lashed
-
6,50,000 ఈ-మెయిళ్లు చదివారా?
కేవలం ఎనిమిది రోజుల్లోనే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కు చెందిన ఆరున్నర లక్షల ఈ-మెయిళ్లను చదివారా? అంటూ అమెరికన్ అధ్యక్ష పదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ఎఫ్ బీఐ డైరెక్టర్ ను ప్రశ్నించారు. మిచిగాన్ లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ ఎఫ్ బీఐ డైరెక్టర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఎన్నికల ముందు హిల్లరీకి భారీ ఊరట) హిల్లరీ అక్రమాలపై చాలా కాలం విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో దారుణ అక్రమాలకు పాల్పడిన ఆమెను ఎఫ్ బీఐ అధికారులు విడిచిపెట్టరని అన్నారు. కానీ, ప్రస్తుతం రిగ్గ్ డ్ సిస్టం ఆమెను రక్షిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు చాఫెజ్ కూడా క్లింటన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నేరాలకు పాల్పడిన హిల్లరీని అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనివ్వకూడదని ట్రంప్ అమెరికన్లకు పిలుపునిచ్చారు. -
నగరంలో గాలివాన బీభత్సం
హైదరాబాద్: నగరంలో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో ప్రారంభమైన వాన ధాటికి దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, కర్మాన్ ఘాట్, చైతన్యపురి, బేగంపేట, బంజారాహిల్స్ లలో చెట్లు నేల కూలాయి. చెట్లు కూలి వాహనాల మీద పడటంతో కార్లు, బైక్ లు భారీగా ధ్వంసమయ్యాయి. అమీర్పేట నుంచి ఎస్ఆర్నగర్, పంజగుట్ట ప్రాంతాల్లో చెట్లు కూలడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ లో బస్టాప్ మీద చెట్టు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సనత్నగర్ బస్టాపు సమీపంలోని ఓ దుకాణం మీద కూడా ఓ చెట్టు కూలింది. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగలేదు.