lokmanya express
-
లోకమాన్య తిలక్ లో పొగలు
సాక్షి, జనగామ: విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ (ఎల్టీటీ) ఎక్స్ప్రెస్లో పొగలు కమ్ముకోవడంతో జనగామ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. బ్రేకులు పట్టేయడంతో సాంకేతిక సమస్య తలెత్తి పొగలు వెలువడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. ఒక్కసారిగా రైళ్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సహాయ చర్యలు చేపడుతున్నామని సమస్య పరిష్కారం కాగానే యధావిధిగా రైలు ముందుకు వెళ్తుందని తెలియడంతో ఆంతా ఊపిరిపీల్చుకున్నారు. -
పట్టాలు తప్పిన లోకమాన్య ఎక్స్ప్రెస్
ఉన్నవ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు పట్టాలు తప్పింది. ఉన్నవ్ రైల్వే స్టేషన్ సమీపంలో లోకమాన్య తిలక్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. పట్టాలు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్ను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు. దీనిపై దర్యాప్తునకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లింది.