mind reading
-
మైండ్ రీడింగ్ టెక్నిక్.. ఈ మ్యాజిక్ ఏంటో తెలుసా?
మ్యాజికల్ ఇల్యూజన్.. మెంటలిజం మదిని చదివే కళ సాక్షితో ముచ్చటించిన సుహానీ షా.. మెంటలిజం, ఇల్యూజన్ వంటి వినూత్న మ్యాజిక్ మాయాజాలాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. సోషల్ మీడియాలో మెంటలిస్టులకు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇదే తరహాలో ప్రముఖ భారత మెంటలిస్ట్, ఇల్యూజనిస్ట్, ఇంద్రజాలికురాలు సుహానీ షా సోషల్ సెలిబ్రిటీగా మారింది. ఒక మనిషిని చూసి తన మనసులో ఏమనుకుంటున్నారో ఇట్టే చెప్పేయగల ప్రముఖ మెంటలిస్ట్ సుహానీ. ఇలా తన మైండ్ రీడింగ్తో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలతో హాలీవుడ్, బాలీవుడ్ తారలతో పాటు క్రికెటర్లు, వ్యాపార దిగ్గజాలను మెస్మరైజ్ చేస్తోంది. నగరంలోని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ‘ది మ్యాజిక్ ఆఫ్ మెంటలిజం’ కార్యక్రమంలో ఈ మానసిక మాంత్రికురాలు మరోసారి తన స్కిల్తో వావ్ అనిపించింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మెంటలిజం, ఇల్యూజన్ తదితర అంశాల గురించి సుహానీ చెప్పిన కహానీలు ఆమె మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో మెంటలిజం మనుషులను, వారి ఆలోచనలను పసిగట్టగల మైండ్ రీడింగ్ టెక్నిక్. దీనికి మాతృక మాత్రం మ్యాజిక్కే. మ్యాజిక్లో సబ్ జానర్ ఈ మెంటలిజం. మ్యాజిక్లో దాగున్న విభిన్న రూపాల్లో ఇల్యూజన్, బ్లైడ్ ఫోల్డ్, స్ట్రీట్ మ్యాజిక్, పాలో మ్యాజిక్, ఎస్కూలోపోలాజీ, పిక్ పాకెటింగ్ తదితరాలు ఉన్నాయి. ఒకరి ఆలోచనలను చదవగలగడం, గతాన్ని, భవిష్యత్తును సైకలాజికల్గా ఊహించగలగడం. దీనికి కొన్ని రకాల కోర్సులు ఉన్నాయి. నిపుణులు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. 20 ఏళ్ల ప్రయాణంలో.. నేను ఏడేళ్ల వయసు నుంచి ఈ రంగంలో ఉన్నాను. దాదాపు 20 ఏళ్ల ప్రయాణంలో మొదట ఇల్యూజనిస్ట్గా చేశాను. ట్రెడిషనల్ ఇండియన్ మ్యాజిక్ నా మూలం. నేను గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదు.. 14 ఏళ్ల వరకూ నాకు అంతగా చదవడం, రాయడం రాదు. కానీ 15వ ఏట ‘సైకాలజీ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పుస్తకాన్ని రాశాను. స్వీయ అనుభవాలతో రాసిన ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్గా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకూ 35 నుంచి 40 దేశాల వరకూ తిరిగి మెంటలిస్టుగా షోలు చేశాను. భారత్లో ప్రముఖ మహిళా మెంటలిస్ట్గా సహానీ షా ప్రయాణం మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. 200 మంది ఫిక్కీ లేడీస్ను సుహానీ మాయ చేసి మంత్రముగ్ధుల్ని చేసింది. ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ -
ఆకట్టే కనికట్టు: మెంటలిస్ట్ సుహానీ షా
సుహానీ షాను ఇండియాలో ఏకైక ఫిమేల్ మెంటలిస్ట్ అంటారు. ఇప్పటికి 5000 ప్రదర్శనలు ఇచ్చిన సుహానీ స్టేజ్ మీద ప్రేక్షకులను దిగ్భ్రమ పరిచే చమత్కారాలు చేస్తుంది. సంప్రదాయ మేజీషియన్ల వేషంలో కాకుండా ఆధునికమైన ఆహార్యంలో ఆమె భ్రాంతిని, విభ్రాంతిని, కనికట్టును ప్రదర్శిస్తుంది. అందుకే దేశంలోని ఏదో ఒక నగరంలో ఆమె ప్రదర్శనకు సంబంధించిన ప్రకటన కనపడుతూనే ఉంటుంది. సుహానీ సక్సెస్ స్టోరీ. సుహానీ షా తన షోలో మిమ్మల్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది. మీరెవరో ఆమెకు తెలియదు. ఆమెతో మీరు ఎప్పుడూ మాట్లాడి ఉండరు. ‘మీకు ఇష్టమైన పాట తలుచుకుని మనసులో పాడుకోండి’ అంటుంది. మీరు ఒక నిమిషం మనసులో పాడుకుంటారు. అప్పుడు సుహానీ షా తన చేతిలోని సెల్ఫోన్లో ఒక పాట మ్యూట్లో ప్లే చేసి పక్కన పెట్టి, మీరు ఏ పాట అనుకున్నారో మైక్లో చెప్పండి అంటుంది. ‘మౌనంగానే ఎదగమని’ అని మీరు అంటారు. ఆ ఫోన్లో చూడండి అంటుంది. ఆశ్చర్యం. అందులో అదే పాట అప్పటికే ప్లే అవుతూ ఉంటుంది. మీరు మనసులో అనుకున్న పాట ఆమెకు ఎలా తెలిసింది? అదే మైండ్ రీడింగ్. మళ్లీ ఇంకొకరిని పిలుస్తుంది. ‘ఎవరినైనా మీకు పరిచయమున్న వ్యక్తిని తలుచుకోండి’ అంటుంది. అతను తలుచుకుంటాడు. ఫ్రెండా? అడుగుతుంది. బంధువు అంటాడు. మీరు కళ్లు మూసుకుని ఆ మనిషిని మీ ఎదురుగా ఊహించుకోండి అంటుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న పలక మీద ఒక పేరు రాసి పక్కన పెడుతుంది. కళ్లు తెరిచి మీరు తలుచుకున్న వ్యక్తి పేరు చెప్పండి అంటుంది. అతను చెప్తాడు. పలక చూపిస్తుంది. ఆశ్చర్యం. ఆ పలక మీద అప్పటికే ఆమె ఆ పేరు రాసి ఉంది. అదీ మైండ్ రీడింగే. ఇలాంటివి చేసే మహిళ మన దేశంలో సుహానీ షా ఒక్కర్తే ఉంది. అందుకే ఆమె భారతదేశ ఏకైక ఉమన్ మెంటలిస్ట్. చిన్నప్పటి నుంచి సుహానీ షాది రాజస్థాన్లోని ఉదయ్పూర్. ఏడేళ్ల నుంచే మేజిక్ చేయడం మొదలెట్టింది. ఆ మేజిక్లు పెద్ద హిట్ అయ్యేసరికి స్కూల్కు వెళ్లే వీలే కలగలేదు. దేశ విదేశాలు మేజిక్లు చేస్తూ వెళ్లింది. దాంతో 14 ఏళ్ల వరకు ఆమెకు రాయడం రాదు. 16 ఏళ్ల వరకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. కాని ఇప్పుడు నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ‘సాకులు చెప్పొద్దు’ అంటుంది ఎవరైనా ఏదైనా రాదు అంటే. ‘నేర్చుకోవాలనే సంకల్పం ముఖ్యం’ అంటుంది. సుహానీ షా మొదట మేజిక్లు చేస్తూ, తర్వాత ఇల్యూషన్స్ చేస్తూ, ఆ తర్వాత మైండ్ రీడర్గా మారింది. మెంటలిస్ట్ అంటే? మెజీషియన్లాగా సంగీతం, ఎక్విప్మెంట్, హంగామా ఏమీ ఉండదు. సరికొత్త ఆహార్యంలో ఒక్కరే వచ్చి స్టేజ్ మీద నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎదురుగా కూచున్న వారిలో ఒకరి పెళ్లిరోజు ఏదో చెప్పడం, ఒకరి ఫోన్ తీసుకుని అన్లాక్ చేయడం, ఒకరి గతాన్ని చెప్పడం, మరొకరి భవిష్యత్తును చెప్పడం, మనసులో అనుకున్న అంకెలు తెలియచేయడం... ఇవన్నీ మెంటలిస్ట్ చేస్తారు. సుహానీ షా తాను ఒక్కతే స్టేజ్ మీద నిలబడి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. ‘ఇందుకు దివ్యశక్తులు ఏమీ అక్కర్లేదు. సాధనతో సాధించిన స్కిల్ ఇది’ అంటుంది సుహానీ షా. ‘మామూలు మేజిక్లు చాలా కాలం చేశాక దీనికంటే పై స్థాయికి వెళ్లాలని ఎదుటివాళ్ల మైండ్ రీడింగ్ చేయాలని కొన్నాళ్ల పాటు హిమాలయాలకు వెళ్లి షో డిజైన్ చేస్తూ కూచున్నాను. మూడు నాలుగేళ్లుగా మెంటలిస్ట్గా షోలు చేస్తున్నాను’ అంటుంది సుహానీ. మోటివేషనల్ స్పీకర్ సుహానీ కేవలం షోస్ మాత్రమే చేయదు. యూట్యూబ్లో పర్సనాల్టీ డెవలప్మెంట్ మీద వీడియోలు చేస్తుంది. ఆమెకు గోవాలో హిప్నో క్లినిక్ ఉంది. దురవాట్లను మాన్పించడంలో ఆమె వ్యక్తులకు సాయ పడుతుంటుంది. ‘జీవితంలో ఏ పనీ చేయనివారు ఏదో ఒకటి సాధించాలని అనుకోని వారు తమ జీవితాలను వృథా చేసుకుంటున్నట్టు లెక్క’ అంటుందామె. సుహానీకి లక్షల కొద్ది అభిమానులు ఉన్నారు. ఆమె షోస్ నగరాల్లో జరుగుతూనే ఉంటాయి. ఈసారి మీ దృష్టికి వస్తే వెళ్లి చూడండి. -
భళా 'ఏఐ'.. మైండ్ రీడింగ్ టెక్నాలజీలో అద్భుతం!
Mind Reading AI Technology: ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.. ఈ నేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇప్పటికే పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్ కంపెనీల విషయంలో 'ఏఐ' సంచలనాలు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఏఐ మనిషి మైండ్ కూడా చదివేస్తుందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తాజాగా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మనసును చదవగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో మనిషి మనసును కూడా ఏఐ చదవగలదని చెబుతున్నారు. ఈ ఆధునిక టెక్నాలజీ మీద పరిశోధన బృందంలో ఒకరైన 'లి రుయిలిన్' కీలక విషయాలు వెల్లడించారు. ప్రతి మనిషికి ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారని, దానిని తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ఇలాంటి వాటికోసం మైండ్ రీడింగ్ ఏఐ టెక్నాలజీ రూపొంచాలని సంకల్పించి ప్రయోగం ప్రారంభించామని, మొదట్లో తన మెదడుని ఈ టెక్నాలజీ ఆధారంగా పరిశీలించగా అద్భుతమైన ఫలితం వచ్చిందన్నారు. మొత్తం మీద మెదడు ఆలోచనను పసిగట్టే టెక్నాలజీ చాలా అద్భుతం అని వెల్లడించారు. ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో మరో జర్మన్ కారు - ధర రూ. 1.14 కోట్లు MRI స్కాన్ ద్వారా.. మైండ్ రీడింగ్ AI ని అభివృద్ధి చేయడంలో పనిచేస్తున్న పరిశోధకులకు 58 మంది తమ మైండ్ పరిశోధన చేసుకోవచ్చని స్వచ్చందగా ముందుకు వచ్చారు. అందులో లి రుయిలిన్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఈ టెక్నాలజీ పూర్తిగా MRI స్కాన్ ద్వారా కొనసాగుతుంది, ఇందులో భాగంగా మెదడుకి సంబంధించి సుమారు 1200 నుంచి 5000 చిత్రాలను తీసి, దానిపై స్టడీ చేసి అసలు విషయం గుర్తించడం జరుగుతుంది. ఇదీ చదవండి: ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఆగండాగండి.. ఇవి చెక్ చేశారా? చాట్ జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకున్నట్లే.. ఏఐ మానవ మెదడుని కూడా అర్థం చేసుకుంటుంది. అంటే మనసులోని ఆలోచనలను చదివి పరిశోధకులకు అందిస్తుందన్నమాట. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిందంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే దీనిని ఎవరైన అనవసర విషయాలకు లేదా తప్పుడు పనులకు ఉపయోగిస్తే పెద్ద ముప్పు వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
మైండ్ను దొంగిలించే రోజులొస్తున్నాయి?
జెనీవా: మన మదిలో చెలరేగే ఆలోచనల్ని, భావాల్ని ఇతరులు తెలుసుకోగల, మార్చగల, దొంగిలించగల రోజులు రాబోతున్నాయి. ‘మైండ్ రీడింగ్ టెక్నాలజీ’తో పరిశోధకులు దాన్ని సుసాధ్యం చేయబోతున్నారు. మెదడు పనితీరును శాస్త్రీయంగా డీకోడ్ చేయడం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఈ విషయాన్ని ‘సైంటిఫిక్ అమెరికా’ అనే మేగజీన్ ప్రచురించింది. అయితే, ఈ మైండ్ రీడింగ్ టెక్నాలజీ వాస్తవరూపం దాలిస్తే.. మానవాళికి పెనుముప్పని మరో వర్గం శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఆలోచనలను ఇతరులు నియంత్రించడం జరిగితే ఎదురయ్యే అనర్ధాలను అంచనా కూడా వేయలేమంటున్నారు. అందువల్ల ఇప్పటినుంచే మానవహక్కులకు సంబంధించిన కొత్త చట్టాలను రూపొందించాలని స్విట్జర్లాండ్లోని బాసెల్ వర్సిటీ చెందిన శాస్త్రవేత్త మార్సిలో ఐనెకా కోరుతున్నారు.