breaking news
Jayachandra Reddy
-
డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం అవినీతి కూపంలో నిలువెల్లా కూరుకుపోయిన టీడీపీ పెద్దలు సరికొత్త డైవర్షన్ కుతంత్రాలకు పదును పెడుతున్నారు. బరి తెగించి నకిలీ మద్యం దందాకు పాల్పడిన వారే ఆ బురదను అందరికీ అంటించే కుట్రలు పన్నుతున్నారు. అందుకోసం టీడీపీ పెద్దల డైరెక్షన్లో చిత్రీకరించిన ‘పొలిటికల్ సోషియో ఫాంటసీ’ కుట్ర ఇప్పటికే బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై దు్రష్పచారం చేసేందుకు పన్నిన కుతంత్రం ఫలించ లేదు. దాంతో మరోసారి టీడీపీ వీర విధేయ సిట్ను రంగంలోకి దించి తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాల పేరిట హడావుడి చేయించారు. టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం మాఫియా బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ చౌకబారు ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ద్వారా వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి ఇదంతా చేయించారంటూ తొలుత ఎల్లో మీడియా రంకెలేసింది! అయితే తమ దాడులతోనే నకిలీ మద్యం రాకెట్ బయట పడిందని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఇదంతా చేయించారంటూ జనార్ధన్రావుతో ప్రభుత్వ పెద్దలు చిలుక పలుకులు వల్లె వేయించారు. నిజానికి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్ధన్రావు వీడియో బయటకు రావడం వెనుక లోగుట్టు ఏమిటి? ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా నకిలీ మద్యం పాపం వైఎస్సార్సీపీదేనని ప్రచారం చేయాలంటూ కూటమి ఎంపీలతో ఢిల్లీలో సమావేశం సందర్భంగా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ కుట్ర అట్టర్ ఫ్లాప్ టీడీపీ పెద్దలే సూత్రధారులుగా పచ్చ సిండికేట్ సాగిస్తున్న నకిలీ మద్యం రాకెట్ కేసును పక్కదారి పట్టించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. అడ్డంగా దొరికిపోయిన ప్రతిసారీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలు ఈసారి మరీ చౌకబారు ఎత్తుగడ వేసి నవ్వుల పాలయ్యారు. డైవర్షన్ కుట్రలో భాగంగానే ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్రావుతో చెప్పించిన వీడియో టీడీపీ పెద్దల నేలబారు రాజకీయాన్ని బయటపెట్టింది. ఏం చెప్పాలో పోలీసులే పక్కనుంచి ప్రాంప్టింగ్ అందిస్తుండగా.. జనార్దన్రావు వల్లె వేసిన మాటలను చిన్నపిల్లలు కూడా నమ్మడం లేదన్నది స్పష్టమైంది. ఎల్లో మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో డ్రామా టీడీపీ పెద్దల దిగజారుడుతనాన్ని బయటపెట్టింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు జనార్దన్రావుతో నిబంధనలకు విరుద్ధంగా వీడియో రికార్డ్ చేయించి విడుదల చేశారన్నది నిగ్గు తేలింది. అంతేకాదు.. ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం మాఫియా రాష్ట్రమంతా విస్తరించిందన్నది తేటతెల్లమైంది. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్ కేవలం పాత్రధారులేనని, ఈ వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా ప్రభుత్వ పెద్దలేనన్నది రూఢీ అయ్యింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ప్లాంట్లో యంత్రాలు, క్యాన్లు (ఫైల్) సిట్ ద్వారా మరో డైవర్షన్ డ్రామా... ఏ 1 జనార్దన్రావు వీడియో డ్రామా ఎపిసోడ్ బెడిసికొట్టడంతో ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో కుట్రకు పదును పెట్టారు. ఏడాదికిపైగా రెడ్బుక్ రాజ్యాంగ కుట్రలు అమలు చేస్తున్న తన సిట్ను రంగంలోకి దింపారు. వీడియో డ్రామా ద్వారా జోగి రమేష్ను లక్ష్యంగా చేసుకుని భంగపడ్డ టీడీపీ పెద్దలు.. ఈసారి సిట్ ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిపై గురి పెట్టారు. ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా మిథున్రెడ్డి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానున్న తరుణంలో డైవర్షన్తో మరోసారి కుట్రలకు తెర తీశారు. మిథున్రెడ్డి కుటుంబానికి చెందిన తిరుపతి, హైదరాబాద్లలోని నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం సోదాలతో హడావుడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను విచారించారు. వాస్తవానికి మద్యం విధానంపై అక్రమ కేసులో ఆయన్ను గతంలోనే అరెస్టు చేసి కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. ఆ అక్రమ కేసులో సిట్ అధికారులు ఎటువంటి ఆధారాలు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో మిథున్రెడ్డికి న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక ఈ కేసులో ఆయన్నుగానీ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రతినిధులనుగానీ విచారించేందుకు ఏమీ లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. డిస్టిలరీల మాటున నకిలీ దందా.. ఆధారాలతో సహా బట్టబయలైన నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలుకుతూ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా కట్టడి చేస్తున్నారు. అసలు నకిలీ మద్యం తయారీకి అవసరమైన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్) ఎక్కడి నుంచి సరఫరా అయిందన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. ఎందుకంటే.. అత్యంత ప్రమాదకరమైన ఆ స్పిరిట్ను కొనుగోలు చేసేందుకు మద్యం డిస్టిలరీలు, రసాయన పరిశ్రమలకే అనుమతి ఉంది. ఆ స్పిరిట్లో 100 శాతం ఉండే ఆల్కహాల్ను 42 శాతం లోపు తగ్గించి మనుషులు వినియోగించే మద్యాన్ని తయారు చేసే సామర్థ్యం డిస్టిలరీలకే ఉంటుంది. మరి టీడీపీ సిండికేట్ ములకలచెరువుతోపాటు అనకాపల్లి, పాలకొల్లు, ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లకు స్పిరిట్ ఎక్కడ నుంచి సరఫరా జరిగింది? అనేది అత్యంత కీలకంగా మారింది. అంటే.. డిస్టిలరీలే ఆ స్పిరిట్ను కొనుగోలు చేసి అక్రమంగా నకిలీ మద్యం యూనిట్లకు సరఫరా చేశాయని ఎక్సైజ్ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందినవే. వాటిలో తనిఖీ చేసి రికార్డులు పరిశీలిస్తే మొత్తం బండారం బయటపడుతుంది. అందుకే ఆ డిస్టిలరీలవైపు కన్నెత్తి చూడవద్దని ప్రభుత్వ పెద్దలు పోలీసు, ఎక్సైజ్ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ బడా బాబుల బండారం బయటపడకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నది సుస్పష్టం. నకిలీ మద్యం దందాతో అమాయకుల ప్రాణాలను హరిస్తుండటంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో టీడీపీ పెద్దలు ఇలా డైవర్షన్ డ్రామాలతో కుట్రలకు తెర తీస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనార్దన్రావు ఇంట్లో సోదాలు ఇబ్రహీంపట్నం : నకిలీ మద్యం నిందితుడు జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు ఇళ్లల్లో పోలీసులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించారు. పోలీసులను వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. గంటపాటు మంతనాల తర్వాత లోపలకు అనుమతించారు. మూడు గంటలపాటు పోలీసులు సోదాలు చేశారు.ఎంపీ మిథున్రెడ్డిపై మళ్లీ కక్ష సాధింపుసాక్షి, అమరావతి/తిరుపతి : మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ వేధింపులు కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం హల్చల్ చేశారు. హైదరాబాద్, తిరుపతిలోని ఆయన నివాసం, కార్యాలయాలకు వెళ్లిన సిట్ బృందాలు ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలకు సంబంధించిన వివరాలు చెప్పాలంటూ పదే పదే అడిగినట్లు సమాచారం. తిరుపతిలోని ఎంపీ మిథున్రెడ్డి నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన తల్లి పెద్దిరెడ్డి స్వర్ణలత వాంగ్మూలం నమోదు చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే అనేకసార్లు విచారించారు. జుడీషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. ఆయనపై అభియోగాలకు ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపుతోనే సిట్ మళ్లీ సోదాలు, విచారణ పేరుతో హడావుడి చేస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దల అండతో సాగుతున్న నకిలీ మద్యం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. అందుకే మిథున్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలు చేపట్టడం సందేహాస్పదంగా మారింది. కాగా, ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు, విచారణపై సిట్ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇంత జరిగినా.. ‘బెల్టు’ తీయరా..? జయచంద్రారెడ్డిని అరెస్టు చేయరా?రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నకిలీ మద్యం 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే మొదలైంది. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దోపిడీపై ఎక్సైజ్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం అసలు గుట్టును బయటపెట్టింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీ పర్యవేక్షకులుగా మారి పక్కాగా దోపిడీని వ్యవస్థీకరించిన తీరే అందుకు నిదర్శనం. ఇక ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను రాష్ట్రానికి స్వయంగా తెచ్చింది తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, టీడీపీ నేతలు సురేంద్ర నాయుడు, అద్దేపల్లి జనార్దన్రావులే కావడం గమనార్హం. ములకలచెరువు కేంద్రంగా మొదలైన ఈ మాఫియా ఏడాదిలో రాష్ట్రం అంతటా విస్తరించడం విస్మయపరుస్తోంది. అడ్డంగా దొరికిన తరువాత ఏ1 జనార్దన్రావుతో వీడియో డ్రామాకు యత్నించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. నకిలీ మద్యం మాఫియా కుట్రదారు, అంతిమ లబ్ధిదారు టీడీపీ పెద్దలేనన్న వాస్తవాన్ని ఎంతగా దాచాలని యత్నిస్తే.. అంతగా ఆ అవినీతి బాగోతం బట్టబయలవుతోంది. జనార్దన్రావును విదేశాల నుంచి ఆగమేఘాలపై రాష్ట్రానికి రప్పించిన టీడీపీ పెద్దలు.. జయచంద్రారెడ్డిని ఎందుకు రప్పించడం లేదు? ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో ఊరూరా విస్తరించిన దాదాపు 75 వేల బెల్టు షాపులను నిర్మూలించకపోవడం.. ప్రజల ప్రాణాలను హరిస్తూ అక్కడ విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని జప్తు చేయకపోవడం.. పరీక్షల కోసం ల్యాబ్లకు పంపకపోవటాన్ని బట్టి టీడీపీ పెద్దల అండదండలతోనే పచ్చముఠాలు నకిలీ దందాతో చెలరేగుతున్నట్లు స్పష్టమైందని పేర్కొంటున్నారు. -
ఈ ప్రశ్నలకు బదులేదీ.?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం మాఫియా కేసును టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే కుతంత్రాలకు పదును పెడుతోందన్నది పక్కాగా స్పష్టమవుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావు మాట్లాడిన వీడియో మీడియాకు విడుదల కావడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అంతే కాదు.. పెద్దల పాత్ర, దర్యాప్తు పేరిట పోలీసుల అక్రమాలను బయటపెట్టింది. జనార్దన్రావు టీడీపీ నేతలకే అత్యంత సన్నిహితుడని మరోసారి తేటతెల్లమైంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తూ రాజకీయ పరిశీలకులు ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలు ఇవీ...1 జనార్దన్రావు చంద్రబాబుకు అంతటి సన్నిహితుడే కదా...! 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్ధన్రావు అక్కడే ఉన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్ధన్రావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతం? అంటే ఆయన చంద్రబాబు, జయచంద్రారెడ్డిలకే సన్నిహితుడనే కదా. మరి ఆయన వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్కు సన్నిహితుడు అన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథే కదా!2 నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్రావు ఓ కార్పొరేట్ పారిశ్రామికవేత్త తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆయన ధీమా వెనుక దన్ను ఎవరు? కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్యనేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారు?3 నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్న జనార్ధన్రావు హడావుడిగా ఎందుకు ఆంధ్ర ప్రదేశ్ చేరుకున్నారు? వెంటనే వచ్చి తాము చెప్పినట్టుగా కట్టు కథలు వల్లె వేయాలన్న ముఖ్యనేత ఆదేశంతోనే ఆయన వచ్చారన్నది సుస్పష్టం. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేశ్కు ఆయన నిజంగానే సన్నిహితుడే అయితే ఇంత హడావుడిగా విదేశాల నుంచి వచ్చే ధైర్యం చేయలేరు కదా? అంటే జనార్ధన్రావు వీడియో ద్వారా చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టు కథ అన్నది స్పష్టమవుతోంది.4 జనార్దన్ రావు తన మొబైల్ ఫోన్ను విదేశాల్లో వదిలి రావడం ఏమిటి..? అలా చెప్పమని ఆయన్ను ఆదేశించింది ఎవరు.? ఆ ఫోన్ గుట్టు విప్పితే బయటపడే ప్రభుత్వ పెద్దల జాతకాలు ఏమిటి..? ఇవీ కదా ఈ కేసులో కీలక ప్రశ్నలు. వాటిని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఆయన ఫోన్ వదిలి వచ్చారన్నది తేటతెల్లమవుతోంది కదా.5 ములకల చెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయలేదు? ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా? కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేంతవరకు విదేశాల నుంచి రావద్దని ఆయన్ను ఆదేశించిన ముఖ్యనేత ఎవరు?6 నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం దందా రాష్ట్రం అంతటా విస్తరించిందని ఒప్పుకున్నట్టే కదా...?7 మొదట పోలీసులు, తరువాత జైలు అధికారుల అదుపులో ఉన్న జనార్ధన్రావు అసలు ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడారు? ఆయన మాట్లాడిన వీడియో అసలు ఎక్కడ షూట్ చేశారు? ఎవరు షూట్ చేశారు? పక్కనుంచి ఆయనకు డైలాగులు ఎవరు అందించారు? ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అంటే.. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోంది కదా. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిది?8 జనార్ధన్రావు మాట్లాడిన వీడియో సోమవారం విడుదల కాగా.. అందులోని విషయాలపై ముందుగానే అంటే ఆదివారమే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు? అంటే ఆ వీడియో విడుదల కానుందని...అందులో ఏం మాట్లాడారన్న సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా? వైఎస్సార్సీపీ నేతలకు ప్రమేయం ఉందని చంద్రబాబు ఆదివారం చెప్పిన విషయాలే... సోమవారం విడుదల అయిన జనార్దన్ రావు వీడియోలోనూ ఉండటం వెనుక లోగుట్టు ఏమిటి? -
నకిలీ మాఫియాకు ముఖ్యనేత దన్ను!
సాక్షి, అమరావతి: అనుకున్నట్టుగానే నకిలీ మద్యం మాఫియా దందాను గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నారు. ఈ దందాను అద్దేపల్లి జనార్దన్ వరకే పరిమితం చేసి, దర్యాప్తును పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, ‘నకిలీ మద్యం దందా వెనుక సూత్రధారుల గుట్టు రట్టు చేస్తాం’ అన్న ములకలచెరువు గ్యాంగ్ బెదిరింపులకు ముఖ్యనేత భయపడ్డారన్నది తేటతెల్లమవుతోంది. నకిలీ మద్యం దందా అంతా ఒక్క జనార్దన్ మాత్రమే చేసినట్టుగా తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది.తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, అలాగే కీలక నాయకుడు సురేంద్రనాయుడుతో తనకు లిక్కర్ వ్యాపార సంబంధాలు ఉన్నాయని జనార్దన్ తెలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు, అసలు వీరికి ఈ దందాలో భాగం ఉన్నట్లు అర్థం వచ్చేలా అందులో ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. జయచంద్రారెడ్డి పేరు నిందితునిగా చేరిస్తే, ఆయన వెనుక ఉన్న ముఖ్యనేత పేర్లు బయటకు వస్తాయని, ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు చూస్తున్న టీడీపీ నేతల పేర్లు బట్టబయలవుతాయన్న భయంతో ఈ ఎత్తుగడ వేశారు. మద్యం దుకాణాల వ్యాపారంలో లాభాలు రావడం లేదని 2025 జూన్ తర్వాత జనార్దన్తో టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు చేతులు కలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవం ఏమిటంటే.. ఈ మాఫియాకు మూలం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు.జనార్దన్ వారి అనుచరుడు మాత్రమే. 2024 ఎన్నికలకు ముందే నకిలీ మద్యం దందా కోసం ముఖ్యనేతతో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు డీల్ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి టిక్కెట్ కేటాయించారు. ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో జనార్దన్ను మాత్రమే నకిలీ మద్యం నిర్వాహకునిగా పేర్కొనడం ముఖ్యనేత కుట్రకు నిదర్శనం.తద్వారా మాఫియాకు మూలమైన జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడులను పూర్తిగా తప్పించాలన్నదే ముఖ్యనేత ఎత్తుగడ. పైగా అద్దేపల్లి ఈ ఏడాది జూన్లోనే నకిలీ మద్యం దందా మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్టు సూచించడం విడ్డూరం. మొత్తంగా నకిలీ మద్యం దందా తీవ్రతను తగ్గించి అంతిమ లబ్ధిదారులకు కొమ్ముకాయడమే రిమాండ్ రిపోర్ట్ లక్ష్యమని అర్థమవుతోంది. -
నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్
మదనపల్లె: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసులు శనివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అయిన ములకలచెరువు నల్లగుట్టకు చెందిన సయ్యద్ కలీం అష్రఫ్ (23)ను అరెస్ట్ చేసి తంబళ్లపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరచగా, ఏడు రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్జైలుకు తరలించారు.తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి చెందిన స్కారి్పయో వాహనంలో సయ్యద్ కలీం అష్రఫ్ నకిలీ మద్యాన్ని బెల్టుషాపులకు సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొనగా, ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. కాగా, అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్కు రిమాండ్రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడిగాందీనగర్ (విజయవాడసెంట్రల్): నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్కు ఈనెల 17వరకు విజయవాడలోని 6వ ఏజేఎం ఫస్ట్ క్లాస్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అద్దేపల్లిని శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి కోర్టుకు, ఆ తర్వాత న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరు పరిచారు. కోర్డు రిమాండ్ విధించడంతో అద్దేపల్లి జనార్దన్ను నెల్లూరు జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు జనార్దన్ రిమాండ్ రిపోర్టులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనతోపాటు కట్టా సురేంద్ర నాయుడుతో తనకు లిక్కర్ వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ అధిక సంఖ్యలో వైన్షాపులు దక్కించుకున్నారని పేర్కొంటూ, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వ్యాపార అనుభవం లేని కారణంగా నష్టాలు రావడంతో తనను సంప్రదించారని తెలిపాడు. వీరికి చెందిన ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్, చంద్రాయునిపల్లిలోని ఆంధ్రవైన్స్ తానే నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 2025 మే, జూన్ నెలల నుంచి ములకలచెరువులో అద్దేపల్లి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.అదే సమయంలో ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్నార్ బార్తోపాటు శ్రీనివాస వైన్స్లో విక్రయించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, హీల్స్ బాలాజీ సరఫరా చేసేవాడని, అలాగే లేబుల్స్, బ్రాండ్ స్టిక్కర్స్ రవి సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్లో ఈ–7 అనే బార్లో పార్టనర్గా చేరి అక్కడ చీప్ లిక్కర్ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్తో గోవా వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్లో ఉన్న బాలాజీతో చేతులు కలిపి అతని ద్వారా నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, హీల్స్, క్యాప్లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చి, తయారీ తర్వాత బార్లో విక్రయించాడు.నకిలీ మద్యం తయారీకి ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఐషర్ వాహనాల్లో ఇబ్రహీంపట్నంకు స్పిరిట్ను తరలించేవారు. అలా వచ్చిన మెటీరియల్ను ఉపయోగించి తన సోదరుడు జగన్మోహన్రావుతో కలిసి జనార్దన్ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో లిక్కర్ వ్యాపారం ఉన్న ట్లు గుర్తించారు. ఈ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ముఖ్యనేత యత్నించడం గమనార్హం. -
నాకు టికెట్ ఇస్తే.. ఆఫ్రికా మోడల్ కల్తీ లిక్కర్ తీసుకొస్తా..!
-
పక్కావ్యూహం ప్రకారమే..!
రాష్ట్రంలో నకిలీ మద్యం దందా తీగ లాగుతుంటే ఉండవల్లి కరకట్ట బంగ్లాలో డొంక కదులుతోంది. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ ముఖ్య నేతేనని నిగ్గు తేలుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం... అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు... బెల్టుషాపులకు పచ్చ జెండా... పర్మిట్ రూమ్లకు గేట్లెత్తి వ్యవస్థను నియంత్రణలోకి తెచ్చుకుని... నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి షాప్లకు సరఫరా చేయడం వరకు అంతా పక్కా వ్యూహంతో సాగిందని స్పష్టమవుతోంది.నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ వెనుక విస్తుపోయే ‘ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్’ వంటి భారీ కుట్ర ఉందని క్రమంగా అర్థమవుతోంది. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం నిషా ఎక్కించి రూ.వేల కోట్లు కొల్లగొట్టే కుంభకోణం వెలుగుచూస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణ వెనుక పన్నాగం ఉందని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న నకిలీ మద్యం దందాకు నిరుటి ఎన్నికలకు ముందే కుట్ర పన్నారు. అధికారంలోకి రాగానే దోపిడీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే ‘‘ఆఫ్రికా మోడల్’’ నకిలీ సరుకు దందాను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ముఖ్యనేత దోపిడీకి సహకరిస్తానని జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఆఫర్ ఇచ్చారు. పెదబాబు, చినబాబు వెంటనే ఈ డీల్కు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్కుమార్రెడ్డి, శంకర్యాదవ్లను సైతం పక్కనపెట్టారు. ఖర్చంతా తానే భరిస్తానని శంకర్యాదవ్ చెప్పినా టీడీపీ అధినాయకత్వం వినిపించుకోలేదు. ఆయనకు టికెటివ్వాలని కార్యకర్తలు కరకట్ట నివాసం వద్ద ధర్నాలు చేసినా ఒప్పుకోలేదు. క్యాడర్ వ్యతిరేకించినా జయచంద్రారెడ్డికే తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. దీనివెనుక ఉద్దేశం... ‘‘ఒక సీటు పోయినా ఫర్వాలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాతో భారీ దోపిడీకి పాత్రధారిగా జయచంద్రారెడ్డి ఉంటారు’’ అనే ఆలోచనేనని స్పష్టమవుతోంది. ఇక తాజాగా పెద్ద ఎత్తున బయటపడిన నకిలీ మద్యం ఉదంతంలో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని స్పష్టమైనా.. ఆయనను తూతూమంత్రంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీన్నిబట్టే నకిలీ మద్యం దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం స్థాయిలో ఉందే నిర్ధారణ అవుతోంది. అంతా గుప్పిట పట్టి.. భారీ స్కెచ్.. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకే పోతుంది. మన జేబులు నిండేదెలా? అని ముఖ్య నేత భావించారు. అందుకే నకిలీ మద్యాన్నే అధికారికంగా విక్రయించే కుట్రకు కూటమి ప్రభుత్వం రాగానే తెరతీశారు. మద్యం వినియోగం తగ్గించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించారు. వాటి స్థానంలో టీడీపీ సిండికేట్ ద్వారా 3,736 ప్రైవేటు దుకాణాలను ఏర్పాటు చేయించారు. అనుబంధంగా మరో 3,736 పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చారు. టీడీపీ సిండికేట్ అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను తెరిచింది. తాజాగా 540 బార్లనూ (త్వరలో మరో 300 కూడా) ఈ సిండికేట్కే కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని 20 మద్యం డిస్టిలరీలు దశాబ్దాలుగా టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆ«దీనంలోనే ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరింటికి అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 20 డిస్టిలరీలనూ ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం ఎంప్యానెల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. ఈ విధంగా తయారీ నుంచి విక్రయాల వరకు నెట్వర్క్ అంతటినీ ముఖ్యనేత టీడీపీ మద్యం మాఫియా గుప్పిట్లో పెట్టారు. పచ్చ సీసాలో నకిలీ మద్యం కూటమి అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యతతో కొత్త మద్యం విధానం ఎందుకు అమలు చేశారో లోగుట్టు బయటపడుతోంది. మొత్తం మద్యం నెట్వర్క్ తమ చేతుల్లోకి రావడంతో ముఖ్య నేత రెండో దశ కుట్రను అమలు చేశారు. జయచంద్రారెడ్డితో చినబాబు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు తెరతీశారు. మొత్తం నకిలీ ముఠాకు తనకు అత్యంత సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చినబాబు సమన్వయకర్తగా పెట్టారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా టీడీపీ నేతలకు నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు కట్టబెట్టారు. నర్నీపటా్ననికి చెందిన సీనియర్ నేత కుటుంబానికి ఉత్తరాంధ్ర, ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజాప్రతినిధికి ఉమ్మడి ఉభయ గోదావరి, బాపట్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ కీలక నేతకు రాయలసీమలో నకిలీ మద్యం దందా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆఫ్రికా దేశాల్లో నకిలీ మద్యం తయారుచేసే విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూనిట్లను నెలకొల్పారు. కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్రావు, కట్టా సురేంద్రనాయుడు ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారు. ముఖ్య నేత సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు తరలించారు. రాష్ట్రమంతా ముఖ్యనేత ప్రవేశపెట్టిన నకిలీ బ్రాండ్లు కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్... ఇవీ ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా అమ్మకాలు సాగుతున్న మద్యం బ్రాండ్లు. ఎప్పుడూ వినని ఈ బ్రాండ్లు ఎక్కడివి అనే కదా మీ అనుమానం...? ఇవి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రవేశపెట్టిన ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం బ్రాండ్లు. వారి మాస్టర్ ప్లాన్లో భాగంగా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్రావు, సురేంద్రనాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న నకిలీ బ్రాండ్లే. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం... ఇలా తనిఖీలు చేసిన ప్రతిచోటా పట్టుబడినది టీడీపీ సిండికేట్ ప్లాంట్లలో తయారవుతున్న నకిలీ మద్యమే. గుట్టలుగుట్టలుగా నిల్వ చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సరుకు దొరకడం అధికారులనే విస్మయపరుస్తోంది. దీన్నిబట్టే ఎంత పక్కాగా, యథేచ్ఛగా ముఖ్య నేత ఆఫ్రికా మోడల్ నకిలీ దందాను నడిపిస్తున్నారో స్పష్టమవుతోంది. మోగుతున్న మరణమృదంగం... టీడీపీ కూటమి ప్రభుత్వం... బ్రాండెడ్ ముసుగులో విచ్చలబిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యం రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తోంది. 60 నుంచి 75 శాతం వరకు ఆల్కహాల్ ఉండే నకిలీ మద్యం తాగడంతో గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్ర పిండాలు వేగంగా దెబ్బతింటున్నాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావంతో చిత్తచాంచల్యం ఆవహిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. అంతుబట్టని మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో వరుస హఠాన్మరణాలకు నకిలీ మద్యమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఎక్సైజ్ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ మెడకు చుట్టుకుటుందని భావించారు. భవిష్యత్లో ఇబ్బంది రాకుండా ఎక్సై్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తనిఖీలు, దాడులు చేసింది. ఏదో కిందిస్థాయి ముఠా దొరికితే కేసులు నమోదు చేసి ట్రాక్ రికార్డు కాపాడుకోవాలనుకుంది. కానీ, వారు ఊహించని రీతిలో నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా బండారం బయటపడింది. ఈ మాఫియా డాన్ ముఖ్యనేతేనని తేలడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు నోట మాట రాలేదు. ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశంతో నకిలీ మద్యం మాఫియా తీవ్రతను కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, నకిలీ మద్యం దారుణాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుండటంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి ఏడాది రూ.5,280 కోట్ల దోపిడీ రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో మూడో వంతు నకిలీ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేయడం గమనార్హం. ఈ లెక్కన టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది రూ.5,280 కోట్ల నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది టీడీపీ సిండికేట్ లక్ష్యం. అంటే, రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టడానికి పన్నాగం పన్నింది. ఇందులో నకిలీ మద్యం దందాకు మూల విరాట్ అయిన ముఖ్యనేత కరకట్ట బంగ్లాకు 30 శాతం వాటాగా లెక్కతేల్చారు. మొత్తంమీద రూ.15 వేల కోట్లు కరకట్ట బంగ్లాకు కమీషన్గా చేరనుంది. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్కు 20 శాతం వాటా. ఇంత భారీ దోపిడీ కాబట్టే పెదబాబు, చినబాబు ఈ దందాను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అప్పట్లో దుష్ప్రచారం ... రాద్ధాంతం... ఇప్పుడు అంతటా మౌనం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తేనే టీడీపీ కూటమి, ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు తదితరులు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని రఘురామ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. అసలు తాము అటువంటి నివేదిక ఇవ్వలేదని ఆ ల్యాబ్ ప్రకటించంతో వారి కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యమైనదేనని ప్రకటించింది. అప్పట్లో రాద్ధాంతం చేసిన చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు క్రమంగా బయటపడుతున్నా కిమ్మనడం లేదు. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతను ర్యాండమ్గా పరీక్షించాలని కూడా భావించడం లేదు. ఇదంతా చూస్తుంటే నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దల దన్ను ఉందన్నదే స్పష్టమవుతోంది. స్పిరిట్ .. మనుషులకు ప్రాణాంతకం!వాస్తవానికి ఈ స్పిరిట్లో 100 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. పరిశ్రమలు తమ ఉత్పత్తుల (ఆహార సంబంధిత కాదు) తయారీకి ఈ స్పిరిట్ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాయి. ఇక బ్రాండెడ్ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన, భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్ను బాగా పలుచన (డైల్యూట్) చేసి ఆల్కహాల్ను 42 శాతానికి తగ్గిస్తాయి. తర్వాతే మద్యం తయారీకి ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఎందకంటే ఆల్కహాల్ 42 శాతం కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. కాగా, ఏడాదిగా టీడీపీ కూటమి పెద్దలు అక్రమంగా నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలు ఏమీ పాటించలేదు. వీటిలోని చిన్నచిన్న యంత్రాలకు స్పిరిట్ను ప్రాసెస్ చేసే సామర్థ్యం లేదు. స్పిరిట్లోని ప్రమాదకర కారమిల్ ద్రావణం, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు బ్రాండెడ్ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75 శాతం వరకు ఉంటోందని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అది ఎంత ప్రమాదకరమో ఊహకే అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీసాల్లో నకిలీ మద్యం నింపి మూతలు బిగించి టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న 3,736 ప్రైవేట్ దుకాణాలు, 3,736 పర్మిట్ రూమ్లు, 75 వేల బెల్ట్ దుకాణాలు, ఇప్పటికి 540 బార్లలో (త్వరలో మరో 300 కూడా) యథేచ్ఛగా అమ్ముతున్నారు. -
అంతా స్కెచ్ ప్రకారమే..!
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాము పన్నిన పన్నాగాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఈ మేరకు ‘‘కేసును పక్కదారి పట్టించి నీరుగారుస్తాం. కంగారుపడొద్దు’’ అని పెదబాబు, చినబాబు హామీ ఇవ్వడంతో ఎ1గా ఉన్న జనార్దన్రావు గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం దర్జాగా అడుగుపెట్టారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా సరే ఆయన ఏమాత్రం జంకు లేకుండా రావడం పోలీసులనే విస్మయపరిచింది. కాగా, కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ కథ కమామిషు ఇలా సాగింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడ్డ నకిలీ రాకెట్లో అడ్డంగా దొరికిన ఆఫ్రికా మోడల్ కల్తీ మద్యం మాఫియా సూత్రధారులు టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, ఆయన భాగస్వామి జనార్దన్రావుతో పాటు సురేంద్రనాయుడు ప్రభుత్వ పెద్దలకు ఎదురుతిరిగారు. తమను బయటపడేయకుంటే ఎన్నికలకు ముందు కుదిరిన డీల్ ప్రకారం... పెదబాబు, చినబాబు ఆదేశాలతోనే రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం దందాను వ్యవస్థీకృతం చేశామనే వాస్తవాన్ని బయటపెడతామని తేల్చి చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధితో పాటు కేసును పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారి ద్వారా కూడా సమాచారం పంపించారు. ‘మమ్మల్ని బయటపడేసే బాధ్యత ప్రభుత్వ పెద్దలదే... లేకపోతే మొత్తం నకిలీ మద్యం గుట్టు విప్పుతామని కుండబద్దలు కొట్టారు. జయచంద్రారెడ్డి, జనార్దన్రావు నోరువిప్పితే బండారం బయటపడుతుందని నకిలీ మద్యం దందా కుట్రదారులు, లబ్దిదారులైన పెదబాబు, చినబాబు బెంబేలెత్తారు. ‘‘తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేశాం తప్ప అంతకుమించి దర్యాప్తు ముందుకుసాగకుండా నీరుగారుస్తాం’’ అని హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించి కనికట్టు చేశామని.. టీడీపీలో ఆయన స్థానానికి ఢోకా లేదని కూడా భరోసా ఇచ్చారు. ‘‘విచారణకు హాజరైనట్టు, పోలీసులకు సహకరిస్తున్నట్టు నటించండి. కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని బయటకు తెచ్చి కేసును పూర్తిగా పక్కదారి పట్టిస్తామని’’ చెప్పారు. ఈ డ్రామా కొనసాగింపులోనే నకలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం లేదని వీడియో ద్వారా ప్రకటించాలని జనర్దాన్రావును చినబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా అందరినీ నమ్మించేందుకు ఓ ఆధారాన్ని సృష్టించినట్టు కూడా అవుతుందన్నదన్నది అసలు ఉద్దేశం. కేసు నుంచి బయటపడేస్తామన్న భరోసా వచ్చాకే... జనార్దన్రావు 4 రోజుల క్రితం వీడియో విడుదల చేశారు. అయితే, నకిలీ మద్యం వ్యవహారంతో టీడీపీ నేతలకు సంబంధం ఉందో లేదో చెప్పాల్సింది దర్యాప్తు చేసే పోలీసు అధికారులు. కానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దరావు టీడీపీ నేతలకు క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం.ఇదంతా చూస్తుంటే కేసును పక్కదారి పట్టించేందుకు ఎంత పక్కాగా కథ నడుపుతున్నారో స్పష్టమవుతోంది. ఆ స్కెచ్లో భాగంగానే జనార్దన్రావు పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ గన్నవరం విమానాశ్రయంలో దిగారు. వెంటనే పోలీసులు అరెస్టు చేయడంతో డ్రామాలో మొదటి అంకం పూర్తయింది. ఇక కొద్ది రోజుల్లోనే జనార్దన్రావును బెయిల్పై తీసుకొచ్చి కేసును పూర్తిగా నీరుగార్చాలన్నదే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నకిలీ మద్యం కేసులో జనార్దన్రావు అరెస్ట్గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్రావును ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అద్దేపల్లి జనార్దన్రావు ములకలపల్లి, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు. నకిలీ మద్యం గుట్టు రట్టయిన వెంటనే ఆయన ఆఫ్రికా పారిపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో 12 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదట ముగ్గురు నిందితులు అద్దేపల్లి జగన్మోహన్రావు, బాదల్ దాస్, ప్రతాప్ దాస్, కట్టారాజు, శ్రీనివాసరెడ్డి, కళ్యాణ్ను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చెందిన రవిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఏ–1 అద్దేపల్లి జనార్దన్రావు కూడా అరెస్ట్ కావడంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టయింది. అద్దేపల్లి జనార్దన్రావు అరెస్ట్పై శుక్రవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన విదేశాలకు పారిపోయాడని అధికారులు చెబుతున్నప్పటికీ... విజయవాడలోనే తలదాచుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ జనార్దన్రావు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్రావు మీడియాతో మాట్లాడుతూ తనను రాజకీయంగా ఈ కేసులో ఇరికించారన్నారు. ఆయన తరఫు న్యాయవాది రవీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనార్థనరావును తీసుకొచ్చి సరెండర్ చేస్తామని చెప్పినా ఎక్సైజ్ పోలీసులు స్పందించలేదన్నారు. ఆయనను బలవంతం చేసి వారికి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకొనేందుకు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆయనకు ఏదైనా జరిగితే ఎక్సైజ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిదిపై కేసు ములకలచెరువు: టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్రెడ్డిని నకిలీమద్యం తయారీ కేసులో నిందితులుగా ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం చేర్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈనెల 3న 14 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు. జయచంద్రారెడ్డిని ఏ17గా, గిరిధర్రెడ్డిని ఏ18గా చేర్చారు. మిగిలిన వారిలో అణ్బురాసు, అష్రఫ్, బాలాజీ, సుదర్శన్, రవి ఉన్నారు. కేసులో ఏ–2 కట్టా రాజు, ఏ–12 కొడాలి శ్రీనివాసరావుల వాంగ్మూలాల ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వీరి అరెస్టు కోసం ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. -
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు
-
నకిలీ మద్యం రాకెట్పై బాబు డైవర్షన్ గేమ్
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే రీతిలో టీడీపీ నేతల నేతృత్వంలో నకిలీ మద్యం రాకెట్ బట్టబయలవ్వడంతో దాన్ని తప్పుదోవ పట్టించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా వర్థిల్లుతున్న నకిలీ మద్యం బాగోతంపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యం యూనిట్ నడుస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులే బట్టబయలు చేసినా, దాంతో తమకు సంబంధం లేదని కొందరు టీడీపీ నేతలతో మాట్లాడిస్తుండటం నివ్వెరపోయేలా చేస్తోంది. అంతటితో ఆగకుండా జయచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ కోవర్ట్ అని, అందుకే టీడీపీలో చేరి నకిలీ మద్యం పరిశ్రమ నడిపి దాన్ని బయట పెట్టారనే అబద్ధపు వాదనను మొదలుపెట్టారు. రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఎల్లో మీడియా ఇదే వాదనను జనంలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన టీడీపీ నేత కాదా? జయచంద్రారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. తంబళ్లపల్లెలో అధికార పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే నడిపిస్తున్నారు. బదిలీలు, కాంట్రాక్టులు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. లోకేశ్కు జయచంద్రారెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో శంకర్ యాదవ్ వంటి సీనియర్ను పక్కనపెట్టి మరీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి లోకేశ్తో ఉన్న వ్యాపార ఒప్పందాలు, సాన్నిహిత్యమే కారణం. ఆ సంబంధాల నేపథ్యంలోనే ములకలచెరువు సమీపంలో భారీగా నకిలీ మద్యం తయారు చేసి.. వైన్ షాపులు, బెల్టు షాపులకు సరఫరా చేసే పరిశ్రమను ప్రారంభించినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. కట్టా సురేంద్రనాయుడు, ఆద్దేపల్లి జనార్దనరావు వంటి వారి ద్వారా నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాలను నడిపిస్తున్న విషయం బయటపడింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా నకిలీ మద్యం తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నట్లు ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న నకిలీ మద్యం డంపులే నిదర్శనం. టీడీపీ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత వ్యవస్థీకృత దందా నిర్వహించడం అసాధ్యమని ఎన్నో ఏళ్లుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న వారు చెబుతున్నారు. వారి అండదండలు ఉండబట్టే ఏకంగా నకిలీ మద్యం కోసం పరిశ్రమను స్థాపించి, నకిలీ సరుకును అన్ని ప్రాంతాలకు.. కోరిన బ్రాండ్ల పేరుతో సరఫరా చేస్తున్నారు. బాబు మార్కు డైవర్షన్ ఇదంతా టీడీపీయే చేస్తుందనే విషయం బయట పడడంతో చంద్రబాబు తన మార్కు యాక్షన్ ప్రారంభించారు. నకిలీ మద్యంపై తాను సీరియస్గా ఉన్నట్లు, ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మీడియాకు లీకులిస్తున్నారు. అయినా నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రాన్ని షేక్ చేస్తుండడంతో తంబళ్లపల్లె పార్టీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, స్థానిక నేత సురేంద్ర నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కోవర్టు అనే ప్రచారాన్ని పెద్దఎత్తున చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు సతీష్ రెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న నకిలీ మద్యం వ్యవహారంపై మాట్లాడుతూ ములకలచెరువు యూనిట్ ద్వారా ఐదేళ్లలో రూ.500 కోట్లను అక్రమంగా దండుకునేందుకు స్కెచ్ వేశారని చెబితే దాన్ని వక్రీకరించారు. ఈ దుష్ప్రచారాన్ని ఏకంగా టీడీప్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా చేయడాన్ని బట్టి వారు ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చు.గుట్టు రట్టవడంతో గప్చుప్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా రెప్పపాటు వ్యవధిలో స్పందించే చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. నకిలీ మద్యం వ్యవహారంపై మాత్రం ఇంత వరకు నోరు విప్పక పోవడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం నకిలీ మద్యంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. అలాంటప్పుడు తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డిని ఎందుకు సస్పెండ్ చేసినట్లు? పట్టుబడుతున్న నకిలీ మద్యం బాటిళ్లు అన్నింటిలోనూ టీడీపీ ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. అనేక చోట్ల నకిలీ మద్యం బయట పడుతుండటంతో ఏం మాట్లాడాలో తెలియక టీడీపీ నేతలు మొత్తం సైలెంట్ అయిపోయారు. రెడ్హ్యాండెడ్గా టీడీపీయే ఈ దందా చేస్తున్నట్లు అందరికీ తెలిసి పోవడంతో దీనిపై మాట్లాడేందుకు ఆ పార్టీ నాయకులు ముందుకు రావడంలేదు. ఇప్పుడు అన్నిచోట్లా తాము తాగుతున్న మద్యం కూడా నకిలీయేనా అనే అనుమానం టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. -
Fake Liquor: సస్పెన్షన్ పై టీడీపీ జయచంద్రారెడ్డి రియాక్షన్
-
టీడీపీ కూటమి సర్కారు పెద్దలకు నకిలీ మద్యం రాకెట్ టెన్షన్
-
ఆఫ్రికా టు ఆంధ్రా!
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ కీలక నేత అండతోనే నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో రెక్కలు విప్పుకుందని తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి ఆ ‘కీలక’ నేతతో ఉన్న సంబంధం వల్లే ఇంత భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాంట్ స్థాపించినట్లు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించే వరకు ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు లేదు. అయితే అంతకు కొద్ది రోజుల ముందు ‘మద్యం’ వ్యాపారానికి సంబంధించిన పలు విషయాలను ఈయన ‘కీలక’ నేతతో చర్చించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగా మద్యం తయారీతోపాటు గోవాలో ఖాయిలా పడిన మద్యం పరిశ్రమను లీజుకు తీసుకుని వ్యాపారం చేయొచ్చని.. భారీ స్థాయిలో డబ్బు ఆర్జించవచ్చని లెక్కలతో సహా చెప్పడంతోనే టికెట్ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అందువల్లే టీడీపీని ఎంతో కాలం నమ్ముకుని ఉన్న, ఆ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న శంకర్ యాదవ్ను కాదని చివరి క్షణంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయక ముందు నుంచి సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఆ అనుభవంతో రాష్ట్రంలో ‘మద్యం’ వ్యాపారం చేసే ‘స్కెచ్’ను ‘కీలక’ నేతకు ఇచ్చినట్లు సమాచారం. మొన్న ములకలచెరువులో బట్టబయలైన నకిలీ ప్లాంట్ తీరుతెన్నులు, ఇన్నాళ్లూ సాగించిన అక్రమ వ్యాపారం తీరు చూస్తుంటే ‘కీలక’ నేత అండదండలు లేకుండా ఇంత భారీగా దందా నడిపించడం అసాధ్యమని ఎక్సైజ్, పోలీసు వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. ఈ నకిలీ మద్యం దందా సవ్యంగా సాగేందుకు ‘కీలక’ నేత ఆదేశాలతో అన్నమయ్య జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతతో జయచంద్రారెడ్డి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ములకలచెరువు తరహాలో విజయవాడ ప్రాంతంలో ఒకటి, కర్ణాటకలో కూడా మరో నకిలీ మద్యం ప్లాంట్ నడుస్తున్నట్లు సమాచారం. అయితే శనివారం నుంచి వీటిని తాత్కాలికంగా బంద్ చేసినట్లు తెలిసింది.జనార్దనరావును ముందు పెట్టి దందాకళ్లకు కనిపిస్తున్న ఆధారాలు, ఈమధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ కేసులో ఏ–1గా కేసు నమోదైన అద్దేపల్లె జనార్దనరావును ముందు పెట్టి.. జయచంద్రారెడ్డి కథ నడిపించారని స్పష్టమవుతోంది. జయచంద్రారెడ్డిది ములకలచెరువు సొంత మండలం. విజయవాడకు చెందిన జనార్దనరావుతో జయచంద్రారెడ్డికి కాలేజీ రోజుల నుంచే స్నేహం ఉంది. తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం జయచంద్రారెడ్డి సొంత మండలంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించే స్థాయికి వచ్చింది. జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బి–ఫాంను స్వీకరించే సమయంలోనూ జనార్దనరావు పక్కనే ఉన్నాడు. పైగా ఆ సమయంలో జనార్దనరావు చంద్రబాబుతో చాలా సేపు మాట్లాడినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం రాకెట్పై ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీడీపీలో చేరిన రోజు జయచంద్రారెడ్డితో జనార్దనరావు (ఫైల్) అధికారమే అండగా..ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ నడిపేందుకు ఎక్కడో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తికి సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యమైనా ఇంతటి ప్రమాదకరౖమెన నకిలీ మద్యం తయారీకి బలమైన స్థానికుల సహకారం లేకుండా సాహసం చేయగలడా? ఇలాంటి పనికి స్థానికులు భవనాలను లీజుకు ఇస్తారా? జయచంద్రారెడ్డి అధికార టీడీపీ ఇన్చార్జి కావడం, ‘కీలక’ నేత అండతో, అధికార బలంతో, వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చని ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒకవేళ జయచంద్రారెడ్డికి సంబంధం లేకుంటే నకిలీ మద్యం వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి సహకరించినదెవరో అధికారులు ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదు? నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించడం కూలీలకో, అధికారం లేని వ్యక్తులకో సాధ్యమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ నకిలీ మద్యం కేసులో ఐదో నిందితుడు కావడం ఆయన పాత్ర ఉందని నిర్ధారిస్తోంది. సాధారణ వ్యక్తి అయిన రాజేష్కు మద్యం దుకాణం నిర్వహించే స్థాయి లేదు. పాల వ్యాను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమతా లేదు. ఈ లెక్కన కీలక సూత్రధారుల్లో జయచంద్రారెడ్డి కూడా ఒకరని స్పష్టమవుతోంది. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి మాత్రం ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే.ఆ మంత్రికి భయం పట్టుకుందినకిలీ మద్యం తయారీ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం లేదని ఇంత వరకు ప్రభుత్వం కానీ, టీడీపీ వర్గాలు కాని ఖండించలేదు. శుక్రవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాయలసీమకు చెందిన ఓ మంత్రి ముందుండి పరిస్థితిని చక్కబెడుతున్నారని సమాచారం. టీడీపీ నేతల ప్రమేయం బయటకు వస్తే దాని ప్రభావం తనపై పడుతుందన్న భయంతో ఆ మంత్రి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ మంత్రి 2సార్లు ములకలచెరువులో జయచంద్రారెడ్డి ఇంటికి అనధికారికంగా వచ్చారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. -
తంబళ్లపల్లెలో టీడీపీ అస్త్ర సన్యాసం!
బి.కొత్తకోట: ఏ ఎన్నికై నా బరిలో నిలిచే అభ్యర్థి, ఆ పార్టీ యంత్రాంగం విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతారు, విజయమో, వీరస్వర్గమో అన్నంతగా ప్రత్యర్థులతో తలపడతారు. అయితే ప్రస్తుతం తంబళ్లపల్లెలో టీడీపీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ చూడని దయనీయమైన ప్రస్తుత పరిస్థితిని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డితో తలపడే స్థితిలో లేని టీడీపీ ఓటింగ్కు ముందే అస్త్ర సన్యాసం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎక్కడా ప్రచార ఆర్భాటాలు లేవు, ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయమన్న అభ్యర్థనలు లేవు. సోమవారం ఓటింగ్ జరగనుండగా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్ల కోసం క్యాడర్ పని చేయడమూ లేదు. దీనితో ఓటింగ్కు ముందే టీడీపీ ఓటమి పాలైందా అన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది.అభ్యర్థి ఎవరో తెలియదుటీడీపీ అభ్యర్థుల తొలి జాబితాలోనే తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును చంద్రబాబు ఫిబ్రవరి 24న ప్రకటించారు. రాజకీయాలకు, టీడీపీకి కొత్త అయిన అయన్ను చూడాలని పల్లెల్లోని ఓటర్లు ఎదురుచూశారు. ఆరు మండలాల్లో 1,200లకుపైగా పల్లెలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రతిపల్లెకు తారురోడ్లు నిర్మించారు. అయినప్పటికి ఇందులో సగం పల్లెల్లోనైనా టీడీపీ అభ్యర్థి ప్రచారం జరగలేదు. ప్రచారానికి వెళ్లినా కొద్దిసేపటికే ముగిస్తారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు టీడీపి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి. ఓటర్లతో కనీస పరిచయాలు లేకపోవడం, తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం మిగతా కులాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారం–పదిరోజులుగా టీడీపీ ప్రచారమే కనిపించడం లేదు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మొదట్లో జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా ఆ తర్వాత ఆయనకు దగ్గరయ్యారు. కానీ శంకర్ వర్గాన్ని గుర్తించకపోవడంతో అభ్యర్థి తీరుపై అసంతృప్తితో వారు దూరమయ్యారు.అయిష్టంగానే కిరణ్టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని మార్చేవరకు తంబళ్లపల్లెలో అడుగుపెట్టను అని చెప్పిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి చివరకు సర్దుకుపోయారు. నియోజకవర్గ పర్యటనల్లో జయచంద్రారెడ్డితో కలిసి కిరణ్ అయిష్టంగానే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికితోడు కిరణ్ వర్గీయుల ప్రచారంలో ఎంపీ అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేయాలని కోరుతుండటం గమనార్హం.చంద్రబాబు హెచ్చరించినాటీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని చంద్రబాబు రెండుసార్లు హెచ్చరించినా ఆర్థిక వనరులను సమకూర్చుకునే విషయంలో చేతులెత్తేసినట్టు తెలిసింది. దీంతో చంద్రబాబు కూడా తంబళ్లపల్లెలో టీడీపీ గెలుపు అవకాశాలపై ఆశలు వదులుకున్నట్లు స్పష్టమవుతోంది.ఎన్నికలకు క్యాడర్ దూరంసోమవారం జరిగే ఎన్నికలకు మెజారిటీ టిడీపీ క్యాడర్ దూరంగా ఉంటోంది. గెలుపునకు పనిచేయాలని అభ్యర్థి జయచంద్రారెడ్డి నుంచి పిలుపు లేకపోవడంతో ముఖ్యమైన నేతలు, మండలస్థాయి నాయకులు నిస్తేజంగా ఉండిపోయారు. ఎన్నికల్లో పనిచేసేందుకు కనీస ఖర్చులు భరించకుంటే ఓటర్లను కలిసి ఎలా ఓట్లు అడుగుతామని అంటున్నారు. -
జస్టిస్ జయచంద్రారెడ్డి మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. లా కమిషన్ చైర్మన్గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా భారత న్యాయవ్యవస్థకు ఆయన చేసిన కృషి మరువలేనిదని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. Deeply saddened by the demise of luminary Justice (Retd) K. Jayachandra Reddy. His contribution towards the Indian Judiciary System as the Head of Law Commission & Press Council of India was noteworthy. My thoughts & prayers are with his bereaved family. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2020 పదవీ విరమణ అనంతరం బెంగళూరులో ఉంటున్న జస్టిస్ జయచంద్రారెడ్డి ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్లతో బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్న జస్టిస్ జయచంద్రారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చదవండి : కుగ్రామం నుంచి సుప్రీం స్థాయికి.. జస్టిస్ జయచంద్రారెడ్డి కన్నుమూత -
జేసీ బదర్స్ ముఠా అరాచకాలు తారస్థాయికి చేరాయి
-
టీడీపీ నుంచి మరో నేత సస్పెన్షన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో నాయకుడు ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ జయచంద్రారెడ్డిపై వేటు వేశారు. ఆయనపై మూడు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఇటీవల జయచంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై జేసీకి క్షమాపణ చెప్పాలని పార్టీ ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. తాను చేసిన ఆరోపణలను కట్టుబడి క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీంతో టీడీపీ ఆయనపై చర్య తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను వదిలేసి కౌన్సిలర్ను సస్పెండ్ చేయడాన్ని తాడిపత్రి ప్రజలు తప్పుబడుతున్నారు. భూకబ్జా కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో జేసీ అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్రెడ్డిని టీడీపీ ఇటీవల బహిష్కరించింది. బ్యాంకులకు డబ్బులు ఎగవేశారని ఆరోపణలు రావడంతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని అంతకుముందు టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. -
జంట హత్యతో కలకలం
వివాహేతర సంబంధమే కారణం ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు హత్య బుక్కచెర్ల గ్రామంలో విషాద ఛాయలు జంట హత్యలతో ‘అనంత’ ఉలిక్కిపడింది. అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట సమీపంలో గోపీనాయక్, వెంకటేశ్నాయక్ల హత్యను మరువకనే ఇదే మండలం కక్కలపల్లి గ్రామ సమీపంలో మరో జంట హత్య వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. అనంతపురం సెంట్రల్ : వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు... రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు జయచంద్రారెడ్డి (22) ఆటో డ్రైవర్. ఇతను గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె బంధువులకు తెలియడంతో కొంత కాలం క్రితం గొడవ జరిగింది. పద్ధతి మార్చుకోవాలని జయచంద్రారెడ్డిని పలుమార్లు హెచ్చరించారు. అయినా మార్పు రాకపోవడంతో విసిగిపోయిన మహిళ బంధువులు జయచంద్రారెడ్డిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. అదును చూసి.. అంతమొందించారు.. జయచంద్రారెడ్డి అక్క కుమారుడికి గురువారం సాయంత్రం కుక్క కరిచింది. కుటుంబ సభ్యులతో కలిసి బాలుడిని తీసుకుని రాత్రి 9.30గంటలకు అనంతపురం సర్వజనాసుపత్రికి తన ఆటోలో తీసుకొచ్చాడు. అక్కడ అడ్మిషన్ చేయించిన అనంతరం అదే రోజు రాత్రి తన స్నేహితుడు అశోక్కుమార్రెడ్డి(22)తో కలిసి స్వగ్రామానికి బయల్దేరాడు. అప్పటికే కాపు కాచిన మహిళ బంధువులు ఆటోను అటకాయించారు. మార్గమధ్యంలో ఇద్దరిపై దాడి చేసి, తాడులతో గొంతు బిగించి హతమార్చారు. అనంతరం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. జయచంద్రారెడ్డి–అశోక్కుమార్రెడ్డి మృతితో బుక్కచెర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు జంట హత్యలు జరిగిన విషయం వెలుగులోకి రావడంతో అనంతపురం రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్ఐలు జగదీష్, నాగేంద్రప్రసాద్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుల బంధువులు ఫిర్యాదు మేరకు రాప్తాడు మండలం కొత్తపల్లికి చెందిన మహిళ సోదరుడు సోమనాథ్యాదవ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఎంత పని సేశావురా..?
ఆర్థిక భారంతో ఎంటెక్ చదవలేక గాండ్లపెంట మండలం కత్తివారిపల్లికి చెందిన ఇంజనీరింగ్ (సివిల్) పట్టభద్రుడు పాళ్యం జయచంద్రారెడ్డి(22) ఆదివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఉద్యోగం రాకపోతే ఏదో ఒక పని సేసుకుని బతికేటోళ్లం. పెద్ద సదువు సదవ లేదని మాకు అన్యాలం సేసి పోయినావురా.. సెట్టంట ఎదిగాడని సంబరపడితే ఇట్టెందుకు సేత్తివిరా..’ అంటూ తల్లి శివమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. తెలివైన విద్యార్థి ఇలా తనువు చాలించడంపై గ్రామస్తులు కంట నీరు పెట్టారు. తండ్రి పాళ్యం వెంకటరమణారెడ్డి తనకున్న మూడున్నర ఎకరాల పొలంతో బతుకు బండిని భారంగా లాగిస్తుండగా.. చేతికొచ్చిన కొడుకు ఇలా బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. సోదరి రాజేశ్వరి వివాహ నిశ్చితార్థంతో సోమవారం కళకళలాడాల్సిన ఇల్లు రోదనలతో దద్దరిల్లింది.


