Jammu kashmir encounter
-
కశ్మీర్లో భారత ఆర్మీ వేట.. లష్కర్ టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బందిపొరాలో ఎన్కౌంటర్లో భాగంగా లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ను భద్రతా బలగాలు హతమార్చాయి.వివరాల ప్రకారం.. బందిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య గురువారం రాత్రి నుంచే ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనా స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.🚨 BIG BREAKING:Top Lashkar-e-Taiba (LeT) commander Altaf Lalli killed in Bandipora encounter!A major success for security forces—Lalli, behind multiple terror strikes, neutralized in a swift, intel-driven op. 🔥 #PahalgamTerroristAttack #Pahalgam— Chandan Prasad (@Mrchandanprasad) April 25, 2025 -
కశ్మీర్లో కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, స్థానిక పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగతున్నాయి. ఈ ఎదురుకాల్పులల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. డచిగామ్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం డచిగామ్లో టెర్రరిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల చేతిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మృతిచెందినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గగన్గీర్, గందేర్బల్ సహా పలు ప్రాంతాల్లో దాడులకు సూత్రధారి జునైద్ అని పోలీసులు చెబుతున్నారు. అక్కడ టెర్రరిస్టుల దాడుల కారణంగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. In the ongoing operation, one terrorist was killed and has been identified as Junaid Ahmed Bhat (LeT, Category A). The said terrorist was involved in civilians killing at Gagangir, Ganderbal and several other terror attacks. Operation continues in the upper reaches of Dachigam by… pic.twitter.com/8JhMfc1qMH— ANI (@ANI) December 3, 2024ఈ ఏడాది అక్టోబర్ నెలలో కశ్మీర్లో గందేర్బల్ జిల్లాలోని గగన్గిర్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జునైద్ టీమ్ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ వైద్యుడితో పాటు, ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగం పనుల్లో పాల్గొంటున్న క్రమంలో ఉగ్రదాడి జరిగింది. -
‘ఒక్క నాయకుడు రాలేదు.. తీవ్ర అవమానం’
కశ్మీర్: ఉగ్రవాదుల చేతుల్లో అమరవీరులైన జవాన్లకు, పోలీసులకు సానుభూతిగా మీడియా ముందు ఆర్భాటాలు చేయడానికి మాత్రమే రాజకీయ నాయకులు పనికొస్తారని, వారి అంతిమ క్రియల్లో పాల్గొని సముచిత గౌరవం ఇవ్వడంలో మాత్రం వారి జాడ కూడా కనిపించదని మరోసారి నిరూపితమైంది. జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాల్లో పోలీసులు చనిపోతే వారికి కనీసం గౌరవం దక్కలేదు. ఒక్కరంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా వారి అంతిమ క్రియలకు హాజరుకాలేదు. అంతేకాదు.. పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. కానీ, పోలీసుల కాల్పుల్లో హతమైన లష్కరే తోయిబా ఉగ్రవాదుల అంతిమక్రియలకు మాత్రం పెద్ద మొత్తంలో వారికి సంబంధించిన వారు హాజరయ్యారు. దీంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గత శుక్రవారం అనంత్నాగ్ జిల్లాలో లష్కరే ఉగ్రవాదులు ఆరుగురు పోలీసులను దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. వారి అంత్యక్రియలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ఒక్క నాయకుడు కూడా హాజరుకాలేదు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా తమ నాయకులను జమ్ముకశ్మీర్ డిప్యూటీ ముఖ్యమంత్రి నిర్మల్ కుమార్ సింగ్ సమర్థించుకున్నారు. వారంతా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ముఖ్యమంత్రి ముఫ్తీతో కలిసి చర్చిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ కారణంగానే రాలేకపోయారని చెప్పారు. -
నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు
శ్రీనగర్: శత్రువులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా ఏమాత్రం బెదరకుండా పోరాడాడు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్తున్నా లెక్కచేయకుండా తుపాకీ ఎక్కుపెట్టి యుద్ధం చేశాడు. పెద్ద ఎత్తున ఆయుధాలతో దేశంలోకి చొరబడుతున్న నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడి దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. వీరమరణం చెందిన భారత సైనికుడు 36 ఏళ్ల హవీల్దర్ హంగ్పాన్ దాదా సాహసానికి మారు పేరుగా నిలిచాడు. జమ్ము కశ్మీర్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హవీల్దర్.. నలుగురు ఉగ్రవాదులను చంపాడు. అరుణాచల్ ప్రదేశ్లోని బొడురియా హవీల్దర్ సొంత గ్రామం. దాదా అని పిలుచుకునే హవీల్దర్ 1997లో అసోం రెజిమెంట్లో చేరాడు. 35 రాష్ట్రీయ రైఫిల్స్లో జవాన్గా సేవలందించాడు. 13 వేల అడుగుల ఎత్తున ఉన్న శంసబరి రేంజ్లో పనిచేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో హవీల్దర్ తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. హవీల్దర్ ధైర్యసాహసాలు ప్రదర్శించి, శత్రువులతో భీకరయుద్ధం చేసి నలుగురిని హతమార్చాడని ప్రశంసించారు. దేశంకోసం ప్రాణత్యాగం చేశాడని చెప్పారు. హవీల్దర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతనికి భార్య లొవాంగ్, కుమార్తె రోకిన్, కొడుకు సెన్వాంగ్ ఉన్నారు. -
ఎన్కౌంటర్లో జవాను మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాను మృతి చెందాడు. కుప్వారా జిల్లా అటవీ ప్రాంతంలో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల ఘటనలో ఓం వీర్ సింగ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మిలిటెంట్లు దాగి ఉన్నట్లు సమాచారంతో భద్రతా దళాలు నిన్నటి నుంచి హంద్వారా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగటంతో ప్రతిగా జవాన్లు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.