Mohanambal
-
కోర్టుకు మోహనాంబల్ హాజరు
వేలూరు: వేలూరు సమీపంలోని తారాపడవేడులో రూ.4 కోట్ల 4లక్షల 73,500 నగదు, 73 సవరాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో వసంతపురానికి చెందిన కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ బుధవారం మధ్యాహ్నం కాట్పాడి కోర్టులో హాజరయ్యారు. కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ ఇంటిలో ఈనెల 4న పోలీ సులు తనిఖీలు నిర్వహించి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న మోహనాంబాల్, సోదరి నిర్మల ఈనెల 9వ తేదీన వేలూరు కోర్టులో లొంగిపోయారు. అయితే విచారణ జరిపిన న్యాయమూర్తి కాట్పాడి కోర్టులో 11వ తేదీన హాజరు కావాలని తీర్పు నిచ్చారు. దీంతో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మోహనాంబాల్, సోదరి నిర్మల కాట్పాడి కోర్టులో హాజరయ్యారు. మోహనాంబల్ను పోలీస్ కస్టడికీ ఇవ్వాలని కోరడంతో న్యాయమూర్తి మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు నిచ్చారు. మోహనాంబాల్ మాత్రం తాను వడ్డీ వ్యాపారం చేసి నగదు, బంగారం సంపాదించానని తెలిపినా పోలీసులు నమ్మడం లేదు. పరారీలో ఉన్న మోహనాంబాల్ సోదరి కుమారుడు శరవణన్ వద్ద విచారణ జరిపితే పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు మోహనాంబాల్, సోదరి నిర్మల వద్ద మూడు రోజుల పాటు రహస్య విచారణ జరపనున్నారు. -
రూ. 4.5 కోట్లు... డాన్సర్ కోసం గాలింపు
ఇంటిలో రూ.4.5 కోట్లు దాచి ఉంచిన కరగ డాన్సర్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు ఇంటికి సీల్ వేసి బంధువుల వద్ద విచారణ జరుపుతున్నా రు. కాట్పాడి సమీపంలోని తారాపడవేడులోని కరగ డాన్సర్ మోహనాంబాల్ ఇంటిలో ఈనెల 25వ తేదీన పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ. 4.5 కోట్ల నగదు, 73 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్న విష యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మోహనాంబల్ సెల్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉండడంతో ఆమె అక్క కుమారుడు శరవణన్, మోహనాంబల్ అద్దెకు ఉన్న భవన యజమాని, మరో కరగ డాన్సర్ జమున కోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. వీరు పరారీలో ఉండడంతో శరవణన్ భార్య దేవీబాలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నా రు. పోలీసుల విచారణలో మోహనాంబాల్, శరవణన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వారి ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ ఎర్రచందనం వ్యాపారుల వద్ద నగదు, బంగారాన్ని తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆ డ్యాన్సర్ ఇల్లు.. కోట్ల రూపాయలకు నెలవు!!
-
డాన్సర్ ఇంట్లో ...గోనె సంచుల్లో నోట్ల కట్టలు
చెన్నై : ఓ డాన్సర్ ఇంట్లో పెద్ద ఎత్తున దొరికిన నగదు స్థానికంగా సంచలనం సృష్టించింది. రూ.4 కోట్ల నగదుతోపాటు, 70 సవర్ల బంగారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని గోవిందరాజ మొదలియార్ వీధికి చెందిన జమున ఇంట్లో మోహనాం బాల్ అనే డాన్సర్ అద్దెకు ఉంటోంది. ఈమె ఇంట్లో నగదు కట్టలు కట్టలుగా ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దాంతో కాట్పాడి పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మోహనాంబాల్ అద్దెకు ఉన్న భవనాన్ని చుట్టుముట్టారు. అయితే అప్పటికే మోహనాంబాల్ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయింది. దాంతో పోలీసులు ఇంటి యజమాని జమున సహకారం కోరారు. ఆమె అంగీకారంతో పోలీసులు మోహనాంబాల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గోనె సంచుల్లో ఉన్న నోట్ల కట్టలను గుర్తించారు. సోదాల్లో బంగారు నగలతోపాటు నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విలేకర్లతో మాట్లాడుతూ డాన్సర్ నివాసంలో రూ.4 కోట్ల, 4 లక్షల, 73,500 రూపాయలుతోపాటు 73 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా డాన్సర్ ఇంట్లో ఇంత నగదు, బంగారం ఎలా వచ్చింది.. ఎవరైనా ఇక్కడ దాచి ఉంచారా? దొంగలతో డాన్సర్కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు మోహనాం బాల్ సెల్ నంబర్కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ రావటంతో పోలీసులు నగదుపై లోతుగా ఆరా తీస్తున్నారు. కాగా మోహనాం బాల్ తగిన ఆధారాలు చూపిస్తే నగదు, బంగారాన్ని అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. సాధారణ డాన్సర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉండడం స్థానికంగా పలువురిని ఆశ్చర్యపరిచింది.