breaking news
Mohammad Nawaz
-
ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం! తిలక్ నవ్వులు.. వీడియో
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ (Ind Vs Pak) ఆది నుంచే తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి తాళలేక నామమాత్రపు స్కోరు కూడా చేయలేకపోయింది.అభిషేక్ శర్మ ధనాధన్ఏదేమైనా బ్యాటింగ్లో కాస్త ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్లో మాత్రం పాక్ తేలిపోయింది. దాయాది విధించిన లక్ష్యాన్ని పటిష్ట టీమిండియా 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఓపెనర్లలో అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31) మరోసారి విధ్వంసం సృష్టించగా.. శుబ్మన్ గిల్ (10) మాత్రం ఈసారి విఫలమయ్యాడు.రాణించిన తిలక్, సూర్యఅయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్)తో కలిసి.. నాలుగో నంబర్ బ్యాటర్ తిలక్ వర్మ (31 బంతుల్లో 31) మెరుగ్గా రాణించాడు. అయితే, పన్నెండో ఓవర్లో తిలక్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.మూడుసార్లు ప్రయత్నించినా ఇందుకు పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ పొరపాటే కారణం. తన బౌలింగ్లో తిలక్ ఇచ్చిన స్ట్రెయిట్ క్యాచ్ను పట్టడంలో నవాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మూడుసార్లు ప్రయత్నించినా బంతిని ఒడిసిపట్టలేకపోయాడు. దీంతో తిలక్ వర్మ.. ‘మనం సేఫ్’ అన్నట్లుగా చిరునవ్వులు చిందించగా.. మహ్మద్ నవాజ్ మాత్రం నేలపై పంచ్లు కొడుతూ తనను తాను తిట్టుకున్నాడు.ఇంతలో మరో ఎండ్లో ఉన్న సూర్య వేగంగా స్పందించి.. రనౌట్ ప్రమాదం జరగకుండా చూసుకున్నాడు. అంతేకాదు.. జాగ్రత్తగా ఉండమంటూ తిలక్కు సైగ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!‘‘ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!.. ప్రపంచంలోని బెస్ట్ స్పిన్నర్ ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తాడా?’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ హెడ్కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఇలా కౌంటర్లు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్తో కలిసి శివం దూబే (7 బంతుల్లో 10) ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆసియా కప్ టోర్నీలో భారత్కు ఇది వరుసగా రెండో విజయం. తొలుత యూఏఈని ఓడించిన టీమిండియా.. తాజాగా పాక్పై గెలిచి సూపర్-4కు లైన్ క్లియర్ చేసుకుంది.చదవండి: ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య Looked simple… until the ball turned lava 🤭Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/wVztsgkJv3— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలి: ఇచ్చిపడేసిన దాదా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్కోచ్ మైక్ హసన్ కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. హసన్ మెదడు పనిచేస్తుందో లేదో ఆ జట్టు స్పిన్నర్ మొహమ్మద్ నవాజే (Mohammad Nawaz)నిరూపించాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా భారత్- పాక్ మధ్య మ్యాచ్ నిర్వహణకు ఆదివారం (సెప్టెంబరు 14) షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ఈసారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్తాన్ ఇప్పటికే చెరో విజయం సాధించాయి. తద్వారా గ్రూప్-‘ఎ’లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే.. దాయాదుల పోరు నేపథ్యంలో పాక్ హెడ్కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు.ఇదే విషయాన్ని సౌరవ్ గంగూలీ దగ్గర ఆనంద్ బజార్ పత్రిక విలేకరి ప్రస్తావించారు. ‘‘పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్.. ప్రపంచలోని అత్యుత్తమ స్పిన్నర్ మా జట్టులో ఉన్నాడు’’ అని అన్నాడు సదరు విలేకరి చెప్పగా.. ‘‘ఎవరా స్పిన్నర్?’’ అని దాదా అడిగాడు.మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలిఇందుకు బదులిస్తూ.. ‘‘మొహమ్మద్ నవాజ్’’ అని విలేకరి పేర్కొనగా.. ‘‘సరే.. తమ కోచ్ మెదడు సరిగ్గా పనిచేస్తుందని నిరూపించాల్సిన బాధ్యత సదరు స్పిన్నర్పైనే ఉంది’’ అంటూ గంగూలీ ఘాటుగా కౌంటర్గా ఇచ్చాడు.వీళ్లంతా వరల్డ్క్లాస్ క్రికెటర్లుఅదే విధంగా.. భారత్- పాక్ జట్ల మధ్య పోలికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘రెండు జట్లకు అసలు పోలికే లేదు. పాక్ జట్టు నాణ్యత రోజురోజుకీ దిగజారిపోతోంది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, సయీద్ అన్వర్, ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మొహహ్మద్ యూసఫ్... వీళ్లంతా వరల్డ్క్లాస్ క్రికెటర్లు.కానీ పాకిస్తాన్కు ఇపుడు ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారో మీరే చూడండి. ఇక ఆ టీ20 జట్టులో బాబర్ ఆజం లేడు. మహ్మద్ రిజ్వాన్ కూడా లేడు. ఫఖర్ జమాన్ ఓకే. బౌలింగ్లో షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ ఫర్వాలేదు.షాహిన్ ఎన్నటికీ వసీం అక్రం కాలేడుకానీ టాలెంట్ విషయంలో షాహిన్ ఆఫ్రిది ఎన్నటికీ వసీం అక్రం కాలేడు కదా!.. వసీం, వకార్, షోయబ్లతో షాహిన్ లేదంటే రవూఫ్లను పోల్చగలమా? టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ఏదేమైనా ప్రస్తుత టీమిండియా- పాక్ జట్లకు ఎలాంటి పోలికా లేదని స్పష్టంగా చెప్పగలను’’ అని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి -
Asia Cup 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం: పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో శుభారంభం అందుకుంది. తొలి మ్యాచ్లో పసికూన ఒమన్ను ఎదుర్కొన్న సల్మాన్ ఆఘా బృందం.. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుబ్ డకౌట్.. హ్యారిస్ అర్ధ శతకంఓపెనర్లలో షాహిబ్జాదా ఫర్హాన్ (29) ఫర్వాలేదనిపించగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. అయితే, వన్డౌన్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ అర్ధ శతకం (43 బంతుల్లో 66)తో రాణించడంతో పాక్ ఇన్నింగ్స్ గాడినపడింది.హ్యారిస్తో పాటు ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 23 నాటౌట్) రాణించగా.. నవాజ్ 19 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ ఏడు వికెట్ల నష్టానినకి 160 పరుగులు రాబట్టగలిగింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 67 పరుగులకే ఆలౌట్ చేసిఇక లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ను పాక్ 67 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. స్పిన్నర్లు సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్.. పేసర్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది (పేసర్), అబ్రార్ అహ్మద్ (స్పిన్నర్), మొహమ్మద్ నవాజ్ (స్పిన్నర్) తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఒమన్ బ్యాటర్లలో హమావ్ మీర్జా 27 పరుగులతో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. ఒమన్పై విజయానంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. బౌలింగ్ విభాగం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టులో మేటి స్పిన్నర్లు ఉన్నారని.. యూఏఈ వంటి వేదికపై వారి అవసరమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.స్పిన్నర్లు కీలకం‘‘బ్యాటింగ్పై మేము మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే, బౌలింగ్ పరంగా మా వాళ్లు అద్భుతం. మా బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు.. తమకు తామే ప్రత్యేకం. వీరికి తోడుగా ఆయుబ్ కూడా ఉన్నాడు.దుబాయ్, అబుదాబి వంటి వేదికల్లో స్పిన్నర్లు కీలకం. మాకు 4-5 స్పిన్ ఆప్షన్లు ఉండటం సానుకూలాంశం. అయితే, మేము ఈ మ్యాచ్లో 180 పరుగులు చేయాల్సింది. కానీ ఒక్కోసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాము. ఆటలో ఇలాంటివి సహజం.ఎలాంటి జట్టునైనా ఓడించగలమునిజానికి ఇక్కడ మేము చాలా రోజులుగా ఆడుతున్నాం. ఈ టోర్నీకి ముందు టీ20 ట్రై సిరీస్ ఆడాము. అలవోకగానే సిరీస్ను సొంతం చేసుకున్నాము. సుదీర్ఘ కాలంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు.కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా యూఏఈపై గెలుపొందగా.. పాక్ ఒమన్పై గెలిచింది. అయితే, నెట్ రన్రేటు పరంగా అందనంత ఎత్తులో ఉన్న భారత్ (+10.483) ప్రస్తుతం గ్రూప్-‘ఎ’ టాపర్గా ఉండగా.. పాక్ (+4.650) రెండో స్థానంలో ఉంది.ఆసియా కప్-2025: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉పాకిస్తాన్- 160/7 (20)👉ఒమన్- 67 (16.4)👉ఫలితం: ఒమన్పై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్గా సాల్ట్ చరిత్ర -
హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్
పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ చరిత్ర సృష్టించాడు. అతని దేశం తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి స్పిన్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. యూఏఈ ట్రై సిరీస్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఈ ఘనత సాధించాడు. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి పాక్కు టైటిల్ను అందించాడు.అంతర్జాతీయ టీ20ల్లో నవాజ్కి ముందు 73 మంది హ్యాట్రిక్లు నమోదు చేశారు. పాక్ తరఫున నవాజ్ది మూడో హ్యాట్రిక్. నవాజ్కు ముందు పాక్ తరఫున హ్యాట్రిక్లు సాధించిన వారిద్దరు (ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ హస్నైన్) పేస్ బౌలర్లే.మ్యాచ్ విషయానికొస్తే.. నవాజ్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో పాక్ ఆఫ్ఘనిస్తాన్పై 75 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫకర్ జమాన్ (27), మొహమ్మద్ నవాజ్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (24) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు. రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ తలో 2, ఘజన్ఫర్ ఓ వికెట్ తీసి పాక్ను కట్టడి చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆదిలోనే ఓటమి ఖాయం చేసుకుంది. పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ (4-1-19-5) ధాటికి 15.5 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. రషీద్ ఖాన్ (17), సెదిఖుల్లా అటల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నవాజ్ 6వ ఓవర్ చివరి రెండు బంతులకు, 8వ ఓవర్ తొలి బంతికి వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. 8వ ఓవర్లో నవాజ్ మరో వికెట్ కూడా తీశాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ కూడా తలో 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను దెబ్బ కొట్టారు. షాహీన్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు యూఏఈ. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్ల్లో ఓడి అప్పుడే నిష్క్రమించింది. -
ఎట్టకేలకు ఒకటి.. ట్రై సిరీస్ గెలిచిన పాక్.. ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై విజయం
ద్వైపాక్షిక సిరీస్లు కాకుండా పాక్ ఇటీవలికాలంలో ఆడిన ఏ ప్రధాన టోర్నీ గెలవలేదు. చివరిగా 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆ జట్టు.. ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత రెండుకు పైగా జట్లు పాల్గొన్న ఓ టోర్నీలో విజయం సాధించింది. యూఏఈ వేదికగా జరిగిన ముక్కోణపు టోర్నీలో విజేతగా నిలిచింది. నిన్న (సెప్టెంబర్ 7) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ చెప్పుకోదగ్గ స్కోరేమీ చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫకర్ జమాన్ (27), మొహమ్మద్ నవాజ్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (24) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు. రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ తలో 2, ఘజన్ఫర్ ఓ వికెట్ తీసి పాక్ను కట్టడి చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పాక్ విజయవంతమైంది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. మొహమ్మద్ నవాజ్ (4-1-19-5) ధాటికి 15.5 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా లో స్కోరింగ్ మ్యాచ్లో 75 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ కూడా తలో 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను దెబ్బ కొట్టారు. షాహీన్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (17), సెదిఖుల్లా అటల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు యూఏఈ. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్ల్లో ఓడి అప్పుడే నిష్క్రమించింది. -
అయూబ్ ఆల్రౌండ్ షో.. విండీస్ను చిత్తు చేసిన పాక్
వెస్టిండీస్ పర్యటనను పాకిస్తాన్ ఘనంగా ఆరంభించింది. ఫ్లోరిడా వేదికగా విండీస్తో జరిగిన తొలి టీ20లో 14 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హసన్ నవాజ్(24), ఫఖార్ జమాన్(28) రాణించారు. విండీస్ బౌలర్లలో షెమార్ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్, షెఫర్డ్, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు.టాపర్డర్ ఫెయిల్..అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్కు ఓపెనర్లు జాన్సెన్ చార్లెస్(35), జ్యువెల్ ఆండ్రూ(35) 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే విండీస్ ఒకే ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 12 ఓవర్ వేసిన స్పిన్నర్ మహ్మద్ నవాజ్.. ఆండ్రూ, చార్లెస్, మోటీలను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ షాయ్ హోప్(2), రూథర్ ఫర్డ్(11), ఛేజ్(5), షెఫర్డ్(5) వరుస క్రమంలో ఔటయ్యారు. ఆఖరిలో హోల్డర్(30), షమీర్ జోషఫ్(21) మెరుపులు మెరిపించినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లక్ష్య చేధనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగల్గింది.పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ మూడు, అయూబ్ రెండు, ముఖియమ్ ఓ వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 2న ఫ్లోరిడా వేదికగా జరగనుంది.చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్ -
అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే!
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: ‘‘మ్యాచ్ సాగుతూ.. ఉంది. ఎనిమిది వికెట్లు పడ్డాయి.. ఆ తర్వాత తొమ్మిదో వికెట్ కూడా తీశారు. అయినా.. గెలుపు కోసం అంతలా తంటాలు.. అసలు ఇదేం కెప్టెన్సీ? అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమైందా? టెయిలెండర్లకు సింగిల్స్ తీసే అవకాశం ఇచ్చావు. నీ ఆలోచన ఏంటో అర్థం కాలేదు. ఇందుకు మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా.. ప్రధాన బౌలర్ల కోటా పూర్తయ్యేటప్పటికే మ్యాచ్ ముగించాల్సింది. ఆఖర్లో మీకు మిగిలిన ఆప్షన్లు స్పిన్ బౌలర్లు మాత్రమే. ఇదంతా తెలిసి కూడా లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సింగిల్స్కు అనుమతించేలా ఫీల్డింగ్ సెట్ చేశావంటే నిన్ను ఏమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నలుగురైదుగురు సర్కిల్ లోపల.. మిగిలిన వాళ్లు బౌండరీ వద్ద.. ఇలా ఫీల్డ్ సెట్ చేసి నువ్వేం సాధించావు? ఒకవేళ సౌతాఫ్రికా ఆటగాళ్లను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చి మ్యాచ్ను కాపాడుకుందామని భావించావా? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నీ కెప్టెన్సీ నాకైతే అంతుపట్టలేదు. ప్రధాన బౌలర్లు బరిలోకి దిగినపుడు స్లిప్ పెట్టాలి.. సర్కిల్ లోపల ఎక్స్ట్రా ఫీల్డర్లను సెట్ చేయాలి అని తెలియదా?’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కెప్టెన్సీపై మండిపడ్డాడు. చెత్త కెప్టెన్సీ సౌతాఫ్రికాతో మ్యాచ్లో సారథిగా బాబర్ పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శలు గుప్పించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చేజేతులా ఓటమిని ఆహ్వానించావంటూ బాబర్ తీరును తప్పుబట్టాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ మైదానంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పాక్పై సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కి టేబుల్ టాపర్గా నిలిచింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం సెమీ ఫైనల్ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి. నీ వల్లే ఓటమి! ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. హైడ్రామా నెలకొన్న మ్యాచ్లో టెయిలెండర్లను కూడా కట్టడి చేయలేక చతికలపడ్డ పాకిస్తాన్ ఓటమికి బాబర్ కెప్టెన్సీనే ప్రధాన కారణమని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. అతడి రాతే అంత ఈ సందర్భంగా పాకిస్తాన్ స్పిన్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నవాజ్ రాతే అంత. దుబాయ్ గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా.. మెల్బోర్న్లో రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు ఇక్కడ చెన్నై గ్రౌండ్లో కేశవ్ మహరాజ్.. అతడి బౌలింగ్లో అద్భుతం చేశారు. పాపం ప్రతిసారి నవాజ్ ఎందుకో ఇలా కఠిన పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా సానుభూతి వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా విజయలక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఉసామా మిర్, మహ్మద్ నవాజ్లలో ఒకరిని బరిలోకి దింపాల్సి రాగా బాబర్ ఆజం నవాజ్ వైపు మొగ్గు చూపాడు. ఊహించని షాకిచ్చిన కేశవ్ మహరాజ్ అప్పటికి పేసర్ల కోటా పూర్తవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే, 48 ఓవర్లో నవాజ్ బౌలింగ్లో మొదటి బంతికి తబ్రేజ్ షంసీ సింగిల్ తీసి కేశవ్ మహరాజ్కు స్ట్రైక్ ఇచ్చాడు. అంతే.. రెండో బంతిని ఫోర్గా మలిచిన కేశవ్ ఊహించని రీతిలో సౌతాఫ్రికాను గెలుపుతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నవాజ్ మరోసారి బలిపశువు అయ్యాడు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? View this post on Instagram A post shared by ICC (@icc) -
తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం!
పాకిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో ఇన్నింగ్స్ 21వ ఓవర్ మహ్మద్ నవాజ్ వేశాడు. ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో నవాజ్ చేతి వేలికి తగిలింది. బంతి వేగంగా రావడంతో అతని చూపుడు వేలు విరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన నవాజ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వేలిని పరిశీలించగా.. బోన్ బ్రేక్ అయినట్లు గుర్తించాడు. దీంతో నవాజ్ను సిబ్బంది ఆసుపత్రికి తరలించి ఎక్స్-రే తీయించారు. కాగా రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. గాయం తీవ్రత ఎంతనేది తెలియకపోయినప్పటికి వేలు విరిగితే మాత్రం అతని కెరీర్ ప్రమాదంలో పడినట్లే. సర్జరీ జరిగినప్పటికి చూపుడు వేలు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మహ్మద్ నవాజ్ బౌలింగ్ వేసే చాన్స్ తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ వరుసగా మూడో వన్డేలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్కు 2011 తర్వాత న్యూజిలాండ్పై వన్డే సిరీస్ గెలవడం మళ్లీ ఇదే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 90, బాబర్ ఆజం 54 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 49.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్ 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. టామ్ బ్లండల్ 65, కొల్ మెక్నికొంచి 64, టామ్ లాథమ్ 45 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్లు తలా రెండు వికెట్లు తీశారు. Yaar ye kya hogya 😭 The main finger of M Nawaz has been broken yaar ☹️🥺💔 Plzz remember him in ur prayers to comeback as quick as possible 🙏🤲❤️#BabarAzam𓃵 #NaseemShah #PAKvNZ #muhammadNawaz @Awaisii6 pic.twitter.com/NPOors4m0i — 𝘽𝙖𝙗𝙖𝙧 ⁵⁶ × 𝘼𝙞𝙢𝙖𝙡 ¹¹ ⚡ (@Aymalkhan_112) May 3, 2023 చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా?
టి20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ మహ్మద్ నవాజ్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతికి నవాజ్ ప్యాడ్లను తాకుతూ ఇన్సైడ్ ఎడ్జ్ అయింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. కానీ నవాజ్ ఎలాంటి రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో మాత్రం బంతి ముందు బ్యాట్ను తాకినట్లు స్పైక్స్ కనిపించాయి. ఒకవేళ నవాజ్ రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్ అయ్యేవాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. అంపైర్ ఔట్ ఇచ్చేసరికే మహ్మద్ నవాజ్ క్రీజు బయట ఉన్నాడు. అప్పుడే బంతిని అందుకున్న ఫీల్డర్ డైరెక్ట్ త్రోతో వికెట్లను గిరాటేశాడు. అప్పటికి నవాజ్ క్రీజులోకి చేరుకోలేదు. అయితే నవాజ్ పెవిలియన్ బాట పట్టింది రనౌట్ అయినందుకా లేక ఎల్బీగానా అన్నది ఎవరికి అర్థం కాలేదు. ఒకవేళ నవాజ్ రివ్యూ తీసుకొని ఫలితం అనుకూలంగా వచ్చినా రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చేది. కానీ క్రికెట్ రూల్స్ ప్రకారం అంపైర్ ఒకసారి తన వేలిని పైకెత్తిన తర్వాత బంతిని డెడ్బాల్గా పరిగణిస్తారు. ఈ దశలో రనౌట్ చేసినా పనికిరాదు. మొత్తానికి తాను ఎలా ఔటయ్యాననే దానిపై క్లారిటీ లేకుండానే మహ్మద్ నవాజ్ పెవిలియన్ చేరడం ఆసక్తి కలిగించింది. ఇక పాకిస్తాన్కు సెమీస్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా సౌతాఫ్రికాపై నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్తికర్ అహ్మద్ 51, షాదాబ్ ఖాన్ 52 అర్థసెంచరీలతో చెలరేగగా.. మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్లు తలా 28 పరుగులు చేశారు. pic.twitter.com/8lZ6zc7Qr9 — Guess Karo (@KuchNahiUkhada) November 3, 2022 చదవండి: పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం? -
ఆ బంతి తిరిగి ఉంటే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ప్రపంచకప్లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్పై విజయంలో కోహ్లిదే కీలకపాత్ర అనేది నగ్నసత్యం. అయితే కోహ్లితో పాటు అశ్విన్కు కూడా విజయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి ఓవర్లో మహ్మద్ నవాజ్ వేసిన బంతిని వైడ్గా భావించి అశ్విన్ వదిలేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అయితే కోహ్లి మ్యాజిక్లో అశ్విన్ తెలివిని ఎవరు గుర్తించలేకపోయారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు. స్వయంగా కోహ్లినే అశ్విన్ను.. సరైన సమయంలో మెదుడు చురుకుగా పనిచేసింది అంటూ పొగడడం విశేషం.తాజాగా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పాక్తో మ్యాచ్ అనంతరం తన సహచరుల నుంచి ఎదురైన ప్రశ్నను పంచుకున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో నవాజ్ వేసిన బంతి వైడ్ కాకుండా తిరిగి ఉంటే ఏమయ్యేది అని అడిగారు. వాళ్లు అడిగిన ప్రశ్నకు నా శైలిలో సమాధానం ఇచ్చాను. ''ఈ మ్యాచ్ లో నేను బ్యాటింగ్ కు వెళ్లేప్పుడు బ్లాంక్ మైండ్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాను. బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడని కోహ్లీని అడిగాను. అప్పుడు కోహ్లీ నా ఫేవరేట్ షాట్ కొట్టు పర్లేదు అని చెప్పాడు. అయితే మ్యాచ్ గెలిచాం కాబట్టి సరిపోయింది గానీ ఒకవేళ నవాజ్ వేసిన ఆ బంతి వైడ్ గా కాకుండా టర్న్ అయి ప్యాడ్ కు తాకడమో లేక పరుగులు రాకపోవడమో అయితే నువ్వు ఏం చేసేవాడివని అడిగారు. నేను వారితో.. ఏం లేదు. వెంటనే అక్కడ్నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయి నా ఫోన్ లో ట్విటర్ ఓపెన్ చేసి.. ''ఇన్నాళ్లు నన్ను ఆదరించిన అభిమానులకు, బీసీసీఐకి ధన్యవాదాలు.. ఈ ప్రయాణం చాలా గొప్పది.. ఇక గుడ్ బై'' అని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించేవాడిని..'' అని పేర్కొన్నా'' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. A golden rewind - When two heroes of two engrossing finishes get together to dissect their famous victories👌 Here's @hrishikanitkar & @ashwinravi99 talking about the two #INDvPAK games 👍 - by @RajalArora Click 👉https://t.co/fDy4r9U2cH to watch the full interview 😃 — BCCI (@BCCI) October 26, 2022 చదవండి: నెదర్లాండ్స్పై గెలుపు.. 'సంతోషంగా మాత్రం లేను' క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు -
Ind Vs Pak: పాక్కు ఊహించని షాక్.. కీలక బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు
T20 World Cup 2022- India Vs Pakistan: టీమిండియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పాక్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని జర్నలిస్టు బోరియా మజుందార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా శనివారం (అక్టోబరు 23) పాక్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రోహిత్ సేనతో మెల్బోర్న్ క్రికెట్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీసు మొదలుపెట్టాయి. నవాజ్ షాట్ ఆడగా.. ఈ క్రమంలో పాక్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ షాట్ ఆడగా.. బంతి మసూద్ తలకు తగలగా గ్రౌండ్లో కుప్పకూలినట్లు సమాచారం. దెబ్బ గట్టిగా తగలడంతో సుమారు ఐదు నిమిషాల పాటు అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది షాన్ మసూద్ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పాక్ వన్డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగే ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటి వరకు 12 టీ20 మ్యాచ్లు ఆడి 221 పరుగులు చేశాడు. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో ట్రై సిరీస్ నేపథ్యంలోనూ జట్టుతో ఉన్నాడు. అయితే, కీలక మ్యాచ్కు ముందు గాయపడ్డ అతడు.. టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దాయాదితో పోరుకు సిద్ధమవుతున్న వేళ టాపార్డర్ బ్యాటర్ గాయపడటంతో పాక్ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్' T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ Update: Pakistani Batter Shan Masood has been taken to the hospital. Doctors will examine him and then further steps will be taken. Mohd. Nawaz’s shot hit Masood on the head for this unfortunate injury. He was lying down on the ground for 5-7 mints. Wish him a speedy recovery. — Boria Majumdar (@BoriaMajumdar) October 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంయుక్తంగా రాణించిన బ్యాటర్లు.. పాకిస్తాన్దే ట్రై సిరీస్
న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో జరిగిన ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్కు ఈ విజయం మంచి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రై సిరీస్కు ముందు ఆసియా కప్ ఫైనల్.. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టి20 సిరీస్ల్లో పాకిస్తాన్ ఓటమిపాలయింది. ఇక శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్మన్ 25 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రౌఫ్లు తలా రెండు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, నవాజ్లు చెరొక వికెట్ తీశారు. రేపు(శనివారం) ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం)తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Nawaz and Iftikhar finish it for Pakistan in the final over 🏆#NZvPAK — ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2022 చదవండి: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ -
వెస్టిండీస్పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
ఐసీసీ వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్-ఉల్-హక్(72),బాబర్ అజాం(77) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసేన్ మూడు, ఫిలిప్, జోషఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మహ్మద్ వసీం మూడు, షదాబ్ ఖాన్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ సిరీస్లో అఖరి వన్డే ఆదివారం జరగనుంది. చదవండి: T20 WC 2022: 'అతడు టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు' One jaffa after another! 🌟 Superstar @mnawaz94 registers his career-best figures of 𝟭𝟬-𝟬-𝟭𝟵-𝟰 🙌#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/jf8Eg05fwO — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 -
పాక్ క్రికెటర్పై నిషేధం
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన 23ఏళ్ల ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్పై ఆదేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) రెండు నెలలపాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన చేసిన సమయంలో అక్కడ బుకీలు నవాజ్ను సంప్రదించారు. దీని గురించి బోర్డుకు తను ఆలస్యంగా తెలియజేశాడు. ఇదే విషయాన్ని జాతీయ అవినీతి నిరోధక విభాగం ముందు అతడు ఒప్పుకున్న క్రమంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక రూ.2 లక్షల జరిమానాను కూడా విధించింది. సస్పెన్షన్ కాలంలో అతడు బోర్డుతో కుదుర్చుకున్న సెంట్రల్ కాంట్రాక్టుపై కూడా నిషేధం అమలులో ఉంటుందని పీసీబీ పేర్కొంది. గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఆదేశ క్రికెటర్లు నాసిర్ జంషేడ్, షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ నిషేధానికి గురైన విషయం తెలిసిందే. -
స్పాట్ ఫిక్సింగ్: క్రికెటర్పై నిషేధం
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ జాడ్యం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)కు పాకింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వేటు వేసింది. అతడు క్రికెట్ ఆడకుండా రెండు నెలల పాటు నిషేధం విధించింది. లక్ష రూపాయల జరిమానా వేసింది. నవాజ్పై విధించిన నిషేధం మే 16 నుంచి అమల్లోకి వస్తుందని పీసీబీ ప్రకటించింది. 23 ఏళ్ల నవాజ్ పీఎస్ఎల్లో స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు తనను సంప్రదించిన బుకీల వివరాలు పీసీబీ విజిలెన్స్ అండ్ సెక్యురిటీ విభాగంకు అందించడంలో విఫలమయ్యాడు. దీంతో పీసీబీ అతడిపై చర్య తీసుకుంది. పీసీబీ నిర్దేశించిన విధంగా లిఖితపూర్వక వివరణయిస్తే నవాజ్పై నిషేధం నెల రోజులకు తగ్గించే అవకాశముంది. ఫిబ్రవరి-మార్చిలో జరిగిన రెండో పీఎస్ఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు నవాజ్తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై ఆరోపణలు వచ్చాయి. మహ్మద్ ఇర్ఫాన్పై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించింది. మూడు టెస్టులు, 9 వన్డేలు ఆడిన నవాజ్... పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.