mother dead body
-
తల్లి మృతదేహాన్ని నాలుగు రోజులు బెడ్ కింద దాచిన కుమారుడు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్లో ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే బెడ్ కింద దాచాడు. నాలుగు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన ఎక్కువగా రావడంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు ఆ వ్యక్తి ఇంట్లో బెడ్ కింద అతని తల్లి శవాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమె నాలుగు రోజుల క్రితమే చనిపోయిందని కుమారుడు పోలీసులకు చెప్పాడు. దుర్వాసన రాకుండా రోజూ అగరొత్తులు వెలిగించినట్లు పేర్కొన్నాడు. మృతురాలిని శాంతి దేవి(82)గా గుర్తించారు. ఆమె విశ్రాంత ఉపాధ్యాయురాలు. భర్త 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. కుమారుడు నిఖిల్తో పాటు శివ్పుర్ సహబాజ్గంజ్లో నివసిస్తోంది. అయితే నిఖిల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అతను డ్రగ్స్కు బానిస కావడంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. శాంతి దేవి అనారోగ్య కారణాలతోనే మరణించి ఉంటుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక నిజా నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
అమానవీయ ఘటన: బైక్పై తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు!
షాదోల్: ఆస్పత్రిలో శవ వాహనం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులకు రూ.5 వేలు చెల్లించుకోలేక తల్లి మృతదేహాన్ని ఓ పేద యువకుడు ఏకంగా 80 కిలోమీటర్లు బైక్ మీదనే తీసుకెళ్లాడు! బెడ్షీట్లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనుప్పుర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల జైమంత్రి యాదవ్ ఛాతీ నొప్పికి చికిత్స పొందుతూ షాదోల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి మరణించింది. శవ వాహనం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో మరో మార్గం లేక బైక్మీదే తీసుకెళ్లాల్సి వచ్చిందని కుమారుడు వాపోయాడు. కానీ అతను శవ వాహనం అడగనే లేదని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ చెప్పారు. తమ వద్ద వాహనం లేని మాట నిజమే అయినా ఇలాంటప్పుడు జిల్లా ఆస్పత్రి నుంచో, స్థానిక సంస్థల నుంచో వాటిని సమకూరుస్తామన్నారు. -
హృదయవిదారకం: తోపుడు బండిపై ఓ అమ్మ అంతిమయాత్ర
జైపూర్: కరోనా కారణంగా మాతృదినోత్సవం రోజే ఓ తల్లికి అవమానకర రీతిలో అంతిమయాత్రను ఆమె కొడుకులే నిర్వహించాల్సి వచ్చింది. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని నావల్పురా చౌక్కు చెందిన దినేష్ కుమార్ తల్లికి ఇటీవల కరోనా సోకడంతో అక్కడి స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శనివారం ఆమె అస్పత్రిలో వద్దంటూ ఇంటికి తీసుకెళ్లమని తన ఇద్దరి కొడుకులను కోరింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లగా, అక్కడ ఆమె శనివారం మరణించింది. తన తల్లి మృతదేహాన్ని శశ్మానవాటికి తీసుకెళ్లడానికి ఆంబులెన్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను, పోలీసులను కోరగా వారు నిరాకరించారు. మృతురాలి ఇద్దరు కొడుకులు ఎంత వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు కరోనా మరణం అని తెలిసే సరికి అక్కడి గ్రామస్తులు కూడా ఆ కుటుంబానికి సహకరించలేదు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొడుకులిద్దరే ఓ తోపుడు బండిపై తల్లి శవాన్ని పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. కరోనా నివారణ జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు గానీ కరోనాతో మరణించిన వారి విషయంలో మాత్రం దగ్గరకు రాకూడదనే నిబంధనలను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ( చదవండి: 103 ఏళ్ల పెద్దాయన మనోధైర్యానికి తలవంచిన కోవిడ్ ) -
తల్లి మృతదేహాన్ని స్మశానంలోనే వదిలేసిన కొడుకు
సాక్షి, నిజామాబాద్: కరోనా వైరస్ సోకిందని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన సంఘటనలు చూశాం. ఇక కోవిడ్తో మరణిస్తే మృతదేహాలను సైతం వదిలివెళ్లిన వార్తలను కూడా విన్నాం. అయితే తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి చనిపోతే దహనం చేయకుండా స్మశాన వాటికలో మృతదేహాన్ని వదిలేసి వెళ్లాడు. ఈ ఘటన జిల్లాలోని ప్రగతినగర్ సర్వజనిక్ స్మశాన వాటికలో జరిగింది. ఓ వృద్ధురాలి మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు స్మశానంలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. మృతదేహాన్ని స్మశానవాటికలో వదిలేసి కట్టెలు తీసుకు వస్తామని చెప్పిన ముగ్గురు వ్యక్తులు మళ్లీ తిరిగిరాని రాలేదు. ఎంత సమయం గడిచినా వాళ్లు తిరిగి రాకపోవడంతో స్మశానవాటిక వాచ్మెన్కి అనుమానం వచ్చిది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్నిపోలీసులు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. స్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్లిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తుల్లో వృద్ధురాలి కన్న కొడుకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి కరోనా సోకి మరణించిందనే అనుమానంతో స్మశానంలో మృతదేహాన్ని వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. చదవండి: ఓఎల్ఎక్స్ వేదికగా సోఫా కొంటానని.. -
సహకరించని గ్రామస్తులు.. తల్లి శవాన్ని సైకిల్పై
భువనేశ్వర్ : ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ మృతి చెందితే ఆ గ్రామానికి చెందిన ఏ ఒక్కరు దగ్గరకు రాలేదు. కారణం ఆమె తక్కువ కులానికి చెందిన మహిళ కావడమే. చివరకు ఆమె కుమారుడు ఒక్కడే సైకిల్పై తన తల్లి శవాన్ని తీసుకెళ్లి అడవిలో ఖననం చేశాడు. ఈ హృదయవిదారకర ఘటన ఒడిశాలోని కర్పాబహాల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జాంకి సిన్హానియా(45), తన కుమారుడు సరోజ్(17)తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త గత కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మంచి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లి అదుపు తప్పి అందులో పడి మృతి చెందారు. తన తల్లి అంత్యక్రియలకు సహకరించాలని సరోజ్ గ్రామస్తులను కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక్కడే తల్లి శవాన్ని సైకిల్పై తీసుకెళ్లి గ్రామానికి దాదాపు 6కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఖననం చేశాడు. అంత్యక్రియలకు సహకరించాలని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని సరోజ్ తెలిపారు. తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని వాపోయారు. -
ఆ చిట్టితల్లికి ఎంత కష్టమో
ఒంగోలు క్రైం: తండ్రి ఆలనలో.. తల్లి లాలనలో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆ చిట్టితల్లికి తీరని కష్టం వచ్చి పడింది. ఆడుతూపాడుతూ కాలం గడపాల్సిన వయసులో తల్లికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకెళ్తే... కార్తీక వన మహోత్సవానికి ఆదివారం విజయవాడ వెళ్లి బోటు ప్రమాదంలో మృతిచెందిన వారిలో దేవాబత్తిన లీలావతికి ఆమె ఏకైక కుమార్తె మను మంగళవారం అంత్యక్రియలు నిర్వహించింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహా ప్రస్థానంలో బంధువులు దగ్గరుండి మనుతో లీలావతి మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. కొడుకైనా, కూతురైనా మను ఒక్కటే కావడంతో తానే కుమారుడి పాత్ర పోషించి తన పేగు బంధ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంది. ఈ సంఘటనతో చూపరులు సైతం కంట తడి పెట్టారు. ముంతను ఉట్టిలో పెట్టుకుని చేతపట్టి తల్లి మృతదేహం ముందు మను నడుస్తుంటే దారినపోయే వారు సైతం అయ్యో ఆ చిన్నారికి ఎంత కష్టమో.. అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లి మృతదేహం చుట్టూ ఆఖరి ప్రదక్షిణలు చేసే సమయంలో మనుకు అడుగులు ముందుకు పడలేదు. కానీ, తప్పేది లేదంటూ బంధువులు ఆమెతో బలవంతంగానే అడుగులు వేయించి అంత్యక్రియలు పూర్తిచేయించారు. సుమా రు రెండు గంటలపాటు ఆ చిన్నారి మహా ప్రస్థానంలో వెక్కివెక్కి ఏడ్చి చివరకు సొమ్మసిల్లి పడిపోవడంతో బంధువులు ఆమెను వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. ఏడేళ్ల వయసులోనే తండ్రి మృతి... మనుకు ఏడేళ్ల వయసులోనే తండ్రి మరణించగా, తల్లి లాలనలో పెరుగుతూ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంతలో తల్లి లీలావతి బోటు ప్రమాదంలో మృతిచెందగా, ఆ బాధ తట్టుకోలేక అమ్మమ్మ లక్ష్మీకాంతం ప్రాణాలు విడిచింది. ఇలాంటి కష్టం ఏ చిట్టితల్లికీ రాకూడదని అంత్యక్రియలను చూసిన ప్రతిఒక్కరూ భగవంతుడిని కోరుకున్నారు. -
తల్లి శవం భుజంపై.. జవానుకు ఎంత కష్టం?
కశ్మీర్: ఈ మధ్య చనిపోయిన తమ ఆత్మబంధువులను భుజాలపైన వేసుకొని వెళ్లిన సంఘటనలు ఎక్కువగా మనం ఒడిశా రాష్ట్రంలో చూశాం. ఇలా అనకూడని విషయమే అయినా వారంతా కూడా ఎవరి కళ్లకు సరిగా కనిపించని వాళ్లు.. అంటే బలహీనులు.. వర్గ పరంగా.. ఆర్థికపరంగా.. సామాజికపరంగా ప్రభుత్వాలు దయచూపనంతకాలం ఇంకొన్ని తరాల వరకు వారి బతుకులకు అలాంటి తిప్పలు తప్పవు. కానీ, అలాంటి పరిస్థితి ఒక జవానుకు వస్తే.. తల్లిని మోసుకొని విరిగిపడిన మంచుకొండలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తే.. అది కచ్చితంగా వార్తల్లో నిలుస్తుంది.. వేరే వాళ్లు చూస్తే అది దేశానికి అవమానం. కానీ, అలాంటి సంఘటనే జరిగింది. మహ్మద్ అబ్బాస్ అనే వ్యక్తి పఠాన్ కోట్లో జవానుగా పనిచేస్తున్నాడు. అతడితోపాటు తన తల్లి కూడా జీవిస్తోంది. ఆమె గత ఐదు రోజుల కిందట ప్రాణాలు కోల్పోయింది. దీంతో నియంత్రణ రేఖ వద్ద ఉన్న కర్ణా అనే గ్రామంలోకి తీసుకెళ్లి ఖననం చేయాలని అనుకున్నాడు. కశ్మీర్కు తన తల్లి మృతదేహంతో చేరుకున్నాడు. అయితే, 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండగా దారి మధ్యలో ఓ భారీ మంచుకొండచరియ విరిగి పడింది. దీంతో ఆ జవానుకు హెలికాప్టర్ సహాయం చేస్తామని పై అధికారులు చెప్పారు. వారి మాట విని తల్లి శవాన్ని అక్కడే ఉంచి హెలికాప్టర్ కోసం ఎదురుచూశాడు. కానీ, హెలికాప్టర్ రాలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని తన భుజాన వేసుకొని దాదాపు ఆరు మీటర్ల మేర పేరుకుపోయిన మంచులో నుంచి పది గంటలపాటు మరికొంతమంది సహాయకులతో దాటి ఖననం చేసేందుకు తీసుకెళ్లాడు. దీనిపై అతడు వివరణ ఇస్తూ ‘ఇది చాలా పెద్ద అవమానం. నా తల్లికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయలేకపోయాను. హెలికాప్టర్ పంపిస్తామని చెప్పి పంపించలేదు. పేరుకుపోయిన మంచుముక్కలపై ప్రమాద కర స్థితిలో నడుచుకుంటూ నా తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లాను. నాలుగు రోజులు శవంతో ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు నా ఫోన్ కూడా కట్ చేశారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది’ అని చెప్పాడు. అయితే, తాము ఈ రోజే హెలికాప్టర్ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. వారే హెలికాప్టర్ దిగే చోటులేదని వద్దన్నారని వివరించారు. -
ఏ కంటి పాపనో
-
తల్లి శవం వద్ద 9 నెలల బాబు!
-
తల్లి శవం వద్ద 9 నెలల బాబు!
-
తల్లి శవం వద్ద 9 నెలల బాబు!
హైదరాబాద్: అప్పటివరకు భుజాన ఎత్తుకున్న తల్లి ఒక్కసారిగా రోడ్డుపక్కన కుప్పకూలి కిందపడి చనిపోయింది. చెంత తనవారు ఎవరూ లేరు. చేతిలో నుంచి తల్లి వదిలివేయడంతో 9 నెలల బాబు తల్లి శవం పక్కన కూర్చొని గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్నాడు. వనస్థలిపురం సమీపంలోని ఆటోనగర్ వద్ద మంగళవారం రాత్రి 7.30 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పెట్రోలింగ్కు వెళ్లిన పోలీసులు ఈ హృదయవిదారక దృశ్యం చూశారు. సమీపంలో ఆమెకు సంబంధించినవారు ఎవరూలేరు. తల్లి మూర్చవచ్చి కిందపడి చనిపోయినట్లు భావిస్తున్నారు. తాము గుర్తించిన వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేసి తల్లి మృతదేహాన్ని ఉస్మానియ ఆస్పత్రికి తరలించినట్లు వనస్థలిపురం సిఐ గోపాలకృష్ణ చెప్పారు. 1098కు ఫోన్ చేసి శిశువిహార్ వారికి విషయం చెప్పి బాబుని వారికి అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాబు సారధి స్టూడియో సమీపంలోని శిశువిహార్లో ఉన్నాడు. బాబు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు శిశువిహార్ సూపరింటెండెంట్ స్వరూప చెప్పారు.