l and t metro rail
-
సాక్షి ఎఫెక్ట్: రాయదుర్గం భూములపై ఎల్అండ్టి మెట్రో రైల్ వివరణ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం భూములపై ఎల్అండ్టీ మెట్రో రైల్ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదంతోనే సబ్లైసెన్స్ హక్కులను రాఫర్టీకి అప్పగిమంచామని, ఈజీఎంలో షేర్ హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాతే బీఎస్ఈకి తెలిపామని ఎల్అండ్టీ మెట్రో రైల్ తెలిపింది. స్థిరాస్తి విక్రయించండం జరగదని స్పష్టం చేసింది. సబ్ లైసెన్స్పై కొన్ని అనుమతులు రావాల్సి ఉందనిఎల్అండ్టీ మెట్రో రైల్ పేర్కొంది. చదవండి: కేసీఆర్ పక్కా ప్లాన్.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. -
మెట్రోలో వెళ్తున్నారా.. బిగ్బాస్ మిమ్మల్ని గమనిస్తున్నారు జాగ్రత్త..!
హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు బిగ్బాస్ను బరిలోకి దించింది. సురక్షిత ప్రయాణంపై సామాజిక సందేశాన్ని స్టార్ మా, ఎల్ అండ్ టీ మెట్రో సంయుక్తంగా ప్రచారం కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా స్టార్ మా బిగ్బాస్ సీజన్ -6 హోస్ట్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా బిగ్బాస్ ఈజ్ వాచింగ్ యు (బిగ్బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు) అనే పోస్టర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘బిగ్ బాస్ ఈజ్ వాచింగ్ యు’ ప్రచారం ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని నగరంలోని 57 మెట్రో స్టేషన్లలోని కాన్కోర్స్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్, చెక్ ఇన్ ప్రాంగణాలలో చేస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్తో పాటుగా అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ను మొత్తం బిగ్బాస్ సీజన్లో 100 రోజులూ ప్రచారం చేయనున్నారు. ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా మెట్రో స్టేషన్ ప్రాంగణాలలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగా భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేయనున్నారు. (చదవండి: బన్నీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. పుష్ప-2 ఫస్ట్ గ్లింప్స్ ఆరోజే..!) బిగ్బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. 'వినోదంతో పాటుగా ఓ సహేతుకమైన సందేశమూ ఉండాలి. ఈ ప్రచారం ఆ విధానానికి చక్కటి ప్రాతినిధ్యం వహిస్తుంది. బిగ్బాస్ అనేది పూర్తి వినోదాత్మక కార్యక్రమం. భావోద్వేగాలను తట్టి లేపుతుంది. ఈ ప్రచారం ద్వారా భద్రత పట్ల మరింత అవగాహన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయాణికులకు చక్కటి విలువను జోడించనుంది. స్టార్ మా, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఈ తరహా బాధ్యతాయుతమైన ప్రచారం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉంది' అని అన్నారు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. 'స్టార్ మా బిగ్బాస్తో విజయవంతంగా మూడో ఏడాది భాగస్వామ్యం చేసుకున్నాం. ఈ భాగస్వామ్యంలో భాగంగా మేము ‘బిగ్బాస్ ఈజ్ వాచింగ్ యు’ ప్రచారం ప్రారంభించాము. దీని ద్వారా భద్రతా అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం. ఈ ప్రచారం ద్వారా స్మార్ట్ ట్రావెల్ అలవాట్లను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిద్వారా మెట్రో ప్రయాణీకులు మొబైల్ క్యూఆర్ టిక్కెట్లు, స్మార్ట్ కార్డులు వినియోగించాల్సిందిగా చెబుతున్నాం. సూపర్ స్టార్ నాగార్జున, స్టార్ మా నెట్వర్క్కు నా అభినందనలు తెలియజేస్తున్నా' అని అన్నారు. (చదవండి: ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావు, మరి నిన్నేమనాలి?: నాగ్) -
మెట్రో స్టేషన్లలో జనరిక్ మెడికల్ షాపులు
సాక్షి హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో ఇక నుంచి జనరిక్ ఔషధాలు, ఇతర ఫార్మా ఉత్పత్తులు లభించనున్నాయి. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ , దవా దోస్త్ సంస్థతో భాగస్వామ్యం చేసుకోవడంతో మెట్రో ప్రయాణికులకు ఈ అవకాశం దక్కింది. దవా దోస్త్ సంస్థ ఏర్పాటు చేసిన తొలి హై ఫ్రీక్వెన్సీ స్టోర్ను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ ఉన్నతాధికారులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. త్వరలోనే దవా దోస్త్ కేంద్రాలు అమీర్పేట, కెపీహెచ్బీ, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ తదితర స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులతో పాటుగా సందర్శకులకు ఇది సంతోషకరమైన సమాచారం. ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా జనరిక్ మందులు, ఇతర ఔషధ ఉత్పత్తులను ఆకర్షణీయమైన రీతిలో 15 నుంచి 80 శాతం రాయితీలలో పొందవచ్చన్నారు. ఎల్ అండ్ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైల్ వద్ద దవా దోస్త్ను స్వాగతిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ వద్ద వచ్చిన ఈ స్టోర్తో రాయితీ ధరలలో ప్రయాణికులు ఔషధాలు పొందవచ్చన్నారు. దవాదోస్త్ సంస్థ సీఈవో అమిత్చౌదరి మాట్లాడుతూ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దవా దోస్త్ ప్రారంభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామన్నారు. -
ఆర్థిక ఇబ్బందుల్లో హైదరాబాద్ మెట్రో.. గట్టెక్కెందుకు కొత్త ప్లాన్
మెట్రో రైలు ప్రాజెక్టుకు అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ నడుం బిగించింది. మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధుల సేకరణ రెడీ అయ్యింది. వరుస నష్టాలు ఎల్ అండ్ టీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి హైదరాబాద్ మెట్రో రైలు గాడిన పడే సమయంలో కరోనా సంక్షోభం ఎదురైంది. ఏడాదిన్నరగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు కమర్షియల్ స్పేస్ నుంచి ఆశించిన ఆదాయం రావడం లేదు. రోజురోజుకు నష్టాల భారం పెరిగి పోయి చివరకు నిర్వహాణ భారంగా మారే పరిస్థితి వచ్చింది. దెబ్బ మీద దెబ్బ హైదరాబాద్ మెట్రోని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ ఇప్పటే పలు మార్లు ప్రభుత్వాలను కోరింది ఎల్ అండ్ టీ. మరోవైపు బ్యాంకుల నుంచి సాఫ్ట్లోన్ కోసం కూడా ప్రయత్నాలు చేసింది. అక్కడ జాప్యం అవుతుండటం మరోవైపు కోవిడ్ నిబంధనలు, వర్క్ ఫ్రం హోం, ఓమిక్రాన్ వేరియంట్ ఇలా అనేక అంశాల కారణంగా ఆశించిన స్థాయిలో మెట్రో ఆదాయం పెరగడం లేదు. దీంతో ఆర్థిక పరిపుష్టి కోసం ఎల్ అండ్ టీ సంస్థ మార్కెట్కు వెళ్లాలని నిర్ణయించింది. రూ. 13,600 కోట్లు మార్కెట్లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ చేయడం ద్వారా రూ. 8,600 కోట్లు కమర్షియల్ పేపర్ల ద్వారా మరో రూ.5,000 కోట్లు మొత్తంగా రూ. 13,600 కోట్ల నిధులు సమీకరించాలని ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయించినట్టు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు కమర్షియల్ పేపర్ ద్వారా సేకరించే నిధులకు వన్ ఇయర్ మెచ్యూరిగా టైంగా ఉండగా వడ్డీ 5 నుంచి 5.30 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఇక నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ విషయంలో మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు ఉండగా వడ్డీ రేటు 6.30 శాతం నుంచి 6.60 శాతం వరకు ఉండవచ్చని అంచనా. క్రిసిల్ రేటింగ్.. ఎస్బీఐ క్యాపిటల్ ప్రముఖ రేటింగ్ సంస్థ అంచనాల ప్రకారం హైదరాబాద్ మెట్రో సంస్థకి ట్రిపుల్ ఏ (సీఈ) ఉంది. కాబట్టి మార్కెట్ నుంచి కన్వర్టబుల్ డిబెంచర్స్, కమర్షియల్ పేపర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ సులువుగానే జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ ద్వారా డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు జారీ కానున్నట్టు సమాచారం. నష్టం రూ.1,767 కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్)ని డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్దతిన ఎల్ అండ్ టీ నిర్మించింది. 35 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు సర్వ హక్కులు ప్రభుత్వానికి దాఖలు పడతాయి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మేర హెచ్ఎంఆర్ విస్తరించి ఉంది. ప్రస్తుతం మెట్రో రైలుకి రూ.1.767 కోట్ల నష్టాల్లో ఉంది. ఇందులో రూ.382 కోట్ల నష్ట గతేడాది కాలంలో వచ్చింది. చదవండి: ఒమిక్రాన్ భయం.. మెట్రోకు దూరం దూరం! -
అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం?
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి కోవిడ్ సంక్షోభం శాపంగా మారింది. వరుస లాక్డౌన్లు, కఠిన నిబంధనలు, వర్క్ఫ్రం హోం వంటి కారణాల వల్ల నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతుంది. దీంతో హైదరాబాద్ మెట్రోలో తన వాటా అమ్మేందుకు ఎల్ అండ్ టీ సన్నాహలు చేస్తోంది. మెట్రో స్పీడుకి కోవిడ్ బ్రేకులు పబ్లిక్ , ప్రైవేటు పార్టనర్షిప్లో ప్రపంచలోనే అతి పెద్ద మెట్రోగా 71 కిలోమీటర్ల నిడివితో మూడు మార్గాల్లో హైదరాబాద్ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. ఆరంభానికి తగ్గట్టే ప్రారంభించిన ఏడాదిలోపే నిత్యం 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణ సాధనంగా మారింది. ఇక లాభాల రూట్లోకి వెళ్లడమే తరువాయి అనే సమయంలో కోవిడ్ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. నష్టాల ట్రాక్లో కోవిడ్ ఫస్ట్ వేవ్ కారణంగా ఆరు నెలల పాటు మెట్రో రైలు నడవలేదు. ఆ తర్వాత కఠిన నిబంధనల మధ్య 2020 సెప్టెంబరులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి, క్రమంగా ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటున్న తరుణంలో 2021 మేలో మరోసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఫలితంగా మరోసారి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో వరుసగా మెట్రో నష్టాలు పెరిగాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మెట్రో నష్టాలు రూ. 1,766 కోట్లకు చేరగా అంతకు ముందు ఏడాది ఈ నష్టం రూ. 382 కోట్లుగా నమోదైంది. మొత్తంగా రెండు వేలకు కోట్లకు పైగా నష్టాల్లో మెట్రో నడుస్తోంది. వర్క్ఫ్రం హోం ఎఫెక్ట్ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వర్క్ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కోవిడ్ కారణంగా పడిన జీతాల కోతకు తోడు మెట్రో సర్వీసులు రెగ్యులర్గా నడకవపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ రవాణాకు మారిపోయారు. దీంతో సెకండ్ వేవ్ ముగిసినా మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరగడం లేదు. ఫలితంగా రోజువారి ప్రయాణికుల సంఖ్య 4.50 లక్షల నుంచి కేవలం ఒక లక్షకు పడిపోయింది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో మెట్రో నష్టాలు తడిసి మోపెడు అవుడం ఖాయంగా మారింది. వాటా అమ్మకానికి సిద్ధం లాభాలు తెచ్చివ్వని సంస్థల్లో వాటాలు అమ్మేయాలని ఎల్ అండ్ టీ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా పంజాబ్లోని పవర్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్ మెట్రోలో వాటాను అమ్మాలని సంస్థాపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ మెట్రోలో 15 శాతం వాటా అమ్మకానికి ఎల్ అండ్ టీ రెడీ అవుతోంది. హైదరాబాద్ మెట్రోలో వాటాను వాటాను కొనుగోలు చేసేందుకు గ్రీన్కో సంస్థ సిద్ధంగా ఉందంటూ ఎల్ అండ్ టీ వైస్ప్రెసిడెంట్ డీకే సేన్ అన్నారు. అయితే దీనిపై గ్రీన్ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం అనుమతిస్తుందా ? హైదరాబాద్ మెట్రో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్లో నిర్మించిన ప్రాజెక్టు కావడంతో ఎల్ అండ్ టీ తన వాటాలను ఏకపక్షంగా అమ్మేయడానికి వీలులేదు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటాల విక్రయానికి సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెట్రో అధికారులు అంటున్నారు. సాయం అందేనా ? నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలులో పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ ముందుకు వచ్చినట్టు వార్తలు రావడం కొంత శుభ పరిణామంగా చెప్పుకోవాలిజ హైదరాబాద్ మెట్రోలో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ సుముఖతగా ఉన్నట్టు సమాచారం. నష్టాల ఊబి నంచి బయట పడేందుకు గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం వివిధ బ్యాంకులను హైదరాబాద్ మెట్రో ఆశ్రయిస్తోంది. చదవండి : మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం -
ఎల్ అండ్ టి మెట్రో రైలుకు రుణాల బెడద
-
తీన్మార్గ్
ఖైరతాబాద్ వైపు నుంచి కూకట్పల్లి వైపు ఓ రోడ్డు మార్గం... బంజారాహిల్స్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు మరో రోడ్డు మార్గం... ఇదే మార్గంలో ఫ్లైఓవర్లు... ఇప్పుడు ఆ ఫ్లైఓవర్లపై నుంచి మెట్రో రైల్ లైన్... అప్పుడప్పుడు సినిమాల్లో ఫారిన్ సీన్లలో కనిపించే దృశ్యాలు.. రానున్న రోజుల్లో పంజగుట్టలో కనిపించనున్నాయి. ఎర్రమంజిల్ వద్ద రోడ్డునుంచి తాకేంత ఎత్తులోనే మెట్రో రైల్వే స్టేషన్.. పంజాగుట్ట వరకు వచ్చే సరికి 70 అడుగుల ఎత్తులో పిల్లర్ల నిర్మాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు.. ఇక్కడ ఇప్పటికే ఫ్లైఓవర్ ఉండటంతో దానిపైనుంచి మెట్రో లైన్ నిర్మాణం జరుగుతోంది. ఖైరతాబాద్ నుంచి ఎత్తును పెంచుకుంటూ వస్తున్నారు. ఎర్రమంజిల్ మెట్రో రైల్వే స్టేషన్ భూమిని తాకేంత ఎత్తులో నిర్మాణం జరుగుతోంది. నెల రోజుల నుంచి పంజగుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లర్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. భారీ రద్దీ, ట్రాఫిక్ సమయాల్లోనూ పనులు కొనసాగిస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పంజగుట్టలో మెట్రోరైలు పనులు పూర్తయితే ఈ చౌరస్తా రూపురేఖలే మారనున్నాయి. -
''అవాంతరాలున్నా మెట్రో పనులు ఆపలేదు''
-
అవాంతరాలున్నా మెట్రో పనులు ఆపలేదు: గాడ్గిల్
మెట్రోరైలు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రోరైల్ సీఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. తాజాగా హైదరాబాద్ మెట్రోరైలు విషయమై చెలరేగిన వివాదం నేపథ్యంలో ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాజెక్టుకైనా అవాంతరాలు ఉంటాయని, వాటిని పరిష్కరించుకోడానికి కొన్ని వందల, వేల లేఖలు రాస్తుంటామని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని ఈనెల పదోతేదీన ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమేనని గాడ్గిల్ చెప్పారు. అయితే, దాన్ని యథాతథంగా తీసుకుని కథనాలు రాయడం వల్ల ఇబ్బంది అవుతుందన్నారు. తాము ఫిబ్రవరి నుంచే ప్రభుత్వానికి తమ సమస్యలపై లేఖలు రాస్తున్నామని గాడ్గిల్ చెప్పారు. అయితే ఇంతవరకు ఎక్కడా పనులు మాత్రం ఆపలేదన్నారు.ఇక మెట్రో మార్గంలో మార్పులపై ఇంతవరకు తమకు సమాచారం లేదని ఆయన అన్నారు. నిర్మాణ ప్రక్రియలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. సెప్టెంబర్ పదోతేదీన తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవమేనని ఆయన అన్నారు. తెలంగణ ప్రభుత్వం సహకారంతోనే ప్రాజెక్టు నడుస్తోందని, చిన్న ప్రాజెక్టుల విషయంలోనే చాలా ఉత్తరాలు రాస్తామని.. అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టులో కొన్ని వందల, వేల ఉత్తరాలు పరస్పరం రాసుకుంటామని ఆయన తెలిపారు. సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ఎలాగోలా పరిష్కరించుకుని, ముందుకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమని, అయితే ఇలాంటి కథనాలు రాయడం వల్ల స్ఫూర్తి దెబ్బతింటుందని గాడ్గిల్ చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఉన్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోను చర్చించామన్నారు.