mangalgiri
-
ఈ ఒక్క వీడియో చూస్తే... లోకేష్ గుండె గుబేల్
-
పదేళ్లైనా.. ప్చ్! జనసేన అనుకూల పవనాలు ఇంకా రాలేదు
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్నా పార్టీకి అనుకూల పవనాలు ఇంకా రాలేదని పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాపులందరూ ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకలో తాను ఓడిపోయేవాడిని కాదన్నారు. ‘రాష్ట్రంలో ఇంత సంఖ్యా బలం ఉన్న కాపు, బలిజ కులాలకు నిజంగా కట్టుబాటు ఉంటే వేరేవారు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇది గ్రహించనంత వరకు రాజ్యాధికారాన్ని మరిచిపోండి’ అని పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర వహించి బీసీలు, ఎస్సీలను కూడగట్టి కమ్మ, రెడ్డి, క్షత్రియులకు గౌరవం ఇచ్చి తీరాలన్నారు. ‘మా అమ్మ గాజుల బలిజ, నాన్న కాపు. నా కులం ఉనికిని నేను ఎప్పుడూ తీసివేయలేదు. నా కులం వాస్తవం. కాపులు ఐక్యంగా ఉంటే దక్షిణాదిలో బలమైన శక్తిగా ఎదగవచ్చు’ అని పేర్కొన్నారు. కాపులు కోస్తాలో గొంతు ఎత్తగలరుగానీ రాయలసీమలో బలిజలు నోరెత్తేందుకు భయపడతారని, ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. సీఎం పదవిస్తేనే పొత్తు! ముఖ్యమంత్రి పదవి ప్రాతిపదికనే ఏ పారీ్టతోనైనా పొత్తులు ఉండాలని కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్కు సూచించింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో హరిరామ జోగయ్య మాట్లాడుతూ జనసేనను బలహీన పరిచేందుకు టీడీపీ పలు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ రెండింటితో యుద్ధాన్ని ప్రకటించి ముందుకు వెళ్లాలని తాను పవన్కళ్యాణ్ను కోరుతున్నట్లు చెప్పారు. లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోనని మాటిస్తున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొంటూ తానెందుకు ఉంటానని ప్రశి్నంచారు. ‘నమ్మిన వారిని తగ్గించం. ఎవరి అజెండాల కోసమూ పనిచేయం’ అని తెలిపారు. చదవండి: స్కాములన్నీ బాబు హయాంలోనే -
వీడని యువకుడి అదృశ్యం మిస్టరీ..
మంగళగిరి: నవులూరుకు డిజైనర్ మహేష్ అదృశ్యం మిస్టరీగా మారింది. రెండు రోజుల కిందట తనని కేసులో ఇరికించారని ఆ కేసులో తనను నిందితుడిగా చేస్తే తను బతకలేనంటూ ఆత్మహత్య చేసుకుంటానంటూ అతని సన్నిహితులకు సెల్ఫోన్లో మెసేజ్లు పెట్టి అదశ్యమయ్యాడు. మహేష్ అద్యశ్యంపై బుధవారం రాత్రి అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో అదశ్యమైన మహేష్తో ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మహేష్కు ఫోన్ చేసిన వ్యక్తి తాడేపల్లి, మంగళగిరి స్టేషన్లు తమ సొంత స్టేషన్లని చెబుతూ ఏమి చేసినా స్టేషన్లలో తమను ఎవరు ఏమి చేయరని, ఇప్పుడు ఒక స్టేషన్ను కొంటున్నామని నీవు భయపడాల్సిన అవసరం లేదంటూ మాట్లాడడం గమనార్హం. తెలిసి తప్పు చేయడంతోపాటు నీచేత తప్పు చేయించామని అయినా ఏమీ కాదని, నిన్ను ఎవరు ఏమి చేయలేరని, నన్ను నమ్మి నీవు రిస్క్ చేసి పనిచేసి పెట్టావని నేను ఉండగా నీకేమి కాదంటూ మీ ఆవిడను తీసుకుని ఎటైనా వెళ్తావా, వైజాగ్లో రిసార్ట్ బుక్ చేయమంటవా నీ ఐడీ కూడా నేను దొంగలించాను అయితే ఎంటి అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం. ఫిర్యాదులో నీ పేరు లేనపుడు నీవు ఎందుకు లొంగిపోతావు..నిన్ను బయటకు తీసుకురాలేకపోతే అప్పుడు నీవు నిజాలన్నింటిని పోలీసులకు చెప్పు అని ఆడియోలో మాట్లాడిన మాటలను పోలీసులు పరిగణనలోకి తీసుకుని విచారణ చేసి అసలైన నిందితులను పట్టుకుని తమ కుమారుడిని కాపాడాలని మహేష్ తల్లి కోరుతున్నారు. చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం.. -
ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..
సాక్షి, గుంటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానన్నాడు.. మూడు ముళ్లు కట్టి.. ఏడడుగులు వేసిన బంధాన్ని కాటికి పంపాడు.. భార్యను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో భర్తకు జీవిత ఖైదు (బతికున్నంత కాలం) శిక్షను విధిస్తూ... ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టా కాళిదాసు కథనం మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన మహంకాళి నాగమల్లేశ్వరరావు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మను (25) ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగమల్లేశ్వరరావు భవన నిర్మాణ కార్మికుడిగా ఉండగా వెంకటేశ్వరమ్మ ఇళ్లల్లో పనులు చేస్తుండేది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహం అనంతరం కొద్ది కాలంగా వెంకటేశ్వరమ్మపై భర్త నాగమల్లేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. భార్యను చీటికి, మాటికి కొడుతూ ఉండటంతో వెంకటేశ్వరమ్మ తల్లి వెంకాయమ్మ పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టి సఖ్యత చేసింది. దీంతో భార్యాభర్తలు మార్టూరు వెళ్లి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడకు వెళ్లినప్పటికీ నాగమల్లేశ్వరరావు ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో వెంకటేశ్వరమ్మ తన ఇద్దరు పిల్లలతో మంగళగిరిలోని గండాలయ్యపేటలో నివాసం ఉంటూ ఇంటి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. 2013 ఆగస్టు 24న ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చిన నాగమల్లేశ్వరరావు భార్యతో ఘర్షణకు దిగడంతో చుట్టుపక్కలవారు, ఇంటి యజమాని మందలించి పంపించారు. మరుసటి రోజు 25వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో వెంకటేశ్వరమ్మ గదిలో నుంచి బయటకు వచ్చి తన కుమార్తెను బాత్రూముకు తీసుకెళుతున్న క్రమంలో తనతోపాటు కత్తి తెచ్చుకున్న నాగమల్లేశ్వరరావు వెంకటేశ్వరమ్మను విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న అన్న, తల్లి, ఇంటి యజమాని బయటకు వచ్చే సమయంలో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. దీంతో వెంకటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్యపై మృతురాలి సోదరుడు సాంబయ్య మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ ఆర్.సురేష్బాబు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడంతో, కోర్టు మాని టరింగ్ సెల్ ఏఎస్సై గాజుల శివప్రసాద్, టౌన్ పోలీసు స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ పాలపర్తి నరేంద్ర చొరవ చూపారు. కోర్టులో నాగమల్లేశ్వరరావుపై కేసు రుజువు కావడంతో న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ నిందితుడికి జీవించి ఉన్నంతకాలం జీవిత ఖైదు, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఎన్టీఆర్పై చెప్పులు వేయడం వాస్తవం : మోహన్బాబు
సాక్షి, మంగళగిరి : వైస్రాయ్ హోటల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని సినీనటుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు మంచు మోహన్బాబు స్పష్టం చేశారు. ‘నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్.. తప్పు సరిద్దిదుకుంటాను’ అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డితో కలిసి మోహన్బాబు మీడియాతో మాట్లాడారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందని ధ్వజమెత్తారు. ఇది అన్నయ్య టీడీపీ కాదు.. ‘ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్)ది కాదు.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ. అన్నయ్యేదే అయితే నేను పార్టీ వీడేవాడినే కాదు. ఆ మహానేత పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకుని వదిలేశారు. ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరు. ఆ సమయంలో అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేశారు. చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మహోన్నత వ్యక్తి.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మహోన్నత వ్యక్తి. ఆయన మాట చెబితే అది వేదమే. ఆయన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. కొన్నివేల మంది ప్రజలకు ఇళ్లు కట్టించారు. కాంగ్రెస్ వంటి మహాసముద్రంలో ఓ మహానాయకుడిగా ఎదిగి.. పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకొని అద్భుత పథకాలు రూపొందించారు. ఎంతోమంది పేద పిల్లలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివేలా చేశారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించారు. తాను పార్టీకి బానిసను కాదని, ప్రజలకు బానిసని సోనియాను వ్యతిరేకించారు. ఆ తర్వాతే వైఎస్సార్ మరణం చెందారు. దాని వెనుక అనేక అనుమానులున్నాయి. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఆయను ఆదరించి ముఖ్యమంత్రిని చేసుకుందా. మూడు పంటలు పండే చోట రాజధాని పేరుతో భూములు లాక్కున్నారు. తన బినామీలతో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ముందుగానే కొనుగోలు చేయించారు. రైతులను దారుణంగా మోసం చేశారు. అప్పులు పాలు చేశారు. చంద్రబాబుపై ఉన్న 11 కేసులు ప్రజలకు తెలియకుండా దాచారు. నీ దగ్గరున్న ఎంపీలు అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయారు. నీవెలా సత్య హరిశ్చంద్రుడివి అవుతావు చంద్రబాబు? వేల కోట్లు ఆస్తులు నీకెక్కడి నుంచి వచ్చాయి? బాబుకు ఓటేస్తే ఆయన అనుకూల మీడియా, భూకబ్జాదారులు బాగుపడుతారు. వాళ్లు మళ్లి ప్రజల రక్తం తాగుతారు. పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న డబ్బులు నీవా చంద్రబాబు? నాలుగేళ్లుగా పసుపు కుంకుమ గుర్తుకు రాలేదా? 135 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళగిరిలో మీ అందుబాటులో ఉండే రామకృష్ణారెడ్డిని, గుంటూరు ఎంపీగా మోదుగు వేణుగోపాల్రెడ్డిలను గెలిపించండి. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఏం లాభం లేదు.’ అని మోహన్బాబు ప్రజలను కోరారు. -
లోకేశ్తో నెటిజన్ల హోలీ ఆట
సాక్షి, హైదరాబాద్ : ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ రోజు రసాయన రంగులు హాని చేస్తాయని, సహజరంగులు ఆనందాన్ని ఇస్తాయని ట్విటర్లో సూచించారు. హోలీ పండుగను సహజ రంగులతో సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. పసుపు సహజమైన రంగు. మీ భవిష్యత్తుకు శుభాన్నిస్తుంది అని పేర్కొన్నారు. మోసపూరిత వాగ్దానాలు కూడా సింథటిక్ రంగుల్లాంటివే అంటూ ట్వీట్ చేశారు. హోళీ రోజు రసాయన రంగులు హాని చేస్తాయి. సహజరంగులు ఆనందాన్ని ఇస్తాయి. మోసపూరిత వాగ్దానాలు కూడా సింథటిక్ రంగుల్లాంటివే. పసుపు సహజమైన రంగు. మీ భవిష్యత్తుకు శుభాన్నిస్తుంది. హోళీ పండుగను సహజ రంగులతో సురక్షితంగా జరుపుకోండి. ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు. #HappyHoli2019 pic.twitter.com/5DcPtmfVHc — Lokesh Nara (@naralokesh) 21 March 2019 అయితే హోలీ శుభాకాంక్షల వరకు బాగానే ఉన్నా, పండగను కూడా పసుపురంగుతో ముడిపెట్టి రాజకీయ రంగుపులమడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మోససపూరిత వాగ్ధానాల విషయంలో చినబాబును నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మోసపూరిత వాగ్ధానాలతో 2014లో అధికారంలోకొచ్చింది టీడీపీనే అంటూ మండిపడ్డారు. ట్విటర్లో యమా యాక్టివ్గా ఉండే లోకేశ్ గతంలో చేసిన ఓ ట్వీట్ను వెలికి తీసి మరీ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆ ట్వీట్ ఏంటీ నెటిజన్ల రియాక్షన్ ఏంటో ఓసారి చూద్దాం. 12yrs of TRS & INC, Hyd Metro still a distant dream. 19months of TDP, Vijayawada Metro to be completed by Dec 2018. Hyderabad,choose wisely. — Lokesh Nara (@naralokesh) January 13, 2016 '12 ఏళ్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్లు కలిసి హైదరబాద్లో మెట్రోరైలు కట్టలేకపోయారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం 2018 డిసెంబర్నాటికి విజయవాడ మెట్రో పూర్తి చేస్తుంది' అంటూ 2016లో లోకేశ్ ట్వీట్ చేశారు. 2018 ముగిసి 2019 కూడా ప్రారంభమైంది. అయినా విజయవాడలో మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా పడలేదు. దీంతో హోలీ శుభాకాంక్షలు చెప్పాలని నారా లోకేశ్ చేసిన ట్వీట్ కాస్తా.. టీడీపీ మోసపూరిత వాగ్ధానాలపై సెటైర్లు వేయడానికి నెటిజన్లకు దొరికిన ఓ మంచి అవకాశంగా మారింది. దీంతో సామాజిక మాధ్యమాల్లోనే లోకేశ్తో నెటిజన్లు హోలీ ఆడుకుంటున్నారు. Anna ma bza lo metro rail project ayipoyindha.. Road meeda ekkada kanapadaledu underground lo vesara enti pic.twitter.com/BzE3ux63tL — Shankar Datta (@dattasankar2805) February 6, 2019 ఇదేనా విజయవాడలో మీరు కట్టినా మెట్రో లోకేష్ బాబు గారు... pic.twitter.com/Z9KmydX6eK — siva kallam (@sivakallam1002) February 7, 2019 దగ్గరుండి పూర్తి చేసినట్టున్నారు లోకేశం గారు pic.twitter.com/7ErvN0IcfT — prod version (@prod_version) February 6, 2019 Searching for vijayawada metro🕵️ pic.twitter.com/NnOhMp5ohy — kartheek Reddy🇮🇳 (@ItsKartheekRedE) February 6, 2019 pic.twitter.com/ogGjPtAb9a — Kondal Chary R (@chary081) February 6, 2019 @naralokesh @NaraCBN pic.twitter.com/Q4jzeqyAbW — Sravan Reddy (@SravanReddy04) February 7, 2019 Idhe tweet malli pettandi sir pic.twitter.com/BvEj20QIZG — Baddam Bhaskar ™️ (@NRI_Uganda) February 6, 2019 https://t.co/3vUVb94zfR — #BlackDayForHindus 🕉️ (@bharathbunny27) February 7, 2019 నువ్వు మీ అయ్య నిద్ర లేచినప్పటి నుంచి మోసపూరిత వాగ్దానాలు కదా చెప్పేది — Ramakrishna (@ImRam_Kotikala) March 21, 2019 నాడు హరికృష్ణ మరణంతో బుల్ బుల్ కి సంబ్రమాశ్చర్యం కలిగితే, నేడు వివేకానంద రెడ్డి మరణంతో పరవశించిపోయిన మాలోకం — ً (@ChaltanyaReddy) March 21, 2019 నువ్ మీ అయ్యా నే కదా పప్పు మోసకరులు...మీరు మోసం చేసినట్టు 100కారణాలు చెప్తా... నువ్ ని దొంగ పార్టీ.. — Main be chowkidar. SV (@Svsv9988) March 21, 2019 ఓరీ పిచ్చి నా లోనా! కనీసం పండుగకైనా రాజకీయం పులమకు నీకో దండం. 🙏🙏🙏🙏🙏 శ్రీరామ — Srinivasa Rao Madduluri (@RaoMadduluri) March 21, 2019 Mosapuritha vagdanalu?? Like Vijayawada metro??#NinnuNammamBabu pic.twitter.com/iXQRAFx6VP — kr reddy (@krr_reddy) March 21, 2019 pic.twitter.com/frZ13Zssxq — F-A-R-M-E-R 🌾 (@allams04) March 21, 2019 -
భగ్గుమన్న దళిత సంఘాలు
సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసుల వేధింపుల కారణంగా దళిత యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దంపతుల ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించాయి.దంపతుల మృతదేహాలతో మంగళగిరి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో దళితుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు రాత్రి ఏడుగంటల సమయంలో ప్రభుత్వం దిగిరావడంతో బాధితులు ఆందోళన విరమించారు. మంగళగిరి: మండలంలోని నవులూరు గ్రామంలో చోటుచేసుకున్న దళిత యువ దంపతులు మిరియాల వెంకటకిరణ్, హెలీనా ఆత్మహత్యలతో దళితసంఘాలు భగ్గుమన్నాయి. నవులూరు నుంచి మృతదేహాలను మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించేం దుకు పోలీసులు ప్రయత్నిచగా స్థానికులతో పాటు దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఆత్మహత్యలకు కారణమైన ఇబ్రహీంపట్నం ఎస్ఐ, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీం పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా వినకపోవడంతో మధ్యాహ్నం వరకు మృతదేహాలు ఇంటి వద్దనే ఉన్నాయి. యువ దంపతుల ఆత్మహత్య సమాచారం తెలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ అధికారప్రతినిధి పచ్చల శ్యాంబాబు, జిల్లా కార్యదర్శి ఈపూరి ఆదాం, పలువురు నాయకులతో మధ్యాహ్నం ఒకటిన్న గంటల సమయంలో కిరణ్ ఇంటికి వెళ్లారు. కిరణ్ తండ్రి భోరున విలపించి, తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని, తన కొడుకు, కోడలి మృతికి కారణమైన వారికి శిక్షపడేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. మృతదేహాలను ఆటోలో ఉంచి మంగళగిరి వెళ్లబోగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు అడ్డం తిరగడంతో పోలీసులు ఆటోను అడ్డుకోలేకపోయారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారికి రెండు వైపులా మృతదేహాలను ఉంచి ఆందోళనకు దిగారు. మహిళలు, యువకులు చేరుకుని ఆందోళన చేపట్టారు, వారికి మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్సార్ సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఏఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రామకృష్ణ, ఎస్బీ డీఎస్పీ రామాంజనేయులు, తహసీల్దార్ వసంతబాబు ఆందోళన విరమించాలని కోరినా కలెక్టర్, ఎస్పీ వచ్చి నిందితులందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటేనే తాము ఆందోళన విరమిస్తామని, లేదంటే ఇక్కడే మృతదేహాలను ఖననం చేస్తామని మృతుని బంధువులు తేల్చిచెప్పారు. దళిత యువదంపతులు ఆత్మహత్యలకు నిరసనగా గంటల తరబడి మృతదేహాలతో రోడ్డుపై ఆందోళన చేస్తున్నా కూతవేటు దూరంలోనే ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ పట్టించుకోలేదంటే దళితులపై ప్రభుత్వానికి, టీడీపీకి ఉన్న వివక్ష తెలుస్తోందంటూ దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. ఎక్కడో విశాఖపట్నంలో ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే అరగంటలో బయటకు వచ్చి ప్రకటన చేసిన డీజీపీకి యువదళిత దంపతుల ఆత్యహత్యలు కనపడలేదా అని సూటిగా ప్రశ్నించారు. దళితులంటే చంద్రబాబుకు వివక్ష : ఆర్కే తొలి నుంచీ చంద్రబాబుకు దళితులంటే వివక్షని అందుకే దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానిం చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. చంద్రబాబుతోపాటు మంత్రులకు సైతం దళితులంటే చిన్నచూపేనని వారి ప్రకటనలే రుజువు చేశాయన్నారు. సివిల్ పంచాయితీల్లో పోలీసులు తలదూర్చకూడదని చట్టం చెబుతున్నా కిరణ్తో అతని భార్యను స్టేషన్కు పిలిపించి హింసించి, ప్రామిసరీ నోట్లు, స్టాంపులు, ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఆత్మహత్యలకు కారణమైన పోలీసులు, అందుకు కారణమైన ఆరుగురి నిందితులను కఠినంగా శిక్షించి, కిరణ్ కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీలు, దళిత, క్రిష్టియన్ సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత దంపతులు ఆత్మహత్యలకు పాల్పడినా ఎస్పీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, బుర్రముక్క వేణుగోపాలరెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆకురాతి రాజేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లవరపు నాగయ్య, నూతక్కి జోసఫ్, ఎస్సీ, ఎస్టీ నాయకులు కారుమంచి రామారావు, వలపర్ల కిషోర్, సీపీఎం నాయకులు జె.వి.రాఘవులు, ఎం.రవి, భాగ్యరాజ్, పిల్లలమర్రి బాలకృష్ణ తదితరులు బాధితులకు అండగా నిలిచారు. ఏమి జరిగిందంటే.. మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామానికి చెందిన మిరియాల వెంకటకిరణ్ (34) విజయవాడలోని ఓ కన్సల్టెంట్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన బొమ్మా రామకృష్ణ, చెల్లి సతీష్, హైదరా బాద్కు చెందిన గంగా జగపతి, యోగేష్ ఆ కన్సల్టెంట్ కార్యాలయాన్ని నడుపుతున్నారు. ఆ సంస్థ నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తుంది. మిరియాల వెంకట కిరణ్ పలువురు యువకుల వద్ద డబ్బులు వసూలు చేసి సంస్థకు చెల్లించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెంది న తమ్మిశెట్టి రాజశేఖర్ నుంచి డబ్బు వసూలు చేసిన వెంకటకిరణ్ ఆ మొత్తాన్ని బొమ్మా రామకృష్ణకు చెల్లించారు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తమ్మిశెట్టి రాజశేఖర్ ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో వెంకటకిరణ్పై చీటింగ్ కేసు పెట్టారు. దీంతో వెంకటకిరణ్ను ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యనారాయణ వేధింపులకు గురిచేయడంతోనే తన కొడుకు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారని వెంకటకిరణ్ తండ్రి సుబ్బారావు ఆరోపించారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి 7 గంటల వరకు హైడ్రామా నడిపిన పోలీసులు, ప్రభుత్వం ఎట్టకేలకు దిగిరాకతప్పలేదు. దంపతుల ఆత్మహత్యలకు కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా కుటుంబానికి న్యాయం చేస్తామని తహసీల్దార్ వసంతబాబు, పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మరోమారు పోరాటం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్, దళితసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రాజన్న క్యాంటీన్: భోజనం@రూ.4
అమరావతి: అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ మాట మరిచిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తన సొంత ఖర్చుతో పేదలకు భోజనం పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కేను ఆయన అభినందించారు. ఆదివారం తన నియోజకవర్గం మంగళగిరిలో రాజన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. కేవలం రూ.4లతో సాంబారు అన్నం, పెరుగన్నం, కోడిగుడ్డుతో మీల్స్ను అందిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు అరటిపండు, ఒడియాలను భోజనంలో ఇస్తారు. ప్రభుత్వం చేయలేని పనిని ఒక ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో చేయడం హర్షణీయమని ఉమ్మారెడ్డి అన్నారు. -
మంగళగిరిలో ఆర్టీవో అధికారుల మాయ