సింధుకు వజ్రాల రాకెట్ కానుక
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: అంతర్జాతీయ పోటీల్లో రాణించే క్రీడాకారులందరికీ ప్రోత్సాహం, గుర్తింపు అవసరమని ఒలింపిక్స్ రజత విజేత పీవీ సింధు అన్నారు. ప్రసిద్ధ వజ్రాభరణాల సంస్థ కీర్తిలాల్స్ సోమాజిగూడ షోరూమ్లో సింధుని శుక్రవారం ఘనంగా సన్మానించింది. కీర్తిలాల్స్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ వజ్రాలు పొదిగిన బంగారు బ్యాడ్మింటన్ రాకెట్ను సింధుకు బహుమతిగా అందజేశారు. సిసలైన బంగారం లాంటి సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంస్థ ఎండీ శాంతకుమార్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, మధుసూధన్, సీమా మెహతా పాల్గొన్నారు.