Lakshmi puja
-
మన ముంగిళ్లలో వెలుగు పూలు
సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడే ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.నరకాసుర వధభూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.ఈ పర్వదినాన ఇలా చేయాలి...ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.లక్ష్మీపూజ ఇలా చేయాలి...ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే!
పండుగ ఏదైనా పరమార్థం ఒకటే. చీకటినుంచి వెలుగులోకి పయనం. చెడును నాశనం చేసి మంచిని కాపాడుకోవడం. అలాంటి ముఖ్యమైన పండుగల్లో వెలుగుల పండుగ దీపావళి ఒకటి. ‘‘చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి.. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి ’’ న్నాడు ఆత్రేయ.చిన్నా పెద్దా, తేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగలో దీపాలు, మతాబులతోపాటు లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైన ఆచారం. అదృష్టానికి , ధనానికి దేవత లక్ష్మీ దేవిని పూజిస్తారు. అమావాస్యనాడు వచ్చే పండుగ అయినా జగమంతా వెలుగుపూలు విరగపూస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి.దీపావళి కథశ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై, లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికిపంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, నరసింహా వతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించి, హరి భక్తుల కష్టాలను తొలగించిన ఆనందంలోనూ ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. దీపావళి నాడు ఏం చేయాలి?ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతారు.దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతుందట. అలా శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లల్లో మాత్రమే తాను కొలువుదీరుతుందని భక్తుల విశ్వాసం. దీపావళి నాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టిందట సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది.అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, మట్టి ప్రమిదలు, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించా దేదీప్యమానంగా అలంకరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనీ, ఇల్లంతా సంపదతో తులతూగుతుందని నమ్మకం. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీపూజ ఇలా మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి. పిండి ముగ్గులతో ముంగిళ్లను తీర్చిదిద్దాలి. ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచి భక్తితో యథాశక్తి పూజించాలి. ఈ సందర్భంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచుతారు. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. బంగారు పూలతోనే పూజించాలనేదేమీ లేదు. భక్తితో చేసినదే ముఖ్యం. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఆ తరువాత స్వీట్లు, పిండి వంటలను ఇరుగుపొరుగువారితో సంతోషగా పంచుకుంటారు.దీపావళి సందడి మరింతదీపావళి రోజు చిన్న పిల్లలతో దివిటీలు కొట్టించడం కూడా ఒక ఆచారంగా పాటిస్తారు. గోగు కర్రలపై తెల్లటి కొత్త వస్త్రంతో చేసిన వత్తులను నువ్వులనూనెతో వెలగించి... దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’’ అంటూ పాడుతూ వాటిని నేలమీద మూడు సార్లు కొట్టించి, వెనక్కి తిరిగి చూడకుండా పిల్లలకు లోపలకు వెళ్లమని, ఆ విభూతిని వారి నొసట దిద్ది, తీపి పదార్థంతో వారి నోటిని తీపి చేస్తారు. బొమ్మల కొలువుబొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది.మతాబులు, చిచ్చుబుడ్లుపూజ,దీపాలంకరణ అనంతరం పిల్లా పెద్దా అంతా మతాబులు, చిచ్చు బుడ్లు ఇలా అనేక రకాలు దీపావళి టపాసులను వెలగించుకొని ఆనందంగా గడుపుతారు. తక్కువ పొగ, శబ్దం వచ్చే క్రాకర్స్కు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే టపాసులను కాల్చేటపుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ అప్రమత్తండా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు జాగరూకతతో మెలగాలి.ఈ దీపావళి అందరికీ ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలగాలని కోరుకుందాం. -
Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు వెలిగిస్తే మంచిది..!
చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం... నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర ద్రవ్యాలలోనూ, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసి ని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తత.. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నరకుడు చస్తే పండుగ ఎందుకు? నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేరాజై ఉండి కూడా అసూయతో దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు. లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది. దీపావళి నాడు ఏం చేయాలి? ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందట. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, వీలైనంత అందంగా అలంకరించాలి. చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం. లక్ష్మీపూజ ఇలా చేయాలి... ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలను, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఎన్నో కథలు... మరెన్నో కారణాలు.. లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. జ్ఞానప్రదాత. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దీపావళి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుందాం. – డి.వి.ఆర్.భాస్కర్ చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! -
కాకర పువ్వొత్తుల రంగుపూలు
కాకర పువ్వొత్తులు రంగుపూలు పూశాయి. చిచ్చుబుడ్లు మెరుపులు విరజిమ్మాయి. లక్ష్మీ పూజ ఘనంగా జరిగింది. లడ్డూలు ఇష్టంగా లాగించారు. దీపావళిని అందరూ ఘనంగా జరుపుకొని ఉంటారు. సినిమా తారలు కూడా ఘనంగా జరుపుకున్నారు. పూజ విశేషాలను, పండగ సంబరాలను ఎవరెవరు ఎలా జరుపుకున్నారో తెలుసుకుందాం. దీపావళి ముందు రోజు రాత్రి మోహన్బాబువాళ్ల ఇంట్లో దీపావళి సంబరాలు జరిగాయని తెలిసింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులను మంచు కుటుంబం ఆహ్వానించింది. కృష్ణంరాజు, చిరంజీవి, ప్రభాస్, రచయిత సత్యానంద్, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయితలు బీవీఎస్ఎన్ రవి, గోపీ మోహన్, హీరో రాజ్ తరుణ్.. ఇలా పలువురు తారలు మంచు ఇంటి విందుకి హాజరయ్యారు. ఆ వేడుక విశేషాలను పక్కన ఫొటోల్లో గమనించవచ్చు. విష్ణు చిన్న కుమార్తె ఐరా విద్యా మంచుని చిరంజీవి ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోతో పాటు ఈ విందుకి సంబంధించిన పలు ఫొటోలు బయటికొచ్చాయి. కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, సత్యానంద్, చిరంజీవి, మోహన్బాబు ఇక కొత్తగా రీమోడలింగ్ చేయించిన ఇంట్లో దీపావళిని జరుపుకున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు. చిరంజీవి, నాగబాబు, పవన్కల్యాణ్.. ఇలా మొత్తం కుటుంబసభ్యులు పండగ చేసుకున్నారు. దీపావళిని అక్కినేని ఫ్యామిలీ కూడా గ్రాండ్గానే చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ ఫొటోను సమంత షేర్ చేశారు. పెదనాన్న కృష్ణంరాజుతో కలసి దీపావళిని ఎంజాయ్ చేశారు ప్రభాస్. అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫొటోను పక్కన చూడవచ్చు. ఒక్కసారి బాలీవుడ్ సైడ్ వెళ్తే బోనీకపూర్ ఫ్యామిలీ మొత్తం దీపావళి సాయంత్రాన్ని ఎంజాయ్ చేశారు. దీపావళి ఈవెంట్ను అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నిర్వహించింది. ఆ వేడుకకు పలువురు తారలు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ ఆఫీస్లో ఫెస్టివల్ను ఎంజాయ్ చేశారు స్టార్స్. ఫ్యామిలీతో తాప్సీ దీపావళిని జరుపుకున్నారు. తమన్నా, శ్రుతీహాసన్ సెల్ఫీను షేర్ చేశారు. రంగోలీతో పూజా హెగ్డే ఫొటో పంచుకున్నారు. ఇలా దీపావళి కాంతిని ఫేస్బుక్, ట్వీటర్ల ద్వారా అభిమానులకు కూడా షేర్ చేశారు స్టార్స్. రాజారవీంద్ర, చిరంజీవి, ఐరా విద్య, విరానికా, విష్ణు నాగార్జున, అమల, సమంత, నాగచైతన్య, అఖిల్ విష్ణు,విరానికా, ప్రభాస్, అక్కాచెల్లెళ్లు, స్నేహితులతో వరుణ్తేజ్ శ్యామల, కృష్ణంరాజు, ప్రభాస్ అల్లు అర్జున్, స్నేహ, రామ్చరణ్, ఉపాసన, అర్జున్కపూర్, జాన్వీకపుర్ -
ధన్తేరస్; అప్పుడు పూజ చేస్తేనే మంచిది!
భారతీయ సంస్కృతిలో దీపావళితో పాటు... దివ్వెల పండుగకు రెండు రోజుల ముందుగానే వచ్చే ధన్తేరస్కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. సర్వ సంపద ప్రదాయిని శ్రీ మహాలక్ష్మి జన్మదినం సందర్భంగా అమ్మవారిని పూజించి.. ఆ రోజు బంగారం, వెండి కొనడం వల్ల తమ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువుదీరుతాయని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ధన్తేరస్ నాడు బంగారం షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ధన్తేరస్ గురించి శాస్త్రం ఏం చెబుతుందో.. ఆరోజు ఏ సమయంలో పూజ చేయాలో ఓసారి గమనిద్దాం. చిరంజీవులుగా ఉండేందుకు అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో.. ఆ క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఆమెతో పాటు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కోరిన వరాలిచ్చే కామధేనువు.. అదే విధంగా దేవ వైద్యుడు ధన్వంతరి కూడా జన్మించారు. ఆ రోజు అశ్వయుజ కృష్ణ త్రయోదశి కావడంతో పాటు... ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి జనియించడం వల్ల ధన త్రయోదశి లేదా ధన్తేరస్ అని కూడా పిలుస్తారు. అయితే సాధారణంగా అశ్వయుజ మాసంలో మొదటి పది రోజుల్లో పార్వతీదేవిని, మూలా నక్షత్రంనాడు సరస్వతీ మాతను పూజిస్తారు. సరస్వతీ కటాక్షం మెండుగా ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటేనే ముందుకు సాగుతామని ప్రతీతి. కాబట్టి త్రిమూర్తుల భార్యల్లో పూజ జరగకుండా మిగిలిన లక్ష్మీదేవిని మూడు రోజుల పాటు(ధన త్రయోదశితో పాటు నరకచతుర్ధశి, దీపావళి) ప్రత్యేకంగా పూజించాలని శాస్త్రం చెబుతోంది. అందుకే సిరి సందలకు మూలమైన లక్ష్మీదేవిని మానవాళి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి.. ఆశీసులు అందుకుంటారు. ఇక ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవితో పాటు ఉత్తర దిక్పాలకుడు, ధనానికి అధినాయకుడు అయిన కుబేరుడితో పాటు ధన్వంతరిని కూడా పూజించడం ఆనవాయితీ. ముందుగా చెప్పినట్లుగా ధంతేరస్ నాడు బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు కొనడంతో పాటు దేవ వైద్యుడు, ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరిని పూజించడం వల్ల ఐశ్వర్యం వృద్ధి చెందడంతో పాటు దీర్ఘ కాలంగా బాధిస్తున్న వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుబేరుడు- ధన్వంతరి ప్రదోష కాలంలో పూజ.. సాధారణంగా దీపావళికి రెండు రోజుల ముందు అంటే ధంతేరస్ నాడు సాయంకాల సమయంలో అనగా ప్రదోష వేళలో వృషభ లగ్నంలో లక్ష్మీపూజ ఆచరిస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం కొనసాగుతుంది. ఆశ్వయిజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో లక్ష్మీపూజ చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు దీపాలు వెలిగించి.. కోటి ఆశలతో ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక ఈ ఏడాది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారం(అక్టోబరు 25) రోజే ధన్తేరస్ కావడం విశేషం. -
లక్ష్మీపూజ నిర్వహించిన హాలీవుడ్ సింగర్!
ప్రముఖ హాలీవుడ్ సింగర్ మిలీ సైరస్ హిందువుల సంప్రదాయమైన లక్ష్మీపూజను నిర్వహించింది. హిందువుల పద్ధతిలో సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవి ఫొటో ముందు పూలు, పండ్లు అలకరించి.. అగరొత్తులు, జ్యోతులు వెలిగించి.. హల్వా ప్రసాదం సమర్పించి, భక్తిశ్రద్ధలతో ఆమె ఈ పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రెండు ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్టుచేసింది. ఈ ఫొటోలను బట్టి లక్ష్మీపూజను నిర్వహించి ఉంటుంది లేదా లక్ష్మీపూజలో పాల్గొని ఉంటుందని భావిస్తున్నారు. ఫొటొను బట్టి పండితుడు పూజను నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సూపర్ బౌల్ 2017 క్రీడలకు మద్దతుగా లక్ష్మీదేవికి పూజలు చేసినట్టు ఆమె ఈ పోస్టులో పేర్కొనడం గమనార్హం. ఈ ఫొటోలో ఆమెకు తెలిసిన లేదా ఆమె ఆరాధించే పలువురు గురువుల ఫొటోలు కూడా ఉన్నాయి. #FruitBowl over Super...... -
నెల్లూరులోనూ బురిడీబాబా లీలలు
► పలువురిని మోసగించిన వైనం ► పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోన్న బాధితులు ► ఆరా తీస్తున్న పోలీసులు నెల్లూరు (క్రైమ్) : లక్ష్మీపూజల పేరిట డబ్బులు రెట్టింపు చేస్తామని ప్రజలను బురిడీ కొట్టిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మోస్ట్వాంటెండ్గా మారిన బుడ్డప్పగారి శివ అలియాస్ సూర్యా అలియాస్ స్వామి మోసాలు జిల్లాలోనూ అనేకం ఉన్నాయి. 2014లో జూన్ 8వ తేదీన మాగుంట లేఅవుట్లోని పావని అపార్ట్మెంట్లో ఆనందరెడ్డి ఇంట్లో రూ. 40 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటనపై అప్పట్లో నెల్లూరు నాల్గోనగర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడి కోసం నెల్లూరు, తిరుపతి పోలీసులు విసృ్తత గాలిస్తుండగా అదే ఏడాది ఆగస్టు 22వ తేదీన అలిపిరి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి కరకంబాడి వద్ద బురిడీబాబాను, అతని అనుచరుడు దామోదర్ను అరెస్ట్ చేసి రూ.80 లక్షల నగదు, కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జైలుకు పంపారు. అప్పటి నుంచి అతను కొంతకాలం కనుమరుగయ్యారు. తాజాగా హైదారాబాద్కు చెందిన లైఫ్స్టైల్ అధినేత మధుసూదన్రెడ్డిని సుమారు రూ. 1.30 కోట్లు బురిడీకొట్టించడంతో అక్కడి టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం శివను బెంగళూరులో అరెస్ట్ చేశారు. జిల్లాలో అనేక మోసాలు బురిడీ బాబా శివకు నెల్లూరు జిల్లాలోని పలువురుతో భారీ పరిచయాలు ఉన్నాయి. వారి ఆధారంగా సంపన్న వర్గాలకు చెందిన పలువురుని పూజల పేరిట మోసగించినట్లు తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ను పూజల పేరిట రూ. 80 లక్షల వరకు మోసగించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువుపోతుందోనని విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఇటీవల పూజల పేరిట రూ. 40 గ్రాముల బంగారు, రూ. 40 వేల నగదుతో పూజారి ఉడాయించిన సంఘటనపై ఒకటో నగర పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తాజా ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసులు బురిడీబాబా మోసాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. -
నేటి నుంచి బతకమ్మ వేడుకలు
-
నేటి నుంచి బతకమ్మ వేడుకలు
‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు గౌరమ్మ ఉయ్యాలో...’‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దూల గుమ్మ.. అందాల బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన..’ ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..ఏమేమి కాయొప్పునే.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే..’ ‘ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జామాయె చందమామ...రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయె చందమామ..’’ ఎంగిలి పూల బతుకమ్మ.. బతుకమ్మ... బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బంగారు బతుకమ్మను తొమ్మిది రోజులపాటు కొలిచే పండుగ రానే వచ్చింది. ‘పూల’ పల్లకిలో మహిళలకు సంబరాలు మోసుకువచ్చింది. తెలంగాణకే తలమాణికమైన బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు పల్లెల నుంచి పట్టణాల వరకు మహిళలు ఇష్టంగా జరుపుకుంటారు. మనిషికి ప్రకృతికి విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే భారతీయ సంస్కృతిలో ప్రకృతితో మమేకమై చేసే పండుగలే అధికం. ఇటువంటి పండుగల్లో బతుకమ్మ ఒకటి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వచ్చిందం టే ఆడపడుచుల్లో కలిగే సంబరం అంతా ఇంతా కాదు. అశ్వయుజమాసం ఆరంభం అమావాస్యరోజైన శుక్రవారం నుంచి నవరాత్రులు ముగిసే వరకు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. బతుకమ్మ పండగ మూడు పండగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక. అమావాస్యను తొలి రోజుగా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేర్చి సాయంత్రం చావడి వద్దకు తీసుకవచ్చి ఆడుతారు. ఎంగిలి పూలు వేస్తారు. అమావాస్యకు ముందు ఐదు రోజులు బొడ్డెమ్మగా ఆడిన అనంతరం అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు ఈ ఆట సాగుతుంది. ఈ పండుగ వచ్చిం దంటే ఎక్కడెక్కడి వారో తమ సొంతూళ్లకు చేరుకుంటుంటారు. పండుగ పుట్టిందిలా... పూర్వం ధర్మాంగధుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య సత్యవతి. ఆ కాలంలో ఈ రాజ దంపతులకు పలుమార్లు సంతానం కలిగినా పుట్టిన వారు పుట్టినట్లే చనిపోతూ ఉండేవారు. ఇలా చాలామంది చని పోతుండడంతో దంపతులిద్దరూ లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు. వారికి చివరగా ఓ పాప పుడుతుంది. ఆమె బతికుండాలని రాజు లోకమాత అయిన దుర్గాదేవికి శరన్నవరాత్రుల పేరిట తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. అప్పటి వరకు పాపకు ఏపేరు పెట్టకుండా ఉంటాడు. ఈ బిడ్డ బతకాలని అందరూ ఆమెను ‘బతుకమ్మా.. బతుకమ్మా..’ అంటూ దీవించారు. క్రమంగా ఆ పాప పేరు బతుకమ్మగా మారింది. తదుపరి లక్ష్మీదేవిగా నామకరణం చేసినా.. అందరూ బతుకమ్మగానే పిలుస్తుండేవారు. రాజు కూతురు ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఎవరి ఇంట్లో అడుగిడినా లక్ష్మీదేవి తాండవిస్తుండేది. వరంగల్ జిల్లాలో ఈ పండుగ పుట్టిందనేది ఎక్కువగా వాడుకలో ఉంది. సౌభాగ్యం పంచే బతుకమ్మ పెళ్లి కావాల్సిన వారు పండుగ తొలి రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి వరుడు రావడంతోపాటు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం. ఇదే తీరులో సౌభాగ్యం కలిగిన మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మను పూలతో పూజించి ఆడితే సౌభాగ్యం నిలుస్తుందని విశ్వాసం. పూనాస పంటలుగా వచ్చే వాటితో ఐదు రకాల పిండి వంటలు చేసి, ఐదు రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మగా కొలిస్తే ఆ ఇంట సిరుల పంట కురుస్తుంది. తంగేడు పూలు, గోవు పూలు, గుమ్మడి పూలు, పున్నాగ పూలు, కట్లపూలతో బతుకమ్మను పేరుస్తారు. పప్పు పులుగడం, పెరుగుతో చేసే దద్దోజనం, పాయసం, పులిహోర, కేసరి అనే ఐదింటిని నైవేద్యాలుగా పెడుతారు. ఈ వంటకాలు శరీరారానికి మేలు చేస్తాయి. ప్రదక్షిణలే పాటలయ్యాయి భక్తిశ్రద్ధలతో ఐదేసి రకాల పూలు, వంటకాలతో బతుకమ్మ చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో పాత కాలంలో వేద మంత్రాలతో కూడిన శ్లోకాలు పాడేవారు. అన్ని వర్గాల వారికి శ్లోకాలు రాకవపోవడంతో గౌరమ్మపై స్థానిక భాష, వైవిధ్యాలకు అనుగుణంగా పాటలు పాడేవారు. ఆనాటి ఆ పాటలు నేటి బతుకమ్మ పాటలుగా చెలమణి అవుతున్నాయి. కష్ట జీవులు కూడా బతుకమ్మ ఆడుతున్న సమయంలో తమ శ్రమను, తమ కష్టాల్ని బతుకమ్మ పాటలుగా మలిచేవారు. అలా నేడు బతుకమ్మ పాటలు వేలల్లో కనిపిస్తాయి. ఎక్కువగా దేవుళ్లు పడ్డ కష్టాలు, రామాయణంలో సీతమ్మవారి కష్టాలు, లక్ష్మీదేవి వైభవాన్ని చాటుతాయి. తెలంగాణ ప్రజల కష్టసుఖాలు కూడా బతుకమ్మ పాటలుగా నేడు ఆదరణ పొందుతున్నాయి. సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం. తొమ్మిది రోజుల్లోనూ ప్రతి ఆడపడుచూ తప్పనిసరిగా బతుకమ్మ చుట్టూ రెండు అడుగులు వేయాలి. రెండు పాటలు పాడాలి అనుకునే సందర్భం సద్దుల బతుకమ్మ. మహిళలు పట్టు చీరెలు, యువతులు పరికిణీలు ధరించి, నగలతో సింగారించుకుంటుంటారు. వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ రాత్రిలో బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరుతోనూ, గౌరమ్మగానూ కొలిచి నీటిలో నిమజ్జనం చేసి పోయి రా.. బతుకమ్మా అంటూ.. హారతులు ఇచ్చి సాగనంపుతారు. వెంట తెచ్చుకున్న పెరుగన్నం, సత్తు పిండి (మొక్కజొన్న, వేరుశెనగ పిండి వేయించి చక్కెర కలిపి) ఇచ్చి పుచ్చుకుంటారు. బియ్యం, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్నలను చక్కెర, బెల్లంతో కలిపి దంచిపెడుతారు. యువతులు, మహిళలు ఒకచోట చేరి శిబ్బుల్లో (బతుకమ్మను పేర్చేది) ఇచ్చిపుచ్చుకుంటుంటారు.