MBA admissions
-
‘గీతం’లో ఎంబీఏ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : గీతం యూనివర్సిటీ అనుబంధంగా బెంగళూరులోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో 2016–17 విద్యా సంవత్సరానికి ఎంబీఏ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంవీ రాంప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసినవారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. జాతీయ ప్రవేశ పరీక్షలు క్యాట్, మ్యాట్, జీమాట్, సిమాట్, క్సాట్లలో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణత సాధించిన వారు లేదా 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వారు నేరుగా ఎంబీఏలో చేరేందుకు అర్హులన్నారు. విద్యార్థులకు ఎంబీఏ పుస్తకాలు ఉచితంగా అందజేస్తామని వెల్లడించారు. ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ఎం, ఆపరేషన్స్ స్పెషలైజేషన్లు నిర్వహిస్తున్నామని వివరించారు. మరిన్ని వివరాలకు కోఆర్డినేటర్ ఎంఎస్ శంకర్ (మొబైల్ 89711 99907, 81978 60924)ను సంప్రదించాలని కోరారు. -
ఎంబీఏ దరఖాస్తులకు ‘నల్సార్’ ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: నల్సార్ వర్సిటీలో 2015-17 అకడమిక్ సంవత్సరానికి వివిధ స్పెషలైజేషన్లలో ఎంబీఏ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజి స్ట్రార్ ఫ్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, పట్నాలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు హాజరుకావచ్చు. దరఖాస్తులను వర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వివరాలకు 040-23498408, 9640158883లో సంప్రదించాలి.