mla gouthu syam sundar sivaji
-
మంత్రి కామినేనికి అవమానం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు అవమానం జరిగింది. ఉండవల్లి కరకట్ట మీదకు వెళ్లే రహదారి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే రోడ్డులో ...సెక్యూరిటీ పేరు చెప్పి మంత్రి వాహనాన్ని మంగళవారం ఉదయం భద్రతా సిబ్బంది నిలిపివేశారు. అసెంబ్లీకి అటువైపుగా దారి లేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లు పెట్టి మంత్రి కామినేని శ్రీనివాసరావు, నలుగురు ఎమ్మెల్యేల కార్లను ఆపారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా పంపేది లేదని గన్మన్లతో వాగ్వివాదానికి దిగారు. 15 నిమిషాలపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండిపోయారు. మరోవైపు సీఎం ఇంటికెళ్లే కరకట్ట మార్గంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజధాని ప్రాంత ప్రజలను కూడా అటువైపు నుంచి రాకపోకలు సాగనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా కరకట్ట రోడ్డుపై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీరియస్ అయ్యారు. పోలీసులను వివరణ కోరారు. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్కు వివరణ ఇచ్చారు. పోలీసుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆదేశించారు. గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి కూడా ఇటువంటి సంఘటనే ఎదురైంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన కరకట్టపై నుంచి శాసనసభకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు. -
ఎమ్మెల్యే గౌతు శివాజీకి మళ్లీ అవమానం
అమరావతి: నిన్న కరకట్ట... ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎదుట శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, అధికారపార్టీ సభ్యుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. శుక్రవారం శాసనసభ సమావేశాలకు హాజరు అవుతున్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సిబ్బంది ఎమ్మెల్యే శివాజీని అసెంబ్లీ లోపలకి అనుమతించలేదు. అయితే ఐడీకార్డు చూపించి తనిఖీ చేసిన తర్వాతే ఆయనను లోనికి అనుమతించారు. కనీసం పీఏ కూడా లేని తనలాంటి వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపుతున్నారని, అదే సుమారు ఓ 15మందిని వెంట తీసుకొచ్చే బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నల లాంటివారికి మాత్రం సెల్యూట్ కొడతారని ఎమ్మెల్యే శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన నాలుగురోజుల క్రితం కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు. -
పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీకి తీవ్ర అవమానం!
విజయవాడ: శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, గౌతు శ్యామ్ సుందర్ శివాజీకు తీవ్ర అవమానం జరిగింది. సోమవారం ఉదయం ఆయన కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముఖ్యమంత్రి ఈ మార్గంలో వస్తున్నందున ఎమ్మెల్యే శివాజీ వెళ్ళేందుకు వీలులేదని పోలీసులు ఆపేశారు. దాంతో ఆయన పోలీసుల వైఖరిని నిరసిస్తూ కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నాకు దిగారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు శాసనసభ్యునికి నచ్చజెప్పి ఉండవల్లి మార్గంలో శాసనసభకు పంపించారు. దాంతో పాలీసుల వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోకుంటే ఈ ఘటనపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే శివాజీ తెలిపారు. కాగా గతంలోనూ ఎమ్మెల్యే శివాజీకి ఇటువంటి ఘటనలే ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను హెలిప్యాడ్ వద్దకు పోలీసులు అనుమతించలేదు. దాంతో శివాజీ అక్కడే నిరసనకు దిగిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే గౌతు శివాజీకి తీవ్ర అవమానం!