించాడు. రోహిత్ వరుసగా రెండు గెలవడానికి ముందే కెప్టెన్గా అతని ఖాతాలో మరో మూడు కప్లు ఉన్నాయి. కానీ పాటీదార్ భారత్ తరఫున తన చివరి టెస్టును 2024లో, ఏకైక వన్డేను 2023లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు.గత ఏడాది పాటీదార్ను కెప్టెన్గా ఎంపిక చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. మితభాషి, తన భావనలను ప్రదర్శించలేని అతను సారథిగా ఏం చేస్తాడు అని భావించారు. ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లిలాంటి దిగ్గజాల వల్ల సాధ్యం కాని భారం అతనిపై మోపినట్లు అనిపించింది. దాదాపు రెండేళ్ల క్రితం మొదటిసారి పాటీదార్ను కెప్టెన్గా చేయాలనే ఆలోచన వచ్చిప్పుడు ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్, కోచ్ ఫ్లవర్ చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు. జట్టు పరిస్థితి బాగుపర్చేందుకు కెప్టెన్గా ఏం సూచిస్తావు అని అడిగారు. టీమ్ వాతావరణం, నమ్మకం, ముందుండి నడిపించడంలాంటి రొటీన్ మాటలు అతను చెప్పలేదు.‘పదునైన పేస్ బౌలింగ్ బృందం కావాలి’ అని ఒకే ఒక్క మాటతో ముగించాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా మధ్యప్రదేశ్ను నడిపించిన తీరు చూసి కోహ్లి అనుమతితో వెంటనే పాటీదార్ను కెప్టెన్గా నియమించారు. స్టార్ ఆటగాడిగా గుర్తింపు లేదు. ప్రత్యేక ఆకర్షణగా ఎక్కడా కనిపించడు. టీమ్ సమావేశాల్లో కూడా గలగలా మాట్లాడే అలవాటు లేదు. కానీ ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాతే అతనిలోని కెప్టెన్ బయటకు వస్తాడు. ఆ తర్వాత తాను స్వేచ్ఛగా పని చేస్తాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ లక్షణాలే అతని సారథ్యంపై నమ్మకం ఉంచేందుకు కారణం అయ్యాయని ఆర్సీబీ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఆటగాడిగా కూడా అతను ఒక్కసారిగా ఐపీఎల్ వేదికపై దూసుకురాలేదు. 2021లో ఆర్సీబీ తరఫున 4 మ్యాచ్లలో 71 పరుగులే చేయడంతో తర్వాతి ఏడాది జట్టు అతడిని వదిలేసుకుంది. అయితే గాయంతో లవ్నీత్ తప్పుకోవడంతో అతని స్థానంలో 2022లో మళ్లీ చాన్స్ దక్కగా, లక్నోపై అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. తర్వాతి సీజన్ గాయంతో దూరమైనా...గత ఏడాది కెప్టెన్గా అసాధారణ విజయాన్ని అందించాడు. తాజా సీజన్లో బ్యాటర్గా కూడా అతను విధ్వంసం సృష్టించాడు. 14 ఇన్నింగ్స్లలో 30 ఫోర్లు, 42 సిక్సర్లు సహా ఏకంగా 192.69 స్ట్రయిక్రేట్తో 501 పరుగులు నమోదు చేసి కోహ్లి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారమే ఫైనల్ ముగియగా... తన 33వ పుట్టిన రోజున అందుకున్న రెండో ట్రోఫీతో రజత్ పాటీదార్ తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. -
మళ్లీ వేటాడేసింది...
‘సుదీర్ఘ కాలం మనం వేటాడబడ్డాం... ఇకపై వేటగాళ్లలా మారిపోవాలి. ఇది ఆరంభం మాత్రమే. విజయాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన జట్టుగా మనం కూడా నిలవగలం’... గత ఏడాది ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్ డ్రెస్సింగ్రూమ్లో చేసిన వ్యాఖ్య ఇది. ఆ సమయంలో విజయోత్సాహంతో చెప్పిన మాటలుగానే ఇవి మిగిలిపోలేదు. నాడు జట్టులో కనిపించిన ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శన స్ఫూర్తిగా ఈసారి కూడా బెంగళూరు దూసుకుపోయింది. దాదాపు అదే తరహా ప్రణాళికతో సరిగ్గా సంవత్సరం తర్వాత టీమ్ మళ్లీ చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. ఒక్క టైటిల్తో ఆగిపోకుండా తమ ఆకలిని తీర్చుకుంటూ వరుసగా రెండో ట్రోఫీని గెలుచుకొని సగర్వంగా నిలిచింది.తేదీలు మారడం మినహా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానం సరిగ్గా 2025 తరహాలోనే సాగి టైటిల్ వరకు చేరింది. లీగ్ దశలో 9 విజయాలతో అగ్రస్థానం, తొలి క్వాలిఫయర్లో ఏకపక్ష గెలుపుతో ఫైనల్కు... తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్గా సొంతగడ్డ బెంగళూరులో మళ్లీ ట్రోఫీనిముద్దాడతామని గత ఏడాది గర్వంగా చెప్పినా... వేర్వేరు కారణాలతో అది జరగలేదు. కానీ మళ్లీ అదే అహ్మదాబాద్ వేదికపై విజయానందాన్ని సొంతం చేసుకుంది. 18వ సీజన్లో తొలిసారి ‘ఈ సాలా కప్ నమ్దు’ అంటూ గర్జించిన జట్టు మరోసారి అదే ధ్వనిని బిగ్గరగా వినిపించింది. నాడు విజేతగా నిలిచిన జట్టులోని 13 మంది ఈసారి కూడా గెలుపులో భాగమై తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ పూర్తి ఏకపక్షంగా సాగగా... ఈసారి గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఆడింది. అయితే భయపడినట్లే గిల్, సుదర్శన్, బట్లర్ వైఫల్యం తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టి పడేశారు. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే మైదానంలో టైటాన్స్తో పోరులో సరిగ్గా 155 పరుగులే చేసి ఆర్సీబీ ఓడగా... ఇప్పుడు అసలు పోరులో సీన్ రివర్స్ అయింది. ఛేదనలో కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఆరంభంతో ఆర్సీబీ విజయానికి బాట పడింది. ఆ తర్వాత కాస్త తడబాటు ఎదురైనా... దిగ్గజ ఆటగాడిగా ఛేదనలో తన స్థాయిని చూపిస్తూ దూసుకుపోయిన కోహ్లి భారీ సిక్స్తో విన్నింగ్ షాట్ కొట్టడంతో ఆర్సీబీ బృందంలో సంబరాలు షురూ అయ్యాయి. అహ్మదాబాద్: ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్సీబీ ఐపీఎల్–2026 టైటిల్ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగిపోగా, వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. టపటపా... ప్రతీ సీజన్లో జట్టు బ్యాటింగ్ భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన బ్యాటర్లు తొందరగా వెనుదిరగడంతోనే గుజరాత్ భారీ స్కోరు ఆశలు కోల్పోయింది. శుబ్మన్ గిల్ (8 బంతుల్లో 10; 2 ఫోర్లు), సాయి సుదర్శన్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు) నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్ కాగా, నిశాంత్ సింధు (18 బంతుల్లో 20; 3 ఫోర్లు) ప్రభావం చూపలేదు. పవర్ప్లేలో జట్టు 45 పరుగులే చేసింది. క్రీజ్లో ఉన్నంత సేపు తడబడిన జోస్ బట్లర్ (23 బంతుల్లో 19; 1 ఫోర్) సహనం కోల్పోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో సుందర్ కొంత పట్టుదలగా నిలబడినా... అతనూ పెద్ద షాట్లు కొట్టలేకపోయాడు. 4 పరుగుల వద్ద కాక్స్ క్యాచ్ అందుకున్నా... రీప్లేలో బంతి గ్రౌండ్కు తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. మరోవైపు అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15; 2 సిక్స్లు) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి బ్యాటర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన గుజరాత్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్ రాలేదు! తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 92 పరుగులు రాబట్టింది. శుభారంభం... ఛేదనలో వెంకటేశ్, కోహ్లి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లో సిరాజ్ 5 పరుగులే ఇచ్చినా... రబాడ వేసిన తర్వాత ఓవర్లో వెంకటేశ్ 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. సిరాజ్ రెండో ఓవర్లోనూ 3 బౌండరీలు రాగా... రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6, 4తో చెలరేగిపోయాడు. వెంకటేశ్, పడిక్కల్ (1) పరుగు తేడాతో వెనుదిరగ్గా... పవర్ప్లేలో జట్టులో 70 పరుగులు చేసింది. ఆ తర్వాత కెపె్టన్ రజత్ పాటీదార్ (13 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (1)లను రషీద్ ఒకే ఓవర్లో అవుట్ చేసి కొంత ఒత్తిడి పెంచాడు. అయితే కోహ్లి మాత్రం తగ్గకుండా దూసుకుపోయాడు. 25 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించగా... విరాట్ చివరి వరకు నిలిచి జట్టును విజయతీరం చేర్చాడు.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 12; గిల్ (సి) పాటీదార్ (బి) హాజల్వుడ్ 10; నిశాంత్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 20; బట్లర్ (స్టంప్డ్) జితేశ్ (బి) కృనాల్ 19; సుందర్ (నాటౌట్) 50; అర్షద్ (సి) సలామ్ (బి) హాజల్వుడ్ 15; తెవాటియా (సి) పాటీదార్ (బి) సలామ్ 7; హోల్డర్ (సి) హాజల్వుడ్ (బి) భువనేశ్వర్ 7; రషీద్ (సి) షెఫర్డ్ (బి) సలామ్ 7; రబాడ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–22, 2–26, 3–55, 4–73, 5–99, 6–115, 7–142, 8–151. బౌలింగ్: డఫీ 4–0–38–0, భువనేశ్వర్ 4–0–29–2, హాజల్వుడ్ 4–0–37–2, సలామ్ 4–0–27–3, కృనాల్ 4–0–23–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) రబాడ (బి) సిరాజ్ 32; కోహ్లి (నాటౌట్) 75; పడిక్కల్ (సి) అర్షద్ (బి) రబాడ 1; పాటీదార్ (సి) రబాడ (బి) రషీద్ 15; కృనాల్ (ఎల్బీ) (బి) రషీద్ 1; డేవిడ్ (సి) బట్లర్ (బి) అర్షద్ 24; జితేశ్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 161. వికెట్లపతనం: 1–62, 2–63, 3–89, 4–91, 5–132. బౌలింగ్: సిరాజ్ 4–0–36–1, రబాడ 3–0–44–1, హోల్డర్ 2–0–16–0, రషీద్ 4–0–25–2, అర్షద్ 4–0–32–1, ప్రసిధ్ 1–0–7–0. -
ఐపీఎల్ ఫైనల్పై రాజకీయం? డీకే శివకుమార్
బెంగళూరు: ప్రస్తుతం "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు" ఫ్యాన్స్ పుల్ఖుషీతో ఉన్నారు. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలవడంతో సంతోషంతో ఉబ్బితబ్బవుతున్నారు. ఓవైపు ఆర్సీబీ గెలుపుతో ఫ్యాన్స్ జోష్ మీదుంటే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి. డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడాతూ "నిజానికి ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరగాల్సింది. కానీ మాకు అన్యాయం చేశారు. కేవలం రాజకీయం కారణంగానే ఈ మ్యాచ్ను అక్కడికి (అహ్మదాబాద్) తరలించారు. దీనిపై నేను ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను" అని ఆయన పేర్కొన్నారు.ఈ ఫైనల్ బెంగళూరులో ఫైనల్ జరిగి ఉంటే నగరానికి అది ఒక చారిత్రాత్మక సందర్భం అయ్యేదని, కానీ స్థానిక అభిమానులు ఆ అద్భుత క్షణాన్ని కోల్పోయారని అన్నారు. అయినప్పటికీ, ఈ సీజన్ అంతటా జట్టుకు అండగా నిలిచిన కర్ణాటక అభిమానులకు, ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా శివకుమార్ ప్రమాణస్వికారం చేసే అవకాశం ఉంది.కాగా ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్ జరిగింది. GT 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలిపించారు. కాగా ఆర్సీబీ గతేడాది సైతం ఐపీఎస్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్ఖాన్ బౌలింగ్లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
ఆరెంజ్ క్యాప్ వైభవ్దే.. ప్రైజ్మనీ ఎంతంటే?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక ఐపీఎల్ ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్న వైభవ్.. యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్-2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ 16 మ్యాచ్లలో 776 పరుగులు చేసి ఈ ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు) పేరిట ఉండేది. ఐపీఎల్-2026 సీజన్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తాజా సీజన్తో గిల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచినందుకు వైభవ్కు రూ.10 లక్షలు నగదు బహుమతి దక్కింది.ఛాంపియన్స్గా ఆర్సీబీఇక ఐపీఎల్-2026 సీజన్ ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా గుజరాత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో గుజరాత్ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్ దాటింది. దీంతో ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై సీఎస్కే 4 ఓవర్లలో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో సీఎస్కే రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. విజేతగా ఆర్సీబీఇక ఈ ఏడాది సీజన్ ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలిచింది. గుజరాత్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లి కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులతో రాణించాడు.చదవండి: వైభవ్కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్లో భారత ఓపెనర్లు వీరే? -
అరుదైన ఫీట్తో భువనేశ్వర్ కొత్త చరిత్ర
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఫీట్ సాధించాడు. 16 మ్యాచ్లాడిన భువనేశ్వర్ 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా భువనేశ్వర్ షమీతో కలిసి రికార్డులకెక్కాడు. కాగా ఈ జాబితాలో ఆర్సీబీ తరఫున హర్షల్పటేల్ (32 వికెట్లు, 2021 సీజన్), గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ (28 వికెట్లు, 2023 సీజన్) ఈ ఫీట్ సాధించారు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా (27 వికెట్లు, 2020 సీజన్), రాజస్తాన్ తరఫున చాహల్ (27 వికెట్లు, 2022), గుజరాత్ తరఫున మోహిత్ శర్మ (27 వికెట్లు, 2022) భువనేశ్వర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న భువనేశ్వర్ మరో ఫీట్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ (17 వికెట్లు) షమీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ (19 వికెట్లు) తీసి తొలి స్థానంలో ఉన్నాడు.Bhuvneshwar Kumar in IPL2026 - 𝟮𝟴 wickets (7.95 Eco)*2025 - 17 wickets (9.28 Eco)2024 - 11 wickets (9.35 Eco)2023 - 16 wickets (8.33 Eco)2022 - 12 wickets (7.34 Eco)2021 - 6 wickets (7.97 Eco)2020 - 3 wickets (6.98 Eco)2019 - 13 wickets (7.81 Eco)2018 - 9 wickets… pic.twitter.com/DLOczlJ22e— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 31, 2026చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్వుడ్ బౌలింగ్లో గిల్ ఔటైన వెంటనే పిచ్పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్ల్లో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్
ఈసారి ఐపీఎల్ ప్రస్తావన వస్తే అందులో కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఉంటుంది. ఎందుకంటే తనదైన హిట్టింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తనకోసమే చాలామంది మ్యాచులు చూసేలా చేశాడు. ఈ ఏడాది 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగానూ నిలిచాడు. అందరూ సూర్యవంశీలో క్రికెట్ స్కిల్స్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఇతడిలో నటుడిని చూశాడు. సినిమా ఆఫర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్.. ప్రస్తుతం 'మసూమ్: ద న్యూ జనరేషన్' సినిమాని తీస్తున్నారు. 1983లో వచ్చిన 'మసూమ్'ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు కుటుంబ బంధాలు, ప్రేమ, గుర్తింపు తదితర అంశాలతో తీస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.అయితే వైభవ్ సూర్యవంశీ గురించి ట్వీట్ చేసిన శేఖర్ కపూర్.. 'సూర్యవంశీ ఇంత సంచలన క్రికెటర్ కాకపోయింటే 'మసూమ్'లో అతడికి నటింపజేసేవాడిని' అని చెప్పుకొచ్చారు. వైభవ్ అమాయక రూపం, సహజ వ్యక్తిత్వం తనని ఆకట్టుకున్నాయని.. మసూమ్ లాంటి భావోద్వేగ సినిమాకు వైభవ్ సరిపోతాడని అభిప్రాయపడ్డారు.బిహార్కి చెందిన సూర్యవంశీ వయసు 15 ఏళ్లే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన బ్యాటింగ్ చేసి అదరగొట్టేసిన ఇతడు.. చిన్న వయసులోనే ఐపీఎల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డ్ సృష్టించాడు. భారత బ్యాటర్ల వరకు వేగవంతమైన ఐపీఎల్ శతకం చేసింది కూడా ఇతడే కావడం విశేషం. అలాంటి వైభవ్లో శేఖర్ కపూర్ లాంటి దర్శకుడు.. నటుడిని చూడటం ఆసక్తికరం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)If sooryavanshi wasn’t such a sensational cricketer.. I could have cast him in Masoom the film z.. pic.twitter.com/p8vaLzq1e2— Shekhar Kapur (@shekharkapur) May 31, 2026 -
తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్మన్ గిల్
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్లు శబ్మన్ గిల్, సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచారు. క్వాలిఫయర్-2లో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది.గుజరాత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో రెండో బంతిని గిల్ షార్ట్-ఆర్మ్ జాబ్ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని మిడ్-ఆఫ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన కుడివైపునకు పరిగెత్తుకు వచ్చి బంతిని అందుకున్నాడు.దీంతో గిల్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి తీవ్ర నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఓవర్లో సాయిసుదర్శన్(12 బంతుల్లో 12) కూడా ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. దీంతో గుజరాత్ 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. ఇక ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో (732), సుదర్శన్(722) రెండు, మూడు స్ధానాల్లో నిలిచారు.చదవండి: IND vs SL: రుతురాజ్ గైక్వాడ్కు బంపర్ ఆఫర్ -
అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్పై 36 పరుగులతో, రాజస్తాన్పై 58 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 38 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ -
ఐపీఎల్-2026 సీజన్ విజేతగా ఆర్సీబీ
IPL 2026 RCB vs GT Live Updates: ఐపీఎల్-2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర. 156 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా గుజరాత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీవిరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 25 బంతుల్లోనే కోహ్లి ఆర్ధ సెంచరీ సాధించారు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 116/4ఊహించని ట్విస్ట్.. నాలుగో వికెట్ డౌన్గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ పోరులో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ముందు పాటీదార్ (15)ను వెనక్కి పంపిన రషీద్.. ఆ తర్వాత కృనాల్ పాండ్యా (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.8 ఓవర్లలో ఆర్సీబీ 88-28 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (38), రజత్ పాటీదార్ (15) పరుగులతో ఆడుతున్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దేవ్దత్త్ పడిక్కల్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 16 బంతుల్లో 32 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.దుమ్ములేపుతున్న విరాట్ కోహ్లి158 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. కోహ్లి కేవలం పది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్(26) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ దాటింది.దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(22) దూకుడుగా ఆడుతున్నాడు.ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీతో గుజరాత్ను ఆదుకున్నాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్(12), సాయిసుదర్శన్(12), జోస్ బట్లర్(19) వంటి స్టార్ ప్లేయర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ డౌన్గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన హోల్డర్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18.4 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 143/7ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 115 పరుగులవ వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా రసిక్ సలామ్ బౌలింగ్లో పాటీదార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో వికెట్ డౌన్అర్షద్ ఖాన్(15) రూపంలో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో అర్షద్ ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న అర్షద్ ఖాన్జోష్ బట్లర్ స్ధానంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 5 బంతుల్లోనే రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 100/4గుజరాత్ నాలుగో వికెట్ డౌన్గుజరాత్ టైటాన్స్ వికెట్ల పతనం కొనసాగుతోంది. జోస్ బట్లర్(19) రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 73/4గుజరాత్ మూడో వికెట్ డౌన్నిషాంత్ సింధు రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సింధు.. రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(2), జోస్ బట్లర్(2) ఉన్నారు.గుజరాత్కు భారీ షాక్గుజరాత్కు భారీ షాక్ తగిలింది. ఇన్ఫామ్ బ్యాటర్ సాయిసుదర్శన్(12) రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో సుదర్శన్ ఔటయ్యాడు. 4 ఓవర్లు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 30/2గుజరాత్ తొలి వికెట్ డౌన్గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. రజత్ పాటిదార్ బౌలింగ్లో ఔటయ్యాడు.2 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 18/02 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(6), సాయిసుదర్శన్(9) ఉన్నారు.ఐపీఎల్-2026లో తుది పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సాయికిషోర్ స్ధానంలో పేసర్ అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ మాత్రం తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ సలాం దార్ -
రుతురాజ్ గైక్వాడ్కు బంపర్ ఆఫర్
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ గాయం కారణంగా లంక టూర్కు దూరమయ్యాడు. అతడి స్దానాన్ని మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో బీసీసీఐ భర్తీ చేసింది. తిలక్ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్ దాదాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతవుతున్నాడు. ఐపీఎల్-2026లో రుతురాజ్ 14 మ్యాచ్లు ఆడి కేవలం 337 పరుగులు చేశాడు. అయితే రుతు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశం.ఇక పరాగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే హ్యామ్స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత కొన్ని మ్యాచ్లకు దూరమైనప్పటికీ, జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండటంతో నొప్పితోనే తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ రాజస్తాన్ ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు అతడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో లంక పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ను జట్టులోకి తీసుకున్నారు. అతడు చివరగా 2025లో ఇండియా-ఎ తరపున సౌతాఫ్రికా-ఎపై ఆడాడు. ఆ సిరీస్లో గైక్వాడ్ 210 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా లంక టూర్లో భాగంగా భారత్-ఎ జట్టు.. శ్రీలంక-ఎ, అఫ్గానిస్తాన్-ఎ టీమ్స్తో ముక్కోణపు వన్డే సిరీస్లో తలపడనుంది.శ్రీలంక సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, పడుకున్నా.. ఇలా అతడు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసినప్పటికీ క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయిన రాజస్తాన్ రాయల్స్ సీజన్ను మూడో స్థానంతో ముగించింది. జట్టు ఓటమి పాలైనప్పటికీ వైభవ్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను మరొక్కసారి చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులకు ఒక శుభవార్త. అతడి ఆటను చూడలేకపోవచ్చు కానీ అతడిని స్టేడియంలో మరోసారి చూసే అవకాశం మాత్రం దక్కనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్కు వైభవ్ సూర్యవంశీ హాజరుకానున్నాడు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో వైభవ్ తళుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వైభవ్ తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా సన్మానించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఇవాల్టి ఫైనల్లో గిల్, సాయి సుదర్శన్ తక్కువ స్కోర్లకు వెనుదిరిగితే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. ఈ సీజన్ ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన వైభవ్ ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు సాధించాడు. సీజన్లో 72 సిక్సర్లతో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా నిలిచాడు. ఇక గుజరాత్తో మ్యాచ్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ పోరులోనూ ఎస్ఆర్హెచ్పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అతడి ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.VAIBHAV SOORYAVANSHI AT AHMEDABAD TO WATCH IPL FINAL 🔥⭐ [IANS] pic.twitter.com/o7uRx10z3j— Johns. (@CricCrazyJohns) May 31, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’
ఐపీఎల్ ట్రోఫీ కోసం కళ్లు కాచేలా పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గతేడాది తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి సారథ్యంలో సాధ్యం కాని ఈ ఫీట్ను.. రజత్ పాటిదార్ కెప్టెన్గా అరంగేట్రంలోనే సాధించాడు.ఏమాత్రం అంచనాలు లేకుండాతద్వారా ఆర్సీబీ అభిమానులకు మరింత ఇష్టమైన ఆటగాడిగా మారిపోయాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి ఈ మేరకు అరుదైన విజయం అందుకున్న పాటిదార్.. ఐపీఎల్-2026లోనూ ఆర్సీబీని అద్భుత రీతిలో ముందుకు నడిపించాడు. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా సత్తా చాటి జట్టును ఫైనల్కు చేర్చాడు.మెరుపులు మెరిపించిముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో ఈ నాలుగో నంబర్ బ్యాటర్ దుమ్ములేపాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఈ సీజన్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పాటిదార్ 486 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేయడం ఖాయమని.. కెప్టెన్ రేసులోనూ ముందుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై రజత్ పాటిదార్ తాజాగా స్పందించాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను నేనెప్పుడూ టీమిండియా టీ20 కెప్టెన్ కావాలని ఊహించుకోలేదు. అసలు ఇపుడు భారత టీ20 జట్టుకు ఎంపిక కావాలనే ఆలోచనే నా మదిలో లేదు.భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదునా దృష్టి మొత్తం ఐపీఎల్-2026 సీజన్ మీదే ఉంది. ప్రతి కెప్టెన్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటాడు. నేను కూడా అంతే. గతేడాది మేము టైటిల్ సాధించాము. అక్కడితో ఆ ప్రయాణం ముగిసింది.తాజా ఎడిషన్లో సరికొత్తగా ముందుకు వచ్చాము. 2025లో ఏం జరిగిందన్న విషయం గురించే మాట్లాడుతూ కూర్చుంటే పనులు ముందుకు సాగవు. ప్రస్తుత సీజన్లో ఒక్కో మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా ఇక్కడిదాకా చేరుకున్నాము.అదంతా నాకు అనవసరంగతంలో ఆర్సీబీ కెప్టెన్లు ఏం చేశారో నాకు అనవసరం. భవిష్యత్తులో కెప్టెన్ అయ్యేవారు ఏం చేస్తారన్న అంశంతోనూ నాకు పనిలేదు. సారథిగా నేనేం చేయగలను అన్నదే ముఖ్యం. వ్యక్తిగతంగా నా కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. అయితే, ఎవరినీ నాకు పోటీగా భావించను. నా పనిని పూర్తి చేయడంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మేము డిఫెండింగ్ చాంపియన్లమనే గర్వం మాకు లేదు. మా జట్టు ఈసారి కూడా ట్రోఫీ కోసం అదే స్థాయిలో కృషి చేస్తోంది. మా ఆకలి తీరలేదు’’ అని రజత్ పాటిదార్ పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్ రేసు.. ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ? -
ఫైనల్ కు ముందు కోహ్లిని మరోసారి గెలికిన హెడ్..
-
‘అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్-2026 సీజన్ ఆది నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్ సేన.. టేబుల్ టాపర్గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది.ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి టైటిల్ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా ఎడిషన్లోనూ ఆర్సీబీ బౌలింగ్ దళం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పటిష్టంగా పేస్ దళంటీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికి 26 వికెట్లతో సత్తా చాటగా.. యువ ఆటగాడు రసిఖ్ దర్ సైతం 16 వికెట్లు కూల్చాడు. మిగిలిన వారిలో కృనాల్ పాండ్యా, జట్టుతో ఆలస్యంగా చేరిన జోష్ హాజిల్వుడ్ చెరో 13 వికెట్లతో ఉన్నారు. వీరికి తోడుగా సూయశ్ శర్మ (9), జేకబ్ డఫీ (9) కూడా రాణిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్ చేతికి మాత్రం బంతిని ఇవ్వొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చినా వెంకటేశ్ అయ్యర్నే ఓపెనర్గా కొనసాగించాలని చిక్కా పేర్కొన్నాడు.అతడినే ఓపెనర్గా కొనసాగించాలిఈ మేరకు.. ‘‘ఫిల్ సాల్ట్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్గా ఉన్నా వెంకటేశ్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్గా కొనసాగిస్తే మంచిది.అతడు 3 ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమేఇక బౌలింగ్ విషయానికొస్తే... ఒకవేళ రొమారియో షెఫర్డ్తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం లాంఛనమే. అతడు కచ్చితంగా మూడు ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమే.PC: BCCIషెఫర్డ్ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నన్నడిగితే అతడికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడు.పేలవ ప్రదర్శనఈ క్రమంలో తాజా ఎడిషన్కు కూడా ఆర్సీబీ షెఫర్డ్ను అట్టిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో అతడు.. ఇప్పటికి 14 మ్యాచ్లలో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్గా 14 మ్యాచ్లలో కలిపి కేవలం 83 పరుగులే రాబట్టాడు. చివరగా గుజరాత్తో క్వాలిఫయర్-1లో షెఫర్డ్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చుకున్నాడు.ఐపీఎల్-2026 ఫైనల్.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ తుది జట్లు (అంచనా) ఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్/ వెంకటేశ్ అయ్యర్, దేవ్దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ దర్, జేకబ్ డఫీ/ సుయశ్ శర్మ గుజరాత్: శుబ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సంధు, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సాయికిషోర్. చదవండి: కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ! -
వైభవ్కు మరో భారీ జాక్పాట్..?
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతుండగా, ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతులు కూడా ఆకర్షణగా నిలిచాయి. విజేత జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా, రన్నరప్కు రూ.13 కోట్లు అందనున్నాయి.ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మూడుసార్లు తలపడగా, ఆర్సీబీ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్లో గెలిచే జట్టు ట్రోఫీతో పాటు భారీ చెక్కును కూడా సొంతం చేసుకోనుంది.ప్లే ఆఫ్స్కు చేరిన జట్లకు దక్కే ప్రైజ్ మనీఫైనల్ విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్కు రూ.13 కోట్లు అందనున్నాయి. ఇక క్వాలిఫయర్-2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్లో నిష్క్రమించిన ఎస్ఆర్హెచ్కు రూ.6.5 కోట్లు లభించనున్నాయి.వైభవ్కు మరో భారీ జాక్పాట్..?ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ పోరు ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్ల్లో 776 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ (722), సాయి సుదర్శన్ (710) కూడా ఇంకా రేసులోనే ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ విజేతకు రూ.10 లక్షలు అందుతాయి.పర్పుల్ క్యాప్ కోసం రబడా–భువీ పోటీపర్పుల్ క్యాప్ రేసులో గుజరాత్ పేసర్ రబాడ 28 వికెట్లతో ముందంజలో ఉన్నాడు. ఆర్సీబీ పేసర్ భువనేశ్వ్ర్ కుమార్ 26 వికెట్లతో రబాడ వెన్నంటే ఉన్నాడు. పర్పుల్ క్యాప్ గెలిచే బౌలర్కు కూడా రూ.10 లక్షల బహుమతి ఉంటుంది.ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు వైభవ్ ఫేవరెట్ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్)మధ్య పోటీ నెలకొంది. ఈ అవార్డు గెలిచే ఆటగాడికి రూ.20 లక్షలు అందుతాయి.ఎంవీపీగా ఎవరు..?మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ (436.5 పాయింట్లు), కగిసో రబడా (408), జోఫ్రా ఆర్చర్ (396.5) మధ్య పోటీ కనిపిస్తోంది. ఎంవీపీ విజేతకు రూ.10 లక్షలు దక్కనున్నాయి.ఫెయిర్ప్లే అవార్డుఈ సీజన్లో ఫెయిర్ప్లే పట్టికలో పంజాబ్ కింగ్స్ ముందంజలో ఉంది. ఫెయిర్ప్లే అవార్డు గెలిచే జట్టుకు రూ.10 లక్షల నగదు బహుమతి అందుతుంది.ఐపీఎల్ ప్రైజ్ మనీ చరిత్ర2008, 2009 సీజన్లలో విజేతలకు కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. 2010 నుంచి రూ.10 కోట్లకు పెంచిన బీసీసీఐ, 2014లో రూ.15 కోట్లు చేసింది. 2016 నుంచి విజేతలకు రూ.20 కోట్లు అందిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావంతో 2020లో మాత్రమే రూ.15 కోట్లకు తగ్గించింది. 2021 నుంచి మళ్లీ రూ.20 కోట్లే కొనసాగుతున్నాయి.ఈసారి మొత్తం అవార్డుల రూపంలో బీసీసీఐ సుమారు రూ.47.1 కోట్లను పంపిణీ చేయనుంది. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా, ఐపీఎల్ 2026లో ఆటగాళ్లు, జట్లపై కనక వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఇషాన్ కిషన్కు భారీ షాకిచ్చిన ముంబై ఇండియన్స్ అనామకుడు
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో ఊహించని షాక్ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో పరుగుల వరద పారించిన ఇషాన్ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్ వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం మే 30న ఘనంగా జరిగింది. రాంచీ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. రాంచీ టైటాన్స్, జంషెడ్పూర్ స్టీలర్స్, చోటా నాగ్పూర్ రాయల్స్, కోయలాంఛల్ సూపర్కింగ్స్, థన్బాద్ డైమాండ్స్, సంథల్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీలు తలో రూ.50 లక్షల బడ్జెట్తో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.ఈ వేలంలో రాబిన్ మింజ్ను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కోయలాంఛల్ సూపర్ కింగ్స్ అతడిని రూ.15.25 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాబిన్ మింజ్ రికార్డు సృష్టించాడు.మరోవైపు ఇషాన్ కిషన్ను సంథల్ స్ట్రయికర్స్ రూ.14.70 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్తో పోలిస్తే ఇషాన్ ధర రూ.55 వేల తక్కువగా ఉండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.వాస్తవానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో కనిపించాడు. 15 ఇన్నింగ్స్ల్లో 40.13 సగటు, 182.42 స్ట్రయిక్రేట్తో 602 పరుగులు చేసి సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రాబిన్ మింజ్ మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండే మ్యాచ్లు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు.అయినా, దేశీయ క్రికెట్లో రాబిన్ మింజ్కు ఉన్న పవర్ హిట్టర్ ఇమేజ్ అతడిని ఇషాన్ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయేలా చేసింది. ఇషాన్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా టోర్నీలో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉండటం కూడా వేలంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.కాగా, తొలి జార్ఖండ్ టీ20 లీగ్ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్లో మొత్తం 27 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశ అనంతరం అగ్ర జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇషాన్ కిషన్ను అధిగమించి రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
కోహ్లిని మరోసారి గెలికిన హెడ్
ఐపీఎల్ 2026 ఫైనల్కు ముందు విరాట్ కోహ్లీ–ట్రావిస్ హెడ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజుల కిందట ఓ ఐపీఎల్ మ్యాచ్లో (ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్) వీరిద్దరూ మాటా-మాటా అనుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, ఎస్ఆర్హెచ్లోని పలువురు ఆటగాళ్లతో కరచాలనం చేసినప్పటికీ, ట్రావిస్ హెడ్తో మాత్రం చేతులు కలపలేదు.ఆతర్వాత కోహ్లి అభిమానులు హెడ్ను, అతని భార్య జెస్సికా హెడ్ సోషల్మీడియా వేదికగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. కోహ్లి అభిమానులు హెడ్ భార్యపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారు.ఈ వివాదం హెడ్ తాజా సోషల్మీడియా పోస్ట్తో కొత్త మలుపు తీసుకుంది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్లో ఆశించిన ఫలితాలు సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్ ధాటికి ఓటమి పాలైంది. తాజాగా ఎస్ఆర్హెచ్ ఆటగాడైన ట్రావిస్ హెడ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో "Appreciate those who showed love and respect" అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ క్యాప్షన్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.ఆ క్యాప్షన్లో హెడ్ నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, కోహ్లినే పరోక్షంగా టార్గెట్ చేసినట్లు అర్దమవుతుంది. కోహ్లీ అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ఎదురైన ట్రోలింగ్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేశాడని సోషల్ మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి.కాగా, హెడ్-కోహ్లి మధ్య గొడవ తర్వాత జెస్సికా హెడ్, ఆమె కుటుంబం, స్నేహితులపై సోషల్మీడియా వేదికగా తీవ్రస్థాయి దూషణలు వచ్చాయి. భారత్లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఆ ప్రపంచకప్ ఫైనల్లో భారత్పై అద్భుత సెంచరీ సాధించి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించిన ట్రావిస్ హెడ్ అప్పుడూ భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే 2024 బాక్సింగ్ డే టెస్టులో భారత్పై కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. కుటుంబాలను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు..! క్రీడల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా, ఆటగాళ్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దూషించడం సమర్థనీయం కాదనే అభిప్రాయం మాత్రం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.ఇదిలా ఉంటే, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (మే 31) రాత్రి ఐపీఎల్ 2026 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ పోటీపడనున్నాయి. -
అది సెలక్టర్ల పని: వైభవ్ సూర్యవంశీపై సచిన్ వ్యాఖ్యలు
ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా 16 మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఇన్నింగ్స్లో ఓ విధ్వంసకర శతకం (36 బంతుల్లోనే) కూడా ఉండటం విశేషం. క్వాలిఫయర్-2 ముగిసేసరికి అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ కూడా తన వద్దే పెట్టుకున్నాడు ఈ చిచ్చరపిడుగు.టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లుఇక అంతకు ముందు భారత అండర్-19 జట్టు తరఫున కూడా అదరగొట్టాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). ఈ పరిణామాల క్రమంలో ఇప్పటికే భారత్-‘ఎ’ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అయితే, వీలైనంత త్వరగా ఈ పదిహేనేళ్ల పిల్లాడిని టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.అత్యద్భుతంఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రతి ఒక్కరూ సూర్యవంశీ గురించే మాట్లాడుతున్నారు. నేను కూడా అతడి బ్యాటింగ్ చూశాను. నిజంగా అత్యద్భుతం. అతడు చాలా చాలా ప్రత్యేకమైన ఆటగాడు.కేవలం బంతిని బాదడమే కాదు.. బ్యాటింగ్ చేసేటప్పుడు అతడు మణికట్టును ఉపయోగించే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మైదానం నలుమూలలా షాట్లు బాదాలంటే రిస్ట్ వర్క్ అత్యంత ముఖ్యం. వైభవ్ ఏదో దూకుడుగా, గుడ్డిగా బంతిని బాదడం లేదు.బాల్ను ఎదుర్కొనే ముందు లైన్ అండ్ లెంగ్త్ను సరిగ్గా అంచనా వేసి షాట్ ఆడుతున్నాడు. అందుకే మిగతా వారితో పోలిస్తే అతడు ఎక్కువగా బౌండరీలు బాదగలుగుతున్నాడు. అతడు టీమిండియాకు ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.టెస్టు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది..అయితే, ఇలాంటి విషయాలు వైభవ్పై ఒత్తిడి పెంచుతాయి. ఏదేమైనా అతడు తన సహజ శైలిని వదులుకోవద్దు. వైభవ్ టెస్టు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది. మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో సవాళ్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతీ బంతి ఒక ప్రశ్న లాంటిదే. దానికి బదులిచ్చే క్రమంలో పరిష్కారం కనుగొనే ఆలోచనా విధానం పెరుగుతుంది. కెరీర్లో చివరి రోజు వరకూ కూడా ఈ సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ఏదేమైనా వైభవ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తాను చేస్తున్న పనిపట్ల అతడికి చక్కటి అవగాహన ఉంది.అది సెలక్టర్ల పనిఅందరూ కోరుకున్నట్లుగానే వైభవ్ టెస్టు క్రికెట్ ఆడితే ఎంతో బాగుంటుంది. అయితే, అతడిపై ఒత్తిడి పెంచకూడదు. ప్రతిభావంతుడైన ఆటగాడికి అవకాశాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. అతడిపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.ఇలా ఆడాలి.. అలా ఆడాలి అంటూ మరీ ఎక్కువగా సూచనలు ఇచ్చి అతడిని గందరగోళంలోకి నెట్టేయకూడదు. వైభవ్ ఎంపిక గురించిన అంశాన్ని సెలక్టర్లకు వదిలివేయాలి. అతడిని ఏ జట్టుకు ఎంపిక చేయాలో వారికే తెలుసు. అది వారి బాధ్యత కూడా!.. కాబట్టి వైభవ్ విషయంలో తొందరపడటం మంచిది కాదు’’ అని సచిన్ టెండుల్కర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం! -
ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం
-
అద్వితీయ ప్రదర్శనకు సై!
తొలి ట్రోఫీ కోసం 18 సీజన్ల పాటు వేచి చూసి ఇప్పుడు అదే జోరులో ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు వరుసగా రెండో ట్రోఫీపై గురి పెట్టిన జట్టు ఒక వైపు... ఆడిన తొలి సీజన్లోనే కప్ను గెల్చుకోవడంతో పాటు ఐదో సీజన్లోనే మరో సారి విజేతగా నిలిచే లక్ష్యంతో నిలిచిన జట్టు మరో వైపు... దూకుడైన బ్యాటింగ్ లైనప్, పదునైన బౌలింగ్తో పాటు అమిత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమ్ సవాల్ విసురుతుండగా... ముగ్గురు బ్యాటర్లే దాదాపు మొత్తం బ్యాటింగ్ భారం మోస్తుండగా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో సమరానికి మరో జట్టు రెడీ అయింది. వరుసగా రెండో టైటిల్ నెగ్గిన కెపె్టన్గా అరుదైన జాబితాలో చేరేందుకు ఒక సారథి ఉవి్వళ్లూరుతుండగా, తన నాయకత్వంలో మొదటి టోర్నీ గెలిపించాలని మరొకరు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్–19 తుది పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.అహ్మదాబాద్: ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో అనూహ్య ఫలితాలు, అసాధారణ బ్యాటింగ్ విన్యాసాలు, కొత్త రికార్డులు, సరికొత్త ఘనతలు...64 రోజులు, 73 మ్యాచ్లు, 2299 ఫోర్లు, 1416 సిక్సర్ల తర్వాత ఐపీఎల్ పోరాటం ఆఖరి ఘట్టానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు, మాజీ చాంపియన్ గుజరాత్ను ఢీకొడుతుంది. ఏ జట్టు నెగ్గినా ఇది వారి రెండో టైటిల్ కానుంది. పాయింట్ల పట్టికలో టాప్–2 స్థానాల్లో నిలిచిన జట్లే చివరి సమరానికి సమాయత్తం కావడం విశేషం. తొలి క్వాలిఫయర్లో గుజరాత్ను చిత్తు చేసిన ఆర్సీబీ మానసికంగా పైచేయి సాధించగా... సొంతగడ్డపై ఫైనల్ ఆడనుండటం టైటాన్స్కు సానుకూలాంశం. ఆటగాళ్లంతా ఫామ్లో... డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బెంగళూరు ఈ సారి గత ఏడాదికంటే మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి దూసుకొచి్చంది. అన్ని అంచనాలను అందుకుంటూ జట్టు పాయింట్ల పట్టికలో టాపర్గా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సమష్టి ప్రదర్శన టీమ్ను ముందంజ వేసేలా చేసింది. ఈ సీజన్లో ఆర్సీబీ 10 మ్యాచ్లు గెలవగా... 8 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలవడం జట్టు సమష్టితత్వానికి నిదర్శనం. ప్రతీ ఒక్కరు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి అద్భుత ఫామ్ ఓపెనింగ్లో జట్టు శుభారంభానికి ప్రధాన కారణం. పదేళ్ల క్రితం 2016లో ఇదే స్థాయి ఆటతో ఒంటిచేత్తో బెంగళూరును ఫైనల్కు చేర్చిన విరాట్ కోహ్లి... మరోసారి నాటి ఆటను గుర్తుకు తెచ్చాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో జట్టుకు రెండో టైటిల్ అందించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. కోహ్లి 600 పరుగులు చేయగా, కెపె్టన్ రజత్ పాటీదార్ (486) ఏకంగా 196.76 స్ట్రైక్రేట్తో 5 అర్ధ సెంచరీలతో తన స్థాయిని ప్రదర్శించాడు. పడిక్కల్ (463) కూడా చెలరేగగా... కృనాల్ పాండ్యా ఆల్రౌండర్ ప్రదర్శన (225 పరుగులు, 13 వికెట్లు) జట్టును నడిపించాయి. 2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ అనుభవం జట్టుకు ఎంతో పనికొచి్చంది. భువీ ఇప్పటికే 26 వికెట్లు తీయగా...హాజల్వుడ్ (13) అండగా నిలిచాడు. వీరికి తోడు యువ బౌలర్ రసిఖ్ సలామ్ (16) సత్తా చాటడం బౌలింగ్ బలాన్ని పెంచింది. ఫిట్గా ఉంటే ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. లేదంటే వెంకటేశ్ అయ్యర్ కొనసాగుతాడు. బౌలింగ్లో పరిస్థితిని బట్టి సుయాశ్, డఫీలలో ఒకరికి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా అవకాశం దక్కుతుంది. టాప్–3 దూకుడు... టోర్నీ ఆరంభంనుంచి గుజరాత్ ఒకే విమర్శను మళ్లీ మళ్లీ ఎదుర్కొంది. టాప్–3 బ్యాటర్లు మినహా జట్టులో ఏమి లేదని, వీరిని అవుట్ చేస్తే కుప్పకూలడం ఖాయమని విమర్శలు వచ్చాయి. అయితే చివరిసారి ఈ విమర్శకు గుజరాత్ సిద్ధమైంది. మ్యాచ్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా టాప్–3 బ్యాటింగ్పైనే ఆధారపడుతోంది. శుబ్మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710), జోస్ బట్లర్ (507) తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు కాబట్టి ఈ విషయంలో మేనేజ్మెంట్కు ఆందోళన లేదు. వీరు చెలరేగితే మిడిలార్డర్ అవసరం ఉండదనే భావన రాజస్తాన్తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో కూడా రుజువైంది. సుందర్ (327) కూడా జట్టు విజయాల్లో కొంత పాత్ర పోషించాడు. అయితే పదునైన బౌలింగ్ దళం సహకారంతో గుజరాత్ ముందంజ వేయగలిగింది. కొత్త బంతితో రబాడ (28 వికెట్లు), సిరాజ్ (18) ప్రత్యర్థులను పూర్తిగా కట్టపడేస్తున్నారు. హోల్డర్ (17) కూడా కేవలం 7.54 ఎకానమీతో బౌలింగ్ చేయడం టైటాన్స్కు అదనపు బలంగా మారింది. గత పోరులో రషీద్ లైన్ తప్పినా... అతనిలాంటి స్టార్ బౌలర్ ఏ సమయంలోనైనా చెలరేగిపోగలడు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే స్పిన్నర్ సాయికిషోర్కు ఈ సారి బౌలింగ్ అవకాశం లభించవచ్చు. తుది జట్లు (అంచనా) బెంగళూరు: పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్/ వెంకటేశ్, పడిక్కల్, కృనాల్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, భువనేశ్వర్, హాజల్వుడ్, సలామ్, డఫీ/ సుయాశ్ గుజరాత్: గిల్ (కెపె్టన్), సుదర్శన్, బట్లర్, సుందర్, నిశాంత్, హోల్డర్, తెవాటియా, రషీద్, రబాడ, సిరాజ్, ప్రసిధ్, సాయికిషోర్. పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉన్నా...బౌలర్లూ ప్రభావం చూపగలరు. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన పిచ్పైనే ఫైనల్ నిర్వహిస్తున్నారు. ఆ పోరులో గుజరాత్ గెలిచింది. అన్నింటికి మించి ఈ స్టేడియంలో రెండో సారి బ్యాటింగ్ సులువుగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. -
ఫైనల్కు వాన గండం..! మ్యాచ్ రద్దైతే విజేత ఎవరంటే?
ఐపీఎల్-2026 సీజన్లో తుది సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ పోరులో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. బెంగళూరు మాత్రం ఫైనల్ మ్యాచ్లోనూ తమ జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.మ్యాచ్ జరిగే సమయంలో 30 శాతం వరకు వర్షం పడేందుకు అస్కారం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక వేళ వర్షం పడి మ్యాచ్ రద్దేతే పరిస్థితి ఏంటి? ట్రోఫీ ఎవరికి ఇస్తారు? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఒకవేళ వర్షం పడితే?మిగిలిన నాకౌట్ మ్యాచ్ల మాదిరిగానే ఈ మ్యాచ్కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. కానీ ఈ తుది పోరుకు మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రత్యేకంగా రిజర్వ్ డే ను కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మే 31) పూర్తి మ్యాచ్ నిర్వహించడానికి అంపైర్లు నిర్వహిస్తారు.సమయం మించిపోతుంటే ఓవర్లను కుదిస్తూ వస్తారు. ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి చివరి కట్-ఆఫ్ సమయం రాత్రి 11:55 గంటల వరకు ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే.. అర్ధరాత్రి 12:50 గంటల లోపు కేవలం 'సూపర్ ఓవర్' ద్వారా విజేతను తేల్చేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికి వాతవారణం అనుకూలించకపోతే మ్యాచ్ రిజర్వ్ డేకి మారుతుంది.ఒకవేళ ఆదివారం నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదలు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం(జూన్ 1)మ్యాచ్ను నిర్వహిస్తారు. మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను సోమవారం కొనసాగిస్తారు.రిజర్వ్ డే రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. గ్రూపు స్టేజ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అగ్రస్ధానంలో ఉంది కాబట్టి ఛాంపియన్గా అవతరిస్తోంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది.చదవండి: సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో? -
ఐపీఎల్ 2026 ఫైనల్ : ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
హోరా హోరీగా సాగిన ఐపీఎల్ 2026 ఫైనల్ దశకు చేరింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పీక్స్కు చేరింది. ఫైనల్ మ్యాచ్ కౌంట్డౌన్ స్టార్ట్ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. వెస్ట్రన్ రైల్వే ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.మే 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సూపర్ ఫైట్ను ఈ చూసేందుకు వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్కు తరలివెళ్లనున్నారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్కు ప్రత్యేక ఏసీ సూపర్ఫాస్ట్ రైలు నడపనున్నారు.ట్రైన్ నంబర్ 09021: మే 31న ఉదయం 6:20 గంటలకు ముంబై సెంట్రల్లో బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. మ్యాచ్ రోజునే ప్రయాణించాలనుకునే అభిమానులకు ఇది చాలా అనుకూలమైన ఆప్షన్.ఈ రైలులో ప్రీమియం శతాబ్ది తరహా రేక్తో పాటు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏసీ చైర్ కార్, అనుభూతి క్లాస్, మరియు విస్టాడోమ్ కోచ్లు కూడా ఉంటాయి.రిటర్న్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 09022): ఇది అహ్మదాబాద్లో మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరి, రాత్రి 9:45 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.ఫైనల్ మ్యాచ్ ముగిసాక అదనపు సర్వీసులుమ్యాచ్ ముగిసిన తర్వాత ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వెస్ట్రన్ రైల్వే జూన్ 1న మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది.ట్రైన్ నంబర్ 09044: అహ్మదాబాద్ నుండి బాంద్రా టెర్మినస్ వరకు నడుస్తుంది.ట్రైన్ నంబర్ 09043: అదే రోజు రాత్రి బాంద్రా టెర్మినస్ నుండి వాటివా (Vatva) వరకు నడుస్తుంది.ప్రత్యేకతలు: ప్రీమియం ఏసీ రైళ్లతో పోలిస్తే, ఈ రైళ్లలో ఏసీ త్రీ-టైర్ మరియు స్లీపర్ క్లాస్ కోచ్లు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికులకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.రైలు ఆగే స్టేషన్లు ఈ ప్రత్యేక రైళ్లు ముంబై-అహ్మదాబాద్ కారిడార్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో బోరివలి, వాపి, సూరత్, భరూచ్ మరియు వడోదర ఉన్నాయి. దీనివల్ల వివిధ నగరాల నుండి ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటుంది.బుకింగ్స్ ఎలా అంటే..ఈ నాలుగు ప్రత్యేక సర్వీసుల బుకింగ్స్ మే 30 నుండి ప్రారంభమవుతాయి. టిక్కెట్లను ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా లేదా పీఆర్ఎస్ (PRS) రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.ఐపీఎల్ ఫైనల్ వీకెండ్ కారణంగా భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్కు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఖరారు చేసుకునే ముందు పూర్తి టైమ్టేబుల్ మరియు కోచ్ వివరాలను తనిఖీ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. కాగా టైటిల్కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. -
అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ మరోసారి చాంపియన్గా నిలవడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగాటోర్నీ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలిచినప్పటికీ, క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవనున్నట్లు, అందుకు జోష్ హాజిల్వుడ్ కారణం కానున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు హాజిల్వుడ్ ఐదు టీ20 టోర్నీ ఫైనల్స్ ఆడితే.. ప్రతీసారి తాను ప్రాతినిధ్యం వహించిన జట్టే చాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జట్టులో హాజిల్వుడ్ ఉన్నాడు. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన సిడ్నీ సిక్సర్, 2019 బీబీఎల్ విజేత సిడ్నీ సిక్సర్స్, 2021 టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టు, 2021 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన సీఎస్కే, 2025 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు.. ఇలా ఐదుసార్లు హాజిల్వుడ్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2015, 2023 వన్డే వరల్డ్కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ హాజిల్వుడ్ సభ్యుడిగా ఉండడం విశేషం.దీంతో హాజిల్వుడ్ లక్కీ హ్యాండ్ అని.. అతను ఏ జట్టులో ఉంటే ఆ జట్టు చాంపియన్గా నిలుస్తుందని అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడు లక్కీహ్యాండ్ మాత్రమే కాదు, తాను ఆడిన ఐదు ఫైనల్స్లోనూ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఐదు ఫైనల్స్ కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్తో పాటు 2012 చాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్లో మూడు వికెట్లు తీసి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో హాజిల్వుడ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సీజన్లో 12 ఇన్నింగ్స్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే భువనేశ్వర్, రసిక్ సలామ్లు రాణిస్తుండడంతో హాజిల్వుడ్కు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోవడం లేదు.చదవండి: ‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’ -
ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం
గతేడాది ఐపీఎల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్.. తాజా ఎడిషన్లో మాత్రం అదరగొట్టింది. ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా.. ఎలిమినేటర్ గండం కూడా దాటి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.అయితే, ఫైనల్కు చేరే క్రమంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ముల్లన్పూర్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలుకావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.సంజూ స్థానంలో..గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో తొమ్మిదోస్థానంలో నిలిచిన రాజస్తాన్.. ఈసారి మాత్రం ఈ మేరకు అద్భుతంగానే రాణించింది. నిజానికి ఐపీఎల్-2026కు ముందు రాజస్తాన్ తమ కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేసింది.సంజూ స్థానంలో కెప్టెన్గా రియాన్ పరాగ్ను నియమించిన రాయల్స్.. ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీని పూర్తిస్థాయిలో బరిలోకి దించింది. ఈ రెండు నిర్ణయాలు రాయల్స్కు బాగా కలిసి వచ్చాయి. ఈ సీజన్లో వైభవ్ పదహారు మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా (క్వాలిఫయర్-2 ముగిసేసరికి) నిలిచాడు.సీజన్ మొత్తానికి దూరంఇదిలా ఉంటే.. సంజూకు బదులు రాజస్తాన్ చెన్నై నుంచి ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్ (రూ. 2.4 కోట్లు)లను తీసుకుంది. అయితే, సామ్ కర్రాన్ గజ్జల్లో గాయం అని చెప్పి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో రాజస్తాన్ శ్రీలంక స్టార్ దసున్ షనకను తీసుకుంది.అయితే, గాయం పేరు చెప్పి తప్పుకొన్న సామ్ కర్రాన్ ఇంగ్లండ్ దేశీ టోర్నీ టీ20 బ్లాస్ట్లో సర్రే జట్టుకు సుమారుగా మూడు మ్యాచ్లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను కావాలనే నిర్లక్ష్యం చేశాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ కుమార్ సంగక్కర తాజాగా స్పందించాడు.సర్రే తరఫున ఆడటం నేను చూశాను‘‘సామ్ కర్రాన్కు గాయమైందని మాకు సమాచారం అందింది. కానీ అతడు సర్రే తరఫున 2- 3 మ్యాచ్లు ఆడటం నేను చూశాను. నిజంగా ఈ విషయం మమ్మల్ని చాలా నిరాశపరిచింది.అతడు మా జట్టుతో ఆడాలని మేము కోరుకున్నాము. అందుకే జట్టులో చేర్చుకున్నాము. కానీ అతడు ఇలా చేశాడు. కాకపోతే ముందుగానే విషయం చెప్పినందు వల్ల షనకను తీసుకువచ్చాము. ఆటగాళ్ల కెరీర్లో గాయాలు సహజమే.మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలిఅయితే, కొన్ని తీవ్రమైన గాయాలు ఉంటాయి. మరికొన్ని నామమాత్రంగా ఉంటాయి. ఏదేమైనా బీసీసీఐ ఈ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు కఠినతరం చేయడం అత్యంత ముఖ్యం’’ అని సంగక్కర సామ కర్రాన్ తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా అకస్మాత్తుగా ఐపీఎల్కు దూరమైతే తదుపరి వేలంలో పాల్గొనకుండా రెండేళ్లపాటు నిషేధం విధిస్తోంది బీసీసీఐ. అయితే, గాయాలు, అనారోగ్య కారణాల వల్ల దూరమైన వారికి మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.చదవండి: ఫైనల్కు ముందు ఆర్సీబీకి షాక్! -
రాజస్తాన్ సరికొత్త చరిత్ర.. సన్రైజర్స్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ పోరాటం ముగిసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్.. మరోసారి ఫైనల్కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది.రియాన్ పరాగ్ సారథ్యంలోని రాయల్స్ జట్టు బ్యాటింగ్ పరంగా రాణించినప్పటికి, బౌలింగ్లో మాత్రం దారుణంగా విఫలమైంది. 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. అయితే ఈమ్యాచ్లో రాజస్తాన్ ఓటమిపాలైనప్పటికి ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రాజస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ ఏకంగా 181 కొట్టింది. దీంతో 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నెలకొల్పిన 178 సిక్సర్ల రికార్డును రాజస్తాన్ బ్రేక్ చేసింది.రాజస్తాన్ రాయల్స్ కొట్టిన మొత్తం 181 సిక్సర్లలో, కేవలం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 72 సిక్సర్లు బాదడం విశేషం. ఈ క్రమంలోనే ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) రికార్డును బద్దలు కొట్టాడు.వైభవ్ తర్వాత రాజస్తాన్ జట్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరేధ్రువ్ జురెల్: 24 సిక్సర్లుడొనవొన్ ఫెరీరా: 23 సిక్సర్లురియాన్ పరాగ్ (కెప్టెన్): 21 సిక్సర్లు -
‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ అర్థసెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. అయితే ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ రాజస్తాన్తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులోనూ మరోసారి హిట్వికెట్గా వెనుదిరగడం గమనార్హం. 150 ఏళ్ల క్రికెట్ చరిత్రలో వరుసగా రెండుసార్లు హిట్వికెట్గా వెనుదిరిగిన ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచిపోయాడు. హిట్వికెట్గా రెండోసారి ఔటవ్వడంపై సాయి సుదర్శన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ఈసారి బ్యాట్ జారిపోకుండా ఏదైనా కొత్త పద్ధతిని అనుసరిస్తానని నవ్వుతూ పేర్కొన్నాడు. ‘ఈ సమస్యను అధిగమించడానికి కొత్తగా ఏదైనా చేయాలి. అందుకు కొన్ని గ్రిప్ టెక్నిక్స్ ఉపయోగించి బంతులు ఆడే ప్రయత్నం చేస్తాను. ఆర్సీబీతో మ్యాచ్లో బంతిని ఆడే క్రమంలో నా బ్యాట్ చేతిలో నుంచి జారి బౌన్స్ అయి వికెట్ల మీద పడింది. కానీ రాజస్తాన్తో మ్యాచ్లో స్ట్రెయిట్ షాట్ ఆడాలనుకున్నా. కానీ ఈసారి కూడా బంతి బౌండరీ వెళ్లినప్పటికీ బ్యాట్ నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఫైనల్లో ఈ సమస్య రాకుండా ఒక కొత్త పద్ధతిని అనుసరించాలనుకుంటున్నా. అది ఎంతమేర సఫలమవుతుందో చూ డాలి’ అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ సీజన్లో సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గుజరాత్ తరఫున ఓపెనింగ్లో వస్తున్న సాయి సుదర్శన్ 16 ఇన్నింగ్స్లో 710 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలున్నాయి. అయితే ఈ సీజన్లో గుజరాత్ ఆడిన తొలి ఆరు మ్యాచ్ల్లో సాయి సుదర్శన్ ఒక ఫిఫ్టీ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత నుంచి వరుసగా ప్రతి మ్యాచ్లోనూ స్థిరమైన ప్రదర్శనతో కనీసం అర్థసెంచరీ సాధించడం విశేషం. మరో విషయమేంటంటే సాయి సుదర్శన్ వరుసగా రెండో సీజన్లోనూ 700 పరుగుల మార్క్ను అధిగమించాడు. గతంలో క్రిస్ గేల్ మాత్రమే వరుసగా రెండు సీజన్లలో 700 ప్లస్ మార్కును దాటాడు. తాజాగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. Glad he can still see the funny side of it 😅🎥 Sai Sudharsan on his back-to-back bizarre dismissals \|/#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @gujarat_titans pic.twitter.com/nGVrC10SUc— IndianPremierLeague (@IPL) May 29, 2026THE RAREST OF RARE DISMISSALS! TWICE IN TWO INNINGS 😯😯Sai Sudharsan's bat fell onto his own stumps 🫣Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/htGSYpu3YH— IndianPremierLeague (@IPL) May 29, 2026The Sai Sudharsan dismissal. 😄 pic.twitter.com/m0DaXI29aE— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026చదవండి: అభిమానులకు గుడ్న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక! -
‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆట ముగిసింది. లీగ్ దశలో చాలా కష్టపడి ప్లేఆఫ్స్ చేరిన రాజస్తాన్ ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసింది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి సీజన్ను మూడో స్థానంలో ముగించింది. అలా రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు పరిమితమైనప్పటికీ.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. గత సీజన్లోనే తన మెరుపులను చూపెట్టిన వైభవ్ ఈ సీజన్లో దానిని పరిపూర్ణం చేశాడని చెప్పొచ్చు. ఈ సీజన్లో అతడు కొనసాగించిన బ్యాటింగ్ విధ్వంసం మాములుగా లేదు. ఏదో రెండు మ్యాచ్ల్లో మెరిసి ఆ తర్వాత విఫలమయ్యుంటే వైభవ్ గురించి చర్చ ఉండేది కాదు. కానీ 15 ఏళ్ల వయసులోనే క్రికెట్లో ఉన్న అన్ని షాట్లను అలవోకగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. 16 మ్యాచ్ల్లో 237కు పైగా స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలున్నాయి. క్రీజులోకి అడుగుపెట్టిందే మొదలు ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడమే కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం అలవాటు చేసుకోవడం వైభవ్ సూర్యవంశీలో కనిపించిన గొప్ప పరిణితి. ఉదాహరణకు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కమిన్స్ మొదలుకొని ఏ బౌలర్ను వదలని సూర్యవంశీ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఉంటే ప్రపంచ రికార్డు తన ముంగిట ఉండేదేమో. ఇక గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుతమనే చెప్పొచ్చు. జట్టు కష్టాల్లో పడిందన్న విషయాన్ని గుర్తించిన వైభవ్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసినప్పటికీ మెరుపులకు లోటు లేకుండా చూసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ శతకం చేజార్చుకున్న వైభవ్ ఈ సీజన్లో మొత్తం 72 సిక్సర్లు బాది ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇలా సీజన్ ఆద్యంతం తన ఆటతీరుతో అలరించిన వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఐపీఎల్ ద్వారా నీ అద్భుత బ్యాటింగ్ విన్యాసాలను మాకు చూపించినందుకు థ్యాంక్స్’ అని చెబుతూ పోస్టులతో నింపేశారు. ‘15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026 సీజన్లో ఒక జట్టును తన భుజస్కందాలపై మోసుకెళ్లిన తీరు అద్భుతం. ఐపీఎల్ ట్రోఫీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ నీ ప్రదర్శన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది వైభవ్’ అని ఒక అభిమాని వైభవ్కు సంబంధించిన ఒక వీడియోనూ పంచుకోవడం హైలైట్గా నిలిచింది.THE COLDEST EDIT ON VAIBHAV SOORYAVANSHI. 🥶 pic.twitter.com/LgDqruGc4A— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2026this IPL will be remembered for a 15 year old carrying an entire team on his shouldersTrophies come and go, but the impact you left will always stay🙏 pic.twitter.com/oPOW5ABYx2— OldMonkOfCricket (@OldMonkOfCric) May 30, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
వైభవ్పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్లు!.. ఇదేం పద్ధతి?
వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరే ఒక సంచలనం. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై చితక్కొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. వరల్డ్కప్-2025 ఫైనల్లోనూ భారీ శతకం (80 బంతుల్లో 175)తో జట్టును గెలిపించాడు.అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా వైభవ్ దుమ్ములేపాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై లీగ్ దశలో 36 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్.. కీలక ఎలిమినేటర్లో మరోసారి సన్రైజర్స్ తన బ్యాటింగ్ పదునేమిటో చూపించాడు.ఒంటిచేత్తో.. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. ఒంటిచేత్తో సన్రైజర్స్ను ఎలిమినేట్ చేసి.. రాజస్తాన్ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కూడా ఈ పదిహేనేళ్ల పిల్లాడు చితక్కొట్టాడు. ముల్లన్పూర్లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 96 పరుగులు రాబట్టాడు.బాడీలైన్ బౌలింగ్తోఅయితే.. సన్రైజర్స్కు ఎదురైన చేదు అనుభవం చూసిన గుజరాత్ బౌలర్లు వైభవ్ను గట్టిగానే టార్గెట్ చేశారు. ముఖ్యంగా కగిసో రబడ బాడీలైన్ బౌలింగ్తో వైభవ్ను భయపెట్టాడు. మరోవైపు.. మహ్మద్ సిరాజ్ సైతం బౌన్సర్లు సంధిస్తూ ఇబ్బందిపెట్టాడు.అయినా సరే బుడ్డోడు ఏమాత్రం బెదరకుండా నిలకడగా ఆడాడు. అయితే, ఆఖరికి రబడ వైభవ్పై పైచేయి సాధించి అతడిని అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ గుజరాత్ బౌలర్ల తీరును తీవ్రస్థాయిలో విమర్శించాడు.నాలోని తండ్రి మనసు‘‘పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపడం కోసం బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్లపై అదరగొడుతున్నాడని నాకు తెలుసు. కానీ.. నాలోని తండ్రి మనసు ఈ రకమైన బౌలింగ్ను ఏమాత్రం అంగీకరించడం లేదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.ఇదేం పద్ధతి?అయితే.. చాలా మంది నెటిజన్లు ఇర్ఫాన్ పఠాన్ కామెంట్లపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా ఎలా మాట్లాడుతున్నారు?.. వైభవ్ సూర్యవంశీ ఏమో ఎదురుగా వరల్డ్క్లాస్ బౌలర్ ఉన్నా కనికరం లేకుండా బ్యాటింగ్తో విరుచుకుపడుతున్నాడు.మీరు మాత్రం అతడికి వ్యతిరేకంగా బౌలర్లు ఏపనీ చేయొద్దని చెబుతున్నారు. ఇదేం పద్ధతి?.. పదిహేనేళ్లకే అతడు విధ్వంసం సృష్టిస్తుంటే తప్పు లేదు గానీ.. బౌలర్లు తమ వ్యూహాలు అమలు చేస్తే తప్పా? బౌలర్లు బ్యాటర్ను అవుట్ చేయాలని మాత్రమే చూస్తారు. అందుకోసం ఏమైనా చేస్తారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.బాడీలైన్ బౌలింగ్ అంటే ఏమిటి?ఆస్ట్రేలియాలో 1932-33లో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి ఇది వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్ జట్టు ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ను నిలువరించేందుకు బౌలింగ్ చేసిన తీరు వివాదాస్పదంగా మారింది.ఈ తరహా బౌలింగ్లో ఫాస్ట్ బౌలర్లు షార్ట్ పిచ్ డెలివరీలు లేదంటే లెగ్స్టంప్కు కాస్త ఆవల బంతులు వేస్తూ నేరుగా బ్యాటర్ శరీరాన్ని టార్గెట్ చేశారు. తలపైకి డెలివరీలు సంధిస్తారు. ఈ ప్రమాదకర బౌలింగ్తో బ్యాటర్ తీవ్రంగా గాయపడొచ్చు లేదంటే చాకచక్యంగా ఆ బంతి నుంచి తప్పించుకోవాలి.గుజరాత్తో మ్యాచ్లో రబాడ ఈ తరహా బౌలింగ్తో చెలరేగడంతో వైభవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడి గ్లోవ్స్కు చాలాసార్లు బంతి తగిలింది. అయినా సరే అతడు పట్టుదలగా ఆడాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ రాజస్తాన్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.చదవండి: జైస్వాల్కు క్షమాపణ చెప్పండి.. రోహిత్ ఎందుకు? -
గిల్ విశ్వరూపం... IPL 2026 ఫైనలు గుజరాత్
-
ధోని.. రోహిత్.. కోహ్లి వల్లే కాదు ..! 15 ఏళ్లకే ఇంత ప్రెజర్ ను ఎలా హ్యాండిల్ చేశావ్..?
-
ఒక్కడిని అవుట్ చేయడానికి ఎన్ని ప్లాన్ లు వేశార్రా..! ఒంటిచేత్తో జీత్ ని ఊచకోత కోసిన వైభవ్
-
IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది మరొక రోజులో తేలిపోనుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. వరుసగా రెండోసారి కప్పు కొట్టాలనే ఉత్సాహంతో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్కు ఒక వార్త నిరాశ కలిగిస్తోంది. బెంగళూరు సిటీలో కఠిన ఆంక్షలు విధించడంతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ ఆర్సీబీ గనుక రెండో టైటిల్ గెలిస్తే నగరమంతటా భారీ సంఖ్యలో ప్రజలు గూమిగూడతారనే అంచనాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పేర్కొంది.2025 సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవాలను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయోత్సవం తొక్కిసలాటకు దారి తీసి 11 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. దీంతో ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యల కింద బెంగళూరు సిటీ మొత్తం కఠిన ఆంక్షలు విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.కఠిన ఆంక్షలు ఇవే..👉ముందస్తు అనుమతి లేకుండా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయరాదని తెలిపారు. సంబంధిత శాఖల నుంచి ఆమోదం పొందితే తప్ప బహిరంగ ప్రదేశాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదు.👉ఇక ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో సాముహిక విజయోత్సవ సంబరాలు చేసుకోకూడదు.👉ముఖ్యంగా జనం పెద్ద ఎత్తున గూమికూడి విజయోత్సవాల పేరుతో బైక్ ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేస్తూ సంబరాలు చేసుకోవడం పూర్తిగా నిషేధం.👉ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై టపాసులు కాల్చడం లేదా ఇతర కార్యక్రమాలు చేపట్టడం చేయవద్దని సూచించారు.విషాదంలా విజయోత్సవాలు..2025 ఐపీఎల్లో చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవం నిర్వహించింది. ఈ విజయోత్సవం కాస్తా విషాదంగా మారిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవాలకు జనాలు భారీగా తరలివచ్చారు. స్టేడియం నిండిపోవడంతో బయట కూడా సుమారు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు గూమిగూడారు. భారీ జనసమూహం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యల కింద కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనరేట్ తెలిపింది.గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ..రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ నిలకడగా ఆడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 18 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచి ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. మరోవైపు గుజరాత్ కూడా స్థిరమైన ప్రదర్శన కొనసాగించినప్పటికీ మధ్యలో కొన్ని అపజయాలు పలకరించాయి. కానీ అన్నీ దాటుకొని ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన గుజరాత్కు క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ షాక్ ఇచ్చింది. అయితే క్వాలిఫయర్-2 పోరులో మాత్రం రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా! -
వైభవ్కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్
గుజరాత్ టైటాన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. తమ అరంగేట్ర సీజన్ 2022లో ఏకంగా చాంపియన్గా నిలిచిన టైటాన్స్.. 2023లో రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించిన గుజరాత్ జట్టు.. క్వాలిఫయర్-2లో జయభేరి మోగించింది.రాజస్తాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకువెళ్లింది. ముల్లన్పూర్లో రాయల్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్ ఊదేసింది. తద్వారా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాదించింది. 47 బంతుల్లోనేఇక ఈ విజయంలో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ది కీలక పాత్ర. రాజస్తాన్తో మ్యాచ్లో కేవలం 47 బంతుల్లోనే అతడు శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.ఏదేమైనా క్వాలిఫయర్-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ సాధించిన రికార్డులు ఇవీ..A 1️⃣0️⃣0️⃣ of the highest quality! 🤩🔥👏GT skipper #ShubmanGill brings up a sensational century and what an occasion to deliver this masterclass! ❤️🙌#TATAIPL Qualifier 2 👉 #GTvRR | LIVE NOW 👉https://t.co/pv6LOaRl1f pic.twitter.com/wEbwNXzply— Star Sports (@StarSportsIndia) May 29, 2026ఐపీఎల్లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో..👉విరాట్ కోహ్లి- 9 శతకాలు👉జోస్ బట్లర్- 7 శతకాలు👉క్రిస్ గేల్, కేఎల్ రాహుల్- 6 శతకాలు👉సంజూ శాంసన్, శుబ్మన్ గిల్- 5 శతకాలు👉డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్- 4 శతకాలుగుజరాత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు👉శుబ్మన్ గిల్- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్పై👉శుబ్మన్ గిల్- 49 బంతుల్లో 2023లో ముంబైపై👉శుబ్మన్ గిల్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై👉సాయి సుదర్శన్- 50 బంతుల్లో 2024లో చెన్నైపైఐపీఎల్లో కెప్టెన్గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 5👉కేఎల్ రాహుల్- 3👉శుబ్మన్ గిల్- 2.కాగా గుజరాత్తో మ్యాచ్లోనూ రాజస్తాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 47 బంతులలో 96 పరుగులు చేశాడు. అయితే, గిల్ సెంచరీతో చెలరేగి అతడి ఇన్నింగ్స్కు విలువ లేకుండా చేసి పడేశాడు.చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
ఇదిరా సిరాజ్ అంటే.. గెలుపు కంటే మనిషి ప్రాణమే ముఖ్యం!
-
‘మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప.. అంతా అతడి వల్లే’
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా ఫైనల్ చేరాలన్న రాయల్స్ కలలు చెదిరిపోయాయి.అంచనాలకు మించిఈ నేపథ్యంలో గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తమ జట్టు అంచనాలకు మించి రాణించిందని.. తమ ప్రయాణం ఇక్కడి వరకు సాగడమే గొప్ప విషయమని అతడు అన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ పిచ్పై 215 అనేది కాపాడుకోదగ్గ స్కోరే. అయితే, రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు మరింతగా అనుకూలించడం మాపై ప్రతికూల ప్రభావం చూపింది. తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా సాగింది.మేము మరో 15- 20 అదనపు పరుగులు సాధించి ఉండే బాగుండేది. ఏదేమైనా ఈ సీజన్ మాకు సానుకూలంగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మేము అసలు ప్లే ఆఫ్స్నకు కూడా అర్హత సాధించే స్థితిలో లేము.చాలా మంది యువ ఆటగాళ్లే మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఐపీఎల్ ఆడుతున్నారు. సీజన్కు ముందు ఎన్నెన్నో మార్పులు.. ఎన్నో విభిన్న కాంబినేషన్లు ప్రయత్నించి చూశాము.అయినప్పటికీ మా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడి ఇక్కడి దాకా చేరుకున్నారు. మాకు ఇదొక గొప్ప ఆరంభం. ఈ ప్రయాణంలో మున్ముందు మెరుగ్గా రాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.వైభవ్ సూర్యవంశీనే కారణంఇక గుజరాత్తో క్వాలిఫయర్-2లో తాము గట్టిగా పోరాడగలిగామంటే అందుకు వైభవ్ సూర్యవంశీనే కారణమని రియాన్ పరాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అతడు టీమిండియాకు ఆడితే చూడాలని ఉందని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. వైభవ్ ఆట గాలివాటం కాదని.. పక్కా ప్రణాళికతోనే అతడు మైదానంలో దిగుతాడని ప్రశంసించాడు.ఆర్సీబీతో ఫైనల్లో గుజరాత్కాగా ముల్లన్పూర్ వేదికగా గుజరాత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్) రాణించాడు.ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రాజస్తాన్ 214 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.చదవండి: హార్దిక్ పాండ్యా కూడా! -
చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్... రాజస్థాన్ కల చెదిరింది!
-
గుజరాత్ ఘనంగా ఫైనల్కు
ఐపీఎల్లో ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్లో గుజరాత్ విజయలక్ష్యం 215 పరుగులు... కానీ నాకౌట్ మ్యాచ్లోనూ ఒత్తిడి లేకుండా శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ తమ ఆటతో దీనిని చాలా చిన్నదిగా మార్చేశారు. విధ్వంసక ప్రదర్శన లేకుండానే తమదైన శైలిలో ఓపెనర్లు 77 బంతుల్లోనే 167 పరుగులు జోడించడంతో టైటాన్స్ ఫైనల్ చేరడం లాంఛనంగా మారిపోయింది. కీలక పోరులో రాజస్తాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు మరోసారి సెంచరీ చేజారినా... వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్తోనే రాయల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. తమ సొంతగడ్డపై ఫైనల్ ఆడనున్న గుజరాత్... తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి రెండోసారి టైటిల్ సాధిస్తుందా చూడాలి. న్యూ చండీగఢ్: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్స్లు) వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ అవకాశం కోల్పోయాడు. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, డొనొవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) చివర్లో చెలరేగాడు. అనంతరం గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’కెప్టెన్ శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 104; 15 ఫోర్లు, 3 సిక్స్లు) ఐపీఎల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. రేపు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో బెంగళూరుతో గుజరాత్ తలపడుతుంది. వైభవ్ దూకుడు... గత మ్యాచ్లతో పోలిస్తే వైభవ్ ఈసారి కాస్త ఓపికను ప్రదర్శించాడు. తొలి ఓవర్లోనే జైస్వాల్ (1), తర్వాతి ఓవర్లో ధ్రువ్ జురేల్ (7) వెనుదిరగడం కూడా అందుకు కారణం. సిరాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన వైభవ్ 14వ బంతికిగానీ తన తొలి సిక్స్ కొట్టలేదు. అయితే నాలుగో స్థానంలో వచి్చన జడేజా చకచకా పరుగులు రాబట్టాడు. ప్రసిధ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను 19 బంతుల్లోనే 34 పరుగులకు చేరుకున్నాడు. అయితే మోచేతి గాయంతో రిటైర్డ్హర్ట్గా తప్పుకోగా, ఆ తర్వాత రాజస్తాన్ ఇన్నింగ్స్ తడబడింది. జడేజా మళ్లీ క్రీజ్లోకి వచి్చనా తర్వాతి 14 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. మరోవైపు 46 పరుగుల వద్ద సుదర్శన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన వైభవ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అది నెమ్మదైన అర్ధ సెంచరీ! హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు చూపించిన వైభవ్ తర్వాత ఆడిన 15 బంతుల్లో చెలరేగి 2 ఫోర్లు, 5 సిక్స్లతో 96కు చేరుకున్నాడు. ఈసారైనా సెంచరీ ఖాయం అనుకోగా... మళ్లీ సరిగ్గా గత మ్యాచ్ తరహాలోనే ర్యాంప్ షాట్ ఆడబోయి మరోసారి షార్ట్ థర్డ్మాన్లోకి క్యాచ్ ఇచ్చాడు. అయితే రషీద్ వేసిన చివరి ఓవర్లో రెచి్చపోయిన ఫెరీరా 4 సిక్స్లు బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. పరుగుల జుగల్బందీ... ఛేదనలో గుజరాత్ అలవోకగా దూసుకుపోయింది. రాయల్స్ పేలవ బౌలింగ్తో సుదర్శన్, గిల్ ఎలాంటి శ్రమ లేకుండా ఒకరితో మరొకరు పోటీ పడుతూ సునాయాసంగా పరుగులు రాబట్టారు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో ఇద్దరూ చెరో 2 ఫోర్లతో మొదలు పెట్టగా, పవర్ప్లేలో జట్టు 10 ఫోర్లు సహా 69 పరుగులు రాబట్టింది. సుదర్శన్ 14 వద్ద ఉన్నప్పుడు ఫెరీరా, షనక సమన్వయ లోపంతో క్యాచ్ వదిలేయడం కూడా గుజరాత్కు కలిసొచి్చంది. ఆపై తుషార్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి 30 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరిన గిల్... జడేజా ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టాడు. అనంతరం 26 బంతుల్లోనే సుదర్శన్ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఎట్టకేలకు 13వ ఓవర్లో సుదర్శన్ ‘హిట్ వికెట్’తో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ అనూహ్యంగా ఒకే తరహాలో అవుట్ కావడం విశేషం. 47 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న గిల్, సుందర్ (16) తక్కువ వ్యవధిలో అవుటైనా... తెవాటియా (17 నాటౌట్), బట్లర్ (9 నాటౌట్) కలిసి ఆటను ముగించారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 1; వైభవ్ (సి) ప్రసిధ్ (బి) రబాడ 96; జురేల్ (సి) గిల్ (బి) రబాడ 7; జడేజా (నాటౌట్) 45; పరాగ్ (సి) రబాడ (బి) హోల్డర్ 11; షనక (సి) బట్లర్ (బి) హోల్డర్ 3; ఆర్చర్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 7; ఫెరీరా (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–101, 4–109, 5–118, 6–172. బౌలింగ్: సిరాజ్ 4–0–42–1, రబాడ 4–0–35–2, ప్రసిధ్ 4–0–42–1, సుందర్ 2–0–23–0, హోల్డర్ 4–0–27–2, రషీద్ 2–0–45–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (హిట్ వికెట్) (బి) బ్రిజేశ్ 58; గిల్ (ఎల్బీ) (బి) ఆర్చర్ 104; బట్లర్ (నాటౌట్) 9; సుందర్ (సి) ఫెరీరా (బి) బర్గర్ 16; తెవాటియా (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–167, 2–182, 3–201. బౌలింగ్: ఆర్చర్ 4–0–45–1, బర్గర్ 4–0–35–1, బ్రిజేశ్ 3.4–0–44–1, తుషార్ 3–0–34–0, యశ్రాజ్ 2–0–29–0, జడేజా 2–0–28–0. టాస్ గందరగోళం... మ్యాచ్కు ముందు టాస్ సమయంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు కారణమైంది. గిల్ నాణెం విసరగా, పరాగ్ ‘హెడ్స్’ చెప్పాడు. అయితే నాణెం కింద పడిన తర్వాత దానిని స్పష్టంగా చూపించకుండా రిఫరీ ప్రకాశ్ భట్ తాను ‘సరిగా వినలేదని’... టాస్ మళ్లీ వేయమని కోరాడు. దాంతో మళ్లీ నాణెం విసరగా, ఈసారి పరాగ్ టాస్ నెగ్గాడు. దాంతో గిల్ తన అసంతృప్తిని ప్రదర్శించాడు. గత మ్యాచ్లో వాడిన పిచ్ కాబట్టి తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ రిఫరీ సరిగా వినలేదని అతను వ్యాఖ్యానించాడు. మ్యాచ్లో టైటాన్స్ ఓడి ఉంటే ఇది కూడా పెద్ద వివాదానికి కారణమయ్యేదేమో. -
పాపం సాయి సుదర్శన్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో క్వాలిఫయర్-2లో సుదర్శన్ హిట్ వికెట్గా వెనుదిరిగాడు. సుదర్శన్ ఇలా విచిత్రంగా ఔటవ్వడం ఇది వరుసగా రెండో సారి కావడం విశేషం. అంతకుముందు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కూడా సుదర్శన్ హిట్ వికెట్గా ఔటయ్యాడు.ఏమి జరిగిందంటే?ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్లో సుదర్శన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి మంచి రిథమ్లో కన్పించాడు. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బ్రిజేష్ శర్మ.. ఐదో బంతిని సుదర్శన్కు ఫుట్టాస్గా సంధించాడు. ఆ బంతిని ఆఫ్సైడ్ డీప్స్క్వేర్ దిశగా బౌండరీకి తరలించాడు. అయితే షాట్ ఆడే వేగంలో ఈసారి కూడా బ్యాట్ అతని చేతిలో నుంచి జారిపోయింది.గత మ్యాచ్లో బ్యాట్ కిందపడి దొర్లుకుంటూ వికెట్లను తాకితే, ఈసారి మాత్రం నేరుగా వెళ్లి స్టంప్స్ మీద పడింది. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. శుభ్మన్ గిల్ తల పట్టుకుని మోకాళ్లపై కూలబడిపోయాడు. లైవ్ కామెంటరీలో ఉన్న రవిశాస్త్రి తన మార్క్ స్టైల్లో... "ఎక్కడ ఉంది ఫెవికాల్? ఎక్కడ ఉంది? వ్యాఖ్యనించాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్ వరుసగా రెండు మ్యాచ్ల్లో హిట్వికెట్ అవ్వడం ఇదే తొలిసారి కావచ్చు. సుదర్శన్ మొత్తంగా 32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58 పరుగులు చేశాడు.ಹೀಗೂ ಆಗುತ್ತಾ? Hit wicket! Twice in two innings! 👀🤯 Sai Sudarshan ಪಾಲಿಗೆ ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ದುರದೃಷ್ಟ ಬೇರೆ ಇಲ್ಲ! ಕ್ರೀಸ್ನಲ್ಲಿದ್ದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಔಟ್ ನೋಡಿ ಕಂಪ್ಲೀಟ್ ಶಾಕ್ ಆಗಿದೆ! 😱ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL 2026, Qualifier 2 👉 #GTvsRR | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar. pic.twitter.com/al2pOTFFk5— Star Sports Kannada (@StarSportsKan) May 29, 2026 -
హార్ట్ బ్రేకింగ్.. వైభవ్ మరో 'సారీ'
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో 97 పరుగులు చేసి సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయిన వైభవ్.. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్పై అదే సీన్ రిపీట్ చేశాడు. ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్తో క్వాలిఫయర్-2లో వైభవ్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్తాన్ను వైభవ్ తన అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. గత మ్యాచ్తో పోలిస్తే కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ సులువుగా తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ మరోసారి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వైభవ్ నిలిచిపోయాడు.రబాడ బౌలింగ్లో భారీషాట్కు ప్రయత్నించి థర్డ్మ్యాన్లో వైభవ్ దొరికపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ ఈ విధంగానే అతడు తన వికెట్ను కోల్పోయాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేశాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్ అయిన బ్యాటర్ల సరసన వైభవ్ చేరాడు. డేవిడ్ వార్నర్, కె.ఎల్ రాహుల్ లాంటి దిగ్గజాల రికార్డును అతను సమం చేశాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్ అయిన బ్యాటర్లు వీరేవైభవ్ సూర్యవంశీ-3డేవిడ్ వార్నర్-3కేఎల్ రాహుల్-3గ్లెన్ మాక్స్వెల్-3రుతురాజ్ గైక్వాడ్-3 -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో వైభవ్ వీరవీహారం చేశాడు. కేవలం 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ను తన విరోచిత ఇన్నింగ్స్తో వైభవ్ ఆదుకున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన వైభవ్.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ చిచ్చరపిడుగు తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. ముల్లాన్పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోసారి తృటిలో తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకునే అవకాశాన్ని సూర్యవంశీ కోల్పోయాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్తో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సాధించిన రికార్డులు ఇవేఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 440 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ 545 బంతుల్లో 1,000 పరుగులు చేయగా.. వైభవ్ అంతకంటే 105 బంతులు తక్కువగానే ఆడి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడు ఈ ఏడాది సీజన్లో పవర్ప్లేలో 233.63 స్ట్రైక్ రేట్తో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో వైభవ్ కంటే ముందు ఈ ఫీట్ను అందుకోలేకపోయారు. వైభవ్ తర్వాత డేవిడ్ వార్నర్(467) ఉన్నాడు.చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయంTHE VAIBHAV SOORYAVANSHI SHOW 🤩🩷🎥 The Boy Wonder playing fire with fire 🔥Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @rajasthanroyals pic.twitter.com/UFvfez3ORP— IndianPremierLeague (@IPL) May 29, 2026 -
క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్మన్ గిల్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్లో శుభ్మన్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు.రియాన్ పరాగ్ 'హెడ్స్' అని కాల్ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్ను రద్దు చేసి, రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్ను విసరగా.. రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు.ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు.చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయంToss clip 🔥SCAM?? MISTAKE??FIXED??? OR WOTTT??? 🙊 #GTvsRR pic.twitter.com/atQe43C6Mm— CHICO (@CHICOx58) May 29, 2026 -
వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా!
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో తన బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ ఉపయోగిస్తున్న బ్యాట్ స్పాన్సర్షిప్కు సంబంధించి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్కు ఎస్ఎస్ (సరీన్ స్పోర్ట్స్) కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అయితే ఇకపై వైభవ్ తన బ్యాట్పై ఏడాదికి రూ. 12కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీతో ఉన్న ఒప్పందంతో పోలిస్తే ఇది 24 రేట్లకు ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఈ కొత్త ఒప్పందం ప్రస్తుత స్పాన్సర్ ఎస్ఎస్తోనే జరిగిందా లేక వేరే కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి వైభవ్ పోటీగా మారనున్నాడు.ప్రస్తుతం కోహ్లీ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎంఆర్ఎఫ్ ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఎంఆర్ఎఫ్ కూడా వైభవ్ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలా వైభవ్ తన బ్యాట్తో పరుగుల సునామీ సృష్టించడమే కాదు, ఇప్పుడు బ్యాట్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించబోతున్నాడు.Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually. - It’s more than 24 times than his previous bat sponsorship deal. (CricBlogger). pic.twitter.com/ZwQkLN61uf— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2026చదవండి: ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్! -
క్వాలిఫయర్-2లో గుజరాత్ ఘన విజయం
Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates: ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తమ ఫైనల్ బెర్త్ను గుజరాత్ ఖరారు చేసుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఈ విజయంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ది కీలక పాత్ర. ఈ మ్యాచ్లో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. గిల్తో పాటు సుదర్శన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మ తలా వికెట్ సాధించారు. మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీతో గుజరాత్ తలపడనుంది.సుందర్ అవుట్వాషింగ్టన్ సుందర్(6).. బర్గర్ బౌలింగ్లో ఔటయ్యాడు.గుజరాత్ రెండో వికెట్ డౌన్గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 104 పరుగులు చేసిన గిల్.. ఆర్చర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.శుబ్మన్ సెంచరీగుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గుజరాత్ విజయానికి 38 బంతుల్లో 39 పరుగులు కావాలి.గుజరాత్ తొలి వికెట్ డౌన్సాయిసుదర్శన్(58) రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సుదర్శన్ మరోసారి హిట్వికెట్ రూపంలో వెనుదిరిగాడు.విజయం దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్లు శుబ్మన్ గిల్(39 బంతుల్లో 81), సాయిసుదర్శన్(27 బంతుల్లో 51) దుమ్ములేపుతున్నారు. గుజరాత్ విజయానికి 54 బంతుల్లో 71 పరుగులు కావాలి.దుమ్ములేపుతున్న గుజరాత్ ఓపెనర్లు6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(30), శుబ్మన్ గిల్(29) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్215 పరుగుల భారీ లక్ష్య చేధనను గుజరాత్ టైటాన్స్ ఘనంగా ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(21), సాయిసుదర్శన్(14) ఉన్నారు.వైభవ్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వైభవ్ కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడితో పాటు డొనొవాన్ ఫెరీరా(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా(45) కూడా రాణించాడు. ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జాసన్ హోల్డర్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు.వైభవ్ సెంచరీ మిస్రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెంచరీని 4 పరుగులు దూరంలో మిస్ చేసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.వైభవ్ హాఫ్ సెంచరీవైభవ్ సూర్యవంశీ 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 14 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 129/5రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్రాజస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఆర్చర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. జడేజా తిరిగి క్రీజులోకి వచ్చాడు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్దసన్ షనక రూపంలో రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన షనక.. హోల్డర్ బౌలింగ్లో ఔటయ్యాడు.రియాన్ పరాగ్ రెండో వికెట్ డౌన్రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. జాసన్ హోల్డర్ బౌలింగ్లో ఔటయ్యాడు.జడేజా రిటైర్డ్ హార్ట్మంచి టచ్లో కన్పించిన రవీంద్ర జడేజా(19 బంతుల్లో 34) గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 100/2మొదలెట్టిన వైభవ్వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 27) దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ స్కోర్: 45/2రాజస్తాన్కు భారీ షాక్.. 13 రన్స్కే 2 వికెట్లుధ్రువ్ జురెల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 13/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్టాస్ గెలిచి బ్యాటింగ్కు రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.గుజరాత్ తమ జట్టులో ఓ మార్పు చేసింది. స్పిన్నర్ సాయికిషోర్ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్ మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా -
ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. జట్టును నడిపించడంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సీజన్ మధ్యలోనే పాండ్యాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించాలని ముంబై యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పాండ్యా ముంబై ఇండియన్స్కు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అతడు తన సోషల్ మీడియాలో అకౌంట్లో పెట్టిన పోస్టులే ఉదాహరణ. దీనికి తోడు పాండ్యా కెప్టెన్సీ, అతడి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవ్వడంతో ముంబై యాజమాన్యం కూడా పాండ్యాను జట్టు నుంచి రిలీజ్ చేయాలని భావిస్తోంది. ముంబై ఇండియన్స్ నుంచి బయటికి రానున్న హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ఏ జట్టులోకి వెళ్తే బాగుంటుందనే చర్చ జోరుగా సాగుతుంది. సీఎస్కే లేదా లక్నోకు పాండ్యా కెప్టెన్గా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ జట్టులోకి కూడా హార్దిక్ పాండ్యా వెళ్లే అవకాశం లేకపోలేదు. 2022 ఐపీఎల్ సీజన్లో తొలిసారి ఆడిన గుజరాత్ టైటాన్స్ను చాంపియన్గా నిలిపాడు హార్దిక్ పాండ్యా. తర్వాతి సీజన్లోనూ ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. అయితే గుజరాత్ను చాంపియన్గా నిలపడంతో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను భారీ ధరకు జట్టులోకి తీసుకొచ్చింది. రోహిత్ నుంచి జట్టు పగ్గాలు తీసుకున్న పాండ్యా ముంబైని విజయవంతంగా నడిపించడంలో విఫలమయ్యాడు. గతేడాది సీజన్లో ముంబైని ప్లేఆఫ్స్ చేర్చిన పాండ్యా ఈ సీజన్లో అటు కెప్టెన్గా, ఇటు ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. మైదానంలో ఆటగాళ్లతో అగ్రెసివ్గా ఉండడం, జట్టులో సీనియర్లతో సక్రమంగా వ్యవహరించకపోవడం పాండ్యాకు పూర్తి నెగెటివ్గా మారిపోయింది. ఈ క్రమంలోనే తాను ముంబైని వీడుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే సీజన్లో ముంబై ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత పాండ్యా డ్రెసింగ్ రూమ్కు వెళ్తూ ధరించిన జెర్సీని విప్పి అభిమానుల వైపు విసిరేశాడు. అంతేకాదు రాజస్తాన్తో మ్యాచ్ అనంతరం చాలా అలసిపోయానని, మారేందుకు సిద్ధమవుతున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. మరి ముంబై ఇండియన్స్ను వీడనున్న పాండ్యా ఏ జట్టులోకి వచ్చే అవకాశముందో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.లక్నో సూపర్జెయింట్స్:ముంబై నుంచి బయటకు వస్తే హార్దిక్ పాండ్యా లక్నో సూపర్జెయింట్స్కు కెప్టెన్గా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టు కెప్టెన్గా ఉన్న పంత్ ఇప్పటికే తాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 27 కోట్లు వెచ్చించిన లక్నో యాజమాన్యం కూడా పంత్ ప్రదర్శనపై అసంతృప్తితోనే ఉంది. పంత్ను వదిలేసుకుంటే లక్నో దగ్గరు ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది. ఈ మేరకు హార్దిక్ పాండ్యాను మంచి ధరకు తమ జట్టులోకి తీసుకోవడమే గాక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.ఢిల్లీ క్యాపిటల్స్..ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఢిల్లీ డేర్డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చుకున్నప్పటికీ ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ప్రస్తుత ఢిల్లీ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ అంతంతమాత్రంగా రాణించాడు. జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉన్న కేఎల్ రాహుల్కు కెప్టెన్సీపై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో హార్దిక్పాండ్యాను కెప్టెన్గా నియమిస్తే ఆల్రౌండర్గానూ సేవలందించే అవకాశం ఉంటుంది. అయితే అక్షర్ పటేల్ను ఢిల్లీ రిలీజ్ చేయకపోవచ్చు.కోల్కతా నైట్రైడర్స్:2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆ తర్వాత ఉన్నపళంగా అయ్యర్ను వదిలేసుకుంది. దీంతో అజింక్య రహానేను కెప్టెన్గా నియమించింది. అతడి కెప్టెన్సీలో కేకేఆర్ పెద్దగా రాణించింది లేదు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఆరు వరుస పరాజయాలు రహానేపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాయి. కామెరున్ గ్రీన్ ట్రేడింగ్లోకి వెళ్తే మాత్రం ముంబై ఇండియన్స్ పాండ్యాను కేకేఆర్కు బదలాయించే అవకాశముంటుంది. అప్పుడు పాండ్యాకు కేకేఆర్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది.చెన్నై సూపర్కింగ్స్:ఇక లక్నో తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వెళ్లేది సీఎస్కే జట్టులోకేనని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సీజన్లో కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే సీజన్లో మధ్యలో వరుస విజయాలతో ఊపందుకున్న సీఎస్కే ఒక దశలో ప్లేఆఫ్ రేసులోనూ నిలిచింది. అయితే ఇప్పటికే రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ను కూడా రుతురాజ్ స్థానంలో కెప్టెన్ను చేసే అవకాశం లేకపోలేదు. అయితే ప్రశాంత్ వీర్ లేదా శివమ్ దూబేలలో ఒకరిని సీఎస్కే విడుదల చేస్తే మాత్రం ట్రేడింగ్లో సీఎస్కే పాండ్యాను దక్కించుకునే అవకాశముంది.రాజస్తాన్ రాయల్స్:రాజస్తాన్ రాయల్స్ జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ రియాన్ పరాగ్ కెప్టెన్సీ అనుభవలేమి కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాజమాన్య హక్కులు చేతులు మారడంతో వచ్చే సీజన్లో రాజస్తాన్ కొత్త కెప్టెన్ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పాండ్యా రాజస్తాన్లోకి వస్తే మాత్రం రియాన్ పరాగ్ స్థానంలో అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.**Hardik Pandya throws away MI jersey**His way of saying goodbye to Mumbai Indians forever? pic.twitter.com/1fy2YzygzX— Viraj (@virajs1845) May 27, 2026🔴 STRESSED, EXHAUSTED HARDIK PANDYA TELLS MUMBAI INDIANS HE IS DONE🤯- Hardik has informed MI that he wants to leave the franchise after a disappointing IPL 2026 season.[PTI] Hardik was mentally stressed and completely exhausted & set to quit MI pic.twitter.com/1N8i4Sgfzd— Sam (@cricsam02) May 29, 2026చదవండి: ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం! -
రిషబ్ పంత్ సంచలన నిర్ణయం
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి పంత్ వైదొలిగాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటిచింది. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ పంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. "రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతడి అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించింది. క్రికెట్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులువు కాదు. ఒక కెప్టెన్గా అతడు సూపర్ జెయింట్స్కు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మా దృష్టి అంతా జట్టు ప్రయోజనాల పైనే ఉంది. రాబోయే రోజుల్లో జట్టును మళ్లీ పటిష్టంగా నిర్మించడమే మా లక్ష్యమని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కెప్టెన్గా అట్టర్ ప్లాప్కాగా ఐపీఎల్-2025 వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 27 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ స్ధానంలో తమ జట్టు పగ్గాలను పంత్కు లక్నోకు అప్పగించింది. కానీ లక్నో యాజమాన్యం నమ్మకాన్ని రిషబ్ నిలబెట్టుకోలేకపోయాడు.ఐపీఎల్-2025, 26 సీజనల్లో అతడి కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ రెండు సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. ఈ ఏడాది సీజన్లో లక్నో మరింత ఘోరంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పంత్ కెప్టెన్గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరిచాడు. దీంతో అతడిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ తప్పుకొన్నాడు.చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’ -
ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్లతో కూడిన బలమైన లైనప్కు తోడు భువనేశ్వర్, హాజిల్వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది. అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే! -
‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2026లో గ్రూప్ దశలో పద్నాలుగు మ్యాచ్లకు గానూ ముంబై.. కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది. ఫలితంగా ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఐదుసార్లు చాంపియన్కాగా రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ముంబై గతంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2024లో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. అతడి స్థానంలో... గుజరాత్ టైటాన్స్ను విజేతగా (2022) నిలిపిన తమ మాజీ ఆటగాడు హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకుంది. అంతేకాదు కెప్టెన్గానూ బాధ్యతలు అప్పగించింది.ఘోర పరాభవంముంబై ఇండియన్స్ సారథిగా తొలి ప్రయత్నంలోనే హార్దిక్ ఘోర పరాభవం చవిచూశాడు. సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర వివక్ష ఎదుర్కోవడంతో పాటు.. జట్టును మరీ దారుణంగా చిట్టచివరన పదో స్థానంలో నిలిపాడు. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో హార్దిక్పై నెగిటివిటీ కాస్త తగ్గింది.గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. అదే జోరులో 2025లో ముంబైని ప్లే ఆఫ్స్ చేర్చాడు హార్దిక్ పాండ్యా. అయితే, తాజా ఎడిషన్లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి కెప్టెన్గా.. ఆల్రౌండర్గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన హార్దిక్.. 10 మ్యాచ్లు ఆడి 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై అంబానీల సారథ్యంలోని యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీకి కీలక విషయాలు వెల్లడించాయి.ముంబై తప్పు తెలుసుకుంది‘‘ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ తప్పును తెలుసుకుంది. అయితే, రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేడు. కానీ.. అతడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తే ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ అవుతాడనడంలో సందేహం లేదు. రోహిత్ సూచించిన ఆటగాడికే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సైతం ముంబైని వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల తన ఫోన్ స్క్రీన్పై ‘07:07’ టైమ్ను షేర్ చేయడంతో.. అతడు చెన్నై సూపర్ కింగ్స్లో చేరబోతున్నాడని నెటిజన్లు భావించారు.మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటేఈ విషయం గురించి కూడా సదరు వర్గాలు స్పందించాయి. ‘‘హార్దిక్ కచ్చితంగా ట్రాన్స్ఫర్ కోరుకుంటాడు. కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ అతడు జట్టుకు దూరమవ్వాలని కోరుకుంటున్నాడు.ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నపుడు మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటే ఎవరైనా ఇలాగే చేస్తారు కదా!.. ఆటగాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: GT vs RR: వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే? -
‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆటను, అతడి ప్రదర్శనను క్రీడా నిపుణులు, అభిమానులు క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్మన్, సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ మాత్రం వైభవ్ను మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో పోల్చడం వివాదాస్పదంగా మారింది.‘15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటను చూస్తుంటే నాకు మా షాహిద్ అఫ్రిది గుర్తుకు వస్తున్నాడు. అతడు కూడా యంగ్ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బెరుకు, భయం లేకుండా ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగులు రాబట్టేవాడు. 1996 వన్డే ప్రపంచకప్లో 37 బంతుల్లోనే అఫ్రిది సెంచరీ బాదాడు. అప్పుడు అఫ్రిది వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు వైభవ్ కూడా బౌలర్లు ఎంతవారైనా భయం, బెరుకు లేకుండా బ్యాటింగ్ కొనసాగించడంలో విజయవంతమయ్యాడు. ఇక వైభవ్కు మంచి భవిష్యత్తు ఉంది. 15 ఏళ్ల వయసులో విధ్వంసకర బ్యాటింగ్ ఆడడం అతడి అదృష్టమని చెప్పొచ్చు. బ్యాటింగ్లో అదరగొడుతున్నప్పుడు వయసుతో పని లేకుండా సీనియర్ జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరముంది. అతన్ని వెంటనే టీమిండియా జట్టులోకి తీసుకోవాల్సిందే.’ అని డిమాండ్ చేశాడు. అయితే వైభవ్ బ్యాటింగ్ను మెచ్చుకోవడం నుంచి టీమిండియాలోకి అతడిని తీసుకోవాలని మహ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతృప్తి చెందిన అభిమానులు షాహిద్ అఫ్రిదితో వైభవ్ను పోల్చడంపై మాత్రం మండిపడ్డారు. వైభవ్తో అఫ్రిదిని పోల్చవద్దని హితవు పలికారు. ‘భారత్ పట్ల ఎప్పుడు విద్వేష భావంతో ఉండే అఫ్రిదితో పోల్చడం ఏంటి? ఇది వైభవ్ను అవమానించడం కిందే లెక్క’.. ‘ఉగ్రవాదులతో కలిసి విందులో పాల్గొనే వ్యక్తితో పోలుస్తారా’ అంటూ కామెంట్లు చేశారు. కాగా పాక్ క్రికెటర్గా కొనసాగుతున్న సమయంలో షాహిద్ అఫ్రిది ఉగ్రవాద సంస్థ బలోచ్ నేత ఉజైర్ బలోచ్తో కలిసి డిన్నర్లో పాల్గొన్న ఫొటోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదిగా ముద్ర పడిన వ్యక్తితో కలిసి అఫ్రిది భోజనం చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ను ద్వేషించే క్రికెటర్లలో అఫ్రిది ముందు వరుసలో ఉంటాడు. పదే పదే భారత్ను కించపరిచేలా మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వడం అఫ్రిదికి అలవాటుగా మారిపోయిందని గతంలోనూ భారత క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై విమర్శలు గుప్పించారు.ఐపీఎల్ 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆడిన 15 మ్యాచ్ల్లో 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్రపంచ రికార్డు సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. 15-year-old cricket sensation #Vaibhav Sooryavanshi reminds me of @SAfridiofficial young, fearless, explosive, full of energy. The future is here! 🔥🏏 #Cricket #IPL2026— Mohammad Yousaf (@yousaf1788) May 28, 2026No comparison at all with Afridi. Vaibhav is way different!— manak (@manakseervi) May 29, 2026Hmmm.. getting compared to a bottom tier slogger.. this is perhaps the biggest insult to Vaibhav Sooryavanshi, the lowest point of his life. And I’m happy it has come so early in his career. I’m sure he’ll get over it soon, and after this, nothing negative will ever affect him…— THE SKIN DOCTOR (@theskindoctor13) May 28, 2026Shahid Afridi and Uzair Baloch of PAC aka Lyari Gang pic.twitter.com/IxSg0rUPEM— Zeeshan Akram Mirza (@ZshanMirza) March 27, 2013చదవండి: 'అతడు వేలంలోకి వస్తే 30 కోట్లు చెల్లిస్తా!' -
GT vs RR: పొంచి ఉన్న ప్రమాదం.. మ్యాచ్ రద్దైతే?
క్వాలిఫయర్-1లో ఓటమిపాలైన గుజరాత్ టైటాన్స్.. తనకున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్లో మూడోసారి ఫైనల్ చేరడమే లక్ష్యంగా రాజస్తాన్ రాయల్స్తో పోటీకి సిద్ధమైంది.ముల్లన్పూర్ వేదికగా..ఇరుజట్ల మధ్య శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గుజరాత్- రాజస్తాన్ మధ్య ఈ నాకౌట్ మ్యాచ్కు న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లో గల మహరాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక.పొంచి ఉన్న ప్రమాదంకాగా వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ముల్లన్పూర్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సాయంత్రం మేఘావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్కు కొద్దిమేర వర్ష ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు.సాయంత్రానికి పరిస్థితి చక్కబడితే మాత్రం మ్యాచ్కు ఆటంకం ఉండకపోవచ్చు. ఒకవేళ వాన వల్ల మ్యాచ్కు ఆటంకం కలిగితే, రద్దైతే పరిస్థితి ఏమిటి?.. ఐపీఎల్ నిబంధల ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు.మ్యాచ్ రద్దైతే?కాబట్టి వర్షం వల్ల ఇప్పుడు క్వాలిఫయర్-2కు అంతరాయం కలిగితే.. 16.10.3 క్లాజ్ ప్రకారం.. ఇరుజట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ అప్పుడు టై అయితే.. ఫలితం తేలేంత వరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు.అయితే, సూపర్ ఓవర్ నిర్వహించే పరిస్థితి కూడా లేకపోతే.. గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లు కలిగి ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు. ఒకవేళ పాయింట్లు కూడా సమంగా ఉంటే అప్పుడు నెట్రన్రేటు కీలకంగా మారుతుంది.కాగా గ్రూప్ దశలో గుజరాత్ టైటాన్స్ పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లు సాధించింది. మరోవైపు.. రాజస్తాన్ పద్నాలుగింట ఎనిమిది గెలిచి.. 16 పాయింట్లతో ఉంది. కాబట్టి.. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-1లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫయర్-2 ఆడే పరిస్థితి తెచ్చుకుంది.ఆర్సీబీతో తలపడేది ఎవరో!మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో పటిష్ట సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి.. క్వాలిఫయర్-2 రూపంలో సువర్ణావకాశం దక్కించుకుంది. కాగా ఐపీఎల్-2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. క్వాలిఫయర్-2 విజేతతో మే 31న ఆర్సీబీ అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంటుంది. కాగా గతేడాది ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవగా.. గుజరాత్ తమ అరంగేట్ర సీజన్ 2022లోనే ట్రోఫీ సాధించింది. ఇక 2023లో కూడా ఫైనల్ చేరిన గుజరాత్.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన -
'అతడు వేలంలోకి వస్తే 30 కోట్లు చెల్లిస్తా!'
ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తాజాగా నేడు గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2 పోరులో వైభవ్ ప్రళయం సృస్టిస్తాడా లేక విఫలమవుతాడా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వైభవ్ సూర్యవంశీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ సందర్భంగా హర్భజన్, సెహ్వాగ్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. మాటల సందర్భంలో వైభవ్ వేలంలోకి వస్తే ఎంత ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేస్తావంటూ సెహ్వాగ్కు హర్భజన్ ప్రశ్న సంధించాడు. భజ్జీ ప్రశ్నకు ఏమాత్రం సంకోచించని సెహ్వాగ్.. ఒకవేళ వైభవ్ వేలంలోకి వస్తే గనుక రూ. 30 కోట్లు ఇచ్చి కొనుక్కుంటానంటూ ఆసక్తికర సమాధానమిచ్చాడు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా సెహ్వాగ్ ఇచ్చే ఆఫర్కు సమాన మొత్తాన్ని తాను చెల్లిస్తానంటూ బదులిచ్చాడు. ఇక వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ దృష్ట్యా అతడిని భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే అతను ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు కూడా కాకపోవడం, పైగా 15 ఏళ్లే ఉండడంతో జాతీయ జట్టులోకి అతడి ఎంపికకు ఇంకా సమయం ఉందంటూ బీసీసీఐ పేర్కొంది. అయితే అతడి ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిపేందుకు ఇండియా-ఎ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తిలక్ వర్మ నేతృత్వంలో వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్లో ఇండియా-ఎ తరఫున సూర్యవంశీ ఆడనున్నాడు. ఈ సిరీస్లో వైభవ్ సత్తా చాటితే గనుక త్వరలో భారత సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఐపీఎల్ 18వ సీజన్లోనే కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్లు గాలివాటం కాదని తాజా సీజన్ ద్వారా నిరూపించాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్రపంచ రికార్డు సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన -
IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన
ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారి అదే జోరు కొనసాగిస్తూ.. ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.కీలక ప్రకటనఇక రెండో బెర్తు కోసం పోటీలో ఉన్న గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ (GT vs RR) క్వాలిఫయర్-2లో శుక్రవారం అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్లే మిగిలి ఉన్న వేళ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) కీలక ప్రకటన చేసింది.ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు స్మార్ట్ సన్గ్లాసెస్ ధరించకూడదని ACSU ఆదేశాలు జారీ చేసింది. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA)లోకి వీటిని తీసుకురావొద్దని పేర్కొంది. ఈ మేరకు..అస్సలు తీసుకురాకూడదు‘‘అత్యాధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు గల పరికరాలను మైదానంలోకి తీసుకురాకూడదు. మొబైల్ డేటా లేదంటే వై-ఫై నెట్వర్క్ల ద్వారా.. ప్రత్యక్ష ప్రసారం, సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆడియో, వీడియోలు చేరవేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది.కాబట్టి PMOA ప్రమాణాల ప్రకారం.. ఇలాంటి గాగుల్స్, సన్గ్లాసెస్ను ఆడియో, వీడియో రికార్డింగ్, కమ్యూనికేషన్ పరికరాల కింద పరిగణిస్తారు. కాబట్టి ఆటగాళ్లు, అధికారులు.. ఎవరూ కూడా స్మార్ట్ గాగుల్స్ను అస్సలు PMOAలోకి తీసుకురాకూడదు’’ అని బీసీసీఐ ACSU తెలిపింది.మొబైల్ ఫోన్ చూడకూడదుకాగా రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ బిందర్ PMOAలో మొబైల్ ఫోన్ చూడటం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సైతం రోమీతో పాటు ఫోన్ స్క్రీన్ను చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారగా.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రోమీకి జరిమానా విధించడంతో పాటు.. వైభవ్ను మందలించింది. కాగా తాను ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ కోసం మొబైల్ చూసినట్లు రోమీ చెప్పాడని వార్తలు వచ్చాయి.చదవండి: ‘ఇంగ్లండ్ టూర్కు వైభవ్ను ఎంపిక చేయాల్సిందే’ -
‘ఇంగ్లండ్ టూర్కు వైభవ్ను ఎంపిక చేయాల్సిందే’
క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. పదిహేనేళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న ఈ చిచ్చరపిడుగును చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్న వైభవ్.. ఐపీఎల్-2026లోనూ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.ఆకాశమే హద్దుగారాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా ఈసారి పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన వైభవ్ (Vaibhav Suryavanshi).. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసే సరికి 680 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో గ్రూప్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్పై శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ (103).. ఎలిమినేటర్ మ్యాచ్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.దిగ్గజాలు ఫిదాకేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఏదేమైనా ఈ సీజన్లో ఈ బిహారీ పిల్లాడి ఆట చూసి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్, సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే భారత దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ సైతం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వయసుతో పనిలేదని.. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అతడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా టీమిండియాకు అతడికి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?స్పోర్ట్స్ టాక్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 క్రికెట్ ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నా. ఇంతటి అత్యద్భుతమైన ప్రదర్శన తర్వాత సెలక్టర్లు అతడికి తప్పక చోటివ్వాలి కూడా!..అతడి వయసుతో పనిలేదు. 15 ఏళ్ల కంటే పెద్ద వారి కంటే కూడా అతడు శక్తిమంతంగా సిక్సర్లు బాదుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బౌలర్ల బౌలింగ్లోనూ బంతిని బౌండరీ అవతలకు పంపిస్తున్నాడు.దేవుడిని ప్రార్థిస్తున్నాప్రత్యర్థి ఎవరైనా అతడికి అసలు భయమే లేదు. గల్లీల్లో పిల్లలు ఎలా ఆడతారో ఐపీఎల్లో ఈ పిల్లాడు అలాగే ఆడుతున్నాడు. మనం కూడా చిన్నపుడు డిఫెన్సివ్గా కాకుండా దూకుడుగా ఆడేవాళ్లము. ఇప్పుడు వైభవ్ అదే పని చేస్తున్నాడు.అయితే, అతడు మెగా వేదికపై ఇలా ఆడటం ఆశ్చర్యకరం. అతడి బ్యాటింగ్ శైలి, ఆట తీరు ఇలాగే కొనసాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్లు ఆడిన తర్వాత.. టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్, పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఎంపిక గురించి చర్చ నడుస్తోంది. చదవండి: ‘జైస్వాల్ రాయల్స్ను వదిలేయాలి’Universe Boss 🤝 Universe Boss Baby#VaibhavSooryavanshi smashes another fifty in #TATAIPL 2026 and breaks Chris Gayle’s record for most sixes in a season (59)🔥👊🏻#TATAIPL Playoffs Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/dF7JsFwXro— Star Sports (@StarSportsIndia) May 27, 2026 -
ఒక పక్క ఏడుస్తూనే.. వైభవ్ ను పిలిచి ఏం చేసిందో చూడండి!
-
‘అతడు ప్లే ఆఫ్స్లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు’
ఐపీఎల్-2026లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ అసలు సమరంలో మాత్రం చేతులెత్తేసింది. రాజస్తాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో సమిష్టి వైఫల్యంతో ఇంతటితో ప్రయాణం ముగించింది. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరైన సన్రైజర్స్ టాపార్డర్ రాజస్తాన్ బౌలింగ్ ధాటికి కుదేలు కావడం తీవ్ర ప్రభావం చూపింది.టాపార్డర్ కుదేలుఓపెనర్లలో అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ (8 బంతుల్లో 17) కాసేపు వేగంగా ఆడినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33) మెరుపులు కూడా ఎక్కువసేపు కొనసాగలేదు. ఈ ముగ్గురిని రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పెవిలియన్కు చేర్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లే ఆఫ్స్లో ఎల్లప్పుడూ అతడు విఫలం అవుతున్నాడని.. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదన్నాడు. స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ..అతడు ప్లే ఆఫ్స్లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు‘‘2024 నుంచి సన్రైజర్స్కు ఇదే సమస్య. అభిషేక్ శర్మ ప్లే ఆఫ్స్లో ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాడు. ఆర్చర్ ఈసారి పవర్ప్లేలో అతడితో పాటు ఇషాన్ కిషన్నూ వెనక్కి పంపి దెబ్బకొట్టాడు. ట్రవిస్ హెడ్ అయితే గుడ్డిగా ఆడుతూ పోయాడే తప్ప ప్లాన్ ఉన్నట్లు కనిపించలేదు.ఇక హెన్రిచ్ క్లాసెన్ కంటే ముందు స్మరణ్ రవిచంద్రన్ ఎందుకు బ్యాటింగ్కు వచ్చాడో తెలియదు. అభిషేక్ శర్మ అవుటైనా ఇషాన్ వేగంగా ఆడాడు. మూడు ఓవర్లలోనే దాదాపుగా 50 పరుగులు తెచ్చారు. అయితే, ఇషాన్ అవుటైన తర్వాత సన్రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది.Bowled ’em! 🔥Jofra Archer strikes as Travis Head departs early, and #SRH are in deep trouble in this must-win clash 😮💨#TATAIPL 2026 Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/RAEXQ0WmL7— Star Sports (@StarSportsIndia) May 27, 2026రాయల్స్ను గెలిపించిన వైభవ్ఏదేమైనా ప్లే ఆఫ్స్లో అభిషేక్ శర్మ విఫలం కావడం సన్రైజర్స్కు అతిపెద్ద సమస్యగా మారింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ముల్లన్పూర్ వేదికగా బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్తాన్ తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది.ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 97) విధ్వంసకర ఇన్నింగ్స్తో సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ సన్రైజర్స్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: ‘జైస్వాల్ రాయల్స్ను విడిచి వెళ్లాలి’ -
వైభవ్ X గుజరాత్
న్యూ చండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించడమే లక్ష్యంగా... నేడు మాజీ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్త్ లభిస్తుంది. క్వాలిఫయర్–1లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే టైటిల్ పోరుకు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసి రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో చోటు కోసం మరోపోరుకు సిద్ధమైంది. తొలి ఐపీఎల్ సీజన్లో (2008) విజేతగా అవతరించిన రాజస్తాన్ 2022లో రెండోసారి ఫైనల్ చేరి గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. గుజరాత్ జట్టు 2022లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి, 2023లో రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. సన్రైజర్స్తో ఇదే వేదికపై జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం ప్రదర్శించి రాజస్తాన్ రాయల్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి మరోసారి వైభవ్పైనే కేంద్రీకృతమైంది. వైభవ్ 10 ఓవర్లు క్రీజులో ఉంటే మాత్రం రాజస్తాన్ రాయల్స్ మరోసారి ప్రత్యరి్థకి 200 పరుగులపైనే లక్ష్యాన్ని నిర్దేశించడం ఖాయం. వైభవ్ను పవర్ప్లే లోపు అవుట్ చేస్తే మాత్రం గుజరాత్ పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. టాప్–3పైనే భారం బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లలో సారూప్యత కనిపిస్తోంది. ఈ సీజన్లో రెండు జట్లు ఎక్కువగా టాప్–3 బ్యాటర్లపైనే ఆధారపడ్డాయి. వైభవ్ సూర్యవంశీ (15 మ్యాచ్ల్లో 680 పరుగులు), యశస్వి జైస్వాల్ (15 మ్యాచ్ల్లో 426 పరుగులు), ధ్రువ్ జురేల్ (15 మ్యాచ్ల్లో 508 పరుగులు) ఈ సీజన్లో నిలకడగా రాణించారు. మరోవైపు గుజరాత్ టాపార్డర్ బ్యాటర్లు శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 618 పరుగులు), సాయి సుదర్శన్ (15 మ్యాచ్ల్లో 652 పరుగులు), జోస్ బట్లర్ (15 మ్యాచ్ల్లో 498 పరుగులు) కూడా ఈ సీజన్లో మెరిపించారు. రెండు జట్ల మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల టాపార్డర్ బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగితే భారీ స్కోర్లు ఆశించలేము. ఒకవేళ క్రీజులో నిలదొక్కుకుంటే మాత్రం పరుగుల విందు ఖాయమనుకోవాలి. గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు కలిపి మొత్తం 59 సిక్స్లు కొట్టగా... రాజస్తాన్ చిచ్చరపిడుగు వైభవ్ ఒక్కడే 65 సిక్స్లు బాదాడు. బౌలర్ల తడాఖా... బౌలింగ్ విభాగానికొస్తే గుజరాత్దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. గుజరాత్ పేస్ బౌలర్లు రబాడ 26 వికెట్లు, సిరాజ్ 17 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 15 వికెట్లు, హోల్డర్ 15 వికెట్ల చొప్పున పడగొట్టారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రాజస్తాన్ పేసర్లు ఆర్చర్ 24 వికెట్లు నేలకూల్చగా... బ్రిజేశ్ శర్మ, బర్గర్ 13 వికెట్ల చొప్పున తీశారు. రెండు జట్ల ఓపెనర్లు ఆరంభంలో వికెట్ ఇవ్వకుంటే భారీ స్కోరుకు బాటలు పడతాయి. ఈ సీజన్లో ఛేజింగ్ చేసిన జట్లు 43 మ్యాచ్ల్లో గెలుపొందగా... 27 మ్యాచ్ల్లో ఓడిపోయాయి. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మరో మ్యాచ్ ‘టై’ అయింది. ఐపీఎల్ 19 సీజన్లను పరిశీలిస్తే ‘నాకౌట్’ మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 36 సార్లు గెలుపొందగా... ఛేజింగ్ చేసిన జట్టు 35 సార్లు విజయం అందుకుంది.పిచ్, వాతావరణం ఎలిమినేటర్ మ్యాచ్లో ఉపయోగించిన పిచ్నే క్వాలిఫయర్–2లోనూ వాడనున్నారు. ఫలితంగా ఈసారి ఛేజింగ్ చేసే జట్టు ఇబ్బంది పడవచ్చు. మ్యాచ్ రోజున మధ్యాహ్నం వడగళ్ల వాన కురిసే అవకాశముంది. అయితే సాయంత్రం మేఘావృతంగా ఉండి మ్యాచ్కు ఆటంకం ఉండకపోవచ్చు. జట్ల వివరాలు (అంచనా) గుజరాత్ టైటాన్స్: శుబ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, నిశాంత్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తేవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్/సాయికిశోర్. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, డోనోవాన్ ఫెరీరా, షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్ శర్మ, సుశాంత్ మిశ్రా, యశ్రాజ్ పుంజా. -
‘‘రాజస్థాన్ రాయల్స్ను యశస్వి జైస్వాల్ వదిలివెళ్లాలి’’
చెన్నై సూపర్ కింగ్స్కు సంజూ శాంసన్ వెళ్లడం ఖరారైనప్పుడు.. ఇకపై రాజస్థాన్ రాయల్స్ బాధ్యతలు యశస్వి జైస్వాల్ చేపడతాడని చాలా మంది భావించారు. లేదంటే జట్టులో ప్రధాన ఆటగాడిగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారింది. ఏడాది క్రితమే ఐపీఎల్లోకి ప్రవేశించిన టీనేజర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లోని కీలక ఆటగాళ్లను సైతం డామినేట్ చేస్తున్నాడు.మరోవైపు, 2023 ఐపీఎల్ సీజన్లో 600కుపైగా పరుగులు, 48.07 సగటుతో రాణించినప్పటి నుంచి యశస్వి జైస్వాల్ను భారత క్రికెట్ ఫ్యూచర్ స్టార్గా భావించారు. కానీ, 2026 మే నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దాదాపు ప్రతి అంశంలోనూ అతడిని మించిపోయాడు.వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుండగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ కెరీర్లో కీలక నిర్ణయం తీసుకునే దశలో నిలిచాడు. ఆటను మరింత మెరుగుపర్చుకుని రాజస్థాన్ జట్టులోనే ఉండడం. లేదంటే జట్టు మారడం. జైస్వాల్ తన ఆట తీరును మరింత మెరుగుపరచుకోకపోతే వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల ముందు అతడి పేరు, గుర్తింపు, ప్రాధాన్యం తగ్గిపోయే అవకాశం ఉంది.మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వైభవ్ సూర్యవంశీ నీడ నుంచి బయటకు వచ్చి(ఆర్ఆర్ నుంచి), మరో జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని జైస్వాల్కు సూచించాడు.“అతడు తన ఆటతీరును మార్చుకోవాలి. ఎందుకంటే సూర్యవంశీతో కలిసి ఆడుతూ ప్రతిసారీ అతడి పర్ఫార్మన్స్ ముందు మసకబారిపోతూ ఉండలేడు. జైస్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆటగాడు. మరో జట్టుకు వెళ్తే తన సొంత ప్రతిభతో మ్యాచ్లు గెలిపిస్తాడు. అతడికో ఓ వేదిక అవసరం. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఇకముందూ ఇతరుల ప్రభ తగ్గిపోయేలా చేస్తూనే ఉంటాడు” అని అంబటి రాయుడు అన్నాడు.“వైభవ్ సూర్యవంశీతో పాటు ఓ సీనియర్ భాగస్వామి ఉండాలి. పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. అతడి విజయాన్ని చూసి ఆనందించాలి. పోటీగా భావించకూడదు. అతడితో పోటీ పడటం సాధ్యం కాదు” అని తెలిపాడు. జైస్వాల్కు ముంబై ఇండియన్స్ సరైన జట్టని అన్నాడు. -
కాటీరమ్మ కొడుకులను ఆటాడుకున్న బుడ్డాడు
-
భయం ఎరుగని బ్యాటింగ్.." బౌలర్లకు చుక్కలు! చిన్న వయసులో రికార్డులు బద్దలు!
-
ఎస్ఆర్హెచ్ ఓటమికి గల కారణాలివే
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. వరుసగా రెండో సీజన్లో ఫైనల్కు చేరుకుండానే టోర్నీని నుంచి ఎస్ఆర్హెచ్ ఇంటిముఖం పట్టింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్లో 47 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఓటమి పాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఎస్ఆర్హెచ్ తమ మార్క్ చూపలేకపోయింది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ ఓటమికి గల కారణాలను పరిశీలిద్దాం.వైభవ్ ఊచకోత.. తేలిపోయిన బౌలర్లుముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమనే చెప్పుకోవాలి. వరల్డ్ క్లాస్ పేసర్ అయిన పాట్ కమిన్స్ సైతం ఈ మ్యాచ్లో తేలిపోయాడు. రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని సన్రైజర్స్ బౌలర్లు ఆపలేకపోయారు. కమ్మిన్స్ను వైభవ్ ఉతికారేశాడు. అతడి దెబ్బకు కమిన్స్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్లలో అద్బుతంగా రాణించిన ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్ సైతం ఎలిమినేటర్లో విఫలమయ్యారు. ఒకవేళ వైభవ్ను వీరు ముందుగానే అవుట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. జోఫ్రా ఆర్చర్ దెబ్బ.. అభిషేక్ అబ్బఇక సాధారణంగా ప్రతీ మ్యాచ్లోనూ మెరుపు ఆరంభాన్ని అందించే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు.. ఆర్చర్ దెబ్బకు విలవిల్లాడారు. ఇన్నింగ్స్ రెండో బంతికే అద్భుతమైన బంతితో అభిషేక్ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు. దీంతో అభిషేక్ ఖతాతెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్లను సైతం ఆర్చర్ అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ను కోలులోలేని దెబ్బ తీశాడు. అతడితో పాటు బర్గర్ కూడా ఓ వికెట్ సాధించాడు. దీంతో సన్రైజర్స్ పవర్ప్లేలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిడిలార్డర్ ఫెయిలూర్అయితే కర్ణాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ వరుస మ్యాచ్లలో విఫలమవుతున్నప్పటికి కీలకమైన ఎలిమినేటర్లో కూడా అతడిని ఆడించి ఎస్ఆర్హెచ్ తప్పుచేసింది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన స్మరణ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతడి స్ధానంలో అనికేత్ వర్మ వంటి ఆటగాళ్లకు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. మిడిలార్డర్లో నిలకడగా రాణించే క్లాసన్ కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు.కొంపముంచిన కమిన్స్ఎస్ఆర్హెచ్ ఓటమికి టాస్ కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. దాదాపు చాలా మ్యాచ్లలో సన్రైజర్స్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కమిన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ముల్లాన్పూర్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు, రెండో ఇన్నింగ్స్లో చేజింగ్ చేసిన జట్లకు మధ్య విజయాల శాతంలో పెద్దగా తేడా లేదు. రెండు వైపులా దాదాపు సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ముందు బ్యాటింగ్ చేసి రాజస్తాన్ ముందు మంచి స్కోర్ ఉంచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. -
'ఆ సీక్రెట్ ఐపీఎల్ అయిపోయాక చెప్తా'
ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. అతడి విధ్వంసం ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అనంతరం లక్ష్య చేధనలో సన్రైజర్స్ 196 పరుగులకే ఆలౌటైంది. రాజస్తాన్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. వైభవ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్పై సహచర ఆటగాళ్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్ అనంతరం వైభవ్పై తన సహచరడు, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."అతడు బ్యాటింగ్ చూడాటానికి చాలా బాగుంటుంది. అతడు ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. మాకు డిఫెండ్ చేయడానికి అన్ని ఎక్కువ పరుగులు లభిస్తాయి. వైభవ్ 150 పరుగులు కూడా చేయగలడన్న నమ్మకం నాకు ఉంది" అని ఆర్చర్ అన్నాడు. అదేవిధంగా వైభవ్ను ఆడ్డుకోవాలంటే ఎలా బౌలింగ్ చేయాలన్న ప్రశ్నకు ఆర్చర్కు ఎదురైంది.అందుకు బదులుగా.. వైభవ్ను ఎలా ఔట్ చేయాలో నాకు తెలుసు. కానీ అది ఐపీఎల్ ముగిసిన తర్వాత చెప్తాను అని ఆర్చర్ సరదాగా సమాధనమిచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ(680) అగ్రస్ధానంలో ఉన్నాడు. మే 29న రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.చదవండి: IPL 2026: వైభవ్ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే -
వైభవ్ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్.ఐపీఎల్ మొదలై 19 సీజన్లు అవుతున్నప్పటికి ప్లే ఆఫ్స్లో ఇలాంటి ఇన్నింగ్స్ను ఇప్పటివరకు చూడలేదు. ఈ నాకౌట్ మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లుకు సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఆఖరికి ప్లాన్-బి, ప్లాన్-సి అని చెప్పిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ను సైతం ఈ వండర్ కిడ్ వదల్లేదు. 15 ఏళ్ల వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల బాదిన ప్లేయర్గా క్రిస్ గేల్ ఆల్టైమ్ రికార్డును సూర్యవంశీ(62) బ్రేక్ చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్కు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అయితే వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చర పిడుగును ఐపీఎల్కు పరిచయం చేసింది ఎవరో తెలుసా? అతడి ఐపీఎల్ ఎంట్రీ వెనక చాలా కథ దాగి ఉంది.థాంక్యూ సమర్..వైభవ్ సూర్యవంశీలోని టాలెంట్ను తొలుత గుర్తించింది బిహార్ మాజీ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ టాలెంట్ స్కౌటింగ్ టీమ్లో సభ్యుడైన సమర్ ఖాద్రీ. సమర్ ఖాద్రీ దేశవాళీ మ్యాచ్లలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ను మొదటిసారి చూశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లు, అతడిలోని టాలెంట్ చూసి ఖాద్రీ ఆశ్చర్యపరిచాడు.వెంటనే వైభవ్ గురుంచి రాజస్తాన్ హై పర్ఫార్మెన్స్ అండ్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచాకు సమాచారం అందించాడు. దీంతో జూబిన్.. వైభవ్ కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ ఏర్పాటు చేశారు. అయితే ట్రయల్స్లో వైభవ్ తను ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు. ఇది చూసిన జుబిన్ సైతం బిత్తరపోయాడు. ఎందుకంటే రాజస్తాన్ రాయల్స్ ట్రయల్స్లో అప్పటివరకు సంజూ శాంసన్, జైశ్వాల్ మాత్రమే తాము ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ బాదాడు. ఆ జాబితాలో వైభవ్ కూడా చేరాడు. ట్రయల్స్ ముగిసిన వెంటనే ఆర్ఆర్ మేనేజ్మెంట్కు జుబిన్ ఒక సందేశం పంపాడు. రాబోయే ఐపీఎల్ వేలంలో ఈ అబ్బాయి కోసం రూ.10 కోట్లు సిద్ధంగా ఉంచుకోండి.ఎందుకంటే మనం ఒక అరుదైన, అసాధారణమైన టాలెంట్ను చూశాను అంటూ రాజస్తాన్ యాజమాన్యానికి తెలియజేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లతో వైభవ్ను పట్టుబట్టి మరి రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అప్పటిలో ఒక యువ ఆటగాడిపై అంత మొత్తాన్ని వెచ్చించడాన్ని చాలా మంది తప్పుపట్టారు. కానీ ఇప్పుడు అతడి విలువ వందల కోట్లతో సమానం.చదవండి: ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్కు సచిన్ ఫిదా -
ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్కు సచిన్ ఫిదా
ఐపీఎల్-2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్ యంగ్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఎనిమిది ఓవర్ల పాటు తన మెరుపు బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు.15 ఏళ్ల వైభవ్.. పాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. తొలి ఓవర్ నుంచే సన్రైజర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 29 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు కోల్పోయాడు. ఇక వైభవ్ సంచలన ఇన్నింగ్స్కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయిపోయాడు. వైభవ్పై మాస్టర్ బ్లాస్టర్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంది. అతడి కాళ్ల వైపు వచ్చే బంతులను ఫ్రంట్ఫుట్ క్లియర్ చేసి పక్కకు జరుగుతూ ఆడే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ స్వేచ్ఛే అతన్ని తనదైన శైలిలో ఆడేలా చేస్తోంది. అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ నిజంగా అత్యుద్భుతం" అని సచిన్ ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా ఈ మ్యాచ్లో సన్రైజర్స్పై 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రాయల్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్ -
ఆ ఒక్క పొరపాటే కొంపముంచింది: వైభవ్ సూర్యవంశీ
మ్యాచ్ మారినా, వేదిక మారినా సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ జోరు మాత్రం తగ్గడం లేదు. మరోసారి అసాధారణ ఆట కనబర్చిన అతను ఈ క్రమంలో వరుసగా రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ విధ్వంసం సృష్టించాడు.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్లో సిక్స్తో దూకుడు మొదలు పెట్టిన అతను మలింగ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. ఆపై కమిన్స్ మరుసటి ఓవర్లో ఒక ఫోర్, ఆపై వరుసగా మూడు సిక్సర్లు బాది వైభవ్ తానేంటో చూపించాడు. సాకిబ్ వేసిన తర్వాత ఓవర్లో అతను కొత్త రికార్డు సృష్టించాడు. తొలి సిక్స్తో గేల్ను సమం చేసిన వైభవ్, తర్వాతి సిక్స్తో గేల్ను అధిగమించాడు. మూడో సిక్స్తో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయింది.ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లో అతను ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో సురేశ్ రైనా (2014) రికార్డు సమం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ పవర్ప్లేలో అత్యధిక సిక్స్లు (8) కొట్టిన ఘనత కూడా వైభవ్దే అయింది. ఆ తర్వాత కూడా అతను తగ్గలేదు. అర్ధ సెంచరీ తర్వాత ఆడిన 12 బంతుల్లో అతను 4 ఫోర్లు, 4 సిక్స్లతో మరో 43 పరుగులు రాబట్టాడు. సాకిబ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన తర్వాత హింగే ఓవర్లో మరింత చెలరేగిపోయాడు.వరుసగా 4, 4, 6, 6 బాది అతను 97కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి 3 పరుగులు రాబడితే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతుల్లో గేల్ పేరిట) రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నంచి క్యాచ్ ఇవ్వడంతో 29వ బంతికి అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యవంశీ ఔటయ్యాక మైదానాన్ని వీడడానికి ఇష్టపడలేదు. అనవసర షాట్ ఆడి ఔటైనన్న బాధతో అతడు కాసేపు మైదానంలోనే ఉండిపోయాడు. ఇక ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అవ్వడంపై వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు."నిజానికి ఆ షాట్ ఆడే సమయంలో నా సెంచరీ గురుంచి అసలు ఆలోచించలేదు. కానీ ఫీల్డర్ను చూసిన తర్వాత నా మైండ్ మార్చుకున్నాను. అందుకే నా టైమింగ్ తప్పింది. ఒకవేళ నేను ముందు అనుకున్నట్టుగా 'థర్డ్ మ్యాన్' దిశగా ఆ షాట్ ఆడి ఉంటే, బంతి ఈజీగా బౌండరీ లైన్ దాటిపోయేది. కానీ నేను బంతిని స్ట్రైయిట్గా కొట్టడానికి ప్రయత్నించాను. అదే నేను చేసిన తప్పు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో ఔట్ అవ్వాల్సి వచ్చింది" అని ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో వైభవ్ పేర్కొన్నాడు. అదేవిధంగా సన్రైజర్స్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్కు ముందు ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని రాజస్తాన్ కోచ్లు అందరూ తనకు చెప్పారని సూర్యవంశీ వెల్లడించాడు. కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ను గాను ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్ -
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. తొలుత బౌలింగ్లో విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక హైదరాబాద్ జట్టు చతికలపడింది.19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి(38), సైల్ ఆరోరా(35), ఇషాన్ కిషన్(33) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.పవర్ప్లేలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో రికార్డు సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడం వల్లే తమకు ఓటమి ఎదురైందని కమ్మిన్స్ తెలిపాడు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీపై కూడా ఈ ఆసీస్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.మా ఓటమికి కారణమదే..వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో మా బౌలర్లకు పెద్దగా ఆప్షన్స్ లేకుండా చేశాడు. అతడిని ఆపేందుకు ఏమి చేయాలో కూడా నాకు ఆర్ధం కాలేదు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. కానీ మ్యాచ్ ఫలితంలో వారికి మాకు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా వైభవ్ ఆటకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. యార్కర్ కొంచెం మిస్ అయినా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్లగా మలిచాడు. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే వికెట్ చివరి వరకు కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ఈ సీజన్ ద్వారా మేము యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీశాము.మేము టోర్నీని ఓటమితో ముగించినప్పటికి ఒక పరిపూర్ణమైన జట్టుగా మాత్రం నిలిచాం. ప్రఫుల్, సాకిబ్ ల రూపంలో ఇద్దరు నాణ్యమైన ఇండియన్ పేసర్లు వెలుగులోకి వచ్చారు. టోర్నీ అంతటా వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్కు చేరుకున్న యంగెస్ట్ టీమ్స్లో ఒకటిగా సన్రైజర్స్ నిలిచింది. మా జట్టులో చాలా వరకు యువ ఆటగాళ్లు ఉన్నారు. యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో మా కోచింగ్ స్టాప్ది కీలక పాత్ర. వారి వల్లే ఆరెంజ్ ఆర్మీ ఒక పటిష్టమైన టీమ్గా మారింది. కాబట్టి ఒక కెప్టెన్గా వారు అలా రాణించడం చాలా సంతోషంగా ఉంది. 240 పరుగుల పైగా లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. అయితే ఈ లక్ష్యాన్ని చేధించేందుకు అనువైన పిచ్ ఏదైనా ఉందంటే? అది ముల్లాన్ పూర్ మాత్రమే అని కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్కు అద్భుతంగా ఉంటుంది. ఛేజింగ్ చాలా వరకు మేము గట్టి పోటీ ఇచ్చాము. సరైన రన్రేట్ మెయింటేన్ చేస్తూ ముందుకు వెళ్లాము. కానీ దురదృష్టవశాత్తూ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం మా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. గత మూడు సీజన్లలో మేము రెండు సార్లు ప్లే ఆఫ్స్కు చేరాం. ఈసారి టాప్-2లో నిలిచేందుకు చాలా దగ్గరగా వచ్చాం. ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఈ సీజన్ అంతటా మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను కమిన్స్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.చదవండి: వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు -
వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)
-
ఎస్ఆర్హెచ్కు హార్ట్ బ్రేక్.. ఐపీఎల్ నుంచి నిష్క్రమణ
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ (మే 27) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్దికి భారీ స్కోర్ సమర్పించుకుంది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు) ఊచకోత కోయడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.వైభవ్తో పాటు ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్ స్కోర్.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది.12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో ఎస్ఆర్హెచ్ పేసర్లు సాకిబ్ హుసేన్, నితీశ్కుమార్ రెడ్డి, ఎషాన్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రఫుల్ హింగే (4-0-54-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓ పక్క సహచరులంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా శివాంగ్ కుమార్ (2-0-19-1), నితీశ్ కుమార్ (2-0-12-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. కమిన్స్ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎషాన్ మలింగ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి వికెట్ తీయగా.. సాకిబ్ హుసేన్ 4 ఓవర్లలో వికెట్ లేకుండా 52 పరుగులు సమర్పించుకున్నాడు.రాజస్థాన్ ఇన్నింగ్స్లో వైభవ్, జురెల్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జైస్వాల్ 29, కెప్టెన్ రియాన్ పరాగ్ 26, ఫెరియెరా 12, షనక 5, రవీంద్ర జడేజా 12 (నాటౌట్), ఆర్చర్ 4, బర్గర్ 1, సుషాంత్ మిశ్రా 1 (నాటౌట్) పరుగు చేశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎస్ఆర్హెచ్ ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఒత్తిడికి లోనైన ఆ జట్టు వేగంగా పరుగులు సాధించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ (4-0-58-3), బర్గర్ (3-0-26-2), జడేజా (3-0-21-2), యశ్ రాజ్ పూనియా (4-0-39-1), సుషాంత్ మిశ్రా (2.2-0-21-2) ధాటికి 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై, 47 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.ఈ గెలుపుతో రాజస్థాన్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించగా.. ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ గుజరాత్తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్లో గుజరాత్పై గెలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరింది. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఎస్ఆర్హెచ్తో ఇవాళ (మే 27) జరుగుతున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సెంచరీ మిస్ అయినా ఈ ఇన్నింగ్స్తో వైభవ్ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు.16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (నాకౌట్స్)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సురేశ్ రైనాతో కలిసి షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (నాకౌట్స్)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీస్16 - సురేశ్ రైనా vs PBKS, వాంఖడే, 201416 - వైభవ్ సూర్యవంశీ vs SRH, ముల్లాన్పూర్, 2026*17 - ఆడం గిల్ క్రిస్ట్ vs DC, సెంచూరియన్, 200920 - ఎంఎస్ ధోని vs MI, బెంగళూరు, 201221 - డ్వేన్ స్మిత్ vs CSK, ఢిల్లీ, 201321 - వీరేంద్ర సెహ్వాగ్ vs CSK, వాంఖడే, 201421 - రజత్ పాటిదార్ vs GT, ధర్మశాల, 2026ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు61* - వైభవ్ సూర్యవంశీ (2026)59 - క్రిస్ గేల్ (2012)52 - ఆండ్రీ రస్సెల్ (2019)51 - క్రిస్ గేల్ (2013)45 - జోస్ బట్లర్ (2022)ఐపీఎల్ సీజన్లో ఒక అన్క్యాప్డ్ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు680 - వైభవ్ సూర్యవంశీ (RR, 2026)*625 - యశస్వి జైస్వాల్ (RR, 2023)616 - షాన్ మార్ష్ (PBKS, 2008)573 - రియాన్ పరాగ్ (RR, 2024)549 - ప్రభ్సిమ్రాన్ సింగ్ (PBKS, 2025)ఐపీఎల్లో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక 50లు6 - అభిషేక్ శర్మ5 - నికోలస్ పూరన్5 - వైభవ్ సూర్యవంశీ*ఐపీఎల్ పవర్ ప్లే (1-6 ఓవర్లు)లో అత్యధిక 50+ స్కోర్లు6 - డేవిడ్ వార్నర్5 - వైభవ్ సూర్యవంశీ4 - ట్రావిస్ హెడ్ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో (1-6) మధ్య ఓవర్లలో 50+ స్కోర్లు87 - సురేష్ రైనా vs PBKS, 201474 - ఆడమ్ గిల్ క్రిస్ట్ vs DD, 200960 - వైభవ్ సూర్యవంశీ vs SRH, 2026*ఐపీఎల్లో 1-6 ఓవర్లలో అత్యధిక సిక్సర్లు8 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026 ELM*7 - సనత్ జయసూర్య (MI) vs CSK, ముంబై WS, 20087 - జోస్ బట్లర్ (RR) vs DC, ఢిల్లీ, 2018 (వర్షం కుదించిన గేమ్)7 - జానీ బెయిర్స్టో (PBKS) vs RCB, బ్రబౌర్న్, 20227 - అభిషేక్ శర్మ (SRH) vs PBKS, ముల్లన్పూర్, 20267 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026ఐపీఎల్ సీజన్లో అత్యధిక పవర్ప్లే (1-6 ఓవర్లు) పరుగులు490 - వైభవ్ సూర్యవంశీ (2026)*467 - డేవిడ్ వార్నర్ (2016)402 - ట్రావిస్ హెడ్ (2024)402 - సాయి సుదర్శన్ (2025)382 - ఆడమ్ గిల్క్రిస్ట్ (2009)ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సార్లు 10+ సిక్సర్లు4 - క్రిస్ గేల్4 - వైభవ్ సూర్యవంశీ*2 - అభిషేక్ శర్మ2 - ఫిన్ అలెన్ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు11* - V సూర్యవంశీ vs SRH, జైపూర్, 2026*10 - S గిల్ vs MI, అహ్మదాబాద్, 20239 - R పాటిదార్ vs GT, ధర్మశాల, 2026ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (భారతీయుడు)12 - వి సూర్యవంశీ (RR) vs SRH, 202612 - V సూర్యవంశీ (RR) vs SRH, 2026 ELM11 - మురళీ విజయ్ (CSK) vs RR, 201011 - వి సూర్యవంశీ (RR) vs GT, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ 13.5 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్తో పాటు ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (12), ఫెరియెరా క్రీజ్లో ఉన్నారు. -
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన తర్వాత ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ అభిమానుల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను (@hardikpandya93) డీయాక్టివేట్ చేసుకున్నాడు.ఈ చర్యతో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల అతడు తన ఇన్స్టా స్టోరీలో "07:07" అని పోస్ట్ చేశాడు. ఇది అతని ఫోన్ లాక్స్క్రీన్లో కనిపించిన టైమ్. దీన్ని చూసి అభిమానులు ఎంఎస్ ధోనితో లింక్ చేస్తూ.. హార్దిక్ సీఎస్కేకు మారనున్నాడన్న అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఇన్స్టా ఖాతా డీయాక్టివేట్ కావడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.ధోని జెర్సీ నంబర్ 7, జన్మదినం జూలై 7 (7/7) కావడంతో.. హార్దిక్ వచ్చే సీజన్లో సీఎస్కేలో చేరబోతున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై హార్దిక్, ముంబై ఇండియన్స్ లేదా సీఎస్కే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.హార్దిక్ విషయంలో ఇలా జరగడం ఈ సీజన్లో ఇది మొదటిసారి కాదు. మే 11న కూడా అతడి సోషల్మీడియా యాక్టివిటీ పెద్ద వివాదానికే దారి తీసింది. అప్పట్లో అతడు ముంబై ఇండియన్స్కు సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించాడని, జట్టును అన్ఫాలో చేశాడని వార్తలు వచ్చాయి. కొందరు అభిమానులు అయితే హార్దిక్ తన సహచర ఆటగాళ్లను కూడా అన్ఫాలో చేశాడని పేర్కొన్నారు. దీంతో హార్దిక్ అప్పుడే ముంబై ఇండియన్స్ నుంచి తప్పుకుంటున్నాడన్న ప్రచారం జరిగింది.అయితే కొద్ది సేపటికే పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో అది సోషల్మీడియా గ్లిచ్ అని అందరూ సర్దుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే రావడంతో ఏదో జరుగుతుందన్న అనుమానాలు ఊపందుకున్నాయి.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనలు చేసి, ప్లే ఆఫ్స్కు చేరకుండానే (9వ స్థానం) నిష్క్రమించింది. హార్దిక్ కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై సొంత ఫ్రాంచైజీ అభిమానులే భారీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. జట్టు నుంచి, కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. -
ఎస్ఆర్హెచ్పై రాజస్థాన్ గెలుపు
ఎస్ఆర్హెచ్పై రాజస్థాన్ గెలుపుఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ (మే 27) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు), ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎస్ఆర్హెచ్.. ఆర్చర్ (4-0-58-3), బర్గర్ (3-0-26-2), జడేజా (3-0-21-2), యశ్ రాజ్ పూనియా (4-0-39-1), సుషాంత్ మిశ్రా (2.2-0-21-2) ధాటికి 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది.ఈ గెలుపుతో రాజస్థాన్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించగా.. ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ గుజరాత్తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్లో గుజరాత్పై గెలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరింది. ఓటమి దిశగా సాగుతున్న ఎస్ఆర్హెచ్6.5వ ఓవర్- 81 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ ఓటమి దిశగా సాగుతోంది. యశ్రాజ్ పూనియా బౌలింగ్లో హెన్రిచ్ క్లాసెన్ (18) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. నిప్పులు చెరుగుతున్న ఆర్చర్4.4వ ఓవర్- 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ పోరాడకుండానే చేతులెత్తేశేలా ఉంది. 57 పరుగుల వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ట్రవిస్ హెడ్ (17) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్ ఈ మ్యాచ్లో ఆర్చర్కు మూడవది.పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్3.3వ ఓవర్- భారీ లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి స్మరణ్ రవిచంద్రన్ (1) ఔటయ్యాడు. హెడ్, క్లాసెన్ క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్2.5వ ఓవర్- 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఫెరియెరాకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్కు భారీ షాక్244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్కు రెండో బంతికే భారీ షాక్ తగిలింది. ఆర్చర్ బౌలింగ్లో వికెట్కీపర్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ డకౌటయ్యాడు.రాజస్థాన్ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97), ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్ స్కోర్.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది. 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో సాకిబ్ హుసేన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఎషాన్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్15.2వ ఓవర్- 207 పరుగుల వద్ద రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రఫుల్ హింగే బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (26) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్13.5వ ఓవర్- 192 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అనంతరం ధృవ్ జురెల్ ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్10.2వ ఓవర్- 137 పరుగుల వద్ద రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (29) ఔటయ్యాడు. వైభవ్ సెంచరీ మిస్7.6వ ఓవర్- 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రఫుల్ హింగే బౌలింగ్లో స్మరణ్ రవిచంద్రన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 125-1గా ఉంది. 6 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 80-0వైభవ్ సూర్యవంశీ 60 (20 బంతుల్లో, 2 ఫోర్లు, 8 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ 19 (16 బంతుల్లో 3 ఫోర్లు)దూకుడుగా ఆడుతున్న వైభవ్ 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(36), యశస్వి జైస్వాల్(8) పరుగులు చేశారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ఐపీఎల్ 2026లో ఇవాళ జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఎలిమినేటర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజాసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే -
WWEని తాకిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ క్రేజ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) లాంటి అంతర్జాతీయ ఈవెంట్ను తాకింది. ఆ ఈవెంట్ సూపర్ స్టార్ డ్రూ మెక్ఇన్టైన్ (Drew McIntyre) వైభవ్పై అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నాడు. వైభవ్ ఐపీఎల్ జెర్సీతో జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. Chosen One అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్ కొద్ది నిమిషాల్లోనే వైరలైంది. వైభవ్కు వచ్చిన క్రేజ్ చూసి భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Drew McIntyre (@dmcintyrewwe)బుడ్డోడు అతి స్వల్పకాలంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. సచిన్, ధోని, విరాట్ లాంటి దిగ్గజాలను ఇప్పటికీ చాలామంది అంతర్జాతీయ అథ్లెట్లు గుర్తు పట్టలేరని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా వైభవ్ క్రేజ్ చూసి ఔరా అంటున్నారు.డ్రూ మెక్ఇన్టైన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించడం మరింత వైరల్గా మారింది. "2K గేమ్లో నేను ఎన్ని Future Shock DDTలు వేసానో గుర్తులేదు" అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ అధికారిక సోషల్మీడియా ఖాతా కూడా "Certainly" అంటూ స్పందిస్తూ.. వైభవ్ నిజంగానే "Chosen One" అన్నట్లుగా వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి చివరి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ (మే 27) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు ఎస్ఆర్హెచ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో వైభవ్పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్లో ఇప్పటివరకు అతనాడిన 14 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇదే విధ్వంసం కొనసాగుతుందని రాయల్స్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.పైగా వైభవ్కు ప్లే ఆఫ్స్లో (నాకౌట్స్) మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటం వారి ఆనందానికి అవథుల్లేకుండా చేస్తుంది. ఇప్పటివరకు వైభవ్ ఆడిన 8 నాకౌట్స్లో 209.62 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. రాయల్స్ ఫ్యాన్స్ ధీమాకు మరో కారణం కూడా ఉంది. ఇదే సీజన్ లీగ్ మ్యాచ్లో వైభవ్ ఆ జట్టుపై కేవలం 37 బంతుల్లో శతక్కొట్టాడు.ఇన్ని సానుకూల అంశాల నడుమ నేటి మ్యాచ్లో వైభవ్ విధ్వంసం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి వైభవ్ ఏం చేస్తాడో చూడాలి. -
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే ఈ యువ సంచలనం అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధమయ్యాడని అభిమానులు,మాజీలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు వైభవ్ను ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు. అయితే అంతకంటే ముందు వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్లో భారత్-ఎ జట్టు తరపున వైభవ్ బరిలోకి దిగనున్నాడు. తిలక్ వర్మ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ సిరీస్లో కూడా అతడు మెరుగ్గా రాణిస్తే భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతోంది.ఈ నేపథ్యంలో వైభవ్ భవిష్యత్తుపై ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని.. అతడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజస్తాన్ రాయల్స్, బీసీసీఐపై ఉందని ధుమాల్ అన్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 583 పరుగులు సాధించి ఆరెంజ్క్యాప్ రేసులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి."వైభవ్ సూర్యవంశీ టెంపరామెంట్ దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ, రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం అతడికి అండగా నిలబడాలి. అతడికి సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత బోర్డుతో పాటు రాయల్స్పై కూడా ఉంది. క్రీడలు అంటే కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా ముఖ్యమే.అతడు భవిష్యత్తులో సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించేలా మా వందు మద్దతు అందిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ పేర్కొన్నాడు. కాగా చిన్నవయస్సులోనే స్టార్డమ్ రావడం వల్ల ఆటగాళ్లు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వైభవ్కు సరైన గైడెన్స్ ఇవ్వాలని ధుమాల్ సూచించారు.చదవండి: IPL 2026: రాజస్తాన్తో ఎలిమినేటర్.. సన్రైజర్స్ తుది జట్టు ఇదే! -
సత్తా చాటిన స్టబ్స్
ఐపీఎల్ 2026లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన సౌతాఫ్రికా ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్).. ఇంగ్లండ్లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్లో చెలరేగాడు. హ్యాంప్షైర్ తరఫున అరంగేట్రంలోనే ఇరగదీశాడు. ఫలితంగా ఆ జట్టు ఎసెక్స్పై 30 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్షైర్.. ట్రిస్టన్ స్టబ్స్ (42 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హిల్టన్ కార్ట్రైట్ (21 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జో వెథర్లీ (34 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.హ్యాంప్షైర్ ఇన్నింగ్స్లో టాబీ అల్బర్ట్ (13), కెప్టెన్ జేమ్స్ విన్స్ (8), టామ్ ప్రెస్ట్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎసెక్స్ బౌలర్లలో ఛార్లీ బెన్నెట్ 2, మాథ్యూ క్రిచ్లీ, కెప్టెన్ సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.అనంతరం 201 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఎసెక్స్.. స్కాట్ కర్రీ (4-0-18-4) ధాటికి 170 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితమై, ఓటమిపాలైంది. కర్రీతో పాటు క్రిస్ వుడ్ (4-0-33-2), ఆండ్రూ జాన్ నీల్ (4-0-36-1) కూడా వికెట్లు తీశారు. ఎసెక్స్ ఇన్నింగ్స్లో లూక్ బెన్కెన్స్టైన్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో హార్మర్ (36 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మిగతా ప్లేయర్లలో మైఖేల్ పెప్పర్ (25), వియాన్ ముల్దర్ (14), నోవా థైన్ (18) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో ట్రిస్టన్ స్టబ్స్ 14 మ్యాచ్ల్లో రెండు అర్ద సెంచరీలు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ సీజన్లో ఢిల్లీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గుజరాత్ను ఓడించి నేరుగా ఫైనల్కు చేరింది. ఇవాళ ఎస్ఆర్హెచ్-రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. -
SRH vs RR: వర్షం పడితే ఇంటికే!.. ఆ ఛాన్సే లేదు!
ఐపీఎల్-2026 తొలి ఫైనలిస్టు ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను 92 పరుగుల తేడాతో మట్టికరిపించి.. ఫైనల్లో అడుగుపెట్టింది.అయితే, ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ గుజరాత్కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం మిగిలే ఉంది. ఇక బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్తో గుజరాత్తో తలపడేది ఎవరన్న అంశం తేలిపోనుంది.రిజర్వ్ డేలు ఉండవుఇక ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది. మరి ఈ నాకౌట్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించినా.. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏమిటి?.. కాగా ఐపీఎల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్లకు రిజర్వ్ డేలు ఉండవు. కాబట్టి వాన వల్ల ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దైతే.. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న సన్రైజర్స్ నేరుగా క్వాలిఫయర్-2లో అడుగుపెడుతుంది. కాగా సన్రైజర్స్ లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది గెలిచి మూడో స్థానంలో ఉండగా.. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిది విజయాలు సాధించి నాలుగో స్థానంతో ముగించింది.వాతావరణం ఎలా ఉందంటే?అయితే, చండీగఢ్లో మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. సగటుల 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదువుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇక సాయంత్రం వేళ కూడా దాదాపు 32 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్కు వేదికైన ముల్లన్పూర్లో వర్షం పడే సూచనలైతే దాదాపుగా లేవు.చదవండి: వైభవ్ మాపై శతక్కొట్టవచ్చు.. కానీ: కమిన్స్ -
వైభవ్ ఊచకోత ఖాయం..!
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 27) జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదారాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్కు ముందు అందరి చూపు రాజస్థాన్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఎందుకంటే ఈ బుడ్డోడు ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు.ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. వైభవ్ ఇవాళ ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్లోనూ తప్పక చెలరేగుతాడని భారీ అంచనాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం. ఈ బిహారి చిన్నోడు అన్ని విభాగాల్లో ఇప్పటివరకు 8 నాకౌట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 209.62 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ దూకుడు ఏమాత్రం తగ్గదని స్పష్టమవుతుంది.కాబట్టి నేటి మ్యాచ్లో అతడు చెలరేగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. పవర్ ప్లేలోనే అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అంచనా వేయడానికి బలమైన కారణాలు లేకపోలేదు. ఈ సీజన్ పవర్ ప్లేలో వైభవ్ 231కు పైగా స్ట్రయిక్ రేట్తో ఏకంగా 430 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభం కాగానే వైభవ్ పని పట్టకపోతే పెను ముప్పు తప్పదని వారు ఓ అంచనాకు వచ్చేశారు.ఈ నేపథ్యంలో వారు వైభవ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ సీజన్లోనే జరిగిన లీగ్ మ్యాచ్లో వైభవ్ ఎస్ఆర్హెచ్పై 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో వైభవ్ ఇబ్బందిపడిన అంశాలను ఎస్ఆర్హెచ్ బౌలర్లు టార్గెట్ చేసే అవకాశం ఉంది.గత మ్యాచ్లో అతడు ఎడమ భుజం వైపు గుడ్ లెంగ్త్ బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడు. కమిన్స్, సాకిబ్ హుసేన్ ఈ ఏరియాలోనే వైభవ్ను టార్గెట్ చేసేందుకు వ్యూహరచన చేసుకొని ఉంటాయి.నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్లు..2024 అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్లో శ్రీలంకపై 36 బంతుల్లో 67 పరుగులు 2026 అండర్-19 వరల్డ్కప్ సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్పై 33 బంతుల్లో 68 పరుగులు2026 అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు -
శ్రేయస్ కాదు.. టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని ప్లేయర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్-2026లో ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్పై 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి తమ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. బెంగళూరు ఫైనల్కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ది కీలక పాత్ర.గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-1లో పాటిదార్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్ కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ ఒక్క మ్యాచ్లోనూ సీజన్ మొత్తం పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ పరంగా కూడా అతడు వందకు వంద మార్క్లు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో పాటిదార్ బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 17 ఓవర్లో ఓవర్లో కగిసో రబాడా బౌలింగ్లో పాటిదార్ ఆడిన షాట్ను అశ్విన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ మ్యాచ్లో పాటిదార్ 281.82 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు."కగిసో రబాడ వేసిన ఓ ఫాస్ట్ డెలివరీని రజత్ బ్యాక్ఫుట్పై వెళ్లి కొట్టిన సిక్స్.. “షాట్ ఆఫ్ ది డే” అని చెప్పవచ్చు. బహుశా టోర్నమెంట్లోనే అత్యుత్తమ షాట్గా ఇది నిలుస్తుంది. ఆ పొజిషన్ నుండి అతను అంత పవర్ను ఎలా జనరేట్ చేయగలిగాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.ఈ ఇన్నింగ్స్కు ముందు వరకు కెప్టెన్సీ, బ్యాటింగ్ పరంగా పాటిదార్ కంటే శ్రేయస్ అయ్యర్ కాస్త బెటర్గా కన్పించాడు. కానీ ఈ మ్యాచ్తో పాటిదార్ శ్రేయస్ను వెనక్కి నెట్టి ఆ స్ధానానికి చేరుకున్నాడు. పాటిదార్ స్పిన్కు బాగా ఆడుతాడని మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు అతడు ఫాస్ట్ బౌలర్లను ఆడిన తీరు అద్భుతం.రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ను అతడు ఎదుర్కొన్న తీరు కూడా నన్ను ఆకట్టుకుంది. ఫ్రంట్ఫుట్పైకి వచ్చి, బంతి పిచ్ను అంచనా వేసి రషీద్ను ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్స్ కొట్టే బ్యాటర్లు చాలా అరుదుగా ఉంటారు" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్ పర్యటన తర్వాత ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ను టీమిండియా కెప్టెన్ చేయాలని పలువురు సూచించారు. ఇప్పుడు అనుహ్యంగా పాటిదార్ పేరు కూడా తెరపైకి వచ్చింది.చదవండి: '100 వికెట్లు తీసినా నో ఛాన్స్.. ఇక రంజీ ట్రోఫీని మూసేయండి' -
రాజస్తాన్తో ఎలిమినేటర్.. సన్రైజర్స్ తుది జట్టు ఇదే!
ఐపీఎల్-2026 ఎలిమినేటర్లో భాగంగా చండీగఢ్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో అమీతుమీ తెల్చుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించాలని ఎస్ఆర్హెచ్ పట్టుదలతో ఉంది. ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ రెండు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.మిడిలార్డర్ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ను పక్కన పెట్టాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్మరణ్కు గత కొన్ని మ్యాచ్లలో అవకాశం లభించినప్పటికి సద్వినియోగపరుచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని పక్కన పెట్టి ఫినిషర్ అనికేత్ వర్మను తుది జట్టులోకి తీసుకోవాలని సన్రైజర్స్ భావిస్తుందంట. అనికేత్ కూడా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. 2025 సీజన్లో దుమ్ములేపిన అనికేత్.. ప్రస్తుత సీజన్లో మాత్రం విఫలమయ్యాడు. 8 ఇన్నింగ్స్లలో కేవలం 79 పరుగులు చేశాడు. కానీ అతడిపై నమ్మకం ఉంచిన ఎస్ఆర్హెచ్ మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఎస్ఆర్హెచ్ చివరి లీగ్ మ్యాచ్లో ఆడిన హర్షల్ పటేల్ను కూడా తిరిగి బెంచ్కే పరిమితం చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అతడి స్ధానంలో యువ పేసర్ ప్రపుల్ హింగేకు అవకాశమివ్వన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎస్ఆర్హెచ్దే పై చేయిఈ సీజన్ లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించింది. హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో 57 పరుగులు, జైపూర్లో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆర్ఆర్ను మట్టికరిపించింది. ఇప్పుడు అదే జోరును ఎలిమినేటర్లో కొనసాగించాలని కమ్మిన్స్ సేన ఉవ్విళ్లూరుతోంది. రాజస్తాన్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే.చదవండి: IPL 2026: గుజరాత్ కొంపముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్కే? -
అతడు మాపై శతక్కొట్టొచ్చు.. కానీ..: కమిన్స్
ఐపీఎల్-2026లో ‘ఎలిమినేటర్’ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ ఇందుకు వేదిక.లీగ్ దశలో హైదరాబాద్ తొమ్మిది విజయాలు.. సాధించగా రాజస్తాన్ ఎనిమిది మ్యాచ్లు గెలిచింది. అయితే, ముఖాముఖి పోరులో ఈ సీజన్లో రెండుసార్లూ హైదరాబాద్ జట్టే రాజస్తాన్పై పైచేయి సాధించింది.తొలుత సొంతమైదానం ఉప్పల్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో ఓడించిన సన్రైజర్స్.. జైపూర్లో ఆతిథ్య జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్ పోరులో రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కీలకం కానున్నాడు.36 బంతుల్లోనే శతక్కొట్టి..ఉప్పల్ మ్యాచ్లో ప్రఫుల్ హింగే వైభవ్ను గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపగా.. జైపూర్లో వైభవ్ అతడి బౌలింగ్లో చితక్కొట్టాడు. అంతేకాదు.. 36 బంతుల్లోనే శతక్కొట్టి.. లీగ్లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.ఈ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు తాము పక్కాగా వ్యూహాలు రచించామని సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పడం విశేషం. జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఒక బౌలర్గా మన బలాలు, బలహీనతలు ఏమిటో అర్థం చేసుకోగలను.వైభవ్ కోసం ప్లాన్ బి, సి కూడాఓ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగలడని భావిస్తే.. అతడి కోసం ప్లాన్ బి, సి కూడా సిద్ధం చేసుకోవాలి. వైభవ్ కోసం కచ్చితంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. గత మ్యాచ్లో అతడు మా జట్టుపై సెంచరీ చేయొచ్చు.అయితే, అంతకంటే ముందు మ్యాచ్లో మేము అతడిని నిలువరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్నిసార్లు బౌలర్.. మరికొన్నిసార్లు బ్యాటర్ పైచేయి సాధిస్తారు. గత అనుభవం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదు’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.ఇక గ్రూప్ దశలో రాయల్స్ను రెండుసార్లు ఓడించడం తమలో ఆత్మవిశ్వాసం పెంచిందని.. అయినా సరే ఈసారి మరింత జాగ్రత్తగా ఆడతామని కమిన్స్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఫైనల్ చేరింది. ఇక ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో గుజరాత్ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఆర్సీబీతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: మూడు కీలక యుద్ధాలు గెలిచిన ఆర్సీబీ! -
గుజరాత్ కొంపముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్కే?
ఐపీఎల్-2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్-1లో 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ కీలక మ్యాచ్లో గుజరాత్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ విఫలమైంది. ముఖ్యంగా గుజరాత్ ఓటమికి ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ పరోక్షంగా కారణమయ్యాడు.రబాడ బౌలింగ్, ఫీల్డింగ్లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టినప్పటికి తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఫీల్డింగ్లో అయితే రబాడ వదిలిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. గుజరాత్ ఓటమిని శాసించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను రబాడ జారవిడిచాడు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభం లభించింది. విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ స్కోర్ పవర్ప్లేలోనే 76/1కు చేరింది. పవర్ప్లే తర్వాత గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా 9 ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ కేవలం మూడు బంతుల వ్యవధిలో కోహ్లీ (43), పడిక్కల్ (30) ఇద్దరినీ అవుట్ చేసి ఆర్సీబీకి గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కుల్వంత్ ఖేజ్రోలియా, రషీద్ ఖాన్ చక్కగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు వేగం నెమ్మదించింది.దీంతో 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 128/3గా ఉండేది. అయితే సరిగ్గా ఇదే సమయంలో రబాడ చేసిన తప్పిదం గుజరాత్ టైటాన్స్ కొంపముంచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో మూడో బంతిని పాటిదార్ ఫుల్షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. అయితే డీప్ స్క్వేర్ లెగ్లో ఉన్న రబాడ సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. ఇందుకు గుజరాత్ టైటాన్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. 20 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాటిదార్ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడి సునామీ ఇన్నింగ్స్ ధాటికి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. మే 29న ఛండీఘర్ వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ లేదా రాజస్తాన్ రాయల్స్తో గుజరాత్ తలపడనుంది.చదవండి: ఇప్పట్లో అతడిని టెస్టులకు ఎంపిక చేయొద్దు: గంగూలీ -
తాడోపేడో SRH Vs RR
-
'పనికొచ్చే ప్రశ్నలు వేయండి'.. గుజరాత్ బ్యాటర్ ఆగ్రహం!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విధించిన 255 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో గుజరాత్ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఓటమి అనంతరం గుజరాత్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ మీడియా సమావేశానికి వచ్చాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న రిపోర్టర్లలో ఒక వ్యక్తి తన ప్రశ్నలతో గ్లెన్ ఫిలిప్స్కు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు. 'ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసినప్పుడే మీ మైండ్లో ఓటమి భయం మొదలైందనుకుంటా' అని ప్రశ్నించాడు. రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఫిలిప్స్ ఆ తర్వాత సదరు రిపోర్టర్కు ధీటుగా బదులిచ్చాడు. 'ఇదొక దిక్కుమాలిన ప్రశ్న. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడు లక్ష్యం గురించి ఆలోచించరు. మ్యాచ్లో టార్గెట్ ఎంత ఉన్నప్పటికీ పరుగులు చేయడానికే ప్రయత్నిస్తారు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలను మదిలోకి రానివ్వరు. మీరు వేసిన ప్రశ్న చాలా ఘోరంగా ఉంది. ఐపీఎల్ ఇంతకుమించి టార్గెట్లు ఛేదించిన సందర్భాలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారా?అయితే భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు ఒత్తిడి ఉండడం సహజం. ఆ ఒత్తిడిలో ఒక్కోసారి విజయం సాధించలేకపోవచ్చు. అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. చదవండి: ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ! -
మూడు ‘కీలక యుద్ధాలు’ గెలిచిన ఆర్సీబీ.. పదునైన వ్యూహాలు!
ఐపీఎల్-2026లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్థాయికి తగ్గట్లు రాణించింది. తొలి టైటిల్ కోసం కళ్లు కాయలు కాచేలా 18 ఏళ్లు వేచి చూసిన బెంగళూరూ జట్టు.. వరుసగా రెండో ట్రోఫీ వేటలో ఒక్క అడుగు దూరంలో నిలిచింది. లీగ్ దశలో అద్భుత ఆటతో టేబుల్ టాపర్గా నిలిచిన ఆర్సీబీ.. మంగళవారం నాటి తొలి క్వాలిఫయర్లోనూ అసాధారణ ప్రదర్శన కనబరిచింది.ధర్మశాల వేదికగా అద్వితీయ ఆట తీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆర్సీబీ తొలి టైటిల్ అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ కీలక మ్యాచ్లో మెరుపు బ్యాటింగ్తో చెలరేగాడు. తద్వారా ‘ప్లే ఆఫ్స్’లో అత్యధిక స్కోరు (254) నమోదు చేసిన ఆర్సీబీ విజయం లాంఛనంగా మారిపోయింది. ఆపై 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 6 ఓవర్లు ముగిసేసరికే 51/5తో నిలిచిన గుజరాత్ టైటాన్స్ పూర్తిగా చేతులెత్తేసింది. ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.మూడు కీలక ‘యుద్ధాలు’ గెలిచిన ఆర్సీబీఈ మ్యాచ్లో ఆర్సీబీ మూడు కీలక ‘యుద్ధాలు’ గెలిచింది. గుజరాత్ నమ్ముకున్న బౌలింగ్ ‘ఆయుధాన్ని’ ధ్వంసం చేసి.. మెరుపులు మెరిపించడంలో సఫలమైంది. ప్రత్యర్థి ఫీల్డింగ్ తప్పిదాలను క్యాష్ చేసుకుంది. ఇక తమ బౌలింగ్ అస్త్రాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో పాటీదార్ పూర్తిగా సఫలమయ్యాడు.అంచనాలు తలకిందులుక్వాలిఫయర్-1కు ముందు భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆర్సీబీకి కీలక సూచన చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళం ఆర్సీబీ కంటే బలంగా ఉంది కాబట్టి.. జాగ్రత్త వహించాలన్నాడు.సెహ్వాగ్ మాటలు అక్షరాలా నిజం. ఐపీఎల్-2026లో క్వాలిఫయర్ ముందు వరకు గుజరాత్ బౌలింగ్ దళం అద్భుతంగా రాణించింది. ప్లే ఆఫ్స్నకు ముందు పవర్ ప్లేలో అంటే.. తొలి ఆరు ఓవర్లలో కలిపి గుజరాత్ 30 వికెట్లు కూల్చింది. కగిసో రబాడ సారథ్యంలో సీజన్లోనే అత్యంత ప్రతిభావంతమైన బౌలింగ్ దళంగా నిలిచింది.రబాడ ఒక్కడే పవర్ ప్లేలో 17 వికెట్లు తీయడం విశేషం. అతడికి తోడుగా సిరాజ్ 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. కానీ కీలక మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. కొత్త బంతితో మ్యాజిక్ చేయగలమన్న వారి నమ్మకంపై నీళ్లు చల్లింది.మెరుపు బ్యాటింగ్... బౌలింగ్ ‘వెపన్’ ధ్వంసంటాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటీదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్లు) విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన చేయగా... విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ పేసర్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 3 ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించిన వెంకటేశ్ అయ్యర్ (7 బంతుల్లో 19; 3 ఫోర్లు,1 సిక్స్)... రబాడ వేసిన మరుసటి ఓవర్లో ఒక సిక్స్ బాది మరుసటి బంతికే వెనుదిరిగాడు. కోహ్లి తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడగా... రబాడ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో పడిక్కల్ ధాటిని చూపించాడు. రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో పవర్ప్లే ముగిసేసరికి జట్టు 76 పరుగులు సాధించింది.ఆ తర్వాత హోల్డర్ ఒకే ఓవర్లో కోహ్లి, పడిక్కల్లను వెనక్కి పంపించాడు. ఈ దశలో బెంగళూరుపై టైటాన్స్ బౌలర్లు ఒత్తిడి పెంచారు. అయితే కుల్వంత్ వేసిన 15వ ఓవర్తో ఆట మారిపోయింది. పాటీదార్ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగిపోగా, చివరి 6 ఓవర్లలో జట్టు ఏకంగా 114 పరుగులు సాధించడం విశేషం.ప్రయోగం వికటించిందిఇక గత సీజన్లో ఒకే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడిన తర్వాత ఈ ఏడాది నేరుగా కుల్వంత్ను ప్లే ఆఫ్స్లో దించి గుజరాత్ సాహసం చేసింది. తన తొలి ఓవర్లో అతడు 3 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే అతని రెండో ఓవర్ మ్యాచ్ గతిని మార్చింది. ఈ ఓవర్లో కృనాల్ 2 ఫోర్లు కొట్టగా, పాటీదార్ వరుసగా 4, 6, 4 బాదాడు. దీనికి తోడు అతను 2 నోబాల్, 1 వైడ్ కూడా వేశాడు. చివరకు 9 బంతుల ఈ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. ఆ క్యాచ్ పట్టి ఉంటే... పాటీదార్కు 2 లైఫ్లు రాగా అతడు వాటిని అద్భుతంగా వాడుకున్నాడు. పాటీదార్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రసిధ్ ఓవర్లో కొట్టిన షాట్కు బంతి గాల్లోకి లేచింది. బట్లర్ ఒక వైపునుంచి పరుగెత్తుకు రాగా, మరో వైపు నుంచి కుల్వంత్ వచ్చాడు.చివరకు ఇద్దరూ దానిని అందుకోలేకపోగా బంతి వారి మధ్యలో పడింది. అదే ఓవర్లో స్కోరు 18 పరుగుల వద్ద పాటీదార్ కొట్టిన పుల్ షాట్కు నేరుగా చేతుల్లోకి వచ్చిన క్యాచ్ను రబాడ వదిలేశాడు. గుజరాత్ టాపార్డర్, మిడిలార్డర్ కుదేలుఆర్సీబీ విధించిన భారీ లక్ష్య ఛేదనలో టైటాన్స్ పూర్తిగా కుప్పకూలింది. ఓపెనర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (2)ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్కు పంపగా.. సాయి సుదర్శన్ను జేకబ్ డఫీ అవుట్ చేశాడు.ఇక వన్డౌన్లో వచ్చిన జోస్ బట్లర్ (29)ను జోష్ హాజిల్వుడ్ వెనక్కి పంపాడు. ఇలా టాపార్డర్ను కుదేలు చేసిన ఆర్సీబీ బౌలింగ్ దళం.. మిడిలార్డర్ను కనీసం ఊపిరి కూడా పీల్చుకోనివ్వలేదు. నిశాంత్ సంధు (5), జేసన్ హోల్డర్ (0)లను రసిఖ్ సలామ దర్ అవుట్ చేయగా.. వాషింగ్టన్ సుందర్ (8)ను డఫీ పెవిలియన్కు చేర్చాడు.రాహుల్ తెవాటియా పోరాటంఅయితే, లోయర్ ఆర్డర్లో రాహుల్ తెవాటియా తన అనుభవాన్ని చూపించాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించి.. గుజరాత్ స్కోరు కనీసం 150 పరుగుల మార్కు దాటేందుకు సహాయపడ్డాడు. అయితే, భువీ తన అద్భుత బౌలింగ్తో తెవాటియాను వెనక్కి పంపాడు.మిగిలిన వాళ్లలో రషీద్ ఖాన్ (8) వికెట్ను డఫీ దక్కించుకోగా.. కృనాల్ పాండ్యా.. కగిసో రబాడ (9), సిరాజ్ (5) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి జేకబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్, హాజల్వుడ్ వరుసగా ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ తీయగా... రసిఖ్ సలామ్ తన తొలి ఓవర్లోనే ఒక్క పరుగూ ఇవ్వకుండా 2 వికెట్లు తీసి టైటాన్స్ ఆశలు ముగించాడు. గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మరో అవకాశంఅయితే, ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. ముల్లన్పూర్లో బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ (సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెన్ రాజస్తాన్ రాయల్స్) విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. మరోవైపు.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో జోరు మీదున్న బెంగళూరును టైటిల్ పోరులో ఏ జట్టయినా నిలువరించగలదా అనేదే ఇప్పుడు ఆసక్తికరం! చదవండి: ఇప్పట్లో అతడిని టెస్టులకు ఎంపిక చేయొద్దు: గంగూలీ -
ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ!
భారత్లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత విస్తరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను రెండుసార్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి తగిన కార్యచరణను రూపొందిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘బీసీసీఐ సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లను మార్చి-మే మధ్యలో నిర్వహిస్తోంది. నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లు సహా మొత్తం 74 మ్యాచ్లు ఉన్న టోర్నమెంట్లో విస్తరణ తర్వాత 94 మ్యాచ్లు జరిగే అవకాశముంది. దీంతో ఇప్పటివవరకు లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన జట్లు ఇకపై 18 మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే ఇన్ని మ్యాచ్లను ఒకేసారి నిర్వహించడం వల్ల సీజన్ మరింత పొడిగించాల్సి ఉంటుంది. అందువల్ల టోర్నీ మార్చి నుంచి జూన్ వరకు జరిగే అవకాశముంటుంది. అయితే ఎండాకాలం కావడంతో అధిక వేడిమి కారణంగా క్రికెటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఐపీఎల్ను రెండు విడతల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందున్న ఆలోచన కూడా మాకు కలిగింది. ఈ నేపథ్యంలో మొదటి విడతను ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో, రెండో విడతను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జరిగేలా ప్రణాళిక రచించాలని చూస్తున్నాం. ఐపీఎల్ కేవలం బీసీసీఐని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ బోర్డులను, ఆటగాళ్లను ప్రభావితం చేస్తోంది. అయితే టోర్నమెంట్ను మరో విండోకు మార్చవచ్చా లేదా అనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తాం. అప్పటివరకు ఐపీఎల్ ఇప్పుడున్న ఫార్మాట్లోనే జరుగుతుంది.’ అని చెప్పుకొచ్చారు. అయితే అరుణ్ ధుమాల్ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న ఫార్మాట్ను కాదని రెండు విడతల్లో ఐపీఎల్ నిర్వహించడమనేది ఒక అనవసరమైన ప్రక్రియ అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ టోర్నీల షెడ్యూల్ కూడా గందరగోళంగా తయార వుతుందని, ఆటగాళ్లు గాయపడే అవకాశాలు మరింత పెరుగుతాయని పెదవి విరుస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది.నేడు జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్తో రాజస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. మే 31 (ఆదివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది.చదవండి: పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్! -
పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ పోరులో గుజరాత్ టైటాన్స్కు ఏదీ కలిసి రాలేదు. ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైంది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరు నిజంగా బాధాకరమని చెప్పొచ్చు. ఈ సీజన్ లో అత్యంత నిలకడగా పరుగులు చేస్తున్న సాయి సుదర్శన్.. ఆర్సీబీతో క్వాలిఫయర్-1 పోరులోనే వరుస బౌండరీలతో మంచి టచ్లో కనిపించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో అద్భుతమైన స్క్వేర్ కట్తో బౌండరీ బాదాడు. వరుసగా రెండో ఫోర్ వచ్చిందని అభిమానులు అనుకుంటున్న తరుణంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. షాట్ ఆడిన తర్వాత సాయి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. గాల్లో తిరుగిన బ్యాట్ వచ్చి నేరుగా లెగ్ స్టంప్ను తాకి బెయిల్స్ను పడగొట్టింది. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ సాయి సుదర్శన్ను హిట్ వికెట్గా ఔటిచ్చాడు. దీంతో చేసేదేం లేక సాయి సుదర్శన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇలాంటి విచిత్రమైన ఔట్ చూసి కామెంటేటర్లతో పాటు అభిమానులు కూడా షాక్ తిన్నారు. మ్యాచ్లో కూడా ఇదే టర్నింగ్ పాయింట్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో గుజరాత్ తరఫున నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ ఆరెంజ్క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. గతేడాది కుశాల్ మెండిస్..ఇక ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్ దశలో హిట్ వికెట్ అయిన రెండో బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. తొలి బ్యాటర్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతేడాది ముంబై ఇండియన్స్తో ప్లేఆఫ్ మ్యాచ్ సందర్భంగా ఇదే గుజరాత్కు చెందని కుశాల్ మెండిస్ హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ ఔట్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.'బంతి బౌండరీకి వెళ్లింది.. కానీ బ్యాట్ వికెట్లను కొట్టేసింది', 'పాపం సాయి సుదర్శన్', 'క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 92 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. HOW UNFORTUNATE! 🤯Probably the only way to end Sai Sudharsan's streak of five 50-plus scores 🫣Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/DbpVS0JUKw— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే! -
గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గొడవలో అయినా, ఫన్నీ మోడ్లో అయినా కింగ్ కోహ్లిని ఎవరు బీట్ చేయలేరు. మ్యాచ్లో కోహ్లి 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫొటో సెషన్ జరిగింది. ఈ సమయంలో డగౌట్లో ఉన్న కోహ్లీ గుజరాత్ జట్టు వైపు చూస్తూ.. ‘ బాగైంది.. మేం మీపై గెలిచి ఫైనల్కు చేరుకున్నాంలే’ అంటూ ఫన్నీ మోడ్లో తన చేతులతో స్నేక్ గెచ్చర్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన గుజరాత్ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అంతకముందు గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనూ కోహ్లీ గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్తో కయ్యానికి కాలు దువ్వడం కనిపించింది. అయితే ఇదంతా సరదా కోసమే చేసినట్లు వీడియోలో క్లియర్గా కనిపించింది. ఇక జాకబ్ డఫీకి బంతి ఇవ్వడానికి ముందు కోహ్లీ చేసిన మరొక చర్య కూడా వైరల్గా మారింది. తాను బౌలింగ్కు దిగుతున్నట్లు అంపైర్ వద్దకు వెళ్లి తన క్యాప్ను ఇచ్చిన కోహ్లీ ఆ తర్వాత బంతి తీసుకొని రనప్కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జాకబ్ డఫీ బంతి ఇవ్వమని అడగడంతో అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తన క్యాప్ ఇవ్వాలంటూ అంపైర్ వద్దకు వెళ్లగా, అతడు నిరాకరించాడు. దీంతో 'ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి' అని అంపైర్ను అడగడం వీడియోలో కనిపించింది. గుజరాత్పై విజయం తర్వాత భార్య అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. ఇలా మ్యాచ్ మొత్తం తన చర్యలతో కోహ్లీ హల్చల్ చేశాడు. ఇవన్నీ కోహ్లీ సరదాతో చేసినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం అతడి చర్యను తప్పుబట్టారు. కోహ్లికి వెటకారం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉందని కామెంట్లు పెట్టారు. మొన్న హెడ్తో గొడవ పెట్టుకున్న కోహ్లి ఇవాళ గుజరాత్ టీమ్ను హేళన చేసేలా అతడి స్నేక్ గెచ్చర్ ఉందని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Virat Kohli teasing Gujarat Titans players during their photoshoot in Dharamshala 🤣🔥- Rajat Patidar did the same with GT too 😭 pic.twitter.com/368X6y0VpA— Jara (@JARA_Memer) May 26, 2026 -
ఎలిమినేటర్ పోరు.. నితీశ్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పాటీదార్ ఒక స్లో పాయిజన్.. కప్పు గెలిస్తే చరిత్రే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆ జట్టును వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేర్చడంలో సఫలమయ్యాడు. నాయకుడంటే ముందుండి నడిపించాలి. ఆ మాటలను ఇవాళ పాటీదార్ అక్షరాలా చేసి చూపించాడు. మొదట తన అద్భుత బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరు సాధించడంలో పాటీదార్ కీలకపాత్ర పోషించి షాన్దార్గా నిలిచాడు. త్రుటిలో సెంచరీ చేజారినా, బ్యాటింగ్లో పొరపాట్లు ఉన్నా సరే, అతడి విలువైన ఇన్నింగ్స్ దానిని మర్చిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా తన టీమ్ను రెండోసారి ఫైనల్ చేర్చిన అతను మరో టైటిల్ అందిస్తే చరిత్రలో నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. గుజరాత్పై విజయంతో ఐపీఎల్లో ఒక జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలో పాటీదార్ చేరిపోయాడు. గతంలో ఎంఎస్ ధోని (సీఎస్కే, 2010, 2011), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ 2019, 2020), హార్దిక్ పాండ్యా ( గుజరాత్ టైటాన్స్ 2022, 2023), శ్రేయస్ అయ్యర్ (2024లో కేకేఆర్, 2025లో పంజాబ్) ఈ ఘనత సాధించారు.స్లో పాయిజన్ బ్యాటింగ్..రజత్ పాటీదార్ బ్యాటింగ్ స్టైల్ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. స్లో పాయిజన్ మెళ్లిగా ఎక్కినా బలంగా ప్రభావం చూపుతుంది. అదే తరహాలో ముందు స్లోగా ఆడడం.. ఒకసారి కుదురుకున్నాక అతడి విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం పాటీదార్ స్టైల్. 2025 సీజన్లో బ్యాటింగ్లో కూడా ఫర్వాలేదనిపించే ప్రదర్శన (143.77 స్ట్రైక్రేట్తో 312 పరుగులు) చేసిన అతను ఈసారి మరింతగా చెలరేగిపోయాడు. టైటిల్ సాధించిన నాయకుడిగా వచ్చిన ఆత్మవిశ్వాసం కావచ్చు తాజా సీజన్లో అతను అసాధారణ బ్యాటింగ్ను ప్రదర్శిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న 247 బంతుల్లో అతను 486 పరుగులు (5 అర్ధసెంచరీలు) సాధించాడు. వీటిలో 29 ఫోర్లు, 41 సిక్సర్ల ద్వారానే 362 పరుగులు రాబట్టడం అతని బ్యాటింగ్ ధాటి ఏమిటో చూపించింది. మంగళవారం మ్యాచ్లో అతను అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరుగురు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్న అతనూ ఎవరినీ వదలకుండా అందరి బౌలింగ్లో సిక్సర్లు బాదాడు. కుల్వంత్ ఓవర్లో దూకుడు ప్రదర్శించిన తర్వాత రషీద్ ఓవర్లో అతను 2 భారీ సిక్స్లు కొట్టాడు. వీటిలో ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన సిక్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. రబాడ ఓవర్లోనూ రెండు సిక్స్లు కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతను ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్లు కొట్టాడు. ఇలా కెప్టెన్గా, ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయిన రజత్ పాటీదార్ తొందరలో టీమిండియా గడప కూడా తొక్కే అవకాశం లేకపోలేదు.Captains who led their teams into back to back IPL Finals:- MS Dhoni (2010, 2011). - Rohit Sharma (2019, 2020). - Hardik Pandya (2022, 2023). - Shreyas Iyer (2024, 2025). - Rajat Patidar (2025, 2026). pic.twitter.com/2evHNpBfQK— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026Breathtaking Batting 🤯🎥 Rajat Patidar leaving the best in the business awestruck 😳❤️Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/5BFUDFTHH1— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: ‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్ను గెలిపించింది వాళ్లే!’ -
‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్ను గెలిపించింది వాళ్లే!’
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్ చేరింది. మ్యాచ్లో 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ధర్మశాలలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం, మైదానంలో ప్రశాంతంగా నిలదొక్కుకోవడం కీలకంగా మారిందని అన్నారు. ఈ మ్యాచ్లో తాము కేవలం స్కోరును కాపాడుకోవడానికి రాలేదని, ప్రత్యర్థిపై పూర్తి దూకుడుతో అటాక్ చేయాలనే మైండ్ సెట్తో బరిలోకి దిగడం వల్లే విజయం సొంతమా అయిందని పటీదార్ పేర్కొన్నారు.పాటీదార్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశాడు. సెంచరీ ఏముంది మరో మ్యాచ్లో చేసుకోవచ్చు. అయినా నా బ్యాటింగ్లో చాలా తప్పులున్నాయి. లైఫ్లు లభించడంతోనే ఇవాళ భారీ స్కోరు సాధించాను. మేము భారీ స్కోరు చేసినప్పటికీ, మా బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. గెలుపు క్రెడిట్ను నేను తీసుకోలేను, మా బౌలర్లే ఇవాళ నిజమైన హీరోలు.ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని మా బౌలర్లు ముందే చెప్పారు. లీగ్ ముందుకు సాగుతున్న కొద్దీ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్, రసిక్ సలామ్, కృనాల్ మ్యాచ్ విన్నర్లుగా మారిపోయారు. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫైనల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తాం’ అని రజత్ పాటీదార్ ధీమా వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెపె్టన్ రజత్ పాటీదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్లు) విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన చేయగా... విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Body Language: “𝘞𝘦 𝘢𝘳𝘦 𝘤𝘰𝘮𝘪𝘯𝘨 𝘧𝘰𝘳 𝘺𝘰𝘶” 🦁 pic.twitter.com/oVXoBEWBki— Royal Challengers Bengaluru (@RCBTweets) May 26, 2026 -
Eliminator: నిలిచేదెవరు... నిష్క్రమించేదెవరు?
న్యూ చండీగఢ్: ఐపీఎల్ గత సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి పదునైన ఆటతో మళ్లీ ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని, మరోసారి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ముందుగా ‘నాకౌట్’ మ్యాచ్కు జట్టు సిద్ధమైంది. నేడు జరిగే ‘ఎలిమినేటర్’ పోరులో మరో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్తో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు క్వాలిఫయర్–2కు అర్హత సాధించనుండగా... ఓడిన టీమ్ లీగ్ నుంచి నిష్కమిస్తుంది.కమిన్స్ నాయకత్వంలోని సన్రైజర్స్లీగ్ దశలో 9 విజయాలతో మూడో స్థానంలో నిలవగా... రియన్ పరాగ్ కెప్టేన్సీలో 8 విజయాలు సాధించిన రాజస్తాన్ నాలుగో స్థానంతో ముగించింది. అయితే ఇరు జట్ల మధ్య తాజా సీజన్లో జరిగిన రెండు మ్యాచ్లలో గెలిచి హైదరాబాద్ 2–0తో పైచేయి సాధించింది. మానసికంగా ఇది రైజర్స్కు ఉత్సాహానిచ్చే అంశం. విధ్వంస బ్యాటింగ్ ప్రదర్శనకు చిరునామాగా నిలుస్తూ క్లాసెన్ (606 పరుగులు), ఇషాన్ కిషన్ (569), అభిషేక్ శర్మ (563), హెడ్ (393) సీజన్ను శాసించారు. ఈ టాప్–4 బ్యాటర్లను నిలువరించగలిగితేనే రాజస్తాన్కు మ్యాచ్లో కనీస అవకాశం ఉంటుంది.చక్కటి బౌలింగ్తో మలింగ (19 వికెట్లు), సాకిబ్ (15) ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. మరోవైపు రాజస్తాన్ ప్రధానంగా వైభవ్ సూర్యవంశీ (583), యశస్వి జైస్వాల్ (397) ఇచ్చే ఆరంభంపై ఆధారపడుతోంది. ధ్రువ్ జురేల్ (458) కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో ఆర్చర్ (21) ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. బ్రిజేశ్ శర్మ (13), బర్గర్ (11) కూడా రాణించాల్సి ఉంది. -
పాటిదార్ ఊచకోత.. గుజరాత్ చిత్తు.. ఫైనల్లో ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్కు చేరిన ఈ జట్టు.. ఇవాళ (మే 26) జరిగిన తొలి క్వాలిఫయర్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తుగా ఓడించి, వరుసగా రెండో ఎడిషన్లో ఫైనల్కు చేరింది.ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ రజత్ పాటిదార్ మహోగ్రరూపం (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) దాల్చాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది.ఆర్సీబీ ఇన్నింగ్స్లో పాటిదార్తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆదిలోనే మ్యాచ్పై పట్టు కోల్పోయింది. సాయి సుదర్శన్ (14) దురదృష్టవశాత్తు హిట్ వికెట్గా వెనుదిరగడంతో ఈ జట్టు పతనం ప్రారంభమైంది. ఆతర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ శుభ్మన్ గిల్ (2).. 51 పరుగుల వద్ద బట్లర్ (29), నిషాంత్ సింధు (5), హోల్డర్ (0) ఔట్ కావడంతో పవర్ ప్లేలోనే (5.4 ఓవర్లలో) ఓటమి ఖరారైంది. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో సుందర్ (8), రషీద్ ఖాన్ (8), రబాడ (9) కూడా ఔట్ కావడం 100 పరుగులలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే ఆఖర్లో తెవాతియా (68) బ్యాట్ ఝులిపించడంతో జట్టు స్కోర్ 100 పరుగుల మార్కు దాటింది. అంతిమంగా గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, భువీ, రసిక్, కృనాల్ తలో 2, హాజిల్వుడ్ ఓ వికెట్ తీసి గుజరాత్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. -
పాటిదార్ మహోగ్రరూపం.. ఆల్టైమ్ రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేసింది.రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మహోగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పాటిదార్తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు.వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్టైమ్ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగానూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో అత్యధిక స్కోరు254/5 RCB vs PBKS ధర్మశాల 2026 *233/3 GT vs MI అహ్మదాబాద్ 2023228/5 MI vs GT న్యూ చండీగఢ్ 2025226/6 PBKS vs CSK వాంఖడే 2014222/5 CSK vs DC చెన్నై 2012ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో అత్యధిక బౌండరీలు38 RCB vs GT ధర్మశాల 2026 *33 CSK vs DC చెన్నై 201232 PBKS vs CSK వాంఖేడే 201431 GT vs MI అహ్మదాబాద్ 202331 MI vs GT న్యూ చండీగఢ్ 2025 -
ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సమం
ఐపీఎల్-2026లో ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులు మెరిపించాడు. 18 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాటిదార్.. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.ధర్మశాల మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పాటిదార్.. 5 ఫోర్లు, 8 సిక్స్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడి విధ్వంసం ధాటికి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్తో పాటు విరాట్ కోహ్లి(43), కృనాల్ పాండ్యా(43), పడిక్కల్(30) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన పాటిదార్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్, డ్వేన్ స్మిత్ రికార్డును పాటిదార్ సమం చేశాడు. వీరిద్దరూ కూడా 21 బంతుల్లో తమ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నారు.IPL నాకౌట్లు/ప్లేఆఫ్స్లో అత్యంత వేగవంతమైన 50లు (బంతుల పరంగా)16 సురేష్ రైనా vs పంజాబ్ కింగ్స్ (వాంఖడే 2014)17 ఆడమ్ గిల్క్రిస్ట్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (సెంచూరియన్ 2009)20 ఎంస్ ధోని vs ముంబై ఇండియన్స్( బెంగళూరు 2012)21 డ్వేన్ స్మిత్ vs సీఎస్కే (ఢిల్లీ 2013)21 వీరేంద్ర సెహ్వాగ్ vs సీఎస్కే (వాంఖడే 2014)21 రజిత్ పాటిదార్ vs పంజాబ్ ధర్మశాల 2026 * -
చరిత్ర సృష్టించిన రబాడ
ఆర్సీబీతో జరుగుతున్న ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ రెండో ఓవర్ చివరి బంతికి దూకుడు మీద ఉన్న వెంకటేశ్ అయ్యర్ను (19) ఔట్ చేశాడు. శుభ్మన్ గిల్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టి అయ్యర్ను పెవిలియన్కు పంపాడు.ఈ వికెట్తోనే రబాడ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో మొదటి ఆరు ఓవర్లలో అత్యధిక వికెట్లు (18) తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వికెట్కు ముందు రబాడ మహ్మద్ షమీతో (2023 ఎడిషన్) కలిసి ఈ రికార్డును షేర్ చేసుకున్నాడు. ఈ రికార్డుకు సంబంధించి రబాడ, షమీ తర్వాతి స్థానాల్లో మిచెల్ జాన్సన్ (16 వికెట్లు, 2013), ట్రెంట్ బౌల్ట్ (16, 2020) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 140-3గా ఉంది. వెంకటేశ్ అయ్యర్ (19), విరాట్ కోహ్లి (43), దేవదత్ పడిక్కల్ (30) ఔట్ కాగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (21), కృనాల్ పాండ్యా (25) క్రీజ్లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 1, హోల్డర్ 2 వికెట్లు పడగొట్టారు. హోల్డర్ 9వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ చేసిన అతడు.. నాలుగో బంతికి పడిక్కల్ను పెవిలియన్కు పంపాడు. -
తొలి ప్లేయర్గా కోహ్లి అరుదైన రికార్డు
ఐపీఎల్-2026లో భాగంగా ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 43 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.ఈ క్రమంలో కోహ్లి ఈ ఏడాది సీజన్లో 600 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్ చేశాడు.ఇప్పడు ఈ ఏడాది సీజన్లో కూడా కోహ్లి 50.00 సగటు, 164.38 స్ట్రైక్రేట్తో600 పరుగులు చేశాడు. గతంలో క్రిస్ గేల్ (2011, 2012, 2013), డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) వరుసగా మూడు సార్లు ఈ ఫీట్ అందుకున్నారు. కానీ వరుసగా నాలుగు సీజన్లలో కోహ్లి మినహా మిగితా ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. అదేవిధంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడిన జాబితాలో కోహ్లి నాలుగో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ఇప్పటివరకు 18 ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడి శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్, కిరాన్ పొలార్డ్ సరసన కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోని(28) అగ్రస్ధానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్, రైనా(24) తర్వాతి స్ధానంలో కొనసాగుతున్నారు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్ -
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఎలిమినేటర్లో భాగంగా ఎస్ఆర్హెచ్ బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు సన్రైజర్స్కు భారీ షాక్ తగిలింది.ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ ఎస్ఆర్హెచ్ క్యాంప్ను వీడి శ్రీలంకకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మెండిస్ జాతీయ జట్టు కమిట్మెంట్స్ కారణంగా జట్టును వీడినట్లు సమాచారం. శ్రీలంక జట్టు త్వరలోనే ఆల్ఫార్మాట్ సిరీస్లలో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన శ్రీలంక జట్టులో మెండిస్ భాగంగా ఉన్నాడు. ఈ కారణంతో అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు ముందు తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పటికే లంక జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మెండిస్కు ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. గత సీజన్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతో మెండిస్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. ట్రావిస్ హెడ్, క్లాసెన్, కమ్మిన్స్, మలింగ రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లగా తుది జట్టులో కొనసాగుతున్నారు.రాజస్తాన్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అంబరీష్, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే.


